
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు స్వల్ప కాలిక లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెటల్, ఐటీ కంపెనీల షేర్ల దన్నుతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్ ఈ రోజు వెంటనే భారీగా పాయింట్లను కోల్పోతూ నష్టాలను చవి చూసింది. ఆ వెంటనే కనిష్ట ధరల దగ్గర మరోసారి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది.
ఈ రోజు ఉదయం బీఎస్ఈ సన్సెక్స్ 61,040 పాయింట్లతో ప్రారంభంమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,757 పాయింట్లకు పడిపోయి 400లకు పైగా పాయింట్లు కోల్పోయింది. అక్కడ కొనుగోలు దారుల మద్దతు లభించడంతో క్రమంగా పాయింట్లు పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 166 పాయింట్ల నష్టంతో 61,069 పాయింట్ల దగ్గర ఉంది. ఇక నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 41 పాయింట్ల నష్టంతో 18,216 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment