-
పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి..!
కర్ణాటక: జిల్లాలో హనీ ట్రాప్ ఆరోపణలు గుప్పుమన్నాయి. గుబ్బి పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు జీఎన్ అన్నప్పస్వామి ఈ మేరకు ఓ యువతిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అన్నప్పస్వామికి ఇటీవల ఫేస్బుక్లో నిషా అనే యువతి పరిచయమైంది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అమ్మాయి ఆహ్వానం మేరకు హాసన్, తిపటూరు, దొడ్డబళ్ళాపుర, నెలమంగల ఇలా అనేకచోట్ల కలిశారు. ఆపై యువతి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. దీనికి తిరస్కరించడంతో నిషా, ఆమె స్నేహితులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. మనం కలిసి ఉన్న నగ్నచిత్రాలను వైరల్ చేస్తానని హెచ్చరించింది. తనను హనీ ట్రాప్ చేసి రూ. 20 లక్షల డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని అన్నప్పస్వామి చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం... పుస్తెలతాడుతో పరారీ
వెంగళరావునగర్: ఫేస్బుక్లో పరిచయమై మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళకు ఫేస్బుక్లో గోల్డ్ గ్రూప్ ద్వారా మహేష్ నారాయణదాస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమె నంబర్ తీసుకున్న అతను తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. గత ఫిబ్రవరిలో తన పుస్తెలతాడుకు బంగారు తీగ అల్లి ఇవ్వాలని కోరడంతో వారి ఇంటికి వచ్చాడు. ఇంటి వద్దే తీగ అల్లి ఇవ్వాలని కోరగా తాను కట్టర్ తీసుకురావడం మరచిపోయానని, కూకట్పల్లిలోని తన బంధువుల దుకాణానికి వెళ్లి అరగంటలో తెస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు 40 గ్రాముల పుస్తెలతాడు, పుస్తెలు అతడికి ఇచ్చింది .కూకట్పల్లికి వెళ్లిన మహేష్ తన ఆధార్కార్డు, తండ్రి నెంబర్, షాప్ ఫొటోలు ఆమెకు వాట్సాప్ చేశాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో సదరు మహిళ ఫోన్ చేయగా తనకు యాక్సిడెంట్ అయిందని, త్వరలోనే వస్తానని చెప్పాడు. అయితే ఈ నెల 4న బాధితురాలికి ఫోన్ చేసిన మహేష్ ఆమెను దుర్భాషలాడటమేగాక పుస్తెలతాడు ఇవ్వనని, నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెటా ఇండియా-యూఎస్ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్
గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ను కలిపే సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు మెటా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుంది.‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’గా పిలిచే ఈ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టు భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతుంది. మెటా అప్లికేషన్లు, సర్వీసులను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తవుతుందని అంచనా వేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు రావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లుసాంకేతిక పురోగతికంపెనీ ‘రూటింగ్’ అనే కొత్త సాంకేతికత ద్వారా 7,000 మీటర్ల సముద్ర లోతులో కేబుళ్లను ఏర్పాటు చేస్తారని మెటా ప్రతినిధి తెలిపారు. షిప్ లంగర్లు, ఇతర ప్రమాదాల నుంచి నష్టాన్ని నివారించడం కోసం హైరిస్క్ ఫాల్ట్ ప్రాంతాల్లో మెరుగైన టెక్నిక్లు ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక ఆవిష్కరణ ఇండియాలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సదుపాయాలకు, సర్వీసులకు మద్దతు ఇవ్వడానికి, వాటిలో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు. -
నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్ బర్గ్
వాషింగ్టన్ : ఎవరో ఫేస్బుక్లో (Facebook) పోస్ట్లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్బర్గ్ పై విధంగా మాట్లాడారు.ఆ పాడ్కాస్ట్లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్బర్గ్ స్పష్టం చేశారు. Power of Pakistan 😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
ఫేస్బుక్ పరిచయం.. వివాహితకు శాపం
బంజారాహిల్స్: ఫేస్బుక్ పరిచయం ఆమె పాలిట శాపమైంది. కువైట్లో ఉన్న ఓ వ్యక్తి ఫేస్బుక్ చాట్లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫొటోలను, వీడియోలను కూడా తీశాడు. ఫేస్బుక్ మెసెంజర్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్లో ఉంటున్న కుడుపూడి ప్రసాదరావుతో నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ తర్వాత తరచూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తున్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురూ శారీరకంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2, 3 రోజులుగా గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు ప్రైవేటు పార్ట్స్ను స్క్రీన్ రికార్డ్ చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫొటోలను సేవ్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తనతో ఉన్న ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఫొటోలను తన ఐడీ ద్వారా ఫేస్బుక్ స్నేహితులకు మెసెంజర్లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండలో ఉండే ప్రసాదరావు భార్య భవాని, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి రూ.4,28,800 చెల్లించాలంటూ తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
మార్క్ జుకర్బర్గ్ (ఫేస్బుక్) రాయని డైరీ
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్!‘‘మిస్టర్ జుకర్బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లైన్ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్... ప్లీజ్’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. టేబుల్ మీద ఉన్న ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ లో ట్రంప్ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! కాలేజ్లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్ గర్ల్ టీమ్’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.‘‘మిస్టర్ జుకర్బర్గ్! లైన్ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్ ఎన్ వాంగ్, నిర్ధారణ కోసం.‘‘ఎస్... మిస్టర్ వాంగ్! నేను లైన్ లోనే ఉన్నాను...’’ అన్నాను.హఠాత్తుగా ‘‘హాయ్ జాక్...’’ అంటూ లైన్ లోకి వచ్చేశారు ట్రంప్!‘‘సర్ప్రైజింగ్, మిస్టర్ ప్రెసిడెంట్!’’ అన్నాను.‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్ చేశాన్ జాక్...’’ అన్నారు ట్రంప్!!‘‘ఏ విషయం గురించి మిస్టర్ ప్రెసిడెంట్!!’’ అని అడిగాను.‘‘వెల్... జాక్! నా ఇనాగరేషన్ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్! స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్.‘‘థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్ సాంచెజ్! జెఫ్ బెజోస్ ప్రియురాలు. ఇనాగరేషన్ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్ బెజోస్ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్’ లోపలికి స్లిప్ అయినట్లుంది. అంత బ్యాడ్ మోమెంట్ లేదు నా లైఫ్లో!ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్ ట్రంప్ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్గా అనిపించేది.‘‘వింటున్నావా జాక్? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్. నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్ జాక్’ అంటూ లైన్ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్ జాక్’ అంటూ లైన్ లోంచి వెళ్లిపోయారు ట్రంప్.ఫోన్ పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.‘‘అదే, ఆ బ్యాడ్ మోమెంట్ గురించి ట్రంప్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.ప్రిసిల్లా నవ్వింది.‘‘అది బ్యాడ్ మోమెంట్ కాదు బాస్, బ్యాడ్ ఫొటోగ్రాఫ్... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్ డేస్ తర్వాత ఇన్నేళ్లకు! -
లేత వయసు.. వినని మనసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్లైన్ సైట్లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ వంటి సైట్లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.⇒ సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్లో పోస్ట్లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు. బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్కు, కాలేజ్కు, ట్యూషన్కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి.. బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్ఫోన్లే. చిన్నపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం, ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. – బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్నగర్ సీఐ -
‘ఆయన దయవల్లే బతికున్నాను’
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని వీడారు. అయితే, నాడు దేశాన్ని వీడే సమయంలో జరిగిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. తన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ఆ ఆడియో ప్రసంగంలో ‘రెహానా,నేను కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో మేం మరణం అంచునుంచి తప్పించుకున్నాము’ అని ఆడియో ప్రసంగంలో తెలిపారు. ఆ ఆడియోలో తనను చంపేందుకు వివిధ సమయాల్లో కుట్రలు పన్నారని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. అందుకు ఆగస్టు 21న జరిగిన హత్యల నుండి, కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు నుండి బయటపడటమే నిదర్శనమన్నారు.అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడం సాధ్యమయ్యేది కాదు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరే చూశారు. అయితే, నేనింకా సజీవంగా ఉన్నానంటే అల్లా దయే. నేను నా దేశంలో ఎందుకు లేకపోయానా? అని ఇప్పటికీ బాధపడుతున్నాను.కట్టుబట్టలతో బంగ్లాదేశ్ను వీడాను’ అంటూ భావోద్వేగంగా కన్నీరు పెట్టుకున్నారు.పలు మార్లు హత్యాయత్నంషేక్ హసీనా పలు మార్లు హత్యహత్నం నుంచి తప్పించుకున్నారు. ఆగస్ట్ 21, 2004న బంగాబంధు అవెన్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు పలు మార్లు హసీనాపై హత్యయత్నం జరగడంతో హసీనా భారీ మొత్తంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40ఏళ్లలో ఇదే తొలిసారి -
కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు
మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ చేసిన పొరపాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు సంస్థ క్షమాపణలు చెప్పింది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్బర్గ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దూబే అన్నారు. ఈ వ్యవహారంపై మెటా స్పందించింది.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ కంపెనీ సీఈఓ చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. కంపెనీకి భారత్ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ఘాటించారు. ‘అధికారంలో ఉన్న అనేక పార్టీలు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించవనే మార్క్ వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారత్ అందుకు మినహాయింపు. ఈ అనుకోని పొరపాటుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైంది’ అని తుక్రాల్ అన్నారు. -
పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ తన ఉద్యోగుల్లో దాదాపు ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. ఉద్యోగులందరికీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. పనితీరు నిర్వహణపై పరిమితిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు జూకర్ బర్గ్ మెమోలో పేర్కొన్నారు.‘కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది’ అని మెమోలో పేర్కొన్నారు.ప్యాకేజీ ఇస్తామని హామీసెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఈ కోతల వల్ల దాదాపు 3,600 ఉద్యోగులు ప్రభావితం చెందుతారని అంచనా వేసింది. పనితీరు సరిగాలేని వారిని తొలగించే స్థానంలో ఈ ఏడాది చివర్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. బాధిత ఉద్యోగులకు ఉదారంగా సెవెరెన్స్ ప్యాకేజీ(లేఆఫ్స్ కారణంగా ఇచ్చే ప్యాకేజీ)లు అందిస్తామని జూకర్ బర్గ్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సులభంగా రూ.కోటి సంపాదన!మిశ్రమ స్పందనకార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సంస్థ భవిష్యత్తు ప్రాజెక్ట్లపై కృత్రిమ మేధ, స్మార్ట్ గ్లాసెస్, సోషల్ మీడియా వంటి కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి మెటా చురుకుగా పని చేస్తోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనపై ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కంపెనీ సమర్థతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ల్లో ఫ్యాక్ట్ చెకింగ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్లో థర్డ్పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేసిన మెటా
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్(Facebook), థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్(Instagram)ల్లో ఫ్యాక్ట్ చెకింగ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిల్లోని థర్డ్పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్(Mark) చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుతప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
పాకిస్తాన్ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి
లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్ బాబు(30) కథ ఇది. పాక్ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్ఎఫ్ జవాన్లు ఖఖర్ పోస్ట్ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్లోని మండి బహాఉద్దీన్ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై పారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్ అధికారులు వెల్లడించారు. -
రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్బుక్' (Facebook) తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రెండు లీజింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు కంపెనీ నెలకు రూ.2.8 కోట్లు అద్దె చెల్లించనుంది.హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న మొత్తం ఆఫీస్ స్పేస్ 3.7 లక్షల చదరపు అడుగులు. ఇప్పటి వరకు కంపెనీ దీనికోసం నెలకు రూ. 2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ. 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు.మొత్తం లీజు వ్యవధి ఐదు సంవత్సరాలు.. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది. అయితే 2026 నుంచి అద్దె మరో 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల తరువాత అద్దె మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది.వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంరియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. అద్దెకు ఆకాశాన్నంటుతున్నాయి. న్యూస్ పోర్టల్ ప్రకారం.. 2019లో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అద్దె నెలకు రూ. 23,000. ఈ అద్దె 2023లో రూ. 27,500కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే అద్దె సుమారు 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!హైదరాబాద్లో ఐటీ హబ్గా.. బెంగళూరుకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలకు నెలవు. ఆఫీస్ స్పేస్ కూడా.. సాధారణంగా హైటెక్ సిటీలో సగటున అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనరాక్ డేటా ప్రకారం.. కొండాపూర్లో 2019 - 23 మధ్యలో అద్దెలు 19 శాతం పెరిగాయి. గచ్చిబౌలిలో 20 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా హైదరాబాద్లోని తన ఆఫీస్ స్పేస్ డీల్ పునరుద్ధరణ చేసుకుని నెలకు రూ. 2 కోట్ల రెంట్ చెల్లించేలా డీల్ కుదుర్చుకుంది. -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్జీపీటీ ఆఫ్లైన్లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్బుక్తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్స్టాగ్రామ్లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్మెంట్ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
భర్తను వదిలేసి ప్రియుడితో పరారైన భార్య
బనశంకరి: భర్త, పిల్లలతో ఉంటున్న మహిళ ఫేస్బుక్ ప్రియుని మాయలో పడి అతని వెంట వెళ్లింది. చివరకు తప్పు తెలుసుకుని మళ్లీ భర్త చెంతకు చేరింది. ఇది తట్టుకోలేని కిరాతక ప్రియుడు ఆమెను అంతమొందించాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లాలోని ఎన్ఆర్పుర తాలూకా కిచ్చబ్బి గ్రామంలో జరిగింది. తృప్తి (25) అనే వివాహితను ప్రియుడు చిరంజీవి (29).. చాకుతో పొడిచి చంపి శవాన్ని అక్కడే బావిలో పడేసి పరారయ్యాడు. ఘటనాస్థలానికి బాళెహొన్నూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. తృప్తి, చిరంజీవి ఫేస్బుక్ ద్వారా పరిచయమై, ప్రేమలో పడ్డారు. నెల రోజుల క్రితం భర్త రాజును వదిలి ప్రియునితో వెళ్లిపోయింది. దీనిపై భర్త బాళెహొన్నూరు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. విజయపుర (బిజాపుర)లో తలదాచుకున్న తృప్తి, చిరంజీవిని పోలీసులు వెదికి పట్టుకుని పిలుచుకొచ్చారు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో తృప్తి భర్త వెంట వెళ్లింది. దీంతో ఆగ్రహం చెందిన చిరంజీవి.. చివరిసారిగా మాట్లాడాలని తృప్తిని ఓ పొలం వద్దకు పిలిపించి హత్య చేసి పరారయ్యాడు. హంతకుని కోసం గాలిస్తున్నారు. -
దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు. అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను. పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి. గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.దయనీయంగా వైద్య రంగంవైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్లు చతికిల పడుతున్నాయి. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.కుదేలైన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!దోచుకోవడం.. పంచుకోవడం రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. -
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్గ్రౌండ్లో సెట్చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
చెల్లి పేరుతో పేస్ బుక్ ఖాతా.. యువకుడి నుంచి కోట్లు వసూలు
పత్తికొండ (తుగ్గలి): ఫేస్ బుక్ చాటింగ్ పరిచయంతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసింది ఓ మహిళ. ఈ ఘటన పత్తికొండ మండలంలో చోటు చేసుకుంది. చక్రాళ్లకు చెందిన లావణ్య ఎమ్మిగనూరులో ఉన్న తన చెల్లెలు ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువుకు చెందిన సాయిలుతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నమ్మిస్తూ వచ్చింది. తర్వాత తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో సాయిలు విడతల వారీగా రూ.1.20 కోట్లు సమర్పించుకున్నాడు. చివరకు తన భార్యను కూడా నమ్మించి డబ్బు కాజేసిందని బాధితుడు చెబుతున్నాడు. అనుమానం వచ్చిన సాయిలు పత్తికొండకు వచ్చి ఆరా తీసి మోసపోయానని తెలుసుకున్నాడు. డబ్బుల విషయమై పలుమార్లు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరులో ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతూ కాలం వెళ్లదీసింది. ఎంతకీ డబ్బులు ఇవ్వక పోవడంతో నాలుగు రోజుల క్రితం పత్తికొండకు వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మహిళ తండ్రి, మధ్యవర్తులు పంచాయితీ చేసి సమస్య పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారు. అయితే వ్యవహారం అంతటా దావణంలా వ్యాపించడంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ విషయమై పట్టణ సీఐ జయన్నను సంప్రదించగా ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్ఫామ్గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
వైద్యురాలికి ఎస్ఐ వేధింపులు
దొడ్డబళ్లాపురం: యువ వైద్యురాలిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్పై బెంగళూరు బసవనగుడి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ఇదే ఠాణాలో ఎస్సై రాజ్కుమార్. వివరాలు.. ఫేస్బుక్ ద్వారా 2020లో ఎస్సైకి ఒక వైద్యురాలు పరిచయమయింది. అప్పుడు ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా రాజ్కుమార్ పోలీస్ అకాడెమిలో ఎస్సై శిక్షణలో ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు.ఈ క్రమంలో వైద్యురాలి నుంచి రాజ్కుమార్ రూ.1.71 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నగ్నవీడియోలు, ఫోటోలు పంపించాలని బెదిరించేవాడు. కాల్ రికార్డ్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన వైద్యురాలు అతని దురాగతాలపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఘరానా ఎస్సైపై కేసు నమోదు చేశారు. -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్ప్లేస్ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్లోని వాచ్కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్బుక్కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
Cybercrime: ఫేస్బుక్ టు వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చేసే సైబర్ నేరగాళ్లు నానాటికీ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫేస్బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో.. ఫేస్బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనే క మంది తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తు న్నారు. ఎక్కువగా యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్బుక్ యూజర్కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది. నకిలీ ప్రొఫైల్తో డబ్బు డిమాండ్.. ఇలా ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్.. సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో... వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు. -
ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.మార్క్ జుకర్బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్ఆఫ్ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్హబ్’, ‘ఉబర్ఈట్స్’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. -
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మార్క్ జుకర్బర్గ్ (ఫోటోలు)
-
ఫేస్బుక్తో మోసం.. రూ.3 కోట్లు నష్టం
టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఇందిరాపురం నివాసితులైన నబనిత, మృణాల్ మిశ్రా ఫేస్బుక్లో ఏకంగా రూ.3.1 కోట్లు నష్టపోయారు. స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడి అంటూ ఈ దంపతులను మోసం చేసి.. సైబర్ నేరగాళ్లు జూలై, ఆగస్టు మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.నిజానికి నబానితా మిశ్రా ఫేస్బుక్లో ఒక ప్రకటన చూసి దానిపైన క్లిక్ చేసింది. ఆ తరువాత వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న వాట్సాప్ గ్రూప్లో ఆమెను యాడ్ చేశారు. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ అనే పోటీలో పాల్గొనమని సభ్యులను ప్రోత్సహించారు.ఇన్వెస్ట్మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని.. ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్మెంట్లకు కూడా బదిలీలు చేయాలని చెప్పారు. అప్పటికే వాట్సాప్ గ్రూప్లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారు.ఐపీవో లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని నబానితా మిశ్రా తెలిపారు. ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అలా చేయడానికి ఆమె తన తండ్రి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టింది. ఆ తరువాత ఒక అకౌంట్ యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను చెక్ చేసుకోగలిగింది. కానీ డబ్బును మాత్రం విత్ డ్రా చేయలేకపోయింది. ఆ తరువాత ఆమెకు అనుమానం వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు అవన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. -
సోషల్ మీడియా.. మార్కెట్ మేనియా
విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్ ⇒ 2024 మార్చి నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్: రూ. 10 వేల కోట్లు. ⇒ 2027 నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ (అంచనా): రూ. 14 వేల కోట్లు. ⇒ ఏదో ఒక బ్రాండు, బ్రాండ్ అంబాసిడర్ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు: 90 శాతం ⇒ ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం ⇒ ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం ⇒ దేశంలో సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం ⇒ సోషల్ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం ⇒ ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం సాక్షి, అమరావతిప్రస్తుత స్మార్ట్ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్లో అయితే సోషల్ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంలో భారత్ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. భారత్లో సెల్ ఫోన్ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఇన్ఫ్లుయన్సర్స్ హవా.. ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయన్సర్స్ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్ఫ్లుయన్సర్స్కు డిమాండ్ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్లో 10 లక్షల వ్యూస్ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. ⇒ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకుచేరుతుందని అంచనా. ⇒ సోషల్ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. ⇒ భారత్లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది. ⇒ దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాను వీక్షిస్తున్నారు. ⇒ భారత్లో సోషల్ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్బుక్, రెండో స్థానంలో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్బుక్, 71 శాతం మంది ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్ను ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. -
ఫేస్బుక్, ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. భారతదేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కోసం వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేసింది. గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన తరువాత.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రూ. 639 నుంచి రూ. 21000 వరకు ఉన్నాయి. అయితే వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో ఉపయోగకరంగా ఉండటానికి నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఈ వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి వెరిఫైడ్ బ్యాడ్జ్, భద్రత, కనెక్టివిటీకి సపోర్ట్ చేసే అదనపు ఫీచర్స్ కూడా పొందవచ్చు.టెస్టింగ్ సమయంలో ఒకే ప్లాన్ అందించిన మెటా.. ఇప్పుడు మొత్తం నాలుగు ప్లాన్స్ అందించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ అనేది గతంలో ఎక్స్ (ట్విటర్) ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చేరాయి. -
అధ్యక్ష బరిలో ట్రంప్.. మెటా కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు. -
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్టాక్తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్బుక్ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్ప్లేస్, గ్రూప్లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్లో పేర్కొంది. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్బుక్పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్ఫామ్ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్చాట్ (Snapchat) యాప్కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్ను అర్థం చేసుకోవడానికి, స్నాప్చాట్పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
సోషల్ మీడియాతో ఎన్నికల్లో గెలుపు ఖాయమా?
దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు,రాజకీయ పార్టీలు తమ విజయాలను ప్రచారం చేయడానికి, ఓటర్ల నుండి మద్దతు పొందడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. పార్టీలు ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నాయి? భారత్లో ప్రతినెలా 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్ల ఉన్న వాట్సప్లో లెటర్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ పేరుతో ప్రధాని మోదీ ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. తద్వారా తాను ప్రధానిగా దేశానికి చేసిన సేవ, సంక్షేమ పథకాలు, పనితీరు వంటి విషయాల గురించి అవగాహన కల్పిస్తూ అభిప్రాయాల్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ’ బీజేపీ ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ’ అనే వెబ్సైట్ను ప్రారంభించింది. వెబ్సైట్ను విజిట్ చేసే యూజర్లు మోదీకి ఓటు వేసేలా ప్రతిజ్ఞ చేయడం, అందుకు గల కారణాల్ని తెలుపుతూ వీడియోల్ని క్రియేట్ చేసి అభిప్రాయాల్ని పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. వాట్సప్లో రాహుల్ గాంధీ సైతం మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాట్సప్ గ్రూప్ను నడుపుతున్నారు. ఇందులో ప్రజలతో సంభాషించడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. తద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడడమే కాదు ఓటర్ల బేస్ను గుర్తించవచ్చు. పాండమిక్ తర్వాత ట్రెండ్ మారింది కోవిడ్-19 మహమ్మారి తర్వాత, సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథం గణనీయంగా మారిపోయిందని, పొలిటిక్ అడ్వైజర్ వ్యవస్థాపకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఐటీ సెల్ హెడ్ అంకిత్ లాల్ అన్నారు. ‘సమాచారాన్ని పొందడానికి సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ ఎన్నికల ప్రచారానికి డిజిటల్ వ్యూహాన్ని అవలంబించాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరో మాధ్యమంగా మారారు. వీరి ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయోచ్చని తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గత కొన్ని నెలలుగా యువ ఓటర్లను కనెక్ట్ అవ్వడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానెల్స్ వరుసు ఇంటర్వ్యూలతో హోరెత్తించారు. ఎస్ జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి బీజేపీ నేతలు యూట్యూబ్లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న పోడ్కాస్టర్ రణవీర్ అలహబాడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కమియా జానీతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి పక్షాలకు అదే ఎదురు దెబ్బ 2014 సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది నాయకులు సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో వెనుకబడి పోయారు. దీంతో ఆ ప్రభావం ప్రతిపక్షంలో ఉండేలా చేసింది. ప్రతిపక్షాల కంటే ముందే సోషల్ మీడియాను వినియోగించుకోవడం ముందున్న బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందని అంకిత్ లాల్ చెప్పారు. పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రభావం పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రచారం ప్రాముఖ్యతను లాల్ వివరిస్తూ, ‘40 శాతం ఇంటర్నెట్ వ్యాప్తితో, సగటున రెండు లక్షల మంది జనాభా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటల్ మాధ్యమాల ద్వారా 75,000 నుండి 80,000 మందిని ప్రభావితం చేయడం సాధ్యమవుతుంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా 5,000 ఓట్ల తేడా మంచి గెలుపు ఓటమి తేడా ఉంటుంది. అదే సమయంలో ఇతర విశ్లేషకులు ప్రజలను ఓటర్లుగా మార్చడంలో సోషల్ మీడియా శక్తిపై అనేక సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇండియాలో డేటా సెంటర్ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్లోనే వీటిని పరిచయం చేసింది. భారత్లో రీల్స్కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్ను నెరవేర్చలేమన్న మంత్రి -
USA: అమెరికాలో ‘టిక్టాక్’ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్టాక్ షార్ట్ వీడియో యాప్పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్టాక్పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో నిజాయితీ లేదని, టిక్టాక్ నిషేదం వల్ల ఫేస్బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్టాక్లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్బుక్ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో నష్టాలు చవిచూశాయి. అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్టాక్తో పాటు వి చాట్ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్టాక్ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్టాక్పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ టిక్టాక్ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్టాక్కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి. ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్టాక్ యాప్ యాజమాని బైట్డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది. ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే -
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
పెళ్లికొడుకు వాచ్పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా..
అంబానీ ఇంట వివాహ వేడుకలు ఇటీవలే ముగిశాయి. అనంత్ అంబానీ-రాధికమర్చంట్ ప్రివెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, సినీతారలు, ప్రపంచ వ్యాపారవేత్తలు పాల్గొని అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రివెడ్డింగ్ వేడుకలు ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరైన వారిలో ఫేస్బుక్ అధినేత మార్క్జూకర్బర్గ్ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన వాచ్ చూసి వారు దాని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన మార్క్ భార్య ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని అనంత్కు కితాబిచ్చినట్లు తెలిసింది. దానికి జుకర్బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్ బదులిచ్చాడు. Zuckerberg and wife going gaga over Anant Ambani’s watch (Richard Mille) worth 12-15 crores INR. FYI Anant also has a Patek Philippe Grand Complication Sky Moon Tourbiillion - ₹ 63 crores and a Grand Master Chimes - ₹66 crores 😂 😂 pic.twitter.com/65gwALBGwG — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 3, 2024 ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర, కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. దాని ఖరీదు రూ.15 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్స్లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే ఆర్ఎం 56-02 వాచ్ విలువ రూ.15-18 కోట్లు ఉంటుందని అంచనా. అనంత్కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్బిల్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.63 కోట్లుగా ఉందని తెలిసింది. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం -
ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టా యాప్స్కు తీవ్ర అంతరాయం
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్ మీడియా నెట్వర్క్ ఔటేజ్ ట్రాకర్ ప్లాట్ఫాం డైన్ డిటెక్టర్ వెల్లడించింది. మరోవైన తోటి సోషల్ నెట్వర్క్ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్మస్క్ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్ చేశారు. If you’re reading this post, it’s because our servers are working — Elon Musk (@elonmusk) March 5, 2024 ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ మెటా స్పోక్స్పర్సన్ ఆండీస్టోన్ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. We're aware people are having trouble accessing our services. We are working on this now. — Andy Stone (@andymstone) March 5, 2024 -
ఆగిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు అల్లలాడిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా మెటా నెట్వర్క్కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. సాంకేతికలోపం వల్లే మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు, 47000 కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెటా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సమస్యలను నివేదించడానికి వందలాది యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) ఉపయోగిస్తున్నారు. ఇందులో మెటా డౌన్ అయిందా, లేదా నేను హ్యాక్ చేయబడుతున్నానా?, నా ఇన్స్టాగ్రామ్ లోడ్ కావడం లేదు, ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్ ఒక సెకను హ్యాక్ అయిందని అనుకున్నన్నానాని.. కామెంట్స్ చేస్తున్నారు. -
హిమాచల్ ఉపముఖ్యమంత్రికి సతీ వియోగం
హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి ప్రొఫెసర్ సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉపముఖ్యమంత్రి స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం చండీగఢ్కు తీసుకెళ్తుండగా, కురలి సమీపంలో ఆమె కన్నుమూశారు. हमारी प्रिय प्रोफेसर सिम्मी अग्निहोत्री हमारा और आस्था का साथ छोड़कर चली गई। — Mukesh Agnihotri (@Agnihotriinc) February 9, 2024 -
ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
గతంలో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2005లో ఫేస్బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఫేస్బుక్, ఇంటెల్, మింట్.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ 'యాప్సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు. అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు. ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు. -
ప్రకటనపై క్లిక్ చేస్తే ప్రాణాలు పోవచ్చు..!
సామాన్యులను అప్పుల ఊబిలోకి దింపి, వారిని పీడిస్తున్న అక్రమ రుణ యాప్ల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలోనే వాటి కట్టడికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదైనవి మినహా ఇతర అనధికార రుణ యాప్లను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని ఎప్పుడో నిర్ణయించింది. మొదట్లో చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలివ్వడం వల్ల డిజిటల్ రుణాల వైపు చాలామంది ఆకర్షితులవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ తరవాత మోసపూరిత రుణ యాప్లు రంగప్రవేశం చేసి అడిగిన వెంటనే రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని గుర్తించలేని కొందరు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ యాప్లకు సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా యాడ్లు వస్తున్నాయి. దాంతో కొందరు అక్రమ రుణయాప్లను గుడ్డిగానమ్మి మోసపోతున్నారు. తాజాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ ప్లాట్ఫామ్ల్లో నకిలీ రుణ యాప్లను ప్రచారం చేయకుండా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇండియా ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం దేశంలో ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా మోసపూరిత రుణ యాప్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నకిలీ లోన్ యాప్ల ప్రకటనలను ప్రసారం చేయకుండా ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రకటనలు ప్రసారం చేసినందుకుగాను రుణయాప్లు కొంత డబ్బు ఆ కంపెనీలకు చెల్లిస్తాయి. నకిలీ రుణయాప్లకు సంబంధించి ప్రకటనలు వస్తున్నప్పుడు యూజర్ల ఇష్టానుసారంమేరకే వాటిని నిలిపేసేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే.. ‘ఆర్బీఐ వద్ద నమోదు చేసుకున్న రుణయాప్లు పరిమితంగా ఉండగా.. గుర్తింపు లేనివే అత్యధికంగా ఉన్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా భారీగా వడ్డీలను గుంజుతున్నాయి. రుణాన్ని తిరిగిచెల్లించినా చేయలేదని పేర్కొంటూ.. మరింత చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. ఇక చెల్లింపులు చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ అవమానిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లోన్యాప్ల దాష్టీకానికి రాష్ట్రంలో రెండేళ్లలో 10 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు.’ అని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది. -
మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్
సంగారెడ్డి, సాక్షి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, అలాగే.. తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దీంతో మంత్రి అనుచరులు స్పందించారు. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ నుంచి సందేశాలు వస్తే స్పందించవద్దని కార్యకర్తలను కోరుతున్నారు. -
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్విలాస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నం.. కొట్టేసిన కోట్లతో...
Facebook former executive fraud: టాప్ కంపెనీలో ఉద్యోగం.. అది కూడా టాప్ పొజిషన్.. మంచి జీతం.. అయినా ఆమె బుద్ధి గడ్డి తినింది. జల్సాలు, లగ్జరీ లైఫ్ కోసం నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నమేసింది. ఏకంగా రూ.33 కోట్లకు పైగా కొట్టేసింది. ఫేస్బుక్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ విభాగానికి గ్లోబల్ హెడ్గా పని చేసిన అర్బరా ఫర్లో స్మైల్స్ అనే 38 ఏళ్ల మహిళ నకిలీ విక్రేతలు, కల్పిత ఛార్జీలు, క్యాష్ కిక్బ్యాక్ల ద్వారా కంపెనీ నుంచి 4 మిలియన్లకు పైగా (సుమారు రూ. 33 కోట్లు) కొట్టేసినట్లు అంగీకరించింది. కంపెనీలో 2017 నుంచి 2021 సంవత్సరాల కాలంలో కాజేసిన ఈ డబ్బును ఆమె కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవనం కోసం ఖర్చు చేసింది. మోసం చేసిందిలాగే.. డబ్బును కాజేసేందుకు ఫర్లో స్మైల్స్ కంపెనీ ఖర్చు ఖాతా వ్యవస్థనే మార్చేసింది. పేపాల్, వెన్మో, క్యాష్ యాప్ వంటి చెల్లింపు సేవలకు తన కార్పొరేట్ క్రెడిట్ కార్డులు లింక్ చేసుకుంది. వీటి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి సంబంధించిన చెల్లింపులకు కంపెనీ సొమ్మును వినియోగించేది. తర్వాత వారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకునేది. ఈ సొమ్మును నేరుగా, ఫెడరల్ ఎక్స్ప్రెస్ లేదా మెయిల్ ద్వారా, కొన్నిసార్లు టీ షర్టుల వంటి వాటిలో దాచి ఆమెకు ఇచ్చేవారని ఈ కేసును డీల్ చేస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఖర్చు చేసింది వీటికే.. ఫేస్బుక్ను మోసం చేసి కాజేసిన సొమ్మును ఫర్లో స్మైల్స్ విలాసాలకు వినియోగించేది. హెయిర్ స్టైలిస్ట్లు, బేబీ సిట్టర్లకు భారీగా ఖర్చు పెట్టేదని తెలిసింది. పిల్లల ప్రీస్కూల్ ట్యూషన్ ఫీజుకే ఆమె 18,000 డాలర్లు (రూ.14 లక్షలకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం. నేరాన్ని బార్బరా ఫర్లో స్మైల్స్ అంగీకరించింది. దీంతో ఆమెకు వచ్చే ఏడాది మార్చి 19న శిక్ష విధించనున్నారు. అప్పటి వరకు ఆమె 5,000 డాలర్లు (రూ.4.15లక్షలు) బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. -
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్లు కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
త్వరలోనే డిలీట్.. మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అలెర్ట్!
ఫేస్బుక్ (మెటా) సరిగ్గా మూడేళ్ల క్రితం చాట్ ఇంటిగ్రేషన్ అని ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ఫీచర్ సాయంతో యూజర్లు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్లోని వారి స్నేహితులతో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మెటాలో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అయితే తాజాగా, ఆ ఫీచర్ను డిసెంబర్ నెలలో డిలీట్ చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. మరి ఆఫీచర్ను ఎందుకు తొలగిస్తున్నారనే అంశంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల యురేపియన్ యూనియన్కి చెందిన ప్రభుత్వ సంస్థ యూరోపియన్ కమిషన్ ‘యూరప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ (డీఎంఏ)’ లో కొన్ని మార్పులు చేసింది. వాటికి అనుగుణంగా ఆయా టెక్నాలజీ సంస్థలు మెసేజింగ్ ఫ్లాట్ఫామ్ల మధ్య క్రాస్ చాటింగ్ సదుపాయం ఉండేలా చూడాలని కోరింది. ఈ సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. క్రాస్ చాటింగ్ సాదుపాయం లేకపోతే ‘క్రాస్ చాటింగ్ ఫీచర్ను తొలిగిస్తే యూజర్ల మధ్య మెసేజ్ పంపుకునే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వీలుండదు’ అని మెటా తెలిపింది. ఇప్పటికే యూజర్ల మధ్య జరిగిన చాటింగ్లు రీడ్-ఓన్లీ మెసేజ్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు క్రాస్ చాటింగ్కు సంబంధం ఉన్న మెటా అకౌంట్స్ను తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ యూజర్లు చాటింగ్ చేసుకోవాలంటే మెటా అకౌంట్స్ లేదా మెసేంజర్ నుంచి చాటింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. -
కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం మెటాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వందల కోట్లలో విలువైన కంపెనీ షేర్లను ఒకే రోజు రెండు సార్లు అమ్ముకున్నారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. దాదాపూ రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నవంబర్ నెల ముగిసే సమయానికి మెటా షేర్ల విలువ 172 శాతం పెరిగింది. అయితే అదే రోజు కంపెనీ షేర్లను అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ జుకర్ బర్గ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫారమ్ 4కు అప్లయ్ చేసుకున్నారు. అనంతరం తొలిసారి 560,180 షేర్లు, కొద్ది సేపటి తర్వాత అదనంగా 28,009 షేర్లను అమ్ముతూ 144 ఫారమ్ అప్లయ్ చేసుకున్నట్లు సెక్యూరిటీ ఎక్ఛేంజ్ ఫైలింగ్ తేలింది. ఆ మొత్తం షేర్ల విలువ రూ.1,600 కోట్లు. మార్క్ జూకర్ బర్గ్ సంస్థ షేర్లు అమ్ముకున్నారన్న నివేదికలతో యూఎస్ మార్కెట్లు ముగిసే సమయానికి మెటా షేర ధర 320.02 డాలర్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీలో షేర్లు అమ్మగా సేకరించిన నిధుల్ని ఆయన ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. మెటా.. తీవ్ర వాద సంస్థ : రష్యా ఈ అక్టోబరులో రష్యా అధికారిక వర్గాలు మెటాను ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొనడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపిస్తూ 33 రాష్ట్రాలు పలు న్యాయ స్థానాల్ని ఆశ్రయించడం వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మెటా షేర్లు ఈ ఏడాదిలో వరుసగా పాజిటీవ్గా ట్రేడయ్యాయి. దీంతో నవంబర్ 22న మెటా షేర్ విలువ గరిష్టా స్థాయికి 341.49 డాలర్లకు చేరుకోగా.. చివరి సారిగా అదే షేర్ విలువ డిసెంబరు 30, 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. -
పిల్లల వ్యక్తిగత డేటాను తస్కరించిన ‘మెటా’
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృసంస్థ ‘మెటా’పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరించిందని, ఎక్కువ సమయం తమ సామాజిక మాధ్యమాల వేదికల్లోనే వారు గడిపేలా ఒక బిజినెస్ మోడల్ను రూపొందించిందని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల డేటాను తస్కరించేలా ఉద్దేశపూర్వకంగానే తమ సోషల్ మీడియా వేదికల్లో మెటా మార్పులు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటా సంస్థ నిర్వాకంపై గత నెలలో 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. ఈ సంగతి తాజాగా బయటకు వచి్చంది. యుక్త వయసులో ఉన్నవారిని సోషల్ మీడియా సైట్లవైపు ఆకర్శించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి మెటా ప్రయతి్నస్తోందని వారు ఆరోపించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇన్స్టాగ్రామ్ సేకరించిందని, ఇలా చేయడం చట్టవిరుద్ధమేనని తమ దావాలో పేర్కొన్నారు. చిన్నారుల గోప్యతను కాపాడడానికి ఉద్దేశించిన చట్టాలను మెటా పాటించలేదని ఆరోపించాయి. తమపై వచి్చన ఆరోపణలపై మెటా యాజమాన్యం స్పందించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు తెరవడానికి అనుమతి లేదని వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఖాతాలు ఉంటే తొలగిస్తామని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఏళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తలతో వాటికి మరింత బలం సమకూరిందని అభిప్రాయపడుతున్నారు. -
ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్బుక్దే’
అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్బుక్ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. ‘న్యూస్వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. నవంబర్ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్ అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్బుక్ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే లూకాస్ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్బీ కథనం పేర్కొంది. -
ఫేస్బుక్ యాడ్స్లో ఫేక్ లోన్యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్యాప్లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్కార్డు, పాన్కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
ప్రియుడి కోసం పాక్ చెక్కేసిన అంజూ..మళ్లీ వార్తల్లోకి, స్టోరీ ఏంటంటే?
ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన అంజూ అలియాస్ ఫాతిమా గుర్తుందా. ఈ ఫాతిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ పాక్లోని మారుమూల గ్రామానికి వెళ్లి ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ త్వరలోనే భారతదేశానికి రానుంది. అంజూ తన పిల్లల్ని కలిసేందుకే భారత్ వెళ్లేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోందని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుందని నస్రుల్లా చెప్పారు. తాము ఇస్లామాబాద్లో విదేశీ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యమైనప్పటికీ, అది రాగానే అంజూ భారత్ వెళుతుందని నస్రుల్లా తెలిపారు. భారత్లో ఉన్న తన పిల్లల్ని కలిసిన తర్వాత ఆమె తిరిగి పాకిస్తాన్కు వస్తుందన్నారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్) కాగా ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లింది అంజూ. అయితే తమది ప్రేమలేదు దోమా లేదు..పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ముందు చెప్పినప్పటికీ ఆ తరువాత ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారడం తెలిసిందే. ఆగస్టులో ఈమె వీసానుమరో ఏడాది పాటు పొడిగించింది. అయితే నస్రుల్లాతో ప్రేమ, పెళ్లికి ముందే అంజూకి రాజస్థాన్కు చెందిన అరవింద్తో పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
మెక్డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!
UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డోనాల్డ్స్లో యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్డొనాల్డ్స్లో హ్యాపీ మీల్ను ఆర్డర్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్లోని బారో-ఇన్-ఫర్నెస్లోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి పిల్లల హ్యాపీ మీల్ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్ విప్పి పెద్దకుమారుడు జాక్సన్(3)కి ఇచ్చింది. మరో మీల్ ఓపెన్ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు కాలేబ్కు తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి ఉంటే అన్న ఆలోచనే ఆమెలో అసహ్యాన్ని, ఆందోళననూ రేపింది. మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. సిగరెట్ పీక, బూడిదతో ఇపుడు అదనపు రుచి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయబోగా డాల్టన్ రోడ్లోని మెక్డొనాల్డ్స్ బ్రాంచ్ మేనేజర్ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది. దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
కొలువుల కాలం
భారీ వేతనాలు... సర్వే సంస్థలకు అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే మొత్తాన్ని బట్టి ఉద్యోగుల వేతనాలుంటాయి. పలు సర్వే సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ. 3 నుంచి 5 వేల వరకూ చెల్లిస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు స్మార్ట్ సర్వేలూ చేస్తున్నాయి. అభ్యర్థి నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సోషల్ మీడియా ఫాలో అప్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాథ్యమాల్లో అతను చేసే పోస్టింగులను విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్లను సర్వే సంస్థలు దిగుమతి చేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో అనుభవం ఉన్న యువతను ఈ విభాగాల్లో నియమిస్తున్నారు. వీరికి ఎన్నికల సీజన్ వరకూ ఏకమొత్తంగా వేతనాలుంటాయని సర్వే సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ను డేటా ఎనాలసిస్లో అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల నైపుణ్యం ఉన్న యువతకూ మంచి గుర్తింపు ఇస్తున్నారు. భారీగానే డబ్బు ఇస్తుండడంతో సర్వేలు చేయడానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రకాల సర్వేలు చేయడానికి కూడా యువత ఆసక్తి చూపుతున్నారు. లింక్డ్ ఇన్... నౌకరీ డాట్ కామ్.. వంటి జాబ్ పోర్టల్స్లో మల్టీ నేషనల్ కంపెనీల ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న యూత్కు ఎన్నికల సీజన్ వరంలా మారింది. రాష్ట్రంలో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా, మరొకొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు.. వరుసగా ఉండటంతో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఉద్యోగం తాత్కాలికమే అయినా మంచి వేతనం అంతకు మించిన అనుభవం లభించే వీలుంది. ఎలక్షన్ సర్వేల కోసం ఆయా సంస్థలు యువతీ యువకులను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆరు నెలల నుంచి ఈ తరహా ఉపాధి అవకాశాలు జోరందుకున్నాయి. చిన్నా చితకా కలిపి రాష్ట్రంలో వందకు పైగా సర్వే సంస్థలు ప్రస్తుతం ఎన్నికల సర్వేల్లో నిమగ్నమయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఈ స్పీడ్ మరికొంచెం పెరిగింది. జనం నాడి తెలుసుకునేందుకు, ప్రజల మూడ్ను పట్టుకునేందుకు సర్వేక్షణం తోడ్పడుతుందని అన్ని పార్టీలూ, నేతలు నమ్ముతున్నారు. బహుళ జాతి కంపెనీలు ఆర్థిక అనిశి్చతితో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో జాబ్ మార్కెట్కు ఎలక్షన్ సీజన్ కొంత ఆక్సిజన్ ఇచ్చిందని యువత అభిప్రాయపడుతున్నారు. పుష్కలంగా అనుభవం... రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సర్వే చేయడానికి కనీసం వెయ్యి మంది అవసరం అని సర్వే సంస్థలు చెబుతున్నాయి. పొలిటికల్ సైన్స్ నేపథ్యం ఉన్న పోస్టు–గ్రాడ్యుయేట్ అభ్యర్థులను నేరుగా ప్రజా క్షేత్రంలోకి పంపుతారు. ప్రజల రాజకీయ అభిప్రాయం, అభ్యర్థి నుంచి ప్రజలు ఏం కోరుతున్నారో ఈ బృందం సేకరిస్తుంది. ఆపై డేటా ఎనలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. టెక్నాలజీ నేపథ్యం ఉన్న యువతను ఈ కేటగిరీలో నియమిస్తున్నారు. వివిధ కేటగిరీల నుంచి వచ్చే పలు రకాల డేటాను అప్లోడ్ చేయడం, అవసరమైన ఫార్మాట్లోకి దీన్ని తేవడం వారి బాధ్యత. ఆ తర్వాత కేటగిరీలో ఎనలిస్టులుంటారు. ఆన్లైన్ నుంచి అందే డేటాను క్రోడీకరించి, ఇందులో అంశాల ద్వారా విశ్లేషణ చేయడం, కచ్చితమైన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వారి విధి. అభ్యర్థి వ్యక్తిగతంగానే కాదు... పార్టీలూ ఈ సర్వే సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో ఎన్నికల సీజన్లో కనీసం ఆరు నెలలు సర్వే సంస్థలకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం ఉంటుంది. ఇవి తమ వృత్తికి పదును పెట్టే అనుభవంగా కూడా యువత భావిస్తున్నారు. విశ్లేషణలో మానవ వనరులే కీలకం ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజకీయ నేతలు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో ఈ సర్వేలే కీలకమని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలంటే వేల సంఖ్యలో వివిధ రకాల విద్యావంతులు అవసరం. తాత్కాలిక ఉపాధే అయినా, వారికి మెరుగైన అనుభవం వస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో దాదాపు లక్షకు పైగానే యువత ఎన్నికల సర్వేలో నిమగ్నమైనట్టు అంచనా. –దేశినేని రాజ్కుమార్ (హెచ్ఎంఆర్ రీసెర్చ్) మంచి ఉపాధి సర్వే సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపే యువతను గుర్తించి నెల రోజులు సాంకేతికంగా, ఫీల్డ్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్కిల్ వెలుగులోకి రావడానికి ఇది తోడ్పడుతుంది. ఈ తక్కువ సమయంలో లభించే వేతనం పోటీ పరీక్షలు, కొన్ని రోజులు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు ఉపయోగపడుతోంది. – శైలజ (సర్వే సంస్థలో ఉద్యోగి) మంచి అనుభవం ప్రజాక్షేత్రంలో ఎన్నికల సర్వే చేపట్టడం ఓ మంచి అనుభవం. ఈ సమయంలో వేతనంతో పాటు ఫీల్డ్కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా టీఏ, డీఏ ఉంటాయి. ఉపాధి పరంగానూ మంచి అవకాశమే. యువత సర్వే చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కోరుకునేదేంటో నేతల దృష్టికి తీసుకెళ్తున్న తృప్తి ఉంటోంది. – లక్ష్మాగౌడ్ (ఎన్నికల సర్వేలో ఫీల్డ్ సిబ్బంది) -
సోషల్ మీడియాలో కనపడని పార్టీల సైన్యం!
ఒకప్పుడు.. ఎన్నికల ప్రచారమంటే ఊరూరా పార్టీలు, నాయకుల ర్యాలీలు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు.. ప్రచార పాటలతో తిరిగే వాహనాలు మాత్రమే అన్నట్టుండేది. ప్రతి పార్టీకి, అభ్యర్థికి వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా సైన్యం ఎన్నికల కదనంలో తెరవెనుక ఉంటూ కనిపించని యుద్ధం చేస్తోంది. ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువే ఉంటుండటంతో.. ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసుకుంది. కొన్ని పార్టీల నేతలు, కొత్తగా ఎన్నికల్లో పోటీలో దిగుతున్నవారు కూడా సైతం ఎవరికి వారు సొంతంగా సోషల్ టీంలను పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా దీని వెనుకదాగున్న అంశాలపై కథనం.. – సాక్షి , హైదరాబాద్ ‘సోషల్’ప్రచారం.. ఎందులో ఎలా? ఫేస్బుక్లో ప్రత్యేక పేజీలు, ఖాతాలు సృష్టించి ప్రమోషన్.. ఇన్స్టాగ్రాంలో రీల్స్ ద్వారా.. ట్విట్టర్ (ఎక్స్)లో హ్యాష్ట్యాగ్ల ద్వారా.. యూట్యూబ్ చానల్స్లో ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చేలా చేయడం. సోషల్ మీడియా వాడకం సూక్ష్మంగాఇలా.. ♦ కంటెంట్ క్రియేషన్ ♦ కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్ ♦ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ ♦ కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. సోషల్ మీడియాలో మంచి ప్రచారం పొందాలంటే ఓటర్లను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా.. అనుకూల ఓటరుగా మార్చేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీడియో, ఆడియో సందేశాలు ఉండాలి. ఇందుకే అన్ని రాజకీయ పార్టీలు కంటెంట్ రైటర్లను, క్రియేటర్లను నియమించుకుంటున్నాయి. నేతలు కూడా వ్యక్తిగత సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కంటెంట్ క్రియేటర్లు రోజువారీగా వారికి ఇచ్చిన టార్గెట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, సదరు రాజకీయ పార్టీ లేదా పోటీలో ఉన్న నాయకుడి గురించిన సానుకూల అంశాలు.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల బలహీనతలపై విమర్శలతో కంటెంట్ను రాసి ఇస్తూ ఉంటారు. కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్.. కంటెంట్ రైటర్ల ద్వారా తీసుకున్న అంశాలతో తయారు చేసిన కథనాలు, ఆడియోలు, వీడియోలు, ఫొటోలను టార్గెట్గా పెట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా లేదా రాష్ట్రం మొత్తంగా ఓటర్లకు వివిధ రకాల సోషల్ మీడియా వేదికల ద్వారా చేర్చడమే కంటెంట్ ప్రమోషన్. ఇందుకోసం కంటెంట్ ప్రమోటర్లు తొలుత ఆ రాజకీయపార్టీ, నేతల పేరిట ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, చానళ్లు వంటివి సృష్టిస్తారు. సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ సోషల్ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్ ప్రపంచం. అందులో మనం పోస్ట్ చేస్తున్న, వైరల్ చేస్తున్న కంటెంట్ను, వీడియోలు, ఫొటోలు, సమాచారం, ఆడియో మెసేజ్లు ఎంత వరకు టార్గెట్ ఓటర్లకు చేరుతుంది. ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? టార్గెట్ ఓటర్ను ఆకర్షించేలా ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నాయి? వాటిని కౌంటర్ చేయాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలన్న అంశాలను విశ్లేషించడాన్నే స్థూలంగా సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్గా చెప్పొచ్చు. దీని ఫీడ్బ్యాక్ను ఆధారంగా కంటెంట్లో ఎలాంటి మార్పులు చేయాలనేది కంటెంట్ రైటర్లకు సూచనలు చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో అంశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ప్రజల నాడి తెలుసుకోవడం కూడా ఈ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ టీమ్ల పనిగా చెప్పొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియాతో.. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ డిబేట్లు, సోషల్ మీడియాలో గట్టి ప్రచారంతో ఆయన ముందంజలో నిలుస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. హ్యాకింగ్ టీమ్లతో గుట్టు తెలుసుకుంటూ.. పలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు, నేతల వ్యూహాలను తెలుసుకోవడం కోసం సైబర్ హ్యాకింగ్ నిపుణుల సేవలనూ వాడుకుంటున్నారు. సోషల్ మీడియా పెనెట్రేటింగ్ టూల్స్ను వినియోగించి.. కీలక వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. ప్రచార ట్రెండ్ మారింది.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరేందుకు సోషల్ మీడియా అనేది రాజకీయ పార్టీలకు, నేతలకు అస్త్రంగా మారింది. ఓటర్లకు మన బలాన్ని చెప్పడంతోపాటు ఎదుటి వ్యక్తి బలహీనతలపై ఓటర్లను ఆలోచింపజేసేలా ఈ డిజిటల్ ప్రచారం ఉపయోగపడుతోంది. పార్టీలే కాదు అభ్యర్థులు సైతం సొంతంగా సోషల్ మీడియా ప్రచార టీమ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాట్సాప్ చానల్.. నయా ట్రెండ్.. స్మార్ట్ఫోన్ ఉండి, ఇంటర్నెట్ వాడే ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న సోషల్ మీడియా యాప్ అంటే వాట్సాప్ అని టక్కున చెప్పేయొచ్చు. ఇందులో ఇటీవల జతచేసిన సరికొత్త చానల్ ఫీచర్ సైతం ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఆయా పార్టీలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ వాట్సాప్ చానల్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. వాట్సాప్ చానల్లో సదరు పార్టీలు, నాయకులు తమ కంటెంట్ను వైరల్ చేస్తూ ఓటర్లకు చేరుతున్నారు. ఇది కూడాకంటెంట్ ప్రమోషన్గా చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్స్.. టిక్టాక్ వీడియోలు, హెల్త్, యోగా, ఫ్యాషన్ ఇలా పలు అంశాలపై సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇన్ఫ్లూయెన్సర్ల (సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులు)కు డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరో విధానం. మనం చెప్పదలచుకున్న అంశాలపై వీడియోలు, లింక్లు ఇస్తే.. వాటిని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని షేర్ చేస్తారు. ఇందులో ఇన్ఫ్లూయెన్సర్ల ఫాలోవర్స్కు సదరు రాజకీయ పార్టీ లేదా నేత కంటెంట్ను చేర్చుతున్నారు. ఒక్కో చోట..ఒక్కోలా.. ♦ ఫేస్బుక్లో పార్టీ లేదా నాయకుడి కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోలు ఓటర్లకు చేరాలనుకుంటే అధికారికంగానే ఫేస్బుక్ యాడ్ సెన్స్లో ప్రమోషన్కు కొంత డబ్బులు చెల్లిస్తే చాలు. స్పాన్సర్డ్ ప్రకటనలు వైరల్ అవుతాయి. ఇందుకోసం మనం ఇచ్చిన వివరాలతో ఫేస్బుక్ ఓ జియోఫెన్సింగ్ క్రియేట్ చేస్తుంది. దాని ఆధారంగా ఈ కంటెంట్ వెళ్లేలా చేస్తారు. ♦ గూగుల్ యాడ్ సెన్స్లోనూ డబ్బులు చెల్లిస్తే.. ఫేస్బుక్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్స్ట్రాగామ్ లింక్ అందులో షేర్ చేస్తారు. ఇలా కూడా కంటెంట్ ప్రమోషన్ చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్లి సెర్చ్ చేయగానే మనం ప్రమోట్ చేయాలనుకున్న లింక్లు హైలెట్ అయ్యేలా చేయడమే గూగుల్ యాడ్ సెన్స్. -
జుకర్బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్స్టా యూజర్లకు షాక్!
మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' (Meta) 2024 నుంచి యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను యాడ్స్ లేకుండా వినియోగించాలనుకుంటే తప్పకుండా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటూ కంపెనీ కూడా ప్రకటించింది. అయితే యాడ్స్ వచ్చినా వినియోగించుకోవచ్చు అనుకునేవారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ట్రయల్ తరువాత అధికారికంగా 2024 మధ్యలో గానీ లేదా ఆ సంవత్సరం చివరి నాటికి గానీ అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వినియోగదారుని అనుమతి లేకుండా ప్రకటనలు పంపినందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి అవసరం అనే రీతిలో యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చింది. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత యూజర్ యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు ఇన్స్టాగ్రామ్ 14 డాలర్లు, ఫేస్బుక్ 17 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ప్రారంభంలో ఫ్రీ అన్న జుకర్బర్గ్ ఇప్పుడు ఎక్స్ (ట్విటర్) బాటలో పయనించడానికి సిద్దమవడం గమనార్హం. -
ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా కొంతమంది మీద ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేఆప్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మెటా సైతం ఇప్పటి వరకు సుమారు 20వేలమందిని ఇంటికి పంపింది. ఇందులో ఒక ఉద్యోగి లేఆప్స్ మీద తన అసహనం ప్రదర్శిస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టింది. జాబ్ పోయి 201 రోజులు (ఆరు నెలల కంటే ఎక్కువ) అవుతోంది, ఇప్పటికి ఒక్క అవకాశం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, పని వాతావరణం మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఫేస్బుక్లో టెక్నికల్ రిక్రూటర్గా పని చేసిన యువతి ఈ పోస్ట్ చేసింది. ఆగిపోయిన చోటే నిలిచిపోయానని, త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ తమ అసహనం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సంస్థ మాత్రం ఇప్పటికి తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. -
ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!
Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్మెంట్ టీమ్పై ప్రభావం చూపుతుంది. గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి ఎంప్లాయిస్పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ప్రభావితం చేయవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ బుధవారం ఉంటుందని భావిస్తున్నారు. అయితే తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్ కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల రాజీనామా చేశారు. కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్వాచ్లపై కూడా పని చేస్తోంది. కాగా గ్లోబల్ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్లో పెట్టుబడులు, ట్రేడింగ్కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్ఫామ్లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్లు, పోర్ట్ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
టైమ్ ట్రావెల్ అనేది ఒక విచిత్ర భావన. దీని గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. టైమ్ ట్రావెల్ అనేది వాస్తవికతకు దూరంగా ఉంటుంది. సినిమాల్లో టైం ట్రావెల్ని చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకుంటే అలా ట్రావెల్ చేసి, తమ గతం చూసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి టైమ్ ట్రావెల్ అనేది ఇంకా సాధ్యం కాలేదు. అయితే టైమ్ ట్రావెల్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు టైమ్ ట్రావెల్ నిజమని అనిపిస్తుంటుంది. ఇటీవల విదేశీ మీడియాలో ఇలాంటి ఒక ఫొటో వైరల్గా మారి, తెగ చర్చలకు దారితీసింది. ఇది టైమ్ ట్రావెల్ను రుజువు చేసే ఫొటో అని చెబుతున్నారు. డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో ఐస్లాండ్ దేశానికి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్లో ఒక ఫోటో షేర్ అయ్యింది. ఈ ఫోటోపై ఈ నాటికీ చర్చలు జరుగుతున్నాయి. అందులో కనిపిస్తున్నది టైమ్ ట్రావెలర్ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదన వెనుక ఒక ఆధారం కూడా ఉందని చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని పరిశీలించినప్పుడు.. అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే ఈ ఫోటో 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐస్లాండ్లోని రెక్జావిక్లో తీసినదని నివేదికలో పేర్కొన్నారు. అ ఫొటోలో జనం రద్దీ కనిపిస్తుంది. సైనికులు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఓ షాపు దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. అతడే టైమ్ ట్రావెల్ చేసిన వ్యక్తి అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకుంటే ఆ సమయంలో ఫోన్లు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో అమెరికన్ సైనికులు రోడ్డు మీద వెళుతుండగా వారి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ముఖంలో అలాంటి ఆందోళన కనిపించడం లేదు. కాగా రోడ్డుపై నడుస్తున్నవారు చలిని తట్టుకునేందుకు ట్రెంచ్ కోట్లు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫొటో షేర్ చేసిన ఫేస్బుక్ బృందం ఇది 1943లో తీసిన ఫొటోగా పేర్కొంది. ఇది కూడా చదవండి: 21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత? -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్కు డిఫైనింగ్ మార్క్ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్గ్రౌండ్లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
బాబు రిమాండ్పై హోరెత్తిన సోషల్ మీడియా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తించారు. ఎన్టీఆర్ ఆత్మశాంతించిందంటూ తెగ పోస్టులు పెట్టారు. వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని, టీడీపీని చంద్రబాబు లాక్కుని ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్కు కరెక్ట్గా 73 ఏళ్ల వయసులో బాబు వెన్నుపోటు పొడవగా... ఇప్పుడు అదే 73 ఏళ్ల వయసులో బాబు జైలు పాలయ్యాడన్నారు. ఖర్మ ఫలితం అంటే ఇదేనని ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లలో పోస్టులు పెట్టారు. ‘‘ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే.. ఎన్ని కన్నీళ్ల ఉసురిది.. వెంటాడుతోంది..’’ అనే పాట బ్యాక్గ్రౌండ్తో 1995 బాబు వెన్నుపోటు ఘటన నాటి వైశ్రాయి హోటల్ ముందు ఎన్టీఆర్ వీడియోలు, ఫొటోల పోస్టింగ్స్తో అభిమానులు హర్షాతిరేఖాలు వ్యక్తంచేశారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచారం కోసం 30 మంది ప్రాణాలను బలిగొన్నాడని.. అప్పుడు చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించమని దేవుడు చంద్రబాబును రాజమండ్రి పంపిస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగింది. వంగవీటి రంగా, కారంచేడు మారణహోమంలో బలైన దళితులు, బషీర్బాగ్ కాల్పుల్లో చనిపోయిన అమాయకుల ఆత్మలు సైతం శాంతించాయని మరికొందరు తమ పోస్టుల ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. అలాగే, చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంపై.. తన అల్లుడికి తగిన బుద్ధి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వదిస్తున్నట్లు కార్టూన్లు, మీమ్లను నెటిజన్లు అత్యధికంగా షేర్ చేస్తున్నారు. రెండోరోజూ ట్విట్టర్లో ట్రెండింగ్ ఇక వరుసగా రెండోరోజూ ట్విట్టర్లో చంద్రబాబు అరెస్టు ట్వీట్లు ట్రెండింగ్గా నిలిచాయి. చంద్రబాబు అరెస్టు, స్కాంస్టర్ చంద్రబాబు, చంద్రబాబునాయుడు, స్కిల్ డెవలెప్మెంట్ స్కాం వంటి హ్యాష్ ట్యాగ్లైన్లు భారీగా ట్రెండింగ్ అయ్యాయి. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ కంటే బాబు అరెస్టు వార్తలే టాప్ ట్రెండింగ్లో నిలిచాయి. -
మెటాకు కీలక మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: స్థూలఆర్థిక వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో భారత్లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్ చెప్పారు. వీటితో పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి తమ యాప్స్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్ను తాము కీలక మార్కెట్గా పరిగణిస్తున్నామని ఆమె వివరించారు. కేంద్రం కొత్తగా రూపొందించిన డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టంతో ఇటు యూజర్ల వివరాల గోప్యతను పాటించడం, అటు నూతన ఆవిష్కరణలు చేయడం మధ్య సమతౌల్యం పాటించడానికి సంబంధించి టెక్ కంపెనీలకు స్పష్టత లభించిందని సంధ్య తెలిపారు. తమ ప్లాట్ఫామ్పై తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత కంటెంట్ని క్రియాశీలకంగా కట్టడి చేసేందుకు కృత్రిమ మేధను తాము సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. పెరుగుతున్న యూజర్లు.. కీలక మార్కెట్లలో టీనేజర్లు, యువతలో ఫేస్బుక్కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయం సరికాదని.. మెటాలో భాగమైన ఫేస్బుక్కు భారత్లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని వివరించారు. భారత్లో తాము వివిధ నవకల్పనలను పరీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 2030 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదగాలన్న భారత్ విజన్ అనేది వ్యాపారాలకు గణనీయంగా ఊతమివ్వగలదని సంధ్య చెప్పారు. -
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో ఫేస్బుక్, ఇన్స్ట్రామ్ యూజర్లకు గట్టి షాకివ్వనుంది. ఆ రెండు ఫ్లాట్ఫామ్లలో యాడ్స్ప్లే అవ్వకూడదనుకుంటే అందుకు యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన యురేపియన్ యూనియన్లో అందుబాటులోకి రానుందని సమచారం. త్వరలో మిగిలిన దేశాలకు సైతం వర్తించనుంది. దీనిపై మెటా అధినేత మార్క్ జుకర్ బెర్గ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. 2019 నుంచి మెటా సేవలపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెటా అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను సేకరిస్తుందని ఆరోపిస్తున్నాయి. నాటి నుంచి న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో మెటా యాజమాన్యం పెయిడ్ సర్వీసులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్లు పేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు ఏ ఒక్కదానికి చెల్లించినా.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది. ఇక పెయిడ్ వెర్షన్లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు.. లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. -
సైక్లింగ్తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్,అస్సాం, వెస్ట్బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్లాండ్లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 3,15,000 మంది, యూట్యూబ్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
ఫేస్బుక్ పరిచయం.. రూ.20 లక్షలకు టోకరా
కొవ్వూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన రాజమహేంద్రవరానికి చెందిన బొల్లంకొండ వెంకట సాయిలక్ష్మి మాయమాటలు చెప్పి విడతల వారీగా రూ.20 లక్షలు కాజేసినట్లు పట్టణానికి చెందిన కంఠమణి వెంకట విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుకుమార్ విశాఖపట్నంలో అకౌంటెంట్గా పని చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరూ తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో విష్ణుకుమార్కి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించి తన అకౌంట్స్ నుంచి విడతల వారీగా పలుమార్లు సొమ్ము జమ చేయించుకుంది. పలు రకాల వస్తువులు కొనుగోలు చేసి తనతో బిల్లులు కట్టేంచేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం చేసుకుందామని అడిగితే తన బావ వెంకట తిరుమలేశ్వరరావుతో మాట్లాడిస్తానని చెప్పి రూ.2 లక్షలు సొమ్ము జమ చేయించుకుంది. మళ్లీ తన స్నేహితురాలు ప్రీతి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమెకు మరో రూ.2.50 లక్షలు ఇస్తే వివాహం చేసుకుంటామని చెప్పించింది. ఆ సొమ్ము చెల్లించలేదన్నారు. అప్పటికే పలుమార్లు, వివిధ మార్గాల ద్వారా రూ.20 లక్షల వరకు చెల్లించారు. చివరిలో అడిగిన సొమ్ము ఇవ్వలేదని వారి ఫోన్లు స్వీచ్ ఆఫ్ చేసినట్లు, తన వద్ద సొమ్ము తీసుకుని మోసగించినట్లు విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై డి.భూషణం తెలిపారు. -
పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తరచూ ఓ యాడ్లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్గా ఉన్నారు నుపూర్. -
రింగ్లో ఫైటింగ్కు సిద్ధమౌతున్న మస్క్, జుకర్ బర్గ్
-
నా పేరు గీతా.. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్లో గీతా సెక్సీ పేరుతో ఉన్న ప్రొఫైల్ నిజమని నమ్మిన కనకపురకు చెందిన యువకుడు సైబర్ నేరస్తుల మాయలో పడి రూ.41 లక్షలు పొగొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. కనకపుర నివాసి రాజేశ్ రూ.41 లక్షలు సమర్పించుకున్న బాధితుడు. కొన్ని రోజుల క్రితం రాజేశ్కు గీతా సెక్సీ పేరుగల ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తన పేరు గీత అని చెప్పిన సైబర్ నేరస్తుడు బెంగళూరు, రామనగర, శివమొగ్గ తదితర జిల్లాల్లో ఎస్కార్ట్ సర్వీస్లు ఇస్తానని, నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన రాజేశ్ తన పర్సనల్ విషయాలు ఫోటోలు షేర్ చేసాడు. కొన్ని రోజులకు అపరిచిత వ్యక్తి ఫొటోలు, వివరాలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. పలు దఫాలుగా మొత్తం రూ.41 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. దీంతో బాధితుడు రామనగర సెన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. చదవండి 45 నిముషాల ప్రయాణానికి మూడు గంటలకు పైగా వెయిటింగ్.. -
చిత్తూరు కుర్రాడితో శ్రీలంక యువతి ఫేస్బుక్ ప్రేమ.. విమానమెక్కి..!
వి.కోట(చిత్తూరు జిల్లా): ఫేస్బుక్లో పరిచయమైన శ్రీలంకకు చెందిన ఓ యువతిని చిత్తూరు జిల్లా యువకుడు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే... వి.కోట మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్కు ఆరేళ్ల కిందట ఫేస్బుక్లో శ్రీలంక దేశం కొలంబోలోని బొలగుండుకు చెందిన విఘ్నేశ్వరితో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరి ఈ నెల 8వ తేదీ టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చింది. ఈ నెల 20వ తేదీ లక్ష్మణ్, విఘ్నేశ్వరి వి.కోటలోని సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. ఆరిమాకులపల్లి గ్రామంలోని లక్ష్మణ్ ఇంట్లో ఉంటున్నారు. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వి.కోట పోలీసులు లక్ష్మణ్, విఘ్వేశ్వరిలను చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. -
ప్రభాస్ 'ఫేస్బుక్' అకౌంట్ హ్యాక్
పాన్ ఇండియా హరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సలార్, కల్కి సినిమాలతో బిజీ ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాకయింది. అందులో ఆయనకు 24 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు విషయాలు. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తుంటారు. లేదంటే వాటికి దూరంగా ఉంటారు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. 'మనుషులు దురదృష్టవంతులు' అనే క్యాప్షన్తో ఉన్న ఈ వీడియో చూసిన అభిమానులు 'ప్రభాస్ ఫేస్బుక్ ఖాతా హ్యాకయింది' అంటూ ట్వీట్స్ పెట్టారు. దీంతో అప్రమత్తమైన ప్రభాస్ టీమ్ సమస్యను పరిష్కరించింది. ఆయన ఖాతాను వెంటనే పునరుద్ధరించారు. 2013 అక్టోబర్ 18న తన పేరుతో ఫేస్బుక్ ఖాతాను ప్రభాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హ్యకింగిక్ కారణాలు తెలియాల్సి ఉందని ప్రభాస్ టీమ్ తెలిపింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. -
మతం మారలేదు.. మేం పెళ్లి చేసుకోలేదు!
ఓవైపు పాక్ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే.. ఫేస్బుక్ స్నేహితుడు(ప్రియుడి!) కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్కు విపరీతమైన హైప్ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్ కూడా వైరల్ అయ్యాయి. అయితే.. భారత్కు చెందిన ఓ జాతీయ ఛానెల్ అంజు-నస్రుల్లాను విడివిడిగా సంప్రదించగా.. మీడియాలో వస్తున్న కథనాలన్నింటిని, తమకు వివాహం జరిగిందన్న ప్రచారాన్ని ఇద్దరూ కొట్టేశారు. నస్రూల్లా ఏమన్నాడంటే.. నేను అంజుని పెళ్లి చేసుకోలేదు. మా పేరుతో వైరల్ అవుతున్న సర్టిఫికెట్ కూడా ఫేక్. అన్నీ పుకార్లే. ఆమె కేవలం నాకు మంచి స్నేహితురాలే. మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాం. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే. అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండడం సహజం. గనుక.. ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. 50 మంది పోలీసులు మాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మేం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆమె ఇంకా హిందువుగానే ఉంది. టూరిస్ట్ వీసా మీద పాక్ను చూడడానికి వచ్చింది. భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని.. విడాకుల ప్రక్రియ నడుస్తోందని నాకూ తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక నన్ను ఇష్టపడితే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటా. కానీ, అది ఆమె నిర్ణయం. ఇప్పటికైతే.. ఆగష్టు 4 వీసా గడువు ముగిశాక ఆమె తిరిగి భారత్కు వెళ్లిపోతుంది. అంజూ ఏమందంటే.. పాక్కు వెళ్లాలనుకున్నాను.. వెళ్లాను. నేనేం మతం మారలేదు. ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్ వ్లోగర్ మా ఇద్దరినీ కలిపి షూట్ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్ షూట్ లేదంటే పోస్ట్ వెడ్ షూట్ కాదు. అంతా పుకార్లే. నేను నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే. భారత్కు తిరిగొచ్చాక.. నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటా అని పేర్కొందామె. అక్కడే చచ్చిదనుకంటాం అంజూ(34) ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ మతం.. ఫాతిమాగా పేరు మార్చేసుకుని పాకిస్తాన్ ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్కు చెందిన నస్రుల్లా(29)ను వివాహం చేసుకుందంటూ పాక్ నుంచి కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియగానే.. ఆమె తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. స్వస్థలం మధ్యప్రదేశ్ గ్వాలియర్ బౌనా గ్రామం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన .. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు పిల్లలు, భర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనీసం బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. తన ఇష్టం, తన జీవితం తనది కావొచ్చు. కానీ, ఇలా చేయాలనుకుంటే.. ముందు భర్తకు విడాకులు ఇవ్వాలి కదా. కానీ, ఇలా పరువు తక్కువ పని చేయకూడదు కదా. అన్ని బంధాలను తెంచుకున్న అంజూ ఇక మా దృష్టిలో చచ్చినట్లే అని అంజు తండ్రి గయా ప్రసాద్ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు వ్యాఖ్యానించిన ఆయన.. కూతురి నిఖా చేసుకుందనే వార్త తెలిసే సరికి దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరిగి ఆమెను భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తారా?.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అంటే.. అలాంటి ప్రయత్నమేమీ చేయబోమని తెలిపారాయన. చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | Gwalior, Madhya Pradesh | Gaya Prasad, father of Anju who travelled to Pakistan says, "We don't have any relations with her (Anju). The moment she left India, we cut off all ties with her...I had never imagined that my daughter can do something like this...What she has… pic.twitter.com/aN0YvI8RpM — ANI (@ANI) July 26, 2023 ఇదీ చదవండి: ఆకాశంలో వింత.. స్వర్గానికి దారి ఇదేనా? -
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
ప్రియుడి కోసం పాకిస్థాన్కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్కు చేరినట్లు, త్వరలోనే భారత్కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాతం మార్చుకున్న అంజూ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్లోని దిర్ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. సంబంధిత వార్త: అందుకే పాక్ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్! నిఖా హోగయా అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్ డివిజన్ డీఐజీ నసీర్ మెహమూద్ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. 24 గంటలు గడవకముందే నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది. పాక్లోనే ఉంటుందా? తిరిగొస్తుందా! ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది? Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U — Naimat Khan (@NKMalazai) July 25, 2023 -
ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్కు చెందిన అజు అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్స్థాన్కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది. మూడేళ్లుగా పరిచయం తన పాకిస్థాన్ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్సర్కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్బుక్ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సీమా హైదర్తో పోల్చకండి కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది. సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్కు రానుందని ఆమె పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు. 2019లో పరిచయం కాగా ఉత్తరప్రదేశ్లోని కైలోర్కు చెందిన అంజూ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు అరవింద్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వాలిడ్ పాస్పోర్టుతో.. అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఎఅప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి..
పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ మాదిరిగానే గత ఏడాది తన హిందుస్తానీ ప్రేమికుని కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి కృష్ణ మండల్ భారత్ చేరుకుంది. ఆమెకు ఫేస్బుక్ ద్వారా కోల్కతాకు చెందిన ఆభిక్ మండల్తో తొలుత స్నేహం ఏర్పడింది. పాస్పోర్టులేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకుంది. ఇక్కడ ఆమె తన ప్రియుడని పెళ్లాడాలనుకుంది. అయితే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రేమికుల కథ ఏ విధంగా సాగిందంటే.. ప్రేమకు హద్దులు ఉండవు. సీమా హైదర్ దీనిని అక్షరాలా నిరూపించింది. అయితే ఈ జాబితాలో ఆమె ఒక్కర్తే లేదు.. ప్రేమలో మునిగితేలుతూ తమ దేశాన్ని విడిచిపెట్టి భారత్ చేరుకున్న పలువురు యువతుల కథలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత ఏడాది అంటే 2022, మే 28న దేశ సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ ఒకటి వెలుగు చూసింది. బంగ్లాదేశ్కు చెందిన 22 ఏళ్ల యువతి కృష్ణ తన ప్రేమికుని కోసం రహస్యంగా సరిహద్దులను దాటి భారత్ చేరుకుంది. సీమా హైదర్-సచిన్ కేసుకు దీనికి పోలిక కనిపిస్తుంది. సీమా హైదర్ తన స్నేహితుడిని పబ్జీ గేమ్ ద్వారా కలుసుకోగా, బంగ్లాదేశ్కు చెందిన కృష్ణ తన స్నేహితుడిని ఫేస్బుక్ మాధ్యమంలో కలుసుకుంది. వీరి స్నేహం అతి త్వరలోనే ప్రేమగా పరిణమించింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణ తన ప్రియుడిని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ దారిలో ఆమెకు దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు లాంటి ఆటంటకాలు ఎదురైనా ఆమెకు ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటిని దాటుకుని ఆమె తన ప్రియుడిని మనువాడేందుకు భారత్ వచ్చింది. దట్టమైన అటవీప్రాంతం మీదుగా.. కృష్ణకు కోల్కతాలోని నరేంద్రపూర్ ప్రాంతానికి చెందిన రానియా అభిక్ మండల్తో 2021లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. అది వీరిద్దరి ప్రేమకు దారితీసింది. అనంతరం కృష్ణ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రేమలో నిండా మునిగిన ఆమె పులులు సంచరించే దట్టమైన అటవీప్రాంతంగా పేరొందిన సుందరవనాలను దాటింది. అడవుల్లోని నదులను ఈదుకుంటూ వచ్చి భారత్ చేరుకుంది. ఈ దశలో పలుమార్లు దారి తప్పిపోయింది. పాస్పోర్టు లేనందున జనాల కంటపడకుండా రహస్యంగా పశ్చిమబెంగాల్ చేరుకుంది. అక్కడ అభిక్ను కలుసుకుంది. కోల్కతాలో ప్రేమికులిద్దరూ ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. పోలీసుల అరెస్టుతో.. అయితే ఇక్కడే ఈ జంటకు ఆటకం ఎదురయ్యింది. కృష్ణ అక్రమంగా భారత్లోకి చొరబడిందంటూ పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. తన దగ్గర ఎటువంటి పాస్పోర్టు లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకరమైన మార్గంలో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. సురేంద్రపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తరువాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు పంపించారు. ఇది కూడా చదవండి: రోడ్డుపై సడన్గా విగ్రహంలా మారిన మహిళ.. టైమ్ ట్రావెల్ చేస్తున్నదంటూ.. -
Social Media Scams: ఫేక్ యాడ్స్తో జాగ్రత్త.. సైబర్ వలలో చిక్కుకోవద్దు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, గూగుల్ ప్లాట్ఫారమ్స్లో ఇవి అధికంగా కనిపిస్తుంటాయి. వీటిలో ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి అని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. నిజమని నమ్మి మోసపోయే బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రకటనల పేరుతో జరిగే ఈ ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఫేస్బుక్ ద్వారా.. మోసగాళ్లు నకిలీ అకౌంట్స్ను ఓపెన్ చేస్తారు. వీటిని ఫేక్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, పోస్ట్లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఈ నకిలీ అకౌంట్స్ ద్వారా వచ్చే యాడ్స్కు ఎటువంటి వాస్తవిక ఆధారాలు ఉండవు. ఫేస్బుక్ ప్రకటనలపై క్లిక్ లను రూపొందించడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. దీని ద్వారా కృత్రిమంగా క్లిక్ త్రూ రేట్లను పెంచి, ప్రకటనదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతారు. అలాగే, యాడ్ నెట్వర్క్ను మోసగించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు లేదా యాప్స్ను అనుకరిస్తారు. దీంతో మోసపూరిత వెబ్సైట్లలో ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో.. ♦ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ ఫాలోవర్లను కొనుగోలు చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. లేదా వారి ప్రజాదరణను పెంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, దీని ద్వారా ప్రకటనదారులు ఆశించిన ప్రయోజనాన్ని పొందలేరు. ♦మోసగాళ్లు ఫేక్ గ్రూప్లను క్రియేట్ చేస్తారు. ఒకరి పోస్ట్లను లైక్, షేర్, రివ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. దీని ద్వారా వినియోగదారులు నమ్మకాన్ని పొందేందుకు ఒక భ్రమను సృష్టిస్తారు. తమ యాడ్స్ను ప్రచారం చేసే విధంగా మలుచుకుంటారు. ♦ ఫేక్ గ్రూప్స్ మాదిరిగానే పాడ్ నెట్వర్క్లను ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా సభ్యులు ఒకరి పోస్ట్లపై మరొకరు కృత్రిమమైన ఎంగేజ్మెంట్ను పెంచుకుంటారు. ఎక్కుమంది వ్యూవర్స్ను చేరుకోవడానికి ఇదో తరహా ఎత్తుగడ. ట్విటర్ ► ఫేక్ ఫాలోవర్లు, రీ ట్వీట్లు, లైక్స్ క్రియేట్ చేయడానికి మోసగాళ్లు ఆటోమేటెడ్ బాట్లను అమలు చేస్తారు. వారు హ్యాష్ట్యాగ్స్ లేదా టాపిక్స్ను విస్తరించడానికి బాట్స్ను ఉపయోగిస్తారు. ఇది ట్రెండింగ్ భ్రమను సృష్టిస్తుంది. ► మోసగాళ్లు కొన్ని హ్యాష్ట్యాగ్లు లేదా టాపిక్స్తో జనాదరణ పొందేలా, ట్రెండింగ్లో ఉండేలా కృత్రిమ ప్రచారం చేస్తారు. ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆశతో ప్రకటనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ► హ్యాష్ట్యాగ్స్, రీ ట్వీట్స్ చేయడానికి, విస్తరించడానికి ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేస్తారు. దీని ద్వారా కంటెంట్, విజిబిలిటీతో వ్యూవర్స్ను రీచ్ అవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రచార మోసానికి మార్గాలు ♦ మోసగాళ్లు క్లిక్బైట్ మెసేజ్లను ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియా యా ద్వారా పంపుతారు. ♦ సోషల్ మీడియా ΄ఫ్లాట్ఫారమ్లలో, గూగుల్ ప్రకటనలలో ఫేక్ యాడ్స్ సృష్టిస్తారు. ముఖ్యంగా కొత్త ఐ ఫోన్ మోడల్ వంటి ట్రెండింగ్లో ఉన్న విషయాలను ప్రచారం చేస్తారు. ♦ ప్రకటనలకు ఆకర్షితుడై మోసగాడిని సంప్రదించినప్పుడు అతను బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లించమని అడుగుతాడు. ♦ కోరుకున్న వస్తువు డిస్కౌంట్ రేట్లో లభిస్తుందనే ఆశతో మోసగాడు చెప్పిన మొత్తాన్ని బాధితుడు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాడు. ఆ తర్వాత డెలివరీ, జీఎస్టీ, ఎక్స్ప్రెస్ డెలివరీ ఛార్జీలు మొదలైనవాటికి అదనపు మొత్తాన్ని చెల్లించమని బాధితుడిని కోరతాడు. ♦ మోసగాడు చెప్పింది నిజమని బాధితుడు నమ్మి డెలివరీ ట్రాకింగ్ వివరాలను పంపుతాడు. లేదంటే, అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ♦ బాధితుడు డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోసగాడు కాల్స్ను, ఇతర కమ్యూనికేషన్ మార్గాలను బ్లాక్ చేస్తాడు. మోసాన్ని అధిగమించడానికి .. ► మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రముఖ వ్యాపార ప్రకటనల నెట్వర్క్లు, పబ్లిషర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఏవైనా అడ్వర్టైజింగ్, పార్టనర్షిప్లలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి, తగిన శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రకటనల మోసాన్ని గుర్తించి, నిరోధించడంలో సహాయపడే ధ్రువీకరణ సాధనాలు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఇవి, అనుమానాస్పద యాడ్స్ లోని లొసుగులను కనిపెట్టగలవు. క్లిక్ ఫ్రాడ్, ఇంప్రెషన్ ఫ్రాడ్ వంటి వివిధ రకాల మోసాలకు వ్యతిరేకంగా ఇవి రక్షణను అందిస్తాయి. ► ఏవైనా అనుమానాస్పద యాడ్స్ను గుర్తించడానికి ఇతర యూజర్ల క్రమాన్ని కూడా పర్యవేక్షించాలి. అంటే, అసహజంగా అనిపించే లైక్స్, షేర్స్ వేగంగా పెరగడం వంటివి ఉన్నాయేమో చెక్ చేయాలి. ► మోసాన్ని గుర్తించే లెర్నింగ్ టెక్నిక్స్ను ఉపయోగిస్తే ఇవి మోసపూరిత తేడాలను గుర్తించగలవు. ► మీ యాడ్స్... సంబంధిత ఫ్లాట్ఫారమ్లలో కనిపించేలా చూసుకోవడానికి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలి. అనుమానాస్పదమైన, క్వాలిటీ లేని వెబ్సైట్స్, మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే యాప్లలో ప్రకటనలను ఉంచడం మానుకోవాలి. ► ఈ తరహా తాజా మోసాలను మీ టీమ్ అంటే.. బంధుమిత్రుల సమూహాలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేందుకు ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లు, వెబినార్లు, వర్క్షాప్స్కు హాజరవ్వాలి. ► ప్రకటనల ప్రచారాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. డేటాలో ఏవైనా తేడాలు ఉన్నాయేమో సరిచూసుకోవాలి. మీరు మోసపూరిత కార్యకలాపాలను అనుమానించినట్లయితే, వాటిని సంబంధిత యాడ్ ఫ్లాట్ఫారమ్స్ లేదా నెట్వర్క్లకు తెలియజేయాలి. మోసపూరిత ప్రకటనల విధానాలను పంచుకోవడం ద్వారా మిగతావారిని అలెర్ట్ చేయవచ్చు. ► ప్రకటనల మోసాన్ని ఎదుర్కోవడానికి నిజాయితీని ప్రోత్సహించే ఇండస్ట్రీ అసోసియేషన్స్తో కనెక్ట్ అయి ఉండటం శ్రేయస్కరం. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్బుక్లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా'ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన వాటికి పూర్తిగా నిషేధించే బదులు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యాప్లలో ఆర్థిక, భద్రత పరమైన అంశాలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. -
ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న జాబితాలో గూగుల్,మెటా!
ప్రముఖ టెక్ కంపెనీలు ఆర్ధిక మాంద్యం భయాలతో ఉద్యోగుల్ని ఇష్టానుసారంగా తొలగిస్తున్నా..జీతాలు చెల్లించే విషయంలో ప్రశంసలందుంకుంటున్నాయి. గత ఏడాది ఏయే కంపెనీలు ఉద్యోగులకు ఎంతమేర జీతం చెల్లించాయని నిర్ధారించేలా వాల్ స్ట్రీట్ జర్నల్ కంపెనీల ఆర్ధిక సమాచారాన్ని విశ్లేషించే కంపెనీ మైలాగ్ఐక్యూ డేటాను పరిగణలోకి తీసుకుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎస్అండ్పీ 500 ఇండెక్స్ కంపెనీల్లో భాగమైన 278 కంపెనీల వేతనాల్ని పరిశీలించారు. అయితే, అనూహ్యంగా ఆ నివేదికలో శాలరీ ఎక్కువ ఇస్తున్న కంపెనీల జాబీతాలో మెటా,గూగుల్లో చోటు దక్కించుకున్నాయి. మైలాగ్ఐక్యూ డేటా ఆధారంగా 2022లో అత్యధిక వేతనాలు చెల్లించిన కంపెనీల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ విసి ప్రాపర్టీస్ 4.15 లక్షల వేతనంతో ఈ జాబితాలో అగ్రస్ధానం, మెటా 3,00,000 డాలర్ల మధ్యస్త వేతనంతో రెండవ స్ధానంలో నిలవగా, 2.8 లక్షల డాలర్ల వేతనంతో ఆల్ఫాబెట్ మూడో ప్లస్ను కైవసం చేసుకుంది. ఇక, గత ఏడాది నవంబర్లో మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది మార్చిలో 10,000 మందిపై వేటు వేసింది. మరోవైపు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది జనవరిలో కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సమాచారం అందించారు. -
ఫేస్బుక్పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆధునిక కాలంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా యాప్స్లో చాలామంది కాలం గడిపేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఖాతాదారుని అకౌంట్ని సంస్థలు బ్లాక్ చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుని సరిపెట్టుకుంటాడు. కానీ అమెరికాకు చెందిన ఒక లాయర్ దీని భిన్నంగా అకౌంట్ బ్లాక్ చేసిన కంపెనీ మీద కేసు వేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని జార్జియాకు చెందిన 'జాసన్ క్రాఫోర్డ్' (Jason Crawford) అనే వ్యక్తి తనకు కలిగిన అంతరాయానికి ఫేస్బుక్ కంపెనీకే చెమటలు పట్టించాడు. తన ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో సంస్థ మీద కేసుపెట్టి కోర్టుకి లాగాడు. అంతటితో ఆగకుండా నష్టపరిహారంగా 50 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41.11 లక్షలు జరిమానా విధిందెలా చేసాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) క్రాఫోర్డ్ అందించిన సమాచారం ప్రకారం.. ఒక రోజు ఉదయం ఫేస్బుక్ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయినట్లు, నన్ను బ్యాన్ చేసినట్లు తెలిసింది. దీనికి కారణం చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అని తెలిసింది. అలాంటి తప్పు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పాడు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం సంస్థకు ఫిర్యాదు చేయడానికి చాలా సార్లు ప్రయత్నించానని, అయినా ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించాడు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) ఫేస్బుక్ అకౌంట్ బ్యాన్ కావడాన్ని జీర్ణించుకోలేని క్రాఫోర్డ్ వృత్తి రీత్యా లాయర్ కావడం వల్ల 2022 ఆగష్టులో కంపెనీ మీద కేసు వేసాడు. అయినప్పటికీ ఫేస్బుక్ నుంచి సరైన సమాధానం లభించలేదు, దీంతో కోర్టు క్రాఫోర్డ్కు 50 వేల డాలర్లు చెల్లించాలని మెటాను ఆదేశించింది. అయితే క్రాఫోర్డ్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే సంస్థ తన అకౌంట్ రీస్టోర్ చేసింది. కానీ జరిమానా చెల్లించలేదు. -
ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర పోలీసులతో ఫేస్బుక్ సహకరించకపోతే, ఇండియా అంతటా తన సేవలను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. (సూపర్ ఆఫర్: రూ. 2749 కే యాపిల్ ఐఫోన్ 11!) సౌదీ జైలులో ఉన్న భారతీయుడి కేసు దర్యాప్తుపై రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ఫేస్బుక్ కార్యకలాపాలను మూసివేసేలా ఆర్డర్ జారీ చేయడాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు బుధవారం ఫేస్బుక్ను హెచ్చరించింది. దక్షిణ కన్నడ జిల్లా నివాసి కవిత పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వారంలోగా అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఫేస్బుక్ను ఆదేశించింది. తప్పుడు కేసులో అరెస్టు చేసిన కేసులో ఏ చర్య తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం బాధాకరం. మంగళూరు పోలీసులు కూడా తగు విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్న కోర్టు, విచారణను జూన్ 22కి వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేశారని, తాను పిల్లలతో తన స్వగ్రామంలో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్లో తెలిపారు.2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కి మద్దతుగా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడనే అభియోగంతో సౌదీ పోలీసులు శైలేష్ కుమార్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. (చైనా స్మార్ట్ఫోన్ మేకర్కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్బై, ప్రత్యర్థికి సై!?) అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్కు లేఖ రాసి, నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే ఫేస్బుక్ దీనిపై స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదలకు సాయం చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరిన్ని బిజినెస్వార్తలు, ఇంట్రస్టింగ్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
సొంత ఉద్యోగులే భారీ షాకిచ్చారు
-
లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్కు మింగుడు పడని వార్త ఇది. మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే మెటా మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఐదు శాతం పడిపోయిందని తెలిపింది. (అదరగొట్టిన పోరీలు..ఇన్స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) వాల్ స్ట్రీట్ జనరల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 74 శాతం మంది అసంతృప్తితో ఉన్నారట. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయింది. (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి అనేక టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులపై వేటు వేశాయి. ముఖ్యంగా మెటా అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత , మాజీ ఉద్యోగులు భావిస్తున్నారు. -
ఫాలోయింగ్లో కింగ్
వివిధ డిజిటల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వహణలో ముందుకు దూసుకుపోతోంది. తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ డిజిటల్ మీడియా వింగ్.. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, తప్పుడు సమాచారంపై అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కార్యాలయం, మంత్రి కేటీఆర్ను ఎంత మంది అనుసరిస్తున్నారు, ఎంత మందికి చేరువవుతున్నారనే గణాంకాలను ఇటీవల తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసింది. మరోవైపు ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి ట్విట్టర్లో హరియాణా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ వెయ్యి మందిలో 44 మంది సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఉద్యోగాలపై బారి వేటు అదిరి పోయే ప్యాకేజ్..
-
మెటా తొలగింపులు: ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్లకు షాక్!
సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా భారతీయ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఇండియాలో నలుగురు కీలక ఉద్యోగులను తొలగించింది. కాస్ట్ కటింగ్, వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ,, ఆదాయ వృద్ధిని స్థిరంగా ఉంచే చర్యల్లో భాగంగా మెటా పలు రౌండ్లలో లేఆఫ్స్ ప్రకటించింది. అయితే తాజా తొలగింపులు చివరిదిగా భావిస్తున్నారు. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) ఇక ఇండియాలో మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం భారత మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్టనర్షిప్ డైరెక్టర్ సౌరభ్,మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిజైన్ చేయాల్సిందిగా ఈమెయిల్ ద్వారా వీరిని కోరినట్టు సమాచారం. దీంతోపాటు మలిదశ తొలగింపుల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మరికొంతమందిని తొలగిస్తోంది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్లు వంటి టీమ్లలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులు తమను తొలగించినట్లు లింక్డ్ఇన్లో ప్రకటించారు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్ ) కాగా మైక్రోసాఫ్ట్, గూగుల్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ పేరెంట్ మెటాతో సహా టెక్ దిగ్గజాలు గత ఏడాది చివరి నుంచి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించు కునేందుకు ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్టు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మార్చిలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ప్రారంభంలో 11వేల మందికి, ఏప్రిల్లో మరో పదివేల మందికి ఉద్వాసన పలికింది.రెండవ రౌండ్ మాస్ లేఆఫ్లను ప్రకటించిన తొలి టెక్ దిగ్గజం మెటా. (Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్) భారీ చెల్లింపులు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న మెటా సంబంధిత ఉద్యోగులకు భారీ చెల్లింపులే చేస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం మొత్తం21 వేలమందికి ప్రీ-టాక్స్ సెవెరెన్స్, సంబంధిత ఖర్చులు నిమిత్తం సుమారు 1 బిలియన డాలర్లు అంటే సుమారు రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువే చెల్లిస్తోంది. -
మెటాకు భారీ షాక్
-
ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కంపెనీకి భారీ షాక్ తగిలిదింది. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీసీ) రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్బుక్ డేటాను,అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ జరిగిందని ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. మే 25, 2018 నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్డాగ్ తెలిపింది. ఇందుకు గాను 1.2 బిలియన్ యూరోలు లేదా 130 కోట్ల డాలర్లు అంటే 10వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.(అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) మెటా స్పందన అయితే ఈయూ నిర్ణయంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్యాయమైన , అనవసరమైన జరిమానా సహా, డీపీసీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇతర కంపెనీలకు ఇది తప్పుడు సందేశమిస్తోందని ఆరోపించింది. -
యూజర్ల డేటా అమెరికాకు బదిలీ, మెటాకు భారీ జరిమానా!
ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియా నిబంధనల్ని ఉల్లంఘించిందుకు ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిందని ఆరోపిస్తూ ఐర్లాండ్ రెగ్యులేటర్ రికార్డ్ స్థాయిలో మెటాకు 1.2 బిలియన్ యూరోల (1.3 బిలియన్ డాలర్లు) ఫైన్ విధించింది. యూరోపియన్ యూనియన్కి చెందిన ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) 1.2 బిలియన్ యూరోలను మెటా నుంచి వసూలు చేసే బాధ్యతలను యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (ఈడీపీబీ)కి అప్పగించింది. ఇక 2020 నుంచి ఫేస్బుక్ మాతృసంస్థ ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిన అంశంపై విచారణ ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మెటా యురోపియన్ కేంద్ర కార్యాలయం డుబ్లిన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కేంద్రం నుంచే మెటా యూజర్లు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించేలా వ్యహరించిందంటూ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ (సీజేఈయూ) అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ జరిమానాను మెటా వ్యతిరేకించింది. లోపభూయిష్టంగా, అన్యాయంగా ఇచ్చిన తీర్పు ఇతర కంపెనీలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. రెగ్యులేటర్ విధించిన జరిమానా, ఇతర అంశాలపై చట్టపరంగా పోరాటం చేస్తామని మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ చీఫ్ లీగర్ అధికారి జెన్నీఫెర్ న్యూస్టెడ్ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
వినతుల వెల్లువ.. వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్!
న్యూఢిల్లీ: వాట్సాప్ ఓ అనుకూల సదుపాయాన్ని తన యూజర్ల కోసం రూపొందించింది. ఒకటికి మించిన ఫోన్లలో ఒక్కటే వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, రానున్న వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది వినియోగంలోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ కావాలంటూ వాట్సాప్ యూజర్లలో ఎక్కువ మంది నుంచి వినతులు రావడంతో దీన్ని రూపొందించినట్టు సంస్థ తెలపింది. వాట్సాప్ను వెబ్ బ్రౌజర్కు కనెక్ట్ చేసిన మాదిరే, ఒకటికి మించిన ఫోన్లలోనూ అనుసంధానించడం ద్వారా కొత్త ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే ఖాతా అనుసంధానమై ఉన్న ఏ ఫోన్లో అయినా చాట్, మీడియా, కాల్స్ సేవలు వాడుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఒకవేళ ప్రైమరీ ఫోన్ (మొదట ఇన్స్టాల్ చేసుకున్న)లో వాట్సాప్ చాలా కాలంగా యాక్టివ్గా లేకపోతే, అప్పుడు ఆ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న ఇతర ఫోన్లలోనూ దానంతట అదే లాగవుట్ అవుతుందని పేర్కొంది. సైనవుట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కు ‘నౌ స్విచ్’ను ఎంపిక చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. -
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం మొబైల్ లేకుండా మనకు రోజే గడవదు, అందులోనూ వాట్సాప్, ఫేస్బుక్ వంటివి లేకుండా కాలం ముందుకు సాగదు. అయితే మనకు నచ్చిన వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో స్టేటస్లగా పెట్టుకోవడం సర్వసాధారణమయిపోయింది. అయితే ఇప్పటివరకు వాట్సాప్లో వేరుగా ఫేస్బుక్లో వేరుగా స్టేటస్లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి పద్దతికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది. వాట్సాప్ స్టేటస్ను ఫేస్బుక్లో స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్లో షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలి. అలా కాకుండా వాట్సాప్ తీసుకు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఒకే సమయంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మన వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్లో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్ప్ట్, ఓన్లీ షేర్ విత్ మీ అనే మూడు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే త్వరలో వాటి కింద ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ కూడా రానుంది. వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) వాట్సాప్లో రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మనం ప్రత్యేకంగా ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రెండింటిలోనూ స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. -
షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కూడా లేఆఫ్స్ బాట పట్టినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్, సిస్కో, ఆమెజాన్ఇ లా..దాదాపు అన్ని టాప్ టెక్ సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించినప్పటికీ యాపిల్ ఇప్పటిదాకా లేఆఫ్స్ మాట ఎత్త లేదు. కానీ ఇపుడిక యాపిల్ కూడా ఉద్యోగాలపై వేటు వేయనుంది. (ఇది కూడా చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం, ఐఫోన్ మేకర్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్స్లో కోతలను విధిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీ అభివృద్ధి డెవలప్మెంట్ అండ్ ప్రిజర్వేషన్ బృందాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు, అయితే ఎంతమందిని తొలగించనున్నారనే దానిపై స్పష్టతలేదు. మరోవైపు ఉద్యోగాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని,లేదంటే తొలగింపులు తప్పవని ఉద్యోగులను యాపిల్ హెచ్చరించినట్టు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. దీనిపై యాపిల్ అధికారిక ప్రకటన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా ఫెడ్ అధిక వడ్డీ రేట్టు, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో ఇటీవలి కాలంలో టెక్ కంపెనీలు కూడా ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోతను విధించిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృసంస్థ రెండు దఫాలుగా 21వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 12వేల మందికి, అమెజాన్ పలు రౌండ్లలో ఇప్పటివరకు 27వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. -
బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్బర్గ్
సాక్షి,ముంబై: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. లిటిల్ బ్లెస్సింగ్.. అరేలియా చాన్కి స్వాగతం అంటూ జుకర్ బర్గ్ ప్రకటించారు. దీంతో 1 మిలియన్కు పైగా లైక్స్ అభినందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) (ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) కాగా గతంలోనే తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్బర్గ్.. 2003 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట.ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. (జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) -
ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్బర్గ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలోదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగులకు జుకర్బర్గ్ అంతర్గత ఇమెయిల్ ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2010లో ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ తాజాగా (మంగళవారం. మార్చి 21) లీక్ అయింది. తాజా నివేదికల ప్రకారం ఫేస్బుక్ సొంత మొబైల్ ఫోన్లో పనిచేస్తోందని టెక్ క్రంచ్ కథనానికి ప్రతిస్పందనగా 2010 ఇమెయిల్ పంపించారు. ఈ వార్తను ఖండిస్తూ సిబ్బందిపై జుకర్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నెట్వర్క్ భవిష్యత్తు ప్రణాళికల గురించి తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కంపెనీ రహస్యంగా ఫోన్ను నిర్మిస్తోందన్న టెక్ క్రంచ్ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నమ్మక ద్రోహమే.. ఈ పని ఎవరు చేశారో దయచేసి తక్షణమే రాజీనామా చేయండి అని జుకర్బర్గ్ మండిపడ్డారు. 2010, సెప్టెంబరులో నాటి ఈ ఇ-మెయిల్ "కాన్ఫిడెన్షియల్-డోంట్ షేర్" అనే లైన్తో మొదలవుతుంది. ఒక ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఫోన్ తయారీ గురించి అస్సలు మాట్లాడలేదని, అన్ని ఫోన్లు, యాప్స్ మరింత సోషల్ కావడం, భవిష్యత్తు ప్రణాళికలపై మాత్రమే సుదీర్ఘంగా మాట్లాడాను అంటూ టెక్ క్రంచ్ కథనాన్ని కోట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. లేదంటే అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటామని జుకర్బర్గ్ హెచ్చరించారు. కాగా గత ఏడాదంతా మెటాకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతికూల ఆర్థిక వాతావరణామాలు, ఆదాయాలు పడిపోవడంతో వేలాదిమందిని తొలగించింది. అంతేకాదు మిడిల్ మేనేజ్మెంట్ను లక్ష్యంగా రాబోయే నెలల్లో 10వేల మందిని మెటా తొలగిస్తుందని, అలాగ 5 వేల ఇతర జాబ్స్ను కూడా భర్తీ చేయడంలేదని మార్చి నెల ప్రారంభంలో జుకర్బర్గ్ ఉద్యోగులకు ఇమెయిల్ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
దేశ విభజనతో విడిపోయిన కుటుంబాన్ని.. 75 ఏళ్లకు ఫేస్బుక్ ఒక్కటి చేసింది..!
లాహోర్: 1947లో దేశ విభజనతో వేరు పడిన ఇద్దరు సిక్కు సోదరుల కుటుంబాలు 75 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా సాయంతో ఎట్టకేలకు కలుసుకున్నాయి. కర్తార్పూర్ కారిడార్ వద్ద వీరి కుటుంబసభ్యులు ఆనందంతో పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. గురువారం గురుదేవ్ సింగ్, దయాసింగ్ కుటుంబాల కలయికతో గురుద్వారా దర్బార్ సాహిబ్, కర్తార్పూర్ సాహిబ్ల వద్ద ఉద్విగ్నపూరిత వాతావరణం ఏర్పడింది. హరియాణా రాష్ట్రం మహేద్రగఢ్ జిల్లా గోమ్లా గ్రామానికి చెందిన ఈ సోదరులు తమ తండ్రి స్నేహితుడైన కరీం బక్ష్ తో కలిసి నివసించేవారు. దేశ విభజనతో కరీం బక్ష్ వీరిలో గురుదేవ్ను తన వెంట పాకిస్తాన్కు తీసుకెళ్లగా గోమ్లాలోనే మేనమామ వద్దే దయాసింగ్ ఉండిపోయారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్న కరీంబక్ష్ గురుదేవ్ పేరును గులాం మహ్మద్గా మార్చాడు. గురుదేవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తన సోదరుడు దయాసింగ్ ఎక్కడున్నారో జాడ తెలపాలంటూ గురుదేవ్ భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారని ఆయన కొడుకు మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఆరు నెలల క్రితం తమ అంకుల్ దయాసింగ్ జాడ కనుక్కోగలిగామన్నారు. కర్తార్పూర్ సాహిబ్ వద్ద ఇరువురు కుటుంబాలు కలుసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. వీసా మంజూరు చేసి హరియాణాలోని తమ పూర్వీకుల నివాసాన్ని చూసుకునే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన కర్తార్పూర్ కారిడార్తో భారతీయ సిక్కు యాత్రికులు పాక్ వైపు ఉన్న పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను వీసాతో అవసరం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా సాయంతో భారత్, పాక్ల్లో ఉంటున్న సిద్దిక్(80), హబీబ్(78) అనే సోదరులు కూడా గత ఏడాది జనవరిలో కర్తార్పూర్ కారిడార్లో కలుసుకున్న విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ లవ్స్టోరీ.. అన్నవరంలో పెళ్లి చేసుకుని..
నల్లజర్ల(తూర్పుగోదావరి): తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమజంట శనివారం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరుకు చెందిన సంకుల గాయత్రి బీఎస్సీ పూర్తిచేసి మంగళగిరిలోని ఓ కంప్యూటర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి నల్లజర్ల మండలం అనంతపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వారిద్దరూ ఫేస్బుక్లో స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గాయత్రికి బయట సంబంధాలు చూస్తున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరేమోనని భావించి వారిద్దరూ శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన గాయత్రి తరఫు పెద్దలు మండిపడి చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ గాయత్రి నల్లజర్ల ఎస్ఐ నరసింహమూర్తికి శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇరువురి పెద్దలను పిలచి మాట్లాడతామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?
సోషల్ మీడియా టెక్ దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మళ్లీ లేఆఫ్ అమలు చేయనుందని వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే కంపెనీ గత నవంబర్లో ప్రపంచవ్యాప్తంగా 11వేల మందిని తొలగించింది. ఇది ఆ సంస్థ మొత్తం వర్క్ఫోర్స్లో 13 శాతం. ఎక్కువ మందిని నియమించుకోవడం, ఆర్థిక మందగమనాన్ని అందుకు కారణంగా అప్పట్లో యాజమాన్యం పేర్కొంది. తాజాగా అవే కారణాలను చూపుతూ మరో విడత లేఆఫ్స్ అమలు చేయనుందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని పేర్కొంది. అయితే ఇవి ఒకే సారి కాకుండా దశలవారీగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కంపెనీ రెవెన్యూ నాలుగో త్రైమాసికంలో తగ్గిపోవడం, ఉద్యోగుల పనితీరు సమీక్ష సందర్భంగా వేలాది మందికి అధమ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో లేఆఫ్స్ ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీలో ఉన్నత ఉద్యోగులను కొంతమందిని కింది స్థాయి ఉద్యోగాలకు పరిమితం చేయనున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. (ఇదీ చదవండి: US Visa: మరింత తొందరగా అమెరికన్ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!) అయితే ఈ కథనాన్ని మెటా కంపెనీ ఖండించింది. కంపెనీ కమ్యూనికేషన్స్ హెడ్ యాండీ స్టోన్ వాషింగ్టన్ పోస్ట్ కథనంపై ట్విటర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. వైరుధ్య కథనాలను పదేపదే ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్లు!
వాట్సాప్ యూజర్లను వ్యాపార సంబంధమైన కాల్స్, మెసేజ్లు తెగ విసిగిస్తున్నాయట. వాట్సాప్ బిజినెస్ ఖాతాలతో చేసిన సంభాషణలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కార్యాచరణ ఆధారంగా విసిగించే కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ఎక్కువైనట్లు 76 శాతం మంది యూజర్లు పేర్కొన్నట్లు లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ సర్వే సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి 20 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం.. 95 శాతం వాట్సాప్ వినియోగదారులకు ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇబ్బందికరమైన మెసేజ్లు వస్తున్నాయి. వీరిలో 41 శాతం మందికి రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. వాట్సాప్ బిజినెస్ యూజర్లతో సంభాషణ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కార్యాచరణ ఆధారంగానే వాట్సాప్లో ఇలాంటి విసిగించే మెసేజ్లు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు 12,215 మంది అదే కారణమని బదులిచ్చారు. దేశంలోని 351 జిల్లాల్లో 51 వేల మంది యూజర్లను ఈ సంస్థ సర్వే చేసింది. ఇటువంటి మెసేజ్లకు అడ్డుకట్ట వేయడానికి బ్లాకింగ్, ఆర్కైవింగ్ వంటి అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగిస్తున్నా వాటి అవి ఆగడం లేదు. వాటిని పంపేవారు కూడా నంబర్లు మారుస్తుండటంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి అయాచిత వాణిజ్య సందేశాలు రాకుండా మెరుగైన బ్లాకింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం మంది పేర్కొన్నారు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. రోజుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే మెసేజ్లు పంపించడానికి తాము వ్యాపార సంస్థలకు అనుమతిస్తామని, యూజర్లు ఇటువంటి మెసేజ్లు స్వీకరించడం లేదా మానేయడానికి చాట్లోనే సులభమైన ఆప్షన్ను జోడించినట్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Nandan Nilekani: ఎఎ నెట్వర్క్తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం) -
మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పయనిస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్ని ఉచితంగా అందించిన జుకర్ బర్గ్.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఫ్రీగా వినియోగించుకునే మెటా, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఇకపై మరింత కాస్ట్లీగా మారనున్నాయి. ట్విటర్ తరహాలో మెటా సైతం.. మెటా, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ హోల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఐడీలతో ఫేస్బుక్ బ్లూటిక్ హోల్డర్ల అకౌంట్ల పరిశీలించి.. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ల ఛార్జీలు వసూలు చేయనున్నారు. బ్లూ వెరిఫికేషన్తో ఫేక్ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండొచ్చని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లలో విశ్వసనీయత పెరగడంతోపాటు రీచ్,సెక్యూరిటీ పెరుగుతుందన్నారు.ఇక మెటా ప్రకటించినట్లుగా ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్లు, వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
మీరేంటో ఇట్టే చెప్పేయొచ్చు.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ప్రొఫైల్ బాగుందా!?
ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ♦ సుదీప్ బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు వచ్చింది. వీసా కోసం నిరీక్షిస్తుండగా వీసా రిజెక్ట్ అని మెసేజ్ వచ్చింది..అన్నీ సక్రమంగానే ఉన్నా వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యిందో సుదీప్కు అర్థంకాలేదు. ♦ ఉన్నత విద్యావంతురాలైన శ్రీవిద్యకు మాట్రిమొనీ వెబ్సైట్లో ఓ ఎన్ఆర్ఐ సంబంధం రావడంతో ఆమె తండ్రి ఉబ్బితబ్బిబయ్యాడు. కానీ అంతలోనే ‘మీ సంబంధం వద్దని మా అబ్బాయి అంటున్నాడు’ అని పెళ్లికొడుకు తండ్రి. కారణం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు. ♦ ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినీష్కు మరో కంపెనీలో మంచి పొజిషన్, జీతం పెంపుతో ఆఫర్ వచ్చింది. దేశాల్లోని ఆన్సైట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు. కానీ వారం తర్వాత ఆఫర్ లెటర్ రిజెక్ట్ అయినట్లు అతనికి ఈ–మెయిల్ వచ్చింది. ♦ సుదీప్కు వీసా రాకపోవడానికి... శ్రీవిద్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి... వినీష్ జాబ్ ఆఫర్ రిజెక్ట్ కావడానికి కారణం ఒక్కటే ...వారి సోషల్ ప్రొఫైల్ బాగోలేకపోవడం. ఆకతాయి చేష్టలతో ఆన్లైన్లో వారు పెట్టిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర పోస్ట్లు ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. సోషల్ ఫ్రొఫైలింగ్తో వారంతా చిక్కుల్లో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కాండక్ట్ సరి్టఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇలా అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మనం నిత్యం ఏదో ఒక సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అందులో ఒక వ్యక్తి పెట్టే కామెంట్లు, చేసే పోస్ట్లు, ఫొటోలు పంచుకునే భావాలను అంచనా వేసి ఆ వ్యక్తి గురించి అంచనా వేయడమే సోషల్ ప్రొఫైలింగ్. విద్యార్థులు హద్దు దాటితే కష్టమే.. సోషల్ మీడయా యాప్లలో యువత, విద్యార్థులు గంటల తరబడి చాటింగ్లు, మీటింగ్లలో కొందరు హద్దు దాటుతున్నారు. ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. మరికొందరు రాజకీయపరమైన వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. ఇవే చిక్కులు తెచి్చపెడుతున్నాయి. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకొనే వారి సోషల్ మీడియా ఖాతాలను ఆయా దేశాల ఎంబసీలు పరిశీలించి వీసాల జారీలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయన్న విషయాన్ని మరుస్తున్నారు. ఉద్యోగులకు జాగ్రత్త తప్పదు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా వాడకంలో సంయమనం పాటించకపోతే చిక్కులు తప్పవు. మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా పోస్టులు పెడితే అవి కెరీర్పరంగా ఎదిగేందుకు అడ్డంకిగా మారొచ్చు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసే ఓ టైపిస్ట్ కొంత బడ్జెట్ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టాడన్న కారణంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. డిజిటల్ ఫుట్ప్రింట్ మనమే ఇస్తున్నాం.. సోషల్ మీడియాలో మన వ్యక్తిగత వివరాలను, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, స్నేహితులు ఎవరు, ఎక్కడికి తరచూ వెళుతుంటాం తదితర అంశాలను నిత్యం షేర్ చేస్తున్నాం. సోషల్ ప్రొఫైలింగ్కు కారణమయ్యే ఈ సమాచారాన్నే డిజిటల్ పుట్ప్రింట్స్ ఆన్ సోషల్ మీడియా అని అంటారు. హనీట్రాప్లలో చిక్కే ప్రమాదం... ఏదైనా కంపెనీ లేదా కీలక ప్రభుత్వరంగ సంస్థల్లోని కొందరు ఉద్యోగులను హనీట్రాప్ (వలపు వల) ద్వారా అ«దీనంలోకి తెచ్చుకొని సమాచారం రాబట్టేందుకు సైతం వారి సోషల్ ప్రొఫైలింగే కీలకం అవుతోంది. సదరు వ్యక్తి బలహీనతలు గుర్తించి ట్రాప్ చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా హీరోయిన్ గురించి ఎక్కువ ప్రస్తావన, లైక్, కామెంట్లు ఉన్నట్లయితే ఆ బలహీనతనే ఎరగా వేసి హనీట్రాప్ చేసే ప్రమాదం ఉంటుంది. వివరాలు ఇవ్వకపోవడం ఉత్తమం.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం సాధ్యం కాని పరిస్థితి. సోషల్ మీడియాలో మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలను సాధ్యమైనంత వరకు పెట్టకూడదు. కుల, మత, ప్రాంత, రాజకీయపరమైన పోస్టులేవీ పెట్టకపోవడం ఉత్తమం. యువత ఈ విషయాన్ని గుర్తిస్తేనే వారు భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా ఉంటారు. – ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
ఉద్యోగాల కోతలు.. మార్క్ జూకర్బర్గ్ కు సెక్యూరిటీ పెంపు
-
అవును...ఇది నిజమే!
♦ అన్ఫ్రెండ్’ అనే మాట ఫేస్బుక్కు ముందు ఉందా? అనే ప్రశ్నకు చాలామంది చెప్పే జవాబు ‘లేదు’ అని. అయితే 13వ శతాబ్దానికి చెందిన కవి లయమన్ కవితలో ఈ పదం కనిపిస్తుంది. అప్పటి ఇంగ్లీష్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా అర్ధం కాకుండా మాత్రం పోదు! ♦ ‘హెడ్లెస్ చికెన్ మాన్స్టర్’ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజానికి దీనికీ చికెన్కు ఎలాంటి సంబంధం లేదు. ‘హెడ్లెస్ చికెన్ మాన్స్టర్’ అనేది ఒక రకమైన సముద్రపు దోసకాయ. సదరన్ ఒషియన్కు సమీపంలో దీన్ని కనుగొన్నారు. ♦ ‘టర్టిల్ అనగా ఏమిటి?’ ప్రశ్నకు అందరి నుంచి వినిపించే జవాబు...తాబేలు. స్కాట్లాండ్లో మాత్రం దీనికి వేరే అర్ధం ఉంది. ఎవరి పేరు అయినా ఎంతకూ గుర్తుకు రాని సందర్భంలో, అసహనానికి, తట్టుకోలేని కో పానికి గురయ్యే సమయంలో ఉపయోగించే మాట ఇది. -
మార్క్ జుకర్ బర్గ్ అలవెన్స్ భారీగా పెంచిన ఫేస్బుక్
-
లేఆఫ్ల ట్రెండ్.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్బర్గ్కు ఏకంగా..!
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు సెక్యూరిటీ అలవెన్స్ను పెంచింది. జుకర్బర్గ్కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.115 కోట్లు) చేసింది. ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్బర్గ్కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్బర్గ్కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్ను పెంచడం చర్చనీయాంశమైంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్లో ఉన్న జకర్బర్గ్ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..) -
Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను రెండేళ్ల తర్వాత పునరుద్ధరించింది మెటా. ఆయన వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించుకున్న తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2021 జనవరి 6న సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించారు. క్యాపిటల్ హిల్స్ భవనంలో హింస చెలరేగేలా తన ఫాలోవర్లను ప్రేరేపించినందుకు మెటా ఆయన ఖాతాలను నిరవధికంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఖాతాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఈ ఏడాది జనవరిలోనే మెటా ప్రకటించింది. ట్రంప్కు ఇన్స్టాగ్రాంలో 23 మంది మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాల వేదికగానే ఆయన భారీగా ఫండ్స్ సమకూర్చుకున్నారు. వచ్చే ఏడాది అంటే 2024లో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించడం ఊరటినిచ్చే అంశమే. అయితే ఖాతాలు పునురుద్ధరించిన తర్వాత ట్రంప్ ఇంకా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. తన సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన తర్వాత ట్రంప్ తన సొంత సంస్థల ద్వారా 'ట్రుత్ సోషల్' అనే సోషల్ మీడియా ప్లాట్ఫాంను ప్రారంభించారు. ఇతర సామాజిక మాధ్యమాలు తనకు అవసరం లేదని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్లోనే ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ అందులో యాక్టివ్గా ఉండటం లేదు. మరి ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలనైనా తిరిగి వినియోగిస్తారో లేదో చూడాలి. చదవండి: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..! -
సోషల్ మత్తు.. అదో జగత్తు!
సాక్షి, అమరావతి: ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్.. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గంటల తరబడి వాటిలోనే గడిపేటంత వ్యసనంగా మారిపోయాయి. ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల యువత గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంగ్లండ్కు చెందిన కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ‘ఆఫ్కమ్’ లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత (16–24 సంవత్సరాలు) రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతుంటే భారతదేశంలో 33.7 శాతం మంది అదే పనిలో ఉంటున్నట్టు పేర్కొంది. దేశంలో వినియోగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో కనీసం మూడు యాప్ల్లో ఏదో ఒకటి రోజూ 30 నిమిషాలకు ఒకసారి తెరుస్తున్నట్టు గుర్తించారు. రోజులో గంట కంటే ఎక్కువ సేపు ఆన్లైన్లో గడిపితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.36 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు యూఎస్కు చెందిన టెక్ జ్యూరీ సంస్థ తెలిపింది. దేశంలో 4.7% మందికి వ్యసనం వాస్తవానికి సోషల్ మీడియా వ్యసనాన్ని లెక్కించేందుకు నిర్దిష్టమైన కొలమానాలు ఏవీలేకున్నా.. గంటల తరబడి ఫోన్తోనే గడపడాన్ని వ్యసనంగానే భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం.. ఎలాంటి సందేశాలు రాకున్నా వచ్చినట్టు భావించడం.. కాస్త సమయం దొరికితే యూట్యూబ్, ఫేస్బుక్లోకి దూరిపోయి సమయాన్ని మరిచిపోవడం.. నిద్ర వస్తున్నా బలవంతంగా ఫోన్ చూస్తూ గడిపేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సోషల్ మీడియా అడిక్షన్గా పేర్కొంటున్నారు. 5 గంటలకు పైగా ఆన్లైన్లోనే ఉండేవారిని వ్యసనపరులుగా భావిస్తున్నారు. యూకేలో 10 శాతం మందికి ఈ వ్యసనం ఉండగా, మన దేశంలో 4.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనంగా మారినట్టు లెక్కించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో వచ్చే రెండేళ్లలో మనదేశంలో ఇది 12 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇష్టమైన యాప్స్ లాగిన్ అయినప్పుడల్లా మెదడులో డోపమైన్ (ఆనందాన్ని కలిగించే ఎంజైమ్) విడుదల స్థాయి పెరుగుతుందని, ఫలితంగా మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్లు ఆనందంతో కదులుతాయని వైద్యులు చెబుతున్నారు. అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు.. సోషల్ మీడియా వ్యసనానికి, ఆనందించే అలవాటుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించింది. ► సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ► స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం. ► ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడటం ► ఫోన్లో బ్యాలెన్స్ ఉండి, ఇంటర్నెట్ రాకుంటే చిరాకు, కోపం రావడం, ఏదో కోల్పోయినట్టు ఆందోళన చెందడం. ► అవకాశం దొరికినప్పుడల్లా వ్యక్తులు ఆశ్రయించే మొదటి అంశం స్మార్ట్ఫోన్ కావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సోషల్ మీడియా అడిక్షన్లోకి వెళ్లినట్లేనని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్తో రోజువారీ బంధం ఇలా.. ► సోషల్ మీడియాలో అత్యధికంగా (60 శాతం) ఉండేది 18–34 ఏళ్ల వారే ► ఫోన్ అస్సలు స్విచ్చాఫ్ చేయనివారు 50% ► రోజుకు ఫోన్ అన్లాక్ చేసేది 150 సార్లు ► రోజుకు సగటున ఫోన్చెక్ చేసుకునేది 63 సార్లు.. ఫోన్ పక్కలో పెట్టుకుని నిద్రపోయేవారు 71 శాతం ► బాత్రూముల్లోనూ ఫోన్లు వినియోగించేవారు 40% ► డ్రైవింగ్లో ఒక్కసారైనా మెస్సేజ్ చేసేవారు 75% ► పడుకునే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసేవారు 87 శాతం -
ఉత్తరప్రదేశ్ వాసిని పెళ్లాడిన స్వీడిష్ యువతి
ప్రేమకు హద్దులు లేవని ఇక్కడొక జంట నిరూపించారు. ఇంతవరకు మన భారతీయులు విదేశీయులను పెళ్లాడిన ఎన్నో ఉదంతాలను చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..డెహ్రుడూన్లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి స్వీడిష్ యువతి క్రిస్టెన్ లీబర్ట్ 2012లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారీ అతని కోసం దేశం విడిచి వచ్చేంత వరకు వచ్చింది. ఈ మేరకు ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు పవన్కుమార్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్కి వచ్చింది. అక్కడ ఒక పాఠశాలలో ఆ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పవన్ కుమార్ తల్లిదండ్రులు అంగీకరించడం విశేషం. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇరువురు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే తమకు పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని ఆనందంగా చెబుతున్నారు వరుడి తండ్రి గీతా సింగ్. ఈ పెళ్లికి తాము మనస్పూర్తిగా అంగీకరిచినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Swedish woman flies to India to marry longtime boyfriend from Uttar Pradesh. Read: https://t.co/GnxZODg05d pic.twitter.com/KJ2whmaC2k — editorji (@editorji) January 29, 2023 (చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి) -
డొనాల్డ్ ట్రంప్కు గుడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించనున్నట్లు మెటా ప్రకటించింది. 2021 జనవరిలో క్యాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఖాతాలను రద్దు చేయడం తెలిసిందే. అప్పటికి ట్రంప్కు ఫేస్బుక్లో 3.4 కోట్లు, ఇన్స్టాలో 2.3 కోట్ల ఫాలోవర్లున్నారు. నేతలు ఏం చెబుతున్నారో ప్రజలు వినగలిగినప్పుడే తమకిష్టమైన వాటిని ఎంపిక చేసుకోగలరని మెటా గ్లోబల్ ఎఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ బుధవారం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదికైన ఫేస్బుక్ ట్రంప్ రాజకీయ ప్రచార నిధుల సేకరణకు కీలక వనరుగా ఉంది. ఈ నేపథ్యంలో, ‘‘నన్ను ఫేస్బుక్, ఇన్స్టాల నుంచి తొలగించినందుకు మెటా లక్షలాది డాలర్ల ఆదాయం పోగొట్టుకుంది. అందుకే నా ఖాతాను పునరుద్ధరిస్తోంది’’ అని ట్రంప్ తన సొంత సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో స్పందించారు. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
కొలువుపోయి కొత్త కష్టాలు! అమెరికాలో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరం
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు. పరస్పర సాయం... ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్లను నిర్వహిస్తున్నారు. మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్కార్డు ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్చేశారు. -
ఉద్యోగాల ఊచకోత తరువాత ‘మెటా’ మరో షాకింగ్ డెసిషన్
న్యూఢిల్లీ: వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ఫుల్ టైం ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వేల ఉద్యోగులను తొలగించిన సంస్థ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే తొలిసారని పలువురు వ్యాఖ్యానించారు. నియామక అవసరాలను తిరిగి అంచనా వేయడం కొనసాగిస్తున్నాం. చాలా స్వల్ప సంఖ్యలో అభ్యర్థుల ఆఫర్లను ఉపసంహరించుకుంటూ కష్టమైన నిర్ణయం తీసుకున్నామన్న మెటా ప్రతినిధి వ్యాఖ్యలను టెక్ క్రంచ్ నివేదించింది. మెటా ఇటీవల 20 మంది ఆఫర్లను రద్దు చేసిందని ఇంజనీర్ ,రచయిత గెర్గెలీ ఒరోస్జ్ ట్వీట్ చేశారు. ప్రపంచ మాంద్యం భయాలు నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022 నవంబరులో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను ఫేస్బుక్ తొలగించడం టెక్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తన లండన్ కార్యాలయంలో 2023 వేసవి ఇంటర్న్షిప్ ఆఫర్లను రద్దు చేసింది Just in: Meta has rescinded fulltime offers in London, as I confirmed with devs impacted. New grads with offers due to start in February have been taken back in bulk. I know of about 20 people so far. This is the first time I'm aware that Meta is taking back signed, FTE offers. — Gergely Orosz (@GergelyOrosz) January 9, 2023 -
ఫేస్బుక్లో అభ్యర్థన.. ఆర్టీసీ బస్సు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫేస్బుక్లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తికరమైన ఘటన కృష్ణాజిల్లాలోని పామర్రులో జరిగింది. 40 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది. వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డిని ఫేస్బుక్ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్ డిపో మేనేజర్తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమర్లకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అడగంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు. -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ -
చూస్తే వావ్ అనాల్సిందే, అదిరిపోనున్న వాట్సాప్ కొత్త ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెటా యాజమాన్యంలోని యాప్ గత సంవత్సరం యాండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి బదిలీ ఫీచర్ను విడుదల చేసింది. ఎప్పటికప్పుడు వాట్సాప్ను అప్డేట్ చేస్తూ యూజర్లు అందించే సేవలు విషయంలో ఏ మాత్రం రాజీలేకుండా దూసుకుపోతోంది ఈ సంస్థ. ఇటీవల గూగుల్ డ్రైవ్( Google drive)పై ఆధారపడటాన్ని తొలగించే మరొక బదిలీ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.. యూజర్ల కోసం త్వరలో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్ ఇది వినియోగదారులు వాట్సాప్ (WhatsApp) డేటాను చాట్ హిస్టరీతో సహా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్లు ఇప్పటి వరకు గూగుల్ డిస్క్ బ్యాకప్ని ఉపయోగించి వారి డేటాను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త అప్డేట్ థర్డ్-పార్టీ యాప్లపై ఆధారపడటాన్ని తొలగించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. చదవండి: సామన్యులకు అలర్ట్: కొత్తగా మారిన రూల్స్ తెలుసుకోవడం తప్పనిసరి! -
పెళ్లి చేసుకోవాలని వివాహితపై ఒత్తిడి.. ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్తో
సాక్షి, రంగారెడ్డి: ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్ నగర్లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా మంచాల మండలం రంగాపూర్కు చెందిన శివకాంత్(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ.. -
యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వివాహిత– యువకుని ఉదంతంలో ఆమె హత్యకు గురైంది. ఈ సంఘటన కనకపుర పట్టణ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు... పట్టణ పరిధిలోని కురుపేట వీధి రోడ్డు నివాసి శ్రుతి (28) హతురాలు. శ్రుతి భర్త గార పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనికి వెళ్లేది. ఆమెకు మొబైల్లో ఫేస్బుక్ ద్వారా హనుమంతు అనే అవివాహిత యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్ని రోజులుగా అతడు ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. అయినా శ్రుతి పదేపదే ఫోన్ చేసి హనుమంతును కలవాలని ఒత్తిడి చేసేది. దీంతో విసిగిపోయిన హనుమంతు శ్రుతి ని వదిలించుకోవాలని, బైక్పై మారణ్ణదొడ్డి రోడ్డుకు తీసికెళ్లి బెల్ట్తో గొంతు బిగించి హత్య చేశాడు. బెదిరించడం వల్లనే.. ఈ నేపథ్యంలో పోలీసులు హనుమంతును అరెస్టు చేశారు. తనకు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయమయిందని, వదిలేయాలని ఎంత వేడుకున్నా శ్రుతి వినిపించుకోలేదన్నాడు. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, తనతోనే ఉండాలని బెదిరించేదని చెప్పాడు. అందుకే ఆమెను బైక్పై తీసికెళ్లి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..) -
Swetha: ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..
సాక్షి, చిత్తూరు అర్బన్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.46 లక్షలు కాజేసిన చిత్తూరుకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత (29)ను తెలంగాణలోని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గంగనపల్లెకు చెందిన లేట్ నాగభూషణం కుమార్తె అపర్ణ చిత్తూరులోని అనాథ ఆశ్రమంలో పనిచేసేది. ఆశ్రమం మూతబడటంతో సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడ్డ అపర్ణ, ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ డబ్బులు కాజేయడం మొదలుపెట్టింది. ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకుంది. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అయితే తన పేరిట రూ.7 కోట్లు బీమా ఉందని.. దీన్ని తీసుకోవాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఫోన్లో నమ్మ బలికింది. ఆ బీమా సొమ్ము కోసం ప్రస్తుతం కొద్దిగా డబ్బు చెల్లించాలని, సాయం చేయాలని ఆ వ్యక్తిని కోరింది. ఆ వ్యక్తి ఈ యువతిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో విడతల వారీగా అపర్ణ ఖాతాకు రూ.46 లక్షలు జమచేశాడు. తీరా పెళ్లికి నిరాకరించి, ఫోన్ ఎత్తక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాచకొండ సైబర్ విభాగం పోలీసులు అపర్ణను అరెస్టు చేసి, ఆమె నుంచి అయిదు సెల్ఫోన్లు, ఓ ట్యాబ్ను సీజ్ చేశారు. చదవండి: (ప్రేమ ఎంత కఠినం) -
ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ షాక్, మెటా మరో సంచలన నిర్ణయం!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే యాప్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్లడించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజర్లు కొత్త పోస్టులను క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ను షట్డౌన్ చేయనున్న మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్ట్లు, ప్రాజెక్ట్లను నిలిపివేసింది. ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టవిటీ డివిజన్ను షట్డౌన్ చేయనుంది. డెన్మార్క్లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని ఆపేసింది. 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్ను రద్దు చేస్తున్నట్లు అక్టోబర్ నెలలో ప్రకటించింది. ఆగష్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయలనుకున్నట్టు మెటా తెలిపింది. -
భార్యకు హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన భర్త
గుంటూరు: ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం పలు మలుపులు తిరిగి చివరకు ఓ మహిళ జీవితంలో విషాదం మిగిల్చింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహే తర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్ఐవీ సోకే విధంగా ఓ ఆర్ఎంపీ తో వైద్యం చేయించినట్లు ఆ వివాహిత గురువారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకా రం.. సీతానగరానికి చెందిన యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మంగళగిరి చెందిన ముప్పెర చరణ్కుమార్ను 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. పాప పుట్టిన అనంతరం ఆమెను చరణ్కుమార్ శారీరకంగా దూరం పెట్టడమే కాకుండా ఇంటికి కూడా రావడం మానేశాడు. పిల్లలు పుట్టిన తరువాత నీకు అనారోగ్యంగా ఉంది వైద్యం చేయిస్తానంటూ మంగళగిరి చెందిన ఆర్ఎంపీతో ఆమెకి పలుసార్లు ఇంజక్షన్లు చేయించాడు. కొంత కాలం తరువాత వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉందని తేలింది. ఆసుపత్రి నుంచి అదే విషయాన్ని తన భర్త చరణ్కుమార్కు తెలిపింది. దీంతో అతను ఇంటికి వచ్చి నాకు హెచ్ఐవీ లేదు, నీకు హెచ్ఐవీ ఉంది. నావల్లే పొరపాటు జరిగింది. నన్ను క్షమించు. జీవితాంతం నిన్ను చూసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నన్ను వదిలించుకోవడానికే హెచ్ఐవీ ప్రయోగం చేశాడని, జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష ప్రయోగం కింద, మోసగించినందుకు, కులాన్ని ప్రస్తావించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మెటాకు భారీ షాక్..మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆఫ్రికన్లను ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు హింసను ప్రేరేపించేలా వ్యవహరించిందంటూ మెటాపై పిటిషనర్లు పరువు నష్టం దావా వేశారు. అందుకు పరిహారంగా మెటా తమకు 2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి డిమాండ్ చేశారు. ఆ పిటిషన్ను ఇథియోపియన్ పరిశోధకులు అబ్రమ్ మీరెగ్,ఫిస్సెహా టెక్లే, కెన్యా మానవ హక్కుల సభ్యులు, కటిబా ఇన్స్టిట్యూట్తో పాటు చట్టపరమైన లాభాపేక్షలేని ఫాక్స్గ్లోవ్ సహకారంతో కెన్యా హైకోర్టులో దాఖలు చేశారు. గత నవంబర్లో మీరెగ్ తండ్రి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ మీరెగ్ అమరేను’పై దాడికి చేసేలా ప్రోత్సహించేలా మెటాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టులు షేరింగ్ తర్వాత గుర్తుతెలియని దుండగులు అమరేను ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపినట్లు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం..మెటా "తన ప్లాట్ఫారమ్లో హింసను పరిష్కరించడంలో వైఫల్యం, ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా ప్రమాదకరమైన కంటెంట్ను ప్రోత్సహించేలా ప్రాధాన్యతనిచ్చే మెటా నుంచి ప్రజలకు రక్షణ అవసరమని పిటిషనర్లు ఈ సందర్భంగా వాదించినట్లు బ్లూమ్బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అంతేకాదు 2021లో 117.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన మెటా సిఫార్సు అల్గారిథమ్ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ఆధారంగా ప్రజలు ఏ కంటెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. అందుకు అనుగుణంగా ఆ కంటెంట్ను ప్రచారం చేస్తోంది. దీంతో వ్యాపారస్తులు యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలా మెటా తన ఆదాయాన్ని పెంచుంటున్నట్లు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నివేదించారు. ఈ సందర్భంగా మెటా ఈ తరహా కంటెంట్ను ప్రోత్సహిస్తున్నందుకు కోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తమకు జరిగిన నష్టం కింద సదరు సోషల్ మీడియా సంస్థ 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఫేస్బుక్ మాజీ ఉద్యోగులకు కొత్త ఝలక్ ఇచ్చిన మెటా
-
వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!
న్యూఢిల్లీ: మెటా-యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్ను బుధవారం లాంచ్ చేసింది. యూజర్లు తమ ప్రొఫైల్ను డిజిటల్ వెర్షన్లో రూపొందించుకునే ఈ ఫీచర్ అనుమతినిస్తుంది. నచ్చిన రీతిలో విభిన్న హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల ఫీలింగ్స్, మీ మూడ్కనుగుణంగా 36 అనుకూల స్టిక్కర్లతో మీ ఓన్ అవతార్ను ఎంచుకోవచ్చు. అవతార్ ఫీచర్ను వినియోగదారులందరికీ రోల్ అవుట్ చేస్తున్నట్లు వాట్సాప్ తాజాగా ప్రకటించింది. 36 స్టిక్కర్లలో అవతార్ను ప్రొఫైల్ చిత్రంగా, చాట్లలో స్టిక్కర్గా ఉపయోగించవచ్చు. అన్ని యాప్లలో మరిన్ని స్టైల్లు త్వరలో రానున్నాయి అంటూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో రాశారు. అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి WhatsApp ఖాతాను ఓపెన్ చేసి, సెట్టింగ్లకు వెళ్లండి అవతార్ ఆప్షన్ క్లిక్ చేయండి.(సెట్టింగ్స్లో అకౌంట్ ఆప్షన్ కింద అవతార్ ఫీచర్ అప్డేట్ అయిన తరువాత మాత్రమే అవతార్ ఆప్షన్ కనిపిస్తుంది.) మీ అవతార్ను మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని ప్రొఫైల్ చిత్రంగా సెట్ చేసుకోవడమే...సింపుల్ -
ఫేస్‘బుక్’ అవుతున్నారు.. వందలాది ఖాతాలు హ్యాక్ !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫోన్లు వాడే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇందులో 80 శాతం మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా సెల్ఫోన్ల వాడకం 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతా లను కలిగి ఉన్నట్టు గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పలమనేరు: మీ ఫోన్లో ఫేస్ బుక్ (ముఖ పుస్తకం) ఖాతా ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నిత్యం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ హ్యాక్ బుక్గా మారిపోయింది. ఫేస్బుక్ను టార్గెట్గా చేసుకొని హ్యాకర్లు విరుచుకు పడుతున్నారు. యూజర్స్ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వాడుకుంటూ నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫేక్ అకౌంట్లను ఎలా డిలీట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లను గుర్తించినా వారి పేరు, చిరునామా తప్పుగా ఉంటుంది. దాంతో వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఆపదలో ఉన్నామంటూ రిక్వెస్ట్లు హ్యాక్ చేసిన వారి వివరాలతో ఫేక్ ఖాతాలను సృష్టించి వాటిద్వారా మన స్నేహితులకు ఫేస్బుక్తో పాటు వారి మొబైల్ నంబర్లకు మెసెంజర్, వాట్సాప్, సాధారణ ఎస్ఎంఎస్లను పంపుతున్నారు. తాను ఆస్పత్రిలో ఉన్నానని వెంటనే డబ్బు కావాలంటూ వారి ఫోన్పే లేదా గుగూల్పే నంబర్లను అందులో ఉంచి, సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ఎంతోమంది తమ ఖాతాలనుంచి నగదును హ్యాకర్లకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయి అదే పేర్లతో రెండు, మూడు ఫేక్ అకౌంట్లు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బగ్స్ సృష్టించి హ్యాక్ చేస్తున్న వైనం ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పలువురు సోషల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హ్యాకింగ్ చేయడమే వృత్తిగా చేసుకొని నిత్యం డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఫోన్కొచ్చే లింక్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. మన ఫోన్కు తరచూ వచ్చే ఫోన్ రీచార్జీలు ఉచితమని, లాటరీ వచ్చిందని, ఫెస్టివల్ ఆఫర్లని క్యూఆర్ కోడ్లను పంపుతున్నారు. వాటిని టచ్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి చేరుతోంది. మన ఫోన్ను హ్యాకర్లు ఆపరేట్ చేస్తుంటారు. మన ఫోన్లోని యాక్సెస్ లోకేషన్ ఆధారంగా మనకు తెలియకుండానే మన మొబైల్లోని కెమరాసైతం మనల్ని రికార్డు చేసే టెక్నిక్స్ను ఎథికల్ హ్యాకర్స్ సులభంగా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ పటిష్టం చేసుకోండి ఫేస్బుక్ హ్యాక్ చేశాక ఇబ్బందులు పడేకంటే ముందుగానే సెక్యూరిటీ సిస్టంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఫేస్బుక్లోని సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం, మన పాస్వర్డ్ను మార్చుకోవడం, ఫేస్బుక్ ప్రొఫైల్ను లాక్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మన ఫేస్బుక్ హ్యాక్ అయిందా లేదా అని సెటింగ్స్లో కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్బుక్లో అన్నోన్ ఫ్రెండ్ రిక్సెస్ట్లను ఎప్పుడూ అంగీరించకుండా ఉంటే మంచిది. మనకు బాగా తెలిసిన వారినే ఫ్రెండ్స్గా పెట్టుకోవాలి. హ్యాక్చేసి.. ఫేక్ ఖాతాల సృష్టి హ్యాక్చేసిన ఖాతాలోని వ్యక్తిగత వివరాలు, ఫొటోలను వాడి, అసలు ఖాతాను పోలిన నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. పోనీ ఎందుకొచ్చిన తంటలేనని మన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసుకుంటే మరిన్ని తిప్పలు తప్పవు. అప్పటికే హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన మన సమాచారంతో మరిన్ని సైబర్ నేరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జీమెయిల్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను సైతం సులభంగా హ్యాక్ చేసి ఆపై మన మొబైల్ నంబర్కు కొన్ని యాడ్లింక్స్ పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త స్మార్ట్ఫోన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన లింకులను టచ్ చేయడం, మనకు తెలియని యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం, కోడ్ను స్కాన్ చేయడం చాలా ప్రమాదకరం. మనకు రకరకాలుగా ఆశపెట్టి హ్యాక్ చేసేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సైబర్ నేరాలపై తమశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలి. పొరబాటు జరిగాక బాధపడేకంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. – సుధాకర్ రెడ్డి, డీఎస్పీ, పలమనేరు నా ఫేస్బుక్ను హ్యాక్ చేశారు ఇటీవల నా ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఎవరో ఫేక్ అకౌంట్ను సృష్టించి ఆపదలో ఉన్నానని డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్లు పెట్టారు. దీంతోనేను ఫేస్బుక్హ్యాక్ అయిందని, అదే పేజీలో మెసేజ్ పెట్టాను. నా ఖాతాను సైతం మరింత భద్రపరుచుకున్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వివరాలు సులభంగా బయటకు పోతాయి. – సుధాకర్రెడ్డి, వి.కోట, పలమనేరు నియోజకవర్గం -
మెటా ఇండియా హెడ్ గా విశాఖకు చెందిన సంధ్య నియామకం
-
ఫేస్బుక్లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.. రూ.39లక్షలు..!
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్ పరిచయం ఓ వ్యక్తిని నిలువునా ముంచింది. నాలుగు నెలల క్రితం విజయపుర జిల్లా సిందగి తాలూకా బగలూరి పరమేశ్వరహిప్పరగి అనే యువకుడి ఫేస్బుక్లో ఫ్రెండ్రిక్వెస్ట్ వచ్చింది. ఆమోదించిన పరమే«శ్వరహిప్పరగి, యువతితో క్రమేణా పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు ఫోన్నెంబర్లు తీసుకున్నారు. చాటింగ్ ప్రారంభించారు. వంద, వెయ్యి రూపాయలనుంచి సుమారు రూ.39 లక్షలు పరమేశ్వరహిప్పరగి దశలవారీగా యువతి లాగేసింది. వివరాల్లోకి వెళితే... సిందగి నివాసి పరమేశ్వరకు 2022 జూన్ 29 తేదీన మంజుల, కేఆర్ అనే ఫేస్బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్రిక్వెస్ట్ వచ్చింది. పరమే«శ్వర కన్ఫర్మ్ చేయగానే యువతి హాయ్ అని మెసేజ్ పెట్టింది. తెలంగాణా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు కంపెనీలో ఉన్న పరమేశ్వర నిత్యం మెసేజ్ చేయడం ద్వారా గుర్తుతెలియని యువతితో ఆత్మీయంగా మెలిగారు. ఆగష్టు 14న తల్లి ఆరోగ్యం సరిగా లేదంటూ రూ.700 ఫోన్పే చేయాలని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. అనంతరం రూ.2 వేలు అడగగానే యువతికి పరమేశ్వర ఫోన్ చేశాడు. కొద్దిరోజుల తరువాత తిథి కార్యక్రమానికి రూ.5 వేలు కావాలని యువతి అడిగిన వెంటనే పరమేశ్వర ఆమె అకౌంట్కు జమ చేశారు. చదవండి: (ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్) వివాహం చేసుకుంటానని నమ్మించి.... కొద్దిరోజుల అనంతరం ఫోన్ చేసిన మంజుల తాను ఐఏఎస్ పరీక్ష పాసయ్యాను. కలెక్టర్ పోస్టు వస్తుంది. ప్రస్తుతం హాసన్లో ఉన్నాను తనను చూసుకునేవారు ఎవరూ లేరు. బెంగళూరుకు వెళ్లాలి ఖర్చులకు డబ్బుల్లేవు ఆర్థిక సాయం చేస్తే వివాహం చేసుకుంటానని పరమేశ్వరకు తెలిపింది. యువతి మాటలు నమ్మిన పరమేశ్వర ఒకేరోజు రూ.50 వేలు రెండు దఫాలుగా చెల్లించాడు. కొద్దిరోజుల అనంతరం మంజుల మరింత స్నేహంగా మెలుగుతూ పరమేశ్వర నుంచి దశలవారీగా రూ.41.26 లక్షలు కాజేసింది. అనంతరం తన వద్ద పైసా కూడా లేదని పరమేశ్వర మంజులను అడిగాడు. పాపం కొద్దిగా ఖర్చుకు డబ్బు ఉండాలని భావించి మంజుల రూ.2.21 లక్షలు పరమేశ్వర అకౌంట్కు జమ చేసింది. మళ్లీ మంజుల డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన ఆయన ఈనెల 15న విజయపుర సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామని చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్డీ.ఆనందకుమార్ తెలిపారు. -
మెటా ఇండియా కొత్త బాస్: ఆమె ప్రత్యేకతలివే!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా వైస్ప్రెసిడెంట్గాకూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో మెటా యాజమాన్యం సంధ్యా దేవనాథ్ను నియమించింది. 2023 జనవరి1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించ నున్నారని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ ఒక ప్రకటనలో తెలిపారు. మెటా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తరువాత సంధ్యా దేవనాథన్ను మెటా ఇండియా కొత్త హెడ్గా నియమించడం విశేషం. 2000లో ఢిల్లీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన సంధ్యా నూతన పదవీ బాధ్యతలను స్వీకరించేందుకు త్వరలోనే ఇండియాకు రానున్నారు. గ్లోబల్ బిజినెస్ లీడర్గా పేరొందిన సంధ్యా దేవనాథన్కు బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. 2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డ్లో కూడా పనిచేస్తున్నారు. కాగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించిన కొన్ని రోజులకే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం!
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయంవైపుగా కదులుతోంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని కంపెనీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 10వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టర్ వర్కర్లను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ముగిసిన అసైన్మెంట్ నోటిఫికేషన్లను ఆయా ఉద్యోగులు అందుకుంటున్నారు. దీంతో ఇ-కామర్స్ దిగ్గజం అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా హెడ్కౌంట్ను ఎక్కడ తగ్గించే క్రమంలో ఆయా టీంలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికమాంద్యం, పడిపోతున్న ఆదాయాల నేపథ్యంలో అమెజాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యత వహించే టీం, అలాగే అమెజాన్ రిటైల్ విభాగాలు, హెచ్ఆర్ విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయి. (ఉద్యోగులకు అలర్ట్: ఆ బాటలో ఇన్ఫోసిస్, సూపర్ ఆఫర్ కూడా) డిసెంబర్ 31, 2021 లెక్కల ప్రకారం అమెజాన్లో ఫుల్టైమ్, పార్ట్టైమ్ మొత్తం దాదాపు 16,08,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్టోబర్లో, హాలిడే సీజన్ డిమాండ్ కనుగుణంగా రెగ్యులర్ వార్షిక హైరింగ్ స్ప్రీలో భాగంగా దాదాపు లక్షా యాభై వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. కానీ ఒక నెలలోనే పరిస్థితి తారుమారైంది. నియామకాలను నిలిపివేసిన కంపెనీ ఇపుడిక ఉద్యోగులను తగ్గించుకుంటోంది. కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాని టెక్ నిపుణులు చెబుతున్నారు. ట్విటర్, మెటా పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించగా, సోషల్మీడియా దిగ్గజం మెటా ఏకంగా 11వేల మందికి ఉద్వాసన పలికింది. ఇదీ చదవండి: ఎయిరిండియాకు భారీ షాక్, 122 మిలియన్ డాలర్ల జరిమానా -
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్ప్రదేశ్లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్ప్రదేశ్లో ఆర్తి రాజ్పుత్ అనే యువతి ఈ రీల్స్కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, వాట్సప్లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ వైరల్
తమిళ స్టార్ హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని హీరో తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. టాలీవుడ్లోనూ కార్తికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్కు గురి కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. (చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ మూవీ 'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) ఆయన ట్విటర్లో రాస్తూ..' హలో గాయ్స్. నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. దీనిపై మేం ఫేస్ బుక్ బృందంతో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్ సూపర్ హిట్గా నిలిచింది. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కార్తీ కెరీర్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బెస్ట్ మూవీగా నిలిచింది. Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team. — Karthi (@Karthi_Offl) November 14, 2022 -
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఇప్పుడేం చేయాలి? చేరిన 2 రోజులకే ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది!
ఇటీవల జరుగుతున్న పరిణామలు చూస్తుంటే ఐటీ రంగంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కంపెనీలు ఒకదాని వెనక మరొకటి తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటంతో పాటు ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. దీంతో లేఆఫ్లు తప్పవని కంపెనీలు చెబుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఫేస్బుక్లో ప్రస్తుతం ఉద్యోగాల పోగొట్టుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. అలా మోటా చేపట్టిన కోతలు వల్ల ఉద్యోగం పోయిన ఓ ఐఐటియన్ తన బాధని లింక్డిన్లో షేర్ చేశాడు. ఏం చేయాలి తెలియడం లేదు.. ఐఐటియన్ హిమాన్షు షేర్ చేసని పోస్ట్లో... “నేను అందరిలానే ఎన్నో కలలతో మెటా సంస్థలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. భవిష్యత్తు బాగుంటుందని భావించే లోపే ఊహించని షాక్ తగిలింది. ఉద్యోగంలో చేరిన 2 రోజులకే, కంపెనీ భారీ తొలగింపు కారణంగా మెటాలో నా ప్రయాణం ముగిసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్లిష్టసమయాలను ఎదుర్కొవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. అయితే తదుపరి కార్యాచరణ ఏమిటని, ఎటువంటి ఐడియా కూడా నాకు లేదని’’ తెలిపాడు. తనకు భారత్లో లేదా కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం కావాలని కోరుతూ ఈ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా చాలా మంది హెచ్1బీ వీసాపై ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటాలో ఉద్యోగం చేసేందుకు హిమాన్షులానే విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఉద్యోగం పోవడంతో.. వారు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుకోవాల్సి ఉంది. లేదంటే.. ఆ దేశాలను విడిచి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
‘ఆ మెయిల్కు నా గుండె బరువెక్కింది’..మెటా మహిళా ఉద్యోగి ఆవేదన
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తాజాగా 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో కమ్యూనికేషన్స్ మేనేజర్ అన్నేకా పటేల్ ఉన్నారు. తెల్లారి నిద్ర లేచిన నాకు మెటా పంపిన మెయిల్తో నా గుండె పగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెటాలో తొలగించిన ఉద్యోగుల్లో ప్రసూతి సెలవులో ఉన్న అన్నేకా పటేల్ ఒకరు. ఆమె తన మూడు నెలల కుమార్తెకు పాలుపట్టేందుకు తెల్లవారు జామున 3 గంటలకు మేల్కొంది. ‘ఉదయం 5:35 గంటలకు నన్ను ఉద్యోగం తొలగించినట్లు నాకు ఇమెయిల్ వచ్చింది. నా గుండె బరువెక్కింది’ అని అన్నేకా పటేల్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపారు. కంపెనీ గణనీయంగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందని విన్నాను. అందుకే ఈమెయిల్ చెక్ చేసుకున్నట్లు ఆమె చెప్పారు. చదవండి👉 : మెటా ఉద్యోగులకు ఊహించని షాక్, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన! నెక్ట్స్ ఏంటీ మెటాలో ఉద్యోగం పోయింది. మరి వాట్ నెక్ట్స్ ఏంటీ? అంటే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. నా ప్రసూతి సెలవు ఫిబ్రవరిలో ముగుస్తుంది. మాతృత్వం మొదటి కొన్ని నెలలు నా జీవితం చాలా సవాళ్లతో కూడుకున్నప్పటకీ వాటి గురించి స్పందించలేనన్నారు. చదవండి👉 : 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్టాక్ వైపు మళ్లుతుండటం ఇన్స్టాగ్రామ్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్లకు సంబంధించి మెటాకు భారత్లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
అసలేం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ప్రముఖ కంపెనీలో 11వేల మందిపై వేటు!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బుధవారం కంపెనీలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులపై తాజాగా స్పందించారు. తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం ( 11,000 మందికి) పైగా ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జుకర్బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో.. “ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను షేర్ చేస్తున్నాను. నేను మా బృందం పరిమాణాన్ని సుమారు 13% తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగులలో 11,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నాం. ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు జుకర్బర్గ్. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అకస్మాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణాలు..కంపెనీ ఖర్చను భారీగా తగ్గించుకోవడం, ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్మెంట్లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, కంపెనీని ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నా... హసీనాతో ప్రేమ పాఠాలు
చిన్నతనంలోనే వివాహం.. ఐదేళ్లు గడిచేలోపే ఇద్దరు పిల్లలు.. అంతలోనే భర్త వేధింపులు.. ఇదే సమయంలో మరో వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం. అతని మాయమాటలు నమ్మి తప్పటడుగులు.. తల్లిదండ్రులు మందలించడంతో బలవన్మరణం. వందేళ్ల జీవితాన్ని 25 ఏళ్లకే ముగింపు పలికిన దొర్నిపాడు మండల కేంద్రానికి చెందిన హసీనా గాథ ఇది. సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన దూదేకుల బాషా.. తన కూతురు హసీనా(25) తొమ్మిదో తరగతి చదువుతుండగానే వైఎస్సార్ జిల్లా పెద్ద ముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన బాబయ్యకు ఇచ్చి గతంలో వివాహం చేశాడు. అయితే కొంతకాలానికే భర్త వేధింపులు మొదలయ్యాయి. మానసిక పరిస్థితి సరిగాలేక చీటికిమాటికీ కొడుతుండటం, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో మొదట్లో హసీనా సర్దుకుపోయింది. అంతలోనే ఇద్దరు కుమారులు బషీద్, బాలదస్తగిరి జన్మించారు. అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో ఐదేళ్ల క్రితం పిల్లలను తీసుకుని పుట్టినింటికి వచ్చేసింది. పొలం పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. 55 ఏళ్ల వక్తితో ఫేస్బుక్ పరిచయం.. ఐదు నెలల క్రితం బాపట్ల జిల్లా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 55 ఏళ్ల వయసున్న భూషణం ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన కుమారుడు, కూతురు ఉన్నా... హసీనాకు తియ్యని ప్రేమపాఠాలు చెప్పాడు. కష్టాల్లో ఉన్న ఆమెకు.. అతని మాటలు సాంత్వన చేకూర్చేలా ఉండటంతో దగ్గర కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అక్టోబర్ 31న అతనితో కలిసి చిన్న కుమారుడిని తీసుకొని బాపట్లకు వెళ్లిపోయి అక్కడ కాపురం పెట్టారు. కాగా తన కూతురు, మనవడు కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన బాషా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వారి ఆచూకీ గుర్తించి గురువారం సాయంత్రం దొర్నిపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ భూషణం మాటమార్చినట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేదని, అందరిలాగే హసీనాతోనూ చాటింగ్ చేశానని చెప్పడం, తల్లిదండ్రులు మందలించడంతో ఆమె అవమానంగా భావించి శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ తిరుపాల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన కూతురి ఆత్మహత్యకు కారకుడైన భూషణంను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తండ్రి వదిలేయడం, తల్లి బలవన్మరణం చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. -
మెటాకు అజిత్ మోహన్ రాజీనామా
మెటా ఇండియాలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మెటా ఇండియా డైరెక్టర్ అజిత్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి మెటా ఇండియా డైరెక్టర్గా మనీష్ చోప్రా బాధ్యతలు స్వీకరిస్తారని రాయిటర్స్ తెలిపింది ఇక మెటా ఇండియా డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అజిత్ మోహన్ స్నాప్లో చేరనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మోహన్ ఆసియా-పసిఫిక్ బిజినెస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఉటంకిస్తూ టెక్క్రంచ్ నివేదించింది. ‘గత 4 ఏళ్లుగా అతను (అజిత్ మోహన్) మన భారతదేశ కార్యకలాపాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సోన్ తెలిపారు. -
మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్తో కలిసి ఓ షోకు యాంకర్గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఫేస్బుక్ పేజీలో అశ్లీల ఫొటోలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి చూసి అంత షాక్ ఒక్కసారిగా అయ్యారు. విష్ణు ప్రియ ఎంటి ఇలాంటి ఫొటోలు షేర్ చేసిందంటూ ఆశ్చర్యపోయారు. చదవండి: ‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా చివరకు తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని, తన పేజీని అన్ఫాలో చేయాల్సిందిగా ఆమె తన ఫాలోవర్స్కు సూచించింది. అయితే అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ తన పేజీలో న్యూడ్ వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీంతో తన స్నేహితులు, బంధువుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్కాల్స్ వచ్చాయట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలాటే నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి ఫేస్బుక్లో ఆ వీడియోలు ఎంటని అడుగుతున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కాదు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? పదే పదే నా అకౌంట్ను ఎందుకు హ్యాక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ అంటూ తన స్నేహితుల వద్ద ఆమె వాపోయిందట. కాగా ఆమె ఫేస్బుక్ పేజీతో తరచూ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట, అప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్న విష్ణు ప్రియ ఎందుకు సైలెంట్గా ఉంటుందని, ఎందుకు సైబర్ క్రైమ్ని ఆశ్రయించడం లేదని.. తన పేజీని ఎందుకు డిలిట్ చేయడం లేదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.