మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా! | Meta breaching antitrust rules by giving Facebook users automatic access to Facebook Marketplace | Sakshi
Sakshi News home page

మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!

Nov 15 2024 1:41 PM | Updated on Nov 15 2024 3:11 PM

Meta breaching antitrust rules by giving Facebook users automatic access to Facebook Marketplace

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్‌ కమిషన్‌ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్‌ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ యాడ్స్‌ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది.

‘యూరోపియన్ యూనియన్‌ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్‌బుక్‌ మార్కెట్‌ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్‌బుక్‌లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్‌లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్‌మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్‌ యాక్సెస్‌ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్‌బుక్‌ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్‌ కమిషన్‌ ఆరోపించింది.

ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు

కంపెనీ స్పందన

యురోపియన్‌ కమిషన్‌ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్‌బుక్‌ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement