Europe
-
ఆయన అనుకున్నదంతా అయ్యేనా?
ఆయుధ బలం, ఆర్థిక బలంతో ఏదైనా సాగించవచ్చునన్నట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు, అదంత తేలిక కాదని నెల రోజులు తిరిగేసరికి అర్థమవుతుండాలి! అమెరికన్లతోపాటు వారి అనుయాయ పశ్చిమ దేశాలను, మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఆయన చర్య లను, అందుకు ఎదురవుతున్న ప్రతిఘటన లను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది.అధ్యక్షుని ప్రకటనలను, చర్యలను రెండు విధాలుగా విభజించాలి. అంతర్గతమైనవి, విదేశాంగపరమైనవి. అంతర్గతంగా అన్నీ ఇప్పటికి తను కోరుకున్న విధంగానే జరిగిపోతున్నాయి. కొన్ని చర్యల వల్ల తమ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీస్ రంగాలపైన, గృహావస రాలపైన, సామాజిక సంబంధాలపైన ప్రభావాలు మొదలైనా, నిర సనలు మంద్ర స్థాయిలోనే ఉన్నాయి. ప్రతిపక్షమైన డెమోక్రాట్లలో చలనమే లేదు. ట్రంప్కు అడ్డుపడటమంటూ ఏమైనా జరిగితే అది కోర్టుల స్టే ఉత్తర్వుల వల్లనే. నష్టపోతున్న వారిలో ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఆకర్షితులై భారీగా ఓటు చేసిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికి ఇప్పటికే పనులూ, ఫెడరల్ ఉద్యోగాలు పోతుండటం, ధరల పెరుగు దల వంటి సమస్యలు ఎదురవుతున్నాయనీ వార్తలు చెప్తున్నాయి. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగితే తప్ప ట్రంప్ తన అంతర్గత విధా నాలను సవరించుకోకపోవచ్చు.బయటి నిరసనలుఅంతర్గతంగా ఎట్లున్నా, బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరంగిక పరిస్థితులు, ప్రయోజనాలతో ఉండటం నిజమే అయినా, బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినపుడు ఈ 40 రోజులలో కనిపిస్తున్నది ఏమిటి?ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు పనామా కాలువ స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం, గ్రీన్ల్యాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమె రికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చటం. ఈ అంశాలలో జరి గిందేమిటి? పనామా బలహీన దేశం. అయినా వారి కాలువను స్వాధీనపరచుకోలేక పోయారు. కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్ట మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే.అదే ప్రాంతపు మెక్సికో, తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇపుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసినా, యూరోపియన్ దేశాలు సైతం ఆమో దించటం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్ల్యాండ్ మరొక బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది. ట్రంప్కు కావలసింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం. కానీ అమెరికాకు అమ్మకం అయేందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్ల్యాండ్లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తర ణకు, సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్ల్యాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి. యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్దే రాజ్యమయ్యేది.అమెరికాకు సరిహద్దున ఉండటమేగాక అన్నివిధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అంటున్న 51వ రాష్ట్రపు మాటను కెనడా ఛీత్కరిస్తున్నది. 25 శాతం సుంకాలకు బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించింది. ప్రజలలో జాతీయాభిమానం ఎగసి రాగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బలమైన మద్దతుగల గ్రీన్ల్యాండ్ వలెనే, స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి నెరవేరటం లేదన్నమాట.బుల్డోజర్ పథకం సాగేనా?ఇంచుమించు ఇటువంటిదే గాజా విషయం. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్న అమెరికా విధానంలో నిజాయితీ లేకున్నా నోటి మాటగా అంటూ వస్తూ, ఇపుడు తిరిగి అధికారానికి వచ్చినాక దానిని అకస్మాత్తుగా వదలివేసిన ట్రంప్, గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్టుగా మారుస్తామన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీనియన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు, యూరోపియన్ యూనియన్, తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్యసమితి వెంటనే కొట్టివేశాయి. అయినప్పటికీ తన పంతం వీడని ట్రంప్, తమపై బాగా ఆధారపడి ఉన్న ఈజిప్టు, జోర్డాన్లను ఒత్తిడి చేసి గాజా ప్రజలను, బహుశా తర్వాత వెస్ట్ బ్యాంక్ పాల స్తీనియన్లను కూడా ఆ దేశాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఈజిప్ట్, జోర్డాన్ల సొంత ఆలోచనలు ఏవైనా అక్కడి ప్రజాభిప్రాయానికి, తక్కిన అరబ్ ప్రపంచం ఆగ్రహానికి భయపడి అందుకు అంగీకరించలేదు. కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా, ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు. దానితో, తాము చెప్పిన దానికన్న మెరుగైన ప్రతిపాదన ఉంటే సూచించాలని అరబ్ దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇపుడు కోరు తున్నారు. గాజా ప్రజలు తమ మాతృభూమిలోనే నివసించే విధంగా పునర్నిర్మాణ పథకాన్ని, పాలస్తీనా స్వతంత్ర దేశ పథకాన్ని అరబ్ దేశాలు ఇంచుమించు రూపొందించాయి. ఆ విధంగా అమెరికా అధ్యక్షుని బుల్డోజర్ ఉధృతి అక్కడ సాగబోవటం లేదు. ఈ పరి ణామాల దరిమిలా, తాము, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ధ్వంసం చేయటం, లొంగ దీసుకోవటం జరగవచ్చునా అన్నది వేచి చూడ వలసిన ప్రశ్న అవుతున్నది.ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చేస్తున్నదేమిటో రోజూ వార్తలు వెలువడుతున్నాయి. తాము, యూరప్ కలిసి ఉక్రెయిన్ను మూడేళ్లుగా నిలబెట్టలేక పోవటంతో, వ్యక్తిగతంగా వ్యాపార ధోరణి గల ట్రంప్ ఇప్పుడు రెండువైపుల నుంచి ప్రయోజనాలు పొందే వ్యూహం వైపు మారారు. ఉక్రెయిన్ను, యూరప్ను దారికి తెచ్చుకుని ఉక్రెయిన్లోని లోహాలు, ఖనిజాలను సంపాదించటం; బలమైన రష్యాతో ఆర్థిక, ఇతర సంబంధాల మెరుగుదల. ఎటూ గెలవలేని యుద్ధంలో ఆ విధంగా ఉక్రెయిన్, యూరప్, తనను కాదని చేయగలిగింది కూడా లేని బలహీనులు కావటం వల్ల వారిని దారికి తేగలుగుతున్నారు. దీనినిబట్టి అర్థమయే దేమిటి? పనామా, కెనడా, గాజా, ఉక్రెయిన్, యూరప్ వంటివి వేర్వేరు విధాలైన కేసులు. మొత్తం మీద తన పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే అమెరికా అధ్యక్షుడు ఇన్నిన్ని అనుభవాలు గడించటం బహుశా మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. ఆయనతో ప్రపంచ అనుభవాలు కూడా అటువంటివే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
Indian students: యూరప్ పిలుస్తోంది..
అమెరికా డాలర్ కల కరిగిపోతోంది. బాగా చదువుకొని యూఎస్లో స్థిరపడాలని ఆశించిన యువత ఆశల రెక్కలను ట్రంప్ మహాశయుడు తుంచేశాడు. ఏదో ఒక విధంగా అమెరికాకు వెళితే చాలు నాలుగు డాలర్లు వెనుకేసుకోవచ్చని ఆశించిన లక్షలాది మంది విద్యార్థులు, యువత భంగపాటుకు గురయ్యారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్ముకొని, ఊరూ, పేరూ లేని విశ్వవిద్యాలయాల్లో చేరి ఉన్నత చదువుల నెపంతో రకరకాల ఉద్యోగాలు చేస్తున్న యువత ట్రంప్ దెబ్బకు తిరుగుపయనం అవుతున్నారు.మరోవైపు తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని, అగ్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకొన్న తల్లిదండ్రులు సైతం ట్రంప్ దెబ్బతో తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలని, బాగా సంపాదించాలని కోరుకొనే యువతను ఇప్పుడు యూరప్ దేశాలు ఆకర్షిస్తున్నాయి. కేవలం ఐటీ ఆధారిత కోర్సులు, ఐటీ ఆధారిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా లైఫ్సెన్స్, ఎని్వరాన్మెంటల్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లోనూ అద్భుత అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ అభిరుచికి తగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని పలు కన్సల్టెన్సీలు సూచిస్తున్నాయి. యూఎస్కు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది ప్రామాణికమైన విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతున్నారు. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తరువాత ఆ దేశంలో ఉండే కన్సల్టెన్సీలు సైతం విద్యార్థులను మరోవిధంగా మోసం చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరేందుకు కనీసం రూ.40 లక్షల వరకూ ఖర్చు కావచ్చు. కానీ తాము కేవలం రూ.8 లక్షలతో మరో వర్సిటీలో తమకు నచి్చన కోర్సుల్లో చేరి్పస్తామంటూ నమ్మిస్తున్నారు. మరోవైపు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో అలాంటి యూఎస్ కన్సల్టెన్సీలను నమ్మి నకిలీ వర్సిటీల్లో చేరుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో భాగంగా మొదటి 36 నెలల పాటు పార్ట్టైమ్ ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు లాటరీలో హెచ్–1 వీసా లభిస్తే ఇక భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండబోదనే ఆలోచనతో తక్కువ బడ్జెట్ ఆఫర్లతో ఆకట్టుకొనే వర్సిటీల్లో చేరుతున్నారు. మరి కొందరు రకరకాల విశ్వవిద్యాలయాల పేరిట ఆన్లైన్ కోర్సుల్లో చేరి ఒకే సమయంలో రెండు, మూడు రకాల పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఒక నిర్థిష్ట లక్ష్యం లేకుండా, ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరకుండా ఏదో ఒకవిధంగా స్థిరపడాలని భావించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. యూఎస్లోని వివిధ ప్రాంతాల్లో కనీసం లక్షన్నర మంది విద్యార్థులు ఉన్నట్లు నగరానికి చెందిన ఓ ప్రముఖ కన్సల్టెన్సీ వెల్లడించింది. ట్రంప్ విధానాల ఫలితంగా ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇంటిదారి పట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధి చెబుతున్న మాట.వెల్కం టు యూరప్.. ఈ క్రమంలో యూరప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాల్లో చదువుకొని స్థిరపడాలని కోరుకొనే విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘యూఎస్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ట్రంప్ గెలుపు అనివార్యంగా మారిన తరువాత చాలా మంది విద్యార్థులు యూఎస్ ఆలోచనను విరమించుకొని బ్రిటన్, తదితర దేశాలకు వెళ్తున్నారు.’ అని అమీర్పేట్కు చెందిన కాన్వొకేషన్స్ స్క్వేర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు హిమబింధు కోల్లా తెలిపారు. జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషల్లో కొద్దిపాటి ప్రవేశం ఉన్నా చాలు అక్కడి విద్యాసంస్థల్లో చేరవచ్చు. స్విట్జర్లాండ్లోనూ గొప్ప విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని పర్యటనతో మన విద్యార్థులకు ఫ్రాన్స్ ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం 5 సంవత్సరాల గడువుతో కూడిన వీసాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు. జర్మనీలో స్థిరపడుతున్న తెలుగువాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ స్థిరపడాలనుకొనేవారికి చక్కటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.సృజనాత్మకతకు పెద్దపీట.. చాలా మంది బీటెక్ చదివి ఇంజినీరింగ్ వైపే వెళ్లాలని భావిస్తారు. కానీ ఎన్విరాన్మెంటల్ సస్టెయినబుల్ గవర్నెన్స్ (ఈఎస్జీ), వేస్ట్మేనేజ్మెంట్, ఏఐ ఎథి్నక్స్, సైబర్క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, నర్సింగ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి వివిధ కోర్సుల్లో ప్రతిభను చాటే విద్యార్థులు, యువతకు యూరప్ దేశాల్లో అద్భుత అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.స్పష్టమైన లక్ష్యంతో ఢోకా లేదు.. అమెరికాలో కూడా చదువుకోవచ్చు. అక్కడే మంచి ఉద్యోగాల్లో చేరి స్థిరపడొచ్చు. కానీ ఏ లక్ష్యంతో వెళ్లాలి, ఏ విశ్వవిద్యాలయంలో చదవాలనే విషయంలో స్పష్టత ఉండాలి. యూరప్లో అభిరుచికి తగిన కోర్సుల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. – హిమబింధు కోల్లా, కాన్వొకేషన్స్స్కే్వర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ -
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది. సరైన సంపాదన అవకాశాలులేక ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దానికితోడు కొన్నిదేశాల్లో పెరుగుతున్న జనాభా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాలుగా మారుతుంటే.. యూరప్లాంటి ఇంకొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభా భవిష్యత్తులో శ్రామికశక్తి లోటును సూచిస్తోంది. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించేందుకు, స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అసలు యూరప్లో ఈ పరిస్థితులు నెలకొనేందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వృద్ధులు అధికమవుతుండడంయూరప్ 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్య జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని అంచనా. ఆరోగ్య సంరక్షణలో పురోగతి వల్ల వృద్ధుల నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు. దేశ ఉత్పాదకతలో పెద్దగా పాలుపంచుకోని ఈ జనాభా వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.తగ్గుతున్న జననాల రేటుఅనేక యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేస్తాయి. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరి వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలి. యువతకు, పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి.వలసలే శరణ్యం?2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగడమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.స్పెయిన్: గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునేవారికి ప్రత్యేకంగా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) అందిస్తుంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనన్ను పొందవచ్చు.ఇటలీ: ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది. మోలిస్, కాలాబ్రియా, సిసిలీ వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్తవారికి మూడు సంవత్సరాలకుగాను 28,000 యూరోలు(రూ.25.44 లక్షలు) అందిస్తుంది. దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా పొందవచ్చు. ఒక యూరో(సుమారు రూ.91) కంటే తక్కువకు గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.గ్రీస్: మారుమూల ద్వీపం అంటికైథెరాలో నివసించడానికి గ్రీస్ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ చొరవ వల్ల ఆ ద్వీపం సంస్కృతిని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఐర్లాండ్: ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి గృహ పునరుద్ధరణ, పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలుపట్టణీకరణ పెరుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధికోసం, ఇతర కారణాల వల్ల లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. ఇవి ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జనాభా, ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలను పెంపొందించడం ద్వారా ఈ అసమతుల్యతలను పరిష్కరించాలి.సాంకేతిక పురోగతి, భవిష్యత్తు అవకాశాలుయూరప్ భవిష్యత్తు జనాభాను పెంపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో పురోగతి శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు నూతన మార్పులకు అనుగుణంగా మారాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు, వనరులను పౌరులు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై2100 నాటికి యూరప్ దేశాల్లో జనాభా క్షీణత ఇలా..దేశం జనాభా క్షీణత తగ్గుదలపోలాండ్ 1.88 కోట్లు 49%జర్మనీ 1.31 కోట్లు 16%ఇటలీ 2.38 కోట్లు 40%ఉక్రెయిన్ 2.38 కోట్లు 61%బల్గేరియా 32 లక్షలు 47%లిథువేనియా 16 లక్షలు 57%లాట్వియా 9.28 లక్షలు 50%సెర్బియా 30 లక్షలు 45%హంగేరీ 22 లక్షలు 23% -
డేటా లీక్పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్కు ఎన్ఆర్ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తోందని, ఒక రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేస్తారని యూరోప్ ఎన్ఆర్ఐలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ‘దావోస్ పర్యటన–రాష్ట్రానికి పెట్టుబడులు’ అనే అంశంపై బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలువురు వాణిజ్య నిపుణులు, న్యాయవాదులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ (ఎన్ఆర్ఐ టీడీపీ)కు డేటా లీక్ అయ్యిందని, ఈ సంస్థ ద్వారా యూరోప్లోని ఎన్ఆర్ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరూ ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్)కు ఫిర్యాదులు చేయనున్నారనే విషయం ఈ వెబినార్ ద్వారా బయట పడింది. ఈ వెబినార్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..డేటా లీక్పై విచారణ జరపాలిఒక రాజకీయ సంస్థగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ అనే సంస్థ నుంచి మాకు మెయిల్స్ రావడం చాలా సీరియస్ అంశం. యూరోప్లోని మొత్తం తెలుగు ఎన్ఆర్ఐలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాలి. ఆయా దేశాల్లోని ఎన్ఆర్ఐలు జీడీపీఆర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. దావోస్లో ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అక్కడ నో కార్ జోన్ ఉంటుంది. ఎంత పెద్ద వారు అయినా అక్కడ నడవాల్సిందే. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. జిందాల్ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒక మహిళతో కేసులు పెట్టించడం చేటు చేసింది. – ఎల్లాప్రగడ కార్తీక్, ఆర్థిక నిపుణుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలా?దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగి వచ్చి, దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పడం దారుణం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తీసుకువస్తుంటే, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైగా ప్రపంచ తీరు తెలుసుకునేందుకే దావోస్కు వెళ్లామని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనం. – వీవీఆర్ కృష్ణంరాజు, కన్వీనర్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదురాష్ట్రానికి ప్రాజెక్ట్లు రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి సహకారం ఇస్తామనే దానిపై సమగ్ర ప్రణాళికతో దావోస్కు వెళ్లాలి. అది జరగలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్కు పలు సంస్థలు వచ్చాయి. కానీ చేసిన హడావుడికి, ఆచరణలో సంస్థల పట్ల వ్యవహరించిన తీరుకు మధ్య చాలా తేడా ఉంది. గతంలో సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖలో నిర్వహించిన సదస్సులో భోజనాల కోసం తోపులాట జరగడం ఎవరూ మరచిపోలేదు. – జేటీ రామారావు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడుఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదుపెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల రాజకీయ ప్రభుత్వం, సులభతర వాణిజ్య విధానాలు ఉండాలి. దేశంలో బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఫార్మా, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీ మాత్రం దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోయింది. నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు. – చింతలపాటి సుబ్బరాజు, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకేడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించాలన్న లక్ష్యంతోనే దావోస్ పర్యటనను వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్లు దావోస్కు వెళితే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది భ్రమ అని నిరూపితమైంది. ఎన్ఆర్ఐల డేటాను రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేయడంపై న్యాయస్థానంలో కేసు నమోదు చేయబోతున్నాం. – పల్లి ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిపుణుడు, సామాజిక ఉద్యమకారుడు అస్తవ్యస్తంగా చంద్రబాబు పాలనవైఎస్ జగన్ పాలనలో దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈరోజు చంద్రబాబు పర్యటన ద్వారా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎందుకు తీసుకెళ్లలేదు? రేవంత్రెడ్డి రూ.1.79 లక్షల కోట్లు తెలంగాణాకు తీసుకువచ్చారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఉత్త చేతులతో రాష్ట్రానికి వచ్చారు. బాబు పాలనలో అప్పులు పెరిగాయి, రాబడి తగ్గింది. ఈ లెక్కన ఎవరిది సమర్థమైన పాలన? – బి.అశోక్ కుమార్, ఆంధ్రా అడ్వొకేట్స్ ఫోరం కన్వీనర్ -
సాక్షి కార్టూన్
-
యూరప్లో శాంతి తక్షణావసరం
ఒకప్పుడు ఉక్రెయిన్ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. ఉక్రెయిన్కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్ వాసులు, 56 శాతం బ్రిటన్ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్ వెల్లడించింది.ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్ ప్రారంభంలో ఫ్రెంచ్ ప్రధాని మైకెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్ చేయటంతో 3 సంవత్సరాల సోషల్ డెమాక్రాట్స్–గ్రీన్స్–ఫ్రీ డెమాక్రటిక్ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.బ్రిటన్లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్ ప్రధాని రిషి సునాక్ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ట్రంప్ చేతిలో ఓటమి చెందారు. 2023లో ఉక్రెయిన్ విషయంలో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే అప్పటి యూకే ప్రధాని జాన్సన్ ఆఘ మేఘా లపై కీవ్ వెళ్లి ఉక్రెయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. ఉక్రెయిన్ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ మెర్కల్ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.ఉక్రెయిన్లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్ ఫ్రంట్లైన్లు కుప్పకూలిపోతున్నాయి. నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,కేఎల్ యూనివర్సిటీ ‘ 98494 91969 -
అమెరికా, యూరప్లను... హడలెత్తిస్తున్న మంచు
వాషింగ్టన్/లండన్: కనీవినీ ఎరగనంతటి భారీ మంచు అమెరికా, యూరప్లను హడలెత్తిస్తోంది. అమెరికాలో మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. బ్రిటన్లో హిమ బీభత్సం కొనసాగుతోంది. పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సరీ్వస్ తెలిపింది. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోందని హెచ్చరించింది. ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని హెచ్చరించింది. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మామూలుగా చలి అంతగా ఉండని మిసిసిపీ, ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడతాయని హెచ్చరించారు. ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, బాలి్టమోర్, ఫిలడెల్ఫియా నగరాలను మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సాస్, ఇండియానాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. మిస్సోరీ, ఇల్లినాయీ, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోనూ భారీగా మంచు కురియనుంది. విమాన సరీ్వసులు కూడా ప్రభావితమవుతున్నాయి. బ్రిటన్లో కరెంటు కట్ యూరప్ అంతటా ఆదివారం భారీగా మంచు వర్షం కురిసింది. బ్రిటన్, జర్మనీల్లో ప్రధాన నగరాల్లో హిమపాతంతో ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. విమానాలు నిలిపేశారు. బ్రిటన్లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్లో ఎనిమిదో హెచ్చరిక జారీ చేశారు. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగనుంది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైలు ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
రష్యాకు ఉక్రెయిన్ గ్యాస్ షాక్
మాస్కో/కీవ్: రష్యా నుంచి చౌకగా గ్యాస్ను సరఫరా చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను ఉక్రెయిన్ నిలిపివేసింది. ఈ విషయంలో రష్యాతో కుదిరిన ఐదేళ్ల ఒప్పందం బుధవారం ముగిసింది. ఇకపై తమ భూభాగం నుంచి గ్యాస్ సరఫరాను అనుమతించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరోవైపు అదనపు బిలియన్ డాలర్లు రష్యా సంపాదిస్తామంటే అనుమతించబోమని అన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇదొక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఉక్రెయిన్ గుండా ఐరోపా ఖండానికి గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని రష్యాపై మరో విజయంగా పోలాండ్ ప్రభుత్వం అభివరి్ణంచింది. రష్యా 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవడం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవడం చరిత్రాత్మక ఘట్టమని ఉక్రెయిన్ ఇంధన శాఖ స్పష్టంచేసింది. → గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని ఉక్రెయిన్ పొడిగించకపోవడం ఊహించిన పరిణామమే. దీనివల్ల యూరప్ దేశాలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లక తప్పదు. రష్యా నుంచి చౌకగా వచ్చే గ్యాస్ స్థానంలో ఇకపై ఖరీదైన గ్యాస్ను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.→ యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. దీనివల్ల రష్యాకు నష్టం జరుగుతోంది. రష్యా గ్యాస్ దిగ్గజం గాజ్ప్రోమ్ గత ఏడాది 6.9 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇలా జరగడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. → రష్యా నుంచి ఉక్రెయిన్ మార్గం కాకుండా టర్క్స్ట్రీమ్ లైన్ కూడా ఉంది. ఇది తుర్కియే, బల్గేరియా, సెర్బియా, హంగేరీ నుంచి యూరప్నకు చేరుతోంది. → యూరప్లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని యూరేíÙయా గ్రూప్ ఎనర్జీ హెడ్ హెనింగ్ గ్లోస్టీన్ చెప్పారు. గ్యాస్ ధరల భారంతో విద్యుత్ చార్జీలు అమాంతం పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా గ్యాస్తో యూరప్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. → 2022లో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభం కాకముందు యూరోపియన్ యూనియన్ దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. 2021లో ఆయా దేశాలు తమ అవసరాల్లో 40 శాతం గ్యాస్ను రష్యా నుంచే పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత 2023 నాటికి అది 8 శాతానికి పడిపోయింది. → అయితే యూరప్కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం -
లెక్కలు, చిక్కులు
లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు. ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు. మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం. ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం. పెరిగిన జనాభాను బట్టి లోక్ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది. మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే, అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం. పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు. యూరప్ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది. అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు. విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్ అనుభవాన్ని గమనించిన థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి! -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్ప్లేస్ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్కోర్వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఔషధ ఎగుమతులు @10 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఔషధ ఎగుమతులకు యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా నిలుస్తున్నా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్ట్) ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సర్జికల్ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఫార్మా మార్కెట్లో విశ్వసనీయమైన సరఫరాదారుగా భారత్కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేస్తోంది. ‘‘పా ర్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, బయోలాజికల్ ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా భారత్ స్థానం పటిష్టమవుతోంది. అంతర్జాతీయంగా జనరిక్స్, వినూత్నమైన చికిత్సలకు డిమాండ్ పెరగడంతోపాటు, భారత్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోంది’’అని వివరించింది. వివిధ దేశాలకు ఎగుమతులు ఇలా.. → భారత్ నుంచి ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 39% అమెరికాకు వెళ్లా యి. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 3.69 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత కంపెనీలు అమెరికాకు షిప్ చేశాయి. అమెరికాలో జనరిక్స్, ప్రాణాలను రక్షించే ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండడం కలిసొస్తోంది. → అమెరికా తర్వాత యూకేకు అత్యధికంగా 316.2 మిలియన్ డాలర్ల విలువైన ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతులు నమోదయ్యాయి. యూకే వాటా 3.4 శాతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు 268 మిలియన్ డాలర్లు (2.8 శాతం), ఫ్రాన్స్కు 243 మిలియన్ డాలర్లు (2.6 శాతం), కెనడాకు 197 మిలియన్ డాలర్లు (2.1 శాతం) విలువ చేసే ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతయ్యాయి. → మధ్యప్రాచ్యంలో ఇరాక్కు 86.5 మిలియన్ డా లర్ల విలువ చేసే ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు ఎగుమతి చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 43.5 మిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. → నాణ్యతా ప్రమాణాలతో కూడిన భారత సర్జికల్ ఉత్పత్తులకు సైతం అంతర్జాతీ య మార్కెట్లో ఆదరణ అధికమవుతోంది. గడిచిన ఐదేళ్ల నుంచి ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2019–20లో 0.45 బిలియన్ డా లర్ల ఎగుమతులు నమోదు కాగా, 2023 –24లో ఇవి 0.70 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి ఎగుమతి అయిన సర్జికల్ ఉత్పత్తుల్లో 53 మిలియన్ డాలర్లు (18.1 శాతం) యూఎస్కే వెళ్లాయి. జర్మనీకి 13.5 మిలియన్ డాలర్లు (4.6 శాతం), బ్రిటన్కు 13.4 మిలియన్ డాలర్ల చొప్పున సర్జికల్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. -
రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్
ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్లో వెల్లడించారు.నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్లో అడిగారు.ఈ పోస్ట్ రెడ్డిట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.యూరప్లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.ఇదీ చదవండి: చాట్జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓభారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు. -
సోనాలికా చిన్న కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. నడపడం సులభం.. యూరప్లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. -
యూరోప్ జట్టుదే లేవర్ కప్
బెర్లిన్: రెండేళ్ల తర్వాత లేవర్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో యూరోప్ జట్టు విజేతగా నిలిచింది. వరల్డ్ టీమ్తో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్ జట్టు 13–11 పాయింట్ల తేడాతో వరల్డ్ టీమ్ జట్టును ఓడించి ఐదోసారి విన్నర్స్ ట్రోఫీని దక్కించుకుంది. యూరోప్ జట్టు తరఫున అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), డానిల్ మెద్వెదెవ్ (రష్యా), కాస్పర్ రూడ్ (నార్వే), దిమిత్రోవ్ (బల్గేరియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫ్లావియో కొబోలి (ఇటలీ), జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) బరిలోకి దిగారు. జాన్ బోర్గ్ (స్వీడన్) కెప్టెన్గా, థామస్ ఎన్క్విస్ట్ (స్వీడన్) వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. వరల్డ్ టీమ్ తరఫున టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో, బెన్ షెల్టన్ (అమెరికా), అలెజాంద్రో తబిలో (చిలీ), ఫ్రాన్సిస్సో సెరున్డొలో (అర్జెంటీనా), థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. జాన్ మెకన్రో (అమెరికా) కెపె్టన్గా, ప్యాట్రిక్ మెకన్రో (అమెరికా) వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. రోజుకు మూడు చొప్పున మొత్తం తొమ్మిది సింగిల్స్ మ్యాచ్లు... రోజుకు ఒక డబుల్స్ మ్యాచ్ చొప్పున మొత్తం మూడు డబుల్స్ మ్యాచ్లు నిర్వహించారు. తొలి రోజు మ్యాచ్లో గెలిచిన ప్లేయర్కు 1 పాయింట్... రెండో రోజు మ్యాచ్లో నెగ్గిన ప్లేయర్కు 2 పాయింట్లు... మూడో రోజు మ్యాచ్లో విజయం సాధించిన ప్లేయర్కు 3 పాయింట్లు కేటాయించారు. తొలుత 13 పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల మ్యాచ్ల తర్వాత వరల్డ్ టీమ్ 8–4 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరిరోజు యూరోప్ జట్టు మూడు మ్యాచ్ల్లో నెగ్గి 9 పాయింట్లు సాధించగా... వరల్డ్ జట్టు ఒక మ్యాచ్లో గెలిచి 3 పాయింట్లు సంపాదించింది. ఓవరాల్గా యూరోప్ జట్టు 13–11తో విజయాన్ని దక్కించుకుంది. ఆఖరి రోజు డబుల్స్ మ్యాచ్లో కార్లోస్ అల్కరాజ్–కాస్పర్ రూడ్ (యూరోప్) జోడీ 6–2, 7–6 (8/6)తో బెన్ షెల్టన్–ఫ్రానెŠస్స్ టియాఫో (వరల్డ్) జంటను ఓడించింది. తొలి సింగిల్స్లో బెన్ షెల్టన్ (వరల్డ్) 6–7 (6/8), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో డానిల్ మెద్వెదెవ్ (యూరోప్)పై గెలిచాడు. రెండో సింగిల్స్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (యూరోప్) 6–7 (5/7), 7–5, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టియాఫో (వరల్డ్)ను ఓడించాడు. మూడో సింగిల్స్లో అల్కరాజ్ (యూరోప్) 6–2, 7–5తో టేలర్ ఫ్రిట్జ్ (వరల్డ్)పై నెగ్గడంతో యూరోప్ జట్టుకు టైటిల్ ఖరారైంది. విజేత జట్టులోని ప్రతి సభ్యుడికి 2,50,000 డాలర్ల (రూ. 2 కోట్ల 8 లక్షలు) చొప్పున, రన్నరప్ జట్టులోని ప్రతి సభ్యుడికి 1,25,000 డాలర్ల (రూ. 1 కోటీ 4 లక్షలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రీడాకారుడు రాడ్ లేవర్ పేరిట 2017 నుంచి ప్రతి ఏడాది ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. యూరోప్ దేశాలకు చెందిన మేటి టెన్నిస్ ప్లేయర్లతో ఒక జట్టు... యూరోపేతర దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లతో మరో జట్టు ఈ టోర్నీలో పోటీపడతాయి. 2017, 2018, 2019లలో వరుసగా మూడేళ్లు యూరోప్ జట్టు టైటిల్ నెగ్గి హ్యాట్రిక్ సాధించింది. కరోనా కారణంగా 2020లో ఈ టోర్నీని నిర్వహించలేదు. 2021లోనూ యూరోప్ జట్టుకే టైటిల్ లభించింది. 2022, 2023లలో వరల్డ్ టీమ్ జట్టు విజేతగా నిలిచింది. టైటిల్ పోరుకు విజయ్–జీవన్ జోడీహాంగ్జూ (చైనా): భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్లో తొలిసారి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టోర్నీలో ఫైనల్కు చేరుకున్నాడు. భారత్కే చెందిన జీవన్ నెడుంజెళియన్తో కలిసి హాంగ్జూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో విజయ్ సుందర్ ప్రశాంత్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.సోమవారం జరిగిన సెమీఫైనల్లో 37 ఏళ్ల విజయ్, 35 ఏళ్ల జీవన్ 0–6, 6–2, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కాన్స్టాన్టిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) ద్వయంతో విజయ్–జీవన్ జంట తలపడుతుంది. 71 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయిన విజయ్–జీవన్ ద్వయం రెండో సెట్లో తేరుకుంది. రెండు సార్లు ప్రత్యర్థి జోడీ సర్విస్ను బ్రేక్ చేసి తమ సర్విస్లను కాపాడుకొని సెట్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో భారత జోడీ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది.విజయ్ కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ ఫైనల్కాగా... జీవన్కిది నాలుగో ఫైనల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2018లో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)తో కలిసి చెంగ్డూ ఓపెన్లో, 2023లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పుణే ఓపెన్లో జీవన్ రన్నరప్ ట్రోఫీని సాధించాడు. -
సెక్యులరిజంపై గవర్నర్ రవి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సెక్యులరిజంఅనే భావన యూరప్లో ఉందని, అది భారత దేశానికి సంబంధంలేనిదన్నారు. సోమవారం(సెప్టెంబర్23) ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్.ఎన్ రవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.చర్చికి,రాజుకు మధ్య గొడవ జరిగి వారిద్దరూ దానిని ఆపేయాలనుకోవడం నుంచి యూరప్లో సెక్యులరిజం పుట్టిందన్నారు.ఇక భారత్లోకి సెక్యులరిజాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు.తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి తీవ్రస్థాయిలో విభేదాలున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలకు రాముడంటే తెలియదని రవి ఇటీవలే వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. ఇదీ చదవండి: కోల్కతాఘటన సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే -
ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!
కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్వేరియంట్లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఎక్స్ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్కి సంబంధించిన కేసుని జర్మన్లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ని ఓమిక్రాన్ సబ్వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్ల, బూస్టర్ డోస్లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఎక్స్ఈసీ లక్షణాలు..జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?) -
బోరిస్ తుఫాన్.. వరదలతో యూరప్ అతలాకుతలం (ఫొటోలు)
-
వామ్మో మంకీపాక్స్!.. భారత్లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్, చైనా భేష్
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్పోస్ట్లో పేర్కొన్నారు. చైనా 5 శాతం 2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది. -
కొండాకోనల్ల నడుమ సేద తీరుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
వలసలపై పాశ్చాత్యుల నటనలు
లాటిన్ అమెరికా, ఆసియా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్కు సాగుతున్న వలసలు అక్కడ ఒత్తిడి పెంచుతున్నాయి. ఫ్రాన్స్లోలా అల్లర్లు చెలరేగడం, పలురకాల నేరాలు జరగడం లాంటివి. వీటికి విరుగుడుగా యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచితే, అక్కడే అభివృద్ధి జరిగి, వారు యూరప్కు వలస రాకుండా ఉంటారని జీ–7 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోని చేసిన ప్రతిపాదన వినడానికి అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల ఏళ్లుగా అనుసరించిన విధానాల పర్యవసానమే ఈ వలసలు. ఇప్పుడు ప్రత్యక్ష వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, పరోక్షంగా నియంత్రిస్తూనే ఉన్నారు. వలసలు ఆగాలన్న చిత్తశుద్ధి వారికి ఉంటే చేయవలసింది పరోక్ష దోపిడీని మానివేయటం.ప్రపంచంలోని పేద దేశాలన్నింటిని ఆరు వందల సంవత్సరాల నుంచి తమ వలసలుగా, నయా వలసలుగా మార్చుకుని అదుపులేని దోపిడీ సాగిస్తూ వస్తున్న పాశ్చాత్య దేశాలు, వారి బాగోగుల కోసం అంటూ మరొకమారు నటనలు చేస్తున్నాయి. ఇటలీలో గత వారాంతంలో జరిగిన జీ–7 సమావేశాలలో ఆ దేశపు ప్రధాని జార్జియో మెలోనీ చేసిన ప్రతిపాదనలను గమనిస్తే, ఈ విషయం స్పష్టమవుతుంది.మెలోనీ చేసిన ప్రతిపాదనలు తమకు తక్షణ సమస్యగా మారిన ఆఫ్రికన్ వలసల గురించి. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగాన గల అరబ్ దేశాల నుంచి, దక్షిణాన సహారా ఎడారికి దిగువన గల అనేక ఇతర దేశాల నుంచి ఇటలీతో పాటు యూరప్ అంతటికీ వలసలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. వాటిలో చట్ట ప్రకారం జరిగేవాటి కన్నా, అక్రమంగా జరిగేవి అనేక రెట్లు ఎక్కువ. వారంతా ఆఫ్రికా, యూరప్ల మధ్య గల మధ్యధరా సముద్రం మీదుగా చిన్న చిన్న పడవలలో రహస్యంగా ప్రయాణిస్తారు. యూరోపియన్ దేశాల గస్తీ బోట్లు పట్టుకునేది కొందరినైతే, అనేక మంది పట్టుబడకుండా యూరప్ తీరానికి చేరతారు. అక్కడి నుంచి తమ మిత్రుల ద్వారానో, లేక స్థానిక అధికారులకు, ఏజెంట్లకు డబ్బు ఇచ్చుకునో వివిధ దేశాలకు వెళ్ళిపోతారు. యథాతథంగా ఇదే తమకు సమస్య అని యూరోపియన్ ప్రభుత్వాలు భావిస్తుండగా, మధ్యధరా సముద్రంపై ప్రయాణ సమయంలో పరిస్థితులు అనుకూలించక పడవలు మునిగి ప్రతి యేటా కొన్ని వందలమంది దుర్మరణం పాలవుతుంటారు. ఈ నేపథ్యంలో, జీ–7 సమావేశాలు ముగిసిన రెండురోజులకే ‘బీబీసీ’ ప్రసారం చేసిన ఒక కథనం సంచలనంగా మారింది. మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న యూరోపియన్ దేశాలలో ఇటలీ, గ్రీస్ ముఖ్యమైనవి. వాటి మీదుగానే వలసదారులు ఇతర చోట్లకు వెళుతుంటారు. అటువంటి స్థితిలో గ్రీస్ తీరప్రాంత గస్తీ అధికారులు వలసదారులను తరచు తిరిగి సముద్రంలోకి బలవంతాన తీసుకుపోయి మునిగిపోయేటట్లు చేస్తున్నారట. గత మూడేళ్ళలో జరిగిన ఇటువంటి ఘటనలలో కొన్నింటిని ‘బీబీసీ’ బయటపెట్టింది. వలసల నివారణకు ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన సూచనల ప్రకారం, యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచాలి. ఆ విధంగా అక్కడ అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు ఉపాధి లభించి వారు యూరప్కు వలస రాకుండా ఉంటారు. ఈ విధమైన ప్రతిపాదనలు చరిత్ర తెలియని వారికీ, అమాయకులకూ అద్భుతంగా తోస్తాయి. అటువంటి పెట్టుబడులంటూ నిజంగా జరిగితే, అవి సహజంగా ప్రైవేటువి అవుతాయి. వాటి యాజమాన్యాలు తమ ‘జాబ్లెస్ గ్రోత్ టెక్నాలజీ’ వల్ల కొద్దిపాటి ఉపాధులు కల్పించి, వాటికి నికరమైన దీర్ఘకాలిక హామీ ఏదీ లేకుండా చేసి, తమ దృష్టినంతా అక్కడి వనరులను, మార్కెట్లను కొల్లగొట్టటంపై కేంద్రీకరిస్తాయి. ఈ తరహా విధానాల వల్ల వలసల సమస్య, ఆఫ్రికా పేదరికం సమస్య ఎంతమాత్రం పరిష్కారం కావు. యూరోపియన్లు మాత్రం తమ కొత్త పెట్టుబడులకు రాయితీలు సంపాదించి మరింత లాభపడతారు. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల సంవత్సరాలుగా ఈ తరహా ఆర్థిక నమూనాలను అనుసరించిన దాని పర్యవసానమే ఈవిధంగా సాగుతున్న వలసలు. ఈ విషయం ఇటలీ ప్రధాని మెలోనీకి తెలియదని భావించలేము. అసలు మొత్తం పాశ్చాత్య దేశాల చరిత్రే ప్రపంచాన్ని తమ వలసలుగా మార్చుకోవటం; అక్కడి నుంచి లక్షలాది మందిని బానిసలుగా తెచ్చి తమ వాణిజ్య పంటల ఎస్టేట్లలో, ఇతరత్రా భయంకరమైన రీతిలో చాకిరీ చేయించుకోవటం; ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేయటం; తమ ఉత్పత్తులను అక్కడి మార్కెట్లలో బలవంతంగా అమ్మి స్థానిక ఉత్పత్తులను ధ్వంసం చేయటం; స్థానిక పాలకులను రకరకాలుగా లొంగదీసుకుని తుదముట్టించటాలతో నిండిపోయి ఉంది. ఇది అక్కడి నిష్పాక్షికులైన చరిత్రకారులు, మేధావులు నేటికీ ధృవీకరిస్తున్న విషయం. అంతెందుకు, ప్రముఖ వలస రాజ్యాలలో ఒకటైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ షిరాక్ కొద్దికాలం కిత్రం యూరోపియన్ దేశాల ప్రస్తుత సిరి సంపదలకు తమ వలస దోపిడీలు ఒక ప్రధాన కారణమని అంగీకరించారు. యూరోపియన్ వలసల దశ 1940ల నుంచి 1970ల మధ్య దాదాపు ముగిసిపోయింది. వారి దోపిడీలు కూడా అంతటితో ఆగితే ఈరోజున అక్కడి ప్రజలు యూరప్కు గానీ, అమెరికాకు గానీ వలస వెళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. అక్కడ గల అపారమైన సహజ వనరులు, మానవ నైపుణ్యాలతో వారు స్వయంగా అభివృద్ధి చెంది ఉండేవారు. కానీ పాశ్చాత్యులు ప్రత్యక్ష రాజకీయ వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, స్థానిక నాయకులను, సైనికాధికారులను, సివిలియన్ అధికారులను, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులను పరోక్షంగా నియంత్రిస్తూనే వచ్చారు. తమ పెట్టుబడులు, టెక్నాలజీలు, మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలు వారి ఆధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. ఆసియా కొంత మెరుగుపడినా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో మార్పులు స్వల్పమే. ఇది మంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళుతున్న వారి గురించి అంటున్న మాట కాదు. దిగువ స్థాయి వారికి సంబంధించిన విషయం. ఈ విధంగా వలస వెళుతున్న వారి కారణంగా పాశ్చాత్య దేశాలలో సమస్యలు తలెత్తుతున్న మాట నిజమే. అట్లా వెళ్ళేవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండవు. వారు మురికి వాడలలో నివసిస్తుంటారు. వారి వల్ల తక్కిన సమాజంపై రకరకాల ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఫ్రాన్స్లో వలె ఒక్కోసారి తీవ్రమైన అల్లర్లు, హింస చెలరేగుతాయి. పలురకాల నేరాలు జరుగుతాయి. వారికోసం ఏ ప్రభుత్వమైనా కొన్ని సహాయ చర్చలు తీసుకున్నా అవి ఎంతమాత్రం సరిపోవు. మరొకవైపు వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటలీ ప్రధాని మెలోనీ మాటలను ‘చీమా, చీమా ఎందుకు కుట్టావు?’ అన్న నీతికథలో వలె శోధిస్తూపోతే, పైన చెప్పుకున్న వందల ఏళ్ళ పాశ్చాత్య వలస దోపిడీ చరిత్ర ముందుకు వస్తుంది. విచిత్రం ఏమంటే, ఇన్నిన్ని జరుగుతున్నా వారు తమ గత స్వభావాలను, విధానాలను మార్చుకోవటం లేదు. వారికి ఇప్పటికీ చిన్న చిన్న వలస భూభాగాలు, వందలాది సైనిక స్థావరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలి కాలానికే వస్తే, ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచి వలసలు సుమారు ఆరింటిలో, అక్కడి ఫ్రెంచ్ అనుకూల పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. కొత్తగా అధికారానికి వచ్చిన వారు అక్కడి ఫ్రెంచ్ సైనిక స్థావరాలను ఖాళీ చేయించి వెళ్ళగొట్టారు. దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నానా రభస సృష్టించి కొత్త పాలకులపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారు ససేమిరా లొంగలేదు. ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ నుంచి, అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ల వరకు పాశ్చాత్య నాయకులకు ఇటువంటి వలసలను ఆపాలనే చిత్తశుద్ధి నిజంగా ఉందా? వలసలు యూరప్ అంతటా పెద్ద సమస్య అయినట్లు గత వారమే జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికలలో మితవాదుల ఓటు గణనీయంగా పెరగటం రుజువు చేసింది కూడా. వలసలు, జాతివాదమే అక్కడ ముఖ్యమైన అజెండాగా మారుతున్నాయి. అందువల్ల ఆ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చేయవలసింది ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా దేశాల దోపిడీని త్వరగా మానివేయటం. అక్కడి వనరులను, మార్కెట్లను అక్కడి ప్రజల నియంత్రణకు, ఉపయోగానికి వదిలి వేయటం. వారితో అన్ని సంబంధాలను సమతులనంగా, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా మార్చుకోవటం. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఉడుతలకు, పావురాలకు గర్భనిరోధక మాత్రలు
పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బ్రిటన్లో ఉడుతలకు హాజెల్నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
యూరప్ ట్రిప్ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్11)షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది. గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్ కమిషన్ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు. -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ, పర్పుల్ రంగుల్లో అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్లో తెగ వైరల్ అవుతున్నాయి.Strongest Aurora in last 20 years was visible last evening. This was how it looked on top of Jungfraujoch, Switzerland Video via webcams on https://t.co/BwS7eM6IEY#solarstorm pic.twitter.com/rqG5S2poKb— Backpacking Daku (@outofofficedaku) May 11, 2024 రెండు దశాబ్దాల తరువాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. Guys I’m actually in tears I thought I’d never get to see the northern lights 😍😭 pic.twitter.com/kk8unLfhwE— Jimin’s Toof (B-ChimChim) Semi-IA (@ForeverPurple07) May 11, 2024 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఇటలీ, ఫ్రాన్స్. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్లో, దక్షిణ సైబీరియాలో కూడా కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్ కూడా అరోరా బొరియాలిస్ అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్లకు సూచించారు. -
Mahesh Babu Europe Vacation Photos: యూరప్ వేకేషన్లో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు
-
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది. ► ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది. ► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్ఎల్సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది. ► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్వీఎన్ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది. ► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ► ఎస్బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది. -
ఈఎఫ్టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభం వెనక...
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడి దారీ విధానం వలన ఆ యా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందో ళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశా లతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గుర య్యారు. నేటి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈయూ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి – పంటలకు న్యాయమైన ధరలూ, వాటి విక్ర యాలూ! రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్దయెత్తున చౌకగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటు న్నాయి. ఆహార దిగుమతులతో పాటు ఈయూ పర్యావరణ నిబంధనలు రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4 శాతం సాగు భూమిని శాశ్వతంగా ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతే కాకుండా ప్రతి ఏడాదీ పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. సాగు అవసరాలకు విని యోగిస్తున్న పెట్రోల్, డీజిళ్లపై ఇస్తున్న సబ్సిడీ ఎత్తి వేయాలని ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందు తున్నారు. యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతాంగం తమ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతాయని స్పెయిన్ రైతాంగం భయపడుతున్నది. కొద్ది సంవత్సరాలుగా ఈయూ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్స్లో ‘వాల్’ నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన ‘గ్వాదల్ క్విలిర్’ నదిలో సాధారణ నీటిమట్టంలో నాలుగవ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్లో వ్యవసాయం విస్తృతంగా ఉండటంతో నీటి అవసరాలు ఎక్కు వగా ఉన్నాయి. ఇటలీ లోనూ నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి పాలకులు దిగుమతులు పెంచడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్లో 10 నుంచి 15 శాతం పొలాలపై ఒక బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండటంతో రైతులు దివాళా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈయూ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిర సిస్తూ ఈక్రింది డిమాండ్లకై రైతాంగం ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను ఈయూ అరికట్టాలి. ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలి. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపి వేయాలి. సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4 శాతం భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబంధనలు సడలించాలి. పెట్రోల్, డీజిళ్లపై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదు. నష్టపోయిన రైతులకు పరి హారం చెల్లించాలి వంటి అనేక డిమాండ్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10వేల మంది రైతులు సెంట్రల్ బెర్లిన్ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్ విండన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 2న ఉక్రెయిన్కు తాజాగా నిధులు మంజూరు చేయడానికి ఈయూ నాయకులు సమావేశం నిర్వహించగా బెల్జియం పార్లమెంట్ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియ చేశారు. గ్రీస్లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్లో నిరసన తెలుపు తున్న రైతులు ప్యారిస్ వెలుపల, లియోన్, టౌలేస్ నగరాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. యూరప్ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు మద్దతుగా 73 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కూ ఇతర దేశాల పాలకులకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఫలి తంగా యూరప్ వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ ఈయూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేశాయి. పెట్టుబడిదారీ వ్యవ సాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదనీ, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురౌతున్నాయనీ గ్రహించాలి. - వ్యాసకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ) ‘ 98859 83526 - బొల్లిముంతసాంబశివరావు -
అట్లాంటిక్ డైట్తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఇప్పుడు వెజిటేరియన్ డైట్ అని, ఫ్రూట్ జ్యూస్ డైట్ అని పలు రకాల డైట్లు వచ్చేశాయి. తమ ఆహార్యానికి తగ్గట్టుగా వారికి నచ్చిన డైట్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల బాగా సోషల్ మీడియాలో అట్లాంటిక్ డైట్ అని ఓ డైట్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ డైట్ ఫాలో అయితే కేవలం బరువు మాత్రమే అదుపులో ఉండటమే గాకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అత్యంత ఆరోగ్యకరమైన డైట్లలో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ఏంటా డైట్ అంటే.. ఈ అట్లాంటిక్ డైట్ మెడిటేరియన్ డైట్ని పోలి ఉంటుంది. ఇది యూరప్లో బాగా ఫేమస్ అయ్యిన డైట్. ఇది బరువుని అదుపులో ఉంచడమే గాక శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరునెలల పాటు ఈ డైట్ ఫాలో అయితే గొప్ప ప్రయోజనాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిల తోపాటు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్య స్థాయిలో ఉండేట్లు చేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు 200 స్పానిష్ కుటుంబాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యిందlన్నారు. ఈ డైట్లో ఏం ఉంటాయంటే.. ఈ డైట్లో పోర్చుగల్, వాయువ్య స్పెయిన్లో ప్రసిద్ధి చెందిన ఆహారాలు ఉంటాయి. దీనిని దక్షిణ యూరోపియన్ డైట్ అని కూడా అంటారు. ఐరోపాలో జరిపిన పలు అధ్యయనాల్లో ఈ డైట్ వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ఇందులో క్యాన్సర్ లేదా గుండె జబ్బుల నుంచి ముందుగానే చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, స్ట్రోక్ ,ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచే వేలాడే పొట్ట కొవ్వుని కూడా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ డైట్లో ఉండే ఆహారాలు.. తాజా చేప కొద్దిగా ఎర్ర మాంసం ఉత్పత్తులు పాలు చిక్కుళ్ళు తాజా కూరగాయలు బంగాళదుంపలు గోధమ బ్రెడ్ కొద్ది మోతాదులో వైన్ ఆకుకూరలు ఈ డైట్లె మాంసం, చేపలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మితంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒమెగా 3కి సంబంధించిన కొవ్వు ఆధారిత చేపలు, గుడ్లు, పాలు ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని చాలావరకు కుటుంబసభ్యులంతా కలిసి ప్రిపేర్ చేసుకుని ఉత్సాహ భరితంగా ఆస్వాదిస్తారు. దీంతోపాటు రోజువారీ నడక, సైక్లింగ్ తప్పనిసరి ఉంటాయి. ప్రయోజనాలు.. మెటబాలిక్ సిండ్రోమ్ను తగ్గిస్తుంది జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఊబకాయం వంటివి రావు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలస్ట్రాల్ని దరిచేరనీయ్యదు బరువు అదుపులో ఉంటుంది అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడగలుగుతారు. మూడేళ్లకు అట్లాంటిక్ డైట్కు కట్టుబడి ఉంటే 60 ఏళ్ల పైబడిన పెద్దల్లో ముందస్తుగా మరణించే ప్రమాదాలు 14% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ డైట్. (చదవండి: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
Yatra 2 @ London : లండన్లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రచ్చ రేపిన కొత్త మరణ దండన
ప్రపంచదేశాల్లో ఇప్పటి వరకూ మరణ శిక్ష... ఉరి, విద్యుత్ కుర్చీ, విషపు ఇంజెక్షన్స్, తుపాకీ కాల్పులు వంటి పద్ధతుల ద్వారా ఎక్కువగా అమలవుతూ వస్తోంది. కానీ ప్రపంచంలోనే తొలి సారిగా అమెరికాలో ఓ 58 ఏళ్ల హంతకుడికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అల బామాలో ఇటీవలే ప్రయోగాత్మకంగా స్మిత్ అనే ఖైదీకి మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్థితి లోకి తీసుకెళ్లి మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమ లును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరస నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి, ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లు అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్థాయిలో ఉన్నా యంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందనీ, ఇది క్రూరంగానే ఉందనీ అంగీకరించింది. అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అల బా మాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీలు ఈ తరహా మరణ శిక్ష అమలును ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జన రల్ స్టీవ్ మార్షల్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు. కెన్నెత్ యూజీన్ స్మిత్కు ప్రాణాంతకమైన మందులతో మరణశిక్ష అమలు చేయాలని 2022 నవంబర్లో నిర్ణయించారు. జైలు సిబ్బంది ఒక ఇంట్రావీనస్ లైన్ను చొప్పించారు. అయితే ప్రాణాంతక ఇంజెక్షన్ను ఇవ్వడానికి రెండు లైన్లు అవసరం. రెండవ లైను చొప్పించడానికి వారు ఒక గంట పాటు పోరాడిన తర్వాత, ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ స్మిత్ 1988లో ఒక బోధకుని భార్యను కిరాయికి చంపిన కేసులో ఇటీవల దోషిగా తేలడంతో మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షను నైట్రోజన్ వాయువును ఉపయోగించి అమలు చేశారు. అమెరికా రాష్ట్రాలు కొన్ని ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా మరణ దండన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం పలు రకాల మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి అంగీకరించాయి. స్మిత్కు మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరో ఖైదీ అలాన్ మిల్లర్కు ఐవీ సూదిని చొప్పించడంలో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష అమలు చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఔషధ తయారీదారులు యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్లు 2011లో ఇటువంటి ప్రాణాంతక ఇంజె క్షన్ల ఎగుమతులను నిషేధించాయి. దీంతో ఔషధ తయారీ కంపెనీలు వాటి తయారీని నిలిపివేశాయి. ఈ కారణంగా మరణ శిక్షను అమలు చేయడానికి రాష్ట్రాలుఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అందులో ఒకటి నైట్రోజన్ వాయువును అందించి ప్రాణాలు తీయడం. దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూ వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపంలో ఉన్న ఈ గ్యాస్ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల బామా స్టేట్ అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ మాట్లాడుతూ... నైట్రోజన్ వాయువును ఉప యోగించి, మరణశిక్షను అమలు చేయడం అత్యంత మానవీయమైన పద్ధతి’ అని పేర్కొ నడం గమనార్హం. – వి.వి. వెంకటేశ్వరరావు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 63008 66637 -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్ఫోన్కు అతుక్కుపోయేలా చేసే టిక్టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు. ఇస్లాం సంస్కృతికి, మా యూరోపియన్ నాగరికతకు చాలా తేడాలున్నాయ్. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు. 🚨Watch: #GiorgiaMeloni: "I believe... there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization... Will not allow Sharia law to be implemented in italy.... values of our civilization are different! pic.twitter.com/VGWNix7936 — Geopolitical Kid (@Geopoliticalkid) December 18, 2023 షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బిలియనీర్ ఎలన్ మ్కాస్లు కూడా పాల్గొన్నారు. చదవండి: Mexico: నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది? -
‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి
కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది. ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది. -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్టాక్ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్టాక్తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలు యూరప్లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
హమాస్ దాడులకు ఆ ఎంవోయూ కారణం కావొచ్చు!
వాషింగ్టన్: ఇజ్రాయెల్పై హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కూడా దాడులకు ఒక కారణం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం..) ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్తో కలిసి పాతిక్రేయ సమావేశం నిర్వహించిన బైడెన్.. ఇజ్రాయెల్పై హమాస్ దాడుల గురించి స్పందించారు. హమాస్ దాడుల వెనక భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రకటన కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి రుజువులు మా దగ్గర లేకున్నా.. అది నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్ విషయంలో వెనక్కి తగ్గం అని బైడెన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా.. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ కోసం అవగాహన తాఖీదు(ఎంవోయూ) జరిగింది. భారత్తో పాటు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్యూనియన్లు ఆ ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆసియా, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, యూరప్ మధ్య ఆర్థిక మెరుగైన అనుసంధానం కోసం.. ముఖ్యంగా ఆర్థిక ఏకీకరణ ద్వారా కారిడార్ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ఎంవోయూ కుదర్చుకున్నాయి ఆయా దేశాలు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ను రెండు ప్రత్యేక కారిడార్లుగా విభజించారు. తూర్పు కారిడార్ భారత్ నుంచి పశ్చిమ మధ్య ఆసియాను అనుసంధానిస్తుంది. అలాగే.. ఉత్తర కారిడార్ పశ్చిమ ఆసియాతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ను అనుసంధానిస్తుంది. తాజాగా ఈ కారిడార్పై బైడెన్ స్పందిస్తూ.. ఇది రెండు ఖండాల మధ్య పెట్టుబడి అవకాశాలను పెంపొదిస్తుందంటూ ప్రశంసలు సైతం గుప్పించారు. ముఖ్యంగా సుస్థిరమైన మిడిల్ ఈస్ట్ నిర్మాణానికి ఈ కారిడార్ గుండా ఏర్పాటయ్యే రైల్వే పోర్ట్ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారాయన. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకి చేరుకుంది. హమాస్ను తుడిచిపెట్టేంత వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటూనే.. గాజాపై దాడుల్ని ఉధృతం చేయాలని తమ రక్షణ దళాన్ని ఆదేశించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ. మరోవైపు ఇజ్రాయెల్ బంధీల ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని హమాస్ భావిస్తోంది. -
అందమైన ఈ పువ్వులతో..హార్ట్ ఎటాక్ ముప్పు !
అందమైన పువ్వుల్ని చూడగానే మన ముఖంలో అనుకోకుండా చిరు నవ్వులు పూస్తాయి. ఒక్కోసారి అలాంటి మొక్కల్ని మన గార్డెన్లో కూడా పెంచుకోవాలని ఉబలాటపడతాం. ఇకపై ఇలాంటి ప్రయత్నాలకు కొంచెం ఆలోచన జోడించాల్సిందే! ఎందుకంటే కొన్ని రకాల పువ్వులు మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు తాజాగా హెచ్చరి స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన గార్డెన్ ఫేవరెట్గా పేరొందిన ఫాక్స్గ్లోవ్ పుష్పాలపై సైంటిస్టులు కీలకహెచ్చరికలు చేశారు. ఇది యూరప్ ఆసియాకు చెందిన తీగ జాతి మొక్క. ఈ మొక్కను "డెడ్ మ్యాన్స్ బెల్స్" లేదా "మంత్రగత్తెల చేతి తొడుగులు" అనే పేరుతో విక్రయిస్తారట. సాధారణ ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ పర్పురియా) మొక్క పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో ఉంటాయి. పెండ్యులస్, ట్రంపెట్ ఆకారలో గుత్తుల గుత్తుల పువ్వులు మంత్రముగ్ధులను చేస్తాయి. అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫాక్స్గ్లోవ్ అందమైన పువ్వుల్ని ఇవ్వడమే కాదు, గుండెపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన కార్డియాక్ గ్లైకోసైడ్గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని కూడా కలిగి ఉంటాయి. ఇవి గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయని బఫెలో, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, డాక్టర్ జెన్ వాంగ్ లైవ్ సైన్స్తో చెప్పారు. ఆరోగ్యకరమైన గుండె వేలకొద్దీ కార్డియాక్ కణాల ద్వారా రక్తాన్ని శరీరానికి పంపిస్తుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గా పిలిచే గుండె లయకు డిగోక్సిన్తో ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడితే రసాయన సమస్యలు తలెత్తుతాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా, మరణానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. ఫాక్స్గ్లోవ్ “చనిపోయినవారిని తిరిగి బతికించగలు. జీవించి ఉన్నవారిని చంపగలదు” అనేది పాత ఆంగ్ల సామెత. ఫాక్స్ గ్లోవ్లో అంతటి గొప్ప, ప్రాణాలను రక్షించే ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని డాక్టర్ వాంగ్ కూడా చెప్పారు. ఫాక్స్గ్లోవ్స్లోని డిగోక్సిన్ తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ - డిగోక్సిన్ విలువైన గుండె మందులాగా చాలా పాపులర్ అని, ఇతర మందులేవీ పనిచేయనపుడు గుండె వైఫల్య చికిత్సలో ఇది బాగా పనిచేస్తుందని సూచించారు. -
భారత్- యూరప్ కారిడార్తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?
ఆమధ్య రాజధాని ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో ఇతర అంశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం భారత్ మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్కు చేరుకునేలా కొత్త కారిడార్ను నిర్మించడం. అమెరికా భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ కారిడార్లో సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం చేరింది. ఈ కారిడార్ గేమ్ ఛేంజర్గా, చైనా దూకుడు చూపుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బీఆర్ఐకి భారత్, అమెరికాల పదునైన సమాధానం అని నిపుణులు అంటున్నారు. అయితే చైనా కంటే ముందు టర్కీ ఈ కారిడార్ విషయంలో టెన్షన్ పడుతోంది. దీంతో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీని ఫ్లాప్ చేయడానికి ప్రత్యేక కారిడార్ను నిర్మించాలని యోచిస్తోంది. యూఎస్ నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో టర్కీ సభ్యదేశంగా ఉన్నప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం టక్కీ ఇస్లామిక్ దేశం అయినందున దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా వాస్తవానికి ఐఎంఈసీ అనేది భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జోర్డాన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యమయ్యాయి. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుండి జర్మనీకి కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత సరుకులు షిప్పింగ్ కోసం జర్మనీ చేరుకోవడానికి 36 రోజుల సమయం పడుతుండగా, ఈ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ దూరం 22 రోజుల్లో ఈ తతంగం పూర్తి కానుంది. ఇరాక్ మీదుగా కారిడార్ నిర్మించాలని.. ఈ కారిడార్ ఒక మెగా ప్రాజెక్ట్. దీనిలో గల్ఫ్ దేశాలలో రైల్వేల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశ ప్రాముఖ్యతను పెంచే ఈ ప్రాజెక్ట్తో టర్కీకి సమస్య ఏమిటనే విషయానికి వస్తే టర్కీ భౌగోళిక స్వరూపం యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉంది. ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే మధ్యధరా సముద్ర ప్రాంతంలో టర్కీ ప్రాముఖ్యత తగ్గుతుంది. టర్కీ ఇంతకాలం తాను ఈ ప్రాంతానికి అలెగ్జాండర్గా పరిగణించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోని గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీకి శత్రు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కు పోటీగా, ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొత్త కారిడార్ను నిర్మించాలనుకుంటున్నాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఇరాక్ మీదుగా 1,200 కి.మీ కారిడార్ను నిర్మించాలని టర్కీ యోచిస్తోంది. ఇందులో హైస్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు నిర్మాణం ఉండనున్నాయి. దీనికి దాదాపు 17 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. టర్కీ యోచనకు అనేక అడ్డంకులు అయితే భారత్ను యూరప్కు అనుసంధానించే కారిడార్ ప్రాజెక్టుకు పోటీగా ప్రాజెక్టును సిద్ధం చేయాలన్న టర్కీ యోచనలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో టర్కీ తన మిత్రదేశం చైనాతో జతకట్టి ఐఎంఈసీ కారిడార్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కాగా ఈ విషయంలో చైనా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో ఆర్బీఐ ప్రాజెక్ట్ చేపట్టిన చైనా.. భవిష్యత్తులో టర్కీతో చేతులు కలిపి, ఐఎంఈసీ కారిడార్ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
యూరప్లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్ఫర్ట్, ఉట్రేచ్్ట–నెదర్లాండ్స్లో టీటీడీ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యాణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూరప్లో స్వామి వారి కల్యాణానికి శివరామ్ తడిగొట్ల, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు. -
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..
ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్ వీరుడి పేరు లే టిమిస్. ఇతగాడు సైకిల్ మీదనే యూరోప్ దేశాలన్నింటినీ చుట్టేశాడు. పోర్చుగల్లోని కాబో ద రోకా నుంచి టిమిస్ తన సాహసయాత్రను ప్రారంభించి, రష్యాలోని సైబీరియా అంచుల్లో ఉన్న ఉఫా రైల్వేస్టేషన్ వద్ద ముగించాడు. ఈ యాత్రను అతడు 16 రోజుల 10 గంటల 45 నిమిషాల్లోనే ముగించారు. ఈ యాత్రలో అతడు ప్రయాణించిన దూరం 6,366 కిలోమీటర్లు. దీంతో అతడు అత్యంత వేగంగా యూరోప్యాత్ర పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మొత్తం పది దేశాల మీదుగా అతడు తన యాత్ర సాగించాడు. పోర్చుగల్ నుంచి యాత్ర మొదలుపెట్టి, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, పోలండ్, లిథువేనియా, లాట్వియాల మీదుగా రష్యాకు చేరుకున్నాడు. రోజుకు సగటున 386 కిలోమీటర్ల చొప్పున, గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు. సైక్లింగ్పై అమిత ఇష్టం గల టిమిస్ ఇదివరకు ఏడేళ్లపాటు వివిధ దేశాలను సైకిల్ మీదే చుట్టేశాడు. ఇటీవల యూరోప్ సైకిల్యాత్రను అనితరసాధ్యమైన వేగంతో అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిచేయడంతో వార్తల్లోకెక్కాడు. (చదవండి: ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!) -
ఈ దారి.. వేల ఏళ్ల రహదారి.. యూరప్ మొట్టమొదటి సూపర్ హైవే
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ఈ రోడ్డును చూశారా.. స్ట్రెయిట్గా భలే ఉంది కదా! చూస్తుంటే ఇదేదో పాత రోడ్డు అని కూడా అనిపిస్తోంది కదా.. నిజమే ఈ రోడ్డుకు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 312లో ఈ రోడ్డును అప్పటి రోమన్ సామ్రాజ్య అధినేతలు నిర్మించారు. ఇటలీ ఆగ్నేయ ప్రాంతం బ్రిండిసీ నుంచి 400 మైళ్ల దూరంలోని ప్రధాన నగరం రోమ్ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. అప్పియన్ వేగా పిలిచే ఈ రోడ్డును రాజనీతిజ్ఞుడు అప్పియస్ క్లాడియస్ సీజస్ పేరుపై నిర్మించారు. దక్షిణ ఇటలీని వశం చేసుకోవడం కోసం మిలిటరీని తరలించడానికి, అలాగే గ్రీస్, ఈజిప్టుకు నౌకాయానం కోసం అప్పటి రోమ్ పాలకులు దీనిని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని యూరప్ మొట్టమొదటి సూపర్ హైవేగా కూడా చెబుతారు. చదవండి: జపాన్లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా! -
ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా..
చంద్రయాన్ 3 విజయంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు మరో కొత్త మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం రూపొందించిన ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నారు. దీనిని పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య ఎల్1 ప్రత్యేకతలు సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేస్తుంది. కాగా సూర్యుడు.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఆదిత్య వ్యోమనౌకను సూర్యునికి దగ్గరగా పంపిచరు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. దీని వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. ఇదే తొలి ప్రయోగం సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగేలా ప్రయోగం చేపడుతున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? ఏడు పేలోడ్స్ సుమారు 1500 కిలోల బరువైన ఆదిత్య ఎల్1 శాటిలైట్లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉండనున్నాయి. సూర్యుడిపై ఉప సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు సూర్యుడి మీదకు ఏఏ దేశాలు ప్రయోగాలు చేశాయో.. వివిధ దేశాలు ప్రయోగించిన సోలార్ మిషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా, వేర్వేరుగా స్పేస్ మిషన్లను ప్రయోగించాయి. అమెరికా, నాసా ఖగోళ చరిత్రలో తొలిసారి అమెరికాకు చెందిన నాసా 2018 ఆగస్టు 12న పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రయోగించిన ఓ రోదసీ నౌక సూర్యుడి వెలుపలికక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మిషన్.. సుదీర్ఘకాలం ప్రయాణించి 2021లో దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి కరోనాను(సూర్యుడి చుట్టూ ఉండే వలయం) తాకింది. అక్కడ ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది. నాసా ప్రకారం ఓ రోదసీ నౌక సూర్యుడి ఉపరితల వాతావారణాన్ని తాకడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇదే తొలిసారి. దీని వ్యయం లక్ష కోట్లు..(1.5 బిలియన్ డాలర్లు) చదవండి: ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు అంతకముందు 1995 డిసెంబర్లో నాసా, ఈఎస్ఏ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ) సంయుక్తంగా సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO)ను ప్రారంభించాయి. 1997 ఆగస్టులో అధునాతన కంపోజిషన్ ఎక్స్ప్లోరర్, అక్టోబర్ 2006లో సోలార్ టెరెస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ, ఫిబ్రవరి 2010లో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, జూన్ 2013లో ఇంటర్ఫేస్ రీజియన్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ వంటి ఇతర క్రియాశీల సౌర మిషన్లను నాసా ప్రయోగించింది. 2020 ఫిబ్రవరిలోనూ.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి నాసా మరోసారి సోలార్ ఆర్బిటర్ను ప్రయోగించింది. దీనిని సూర్యుడి సృష్టి, సౌర వ్యవస్థలో నిరంతరం మారుతున్న వాతావరణాన్ని సూర్యుడు ఎలా నియంత్రిస్తున్నాడో తెలుసుకునేందుకు రూపొందించారు. అయితే నాసా ప్రయోగించిన వాటన్నింటిలో సూర్యడికి అతి దగ్గరగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రమే. ఏడేళ్ల పాటు పనిచేసేలా తయారు చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్ సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో పావు వంతు దూరంలో పరిభ్రమిస్తుంటుంది. జపాన్ ఇక జపాన్కు చెందిన జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ) 1981లో తమొదటి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి Hinotori (ASTRO-A)ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సౌర మంటలను అధ్యయనం చేయడం దీని లక్ష్యం. దీని తర్వాత 1991లో Yohkoh (SOLAR-A). 1995లో NASA, ESA సమన్వయంతో SOHO, 1998లో నాసాతో కలిసి ట్రాన్సియెంట్ రీజియన్, కరోనల్ ఎక్స్ప్లోరర్ (TRACE), 2006లో హినోడ్ (సోలార్-బీ)ను ప్రయోగించింది. యూఎస్, యూకే సహకారంతో జపాన్ దీనిని ప్రయోగించింది. ఇది భూమిపై చంద్రుడి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. యూరప్ 1990 అక్టోబర్లో యూరప్ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సూర్యుని పైన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్ను ప్రారంభించింది. NASA ,JAXA సహకారంతో కాకుండా ESA 2001 అక్టోబర్లో ప్రోబా-2ను ప్రయోగించింది. ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలు విజయవంతమైన ప్రోబా-1 సిరీస్కు కొనసాగింపు. ప్రోబా-2లో నాలుగు ప్రయోగాలు కొనసాగుతుండగా.. రెండు సూర్యుడికి సంబంధించినవి. ప్రోబా పూర్తి పేరు ప్రాజెక్ట్ ఫర్ ఆన్-బోర్డ్ అటానమీ. ఇక యూరప్ ప్రయోగించే రాబోయే సౌర మిషన్లలో 2024లో ప్రోబా-3, 2025లో స్మైల్ మిషన్లు ఉన్నాయి. చైనా 2022 అక్టోబర్ 8న అడ్వాన్స్డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని (ASO-S) నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) విజయవంతంగా ప్రారంభించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవబోతోంది. అలాగే వారి కన్నా మెరుగ్గా తక్కువ సమయంలో ఈ ప్రయోగం చేసి పలు రికార్డులు నెలకొల్పడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇస్రో చేపట్టబోయే ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
వెకేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్గా కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వర్ సింగ్ షెకావత్గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!) అయితే గతనెలలో షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన బన్నీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. యూరప్లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సంగీత ఉత్సవం టుమారో ల్యాండ్కు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించారు. దీంతో కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ వేడుక జూలై చివర్లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించనున్నారు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
భారత ఖ్యాతిని పెంచిన పోలీసు అధికారి.. ఇండిపెండెన్స్ డే గిప్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో భారత ఖ్యాతికి పెంచుతూ పంజాబ్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి జాతీయ పతాకాన్ని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతంపై ఎగురవేసి భారతీయుడి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని ప్రశంసిస్తున్నారు. వివరాల ప్రకారం.. పంజాబ్కు చెందిన పోలీసు అధికారి గుర్జోత్ సింగ్ కలేర్.. రష్యా, యూరప్లో ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. భారీ మంచు తుఫానులు, ఉరుములు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులతో పోరాడిన తర్వాత ఆగస్ట్ 11 ఉదయం 7 గంటలకు ఎల్బ్రస్ పర్వతంపైకి చేరుకున్న కలేర్ బృందం చేరుకుంది. అనంతరం.. నలుగురు కలేర్ సభ్యుల బృందం పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎంతో కష్టతరమైన వాతావరణం.. ఈ నేపథ్యంలో గుర్జోత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఐదు రోజుల సమయం పట్టింది. పర్వతం శిఖరాగ్రంలో వాతావరణం చాలా క్లిష్టంగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీని వల్ల అధిరోహణ చాలా కష్టమైంది. ఒకానొక సమయంలో పర్వతాధిరోహణ అసాధ్యమని అని అనిపించింది. కానీ, పట్టుదల, సంకల్పంతో విజయం సాధించామన్నారు. మరోవైపు.. వృత్తిపరంగా శిక్షణ పొందిన పర్వతారోహకుడు కలేర్ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తమ పర్వతారోహకుడిగా ఎంపిక కావడం విశేషం. సింగ్ రికార్డులు ఇవే.. మరోవైపు.. గుర్జోత్ సింగ్ కలేర్ అంతకుముందు.. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాకుండా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కరోనా యోధుల ధైర్యానికి హృదయపూర్వక నివాళిగా 15,000 అడుగుల నుండి స్కైడైవ్ కూడా చేశారు. కలేర్ ప్రస్తుతం AIG (ఎక్సైజ్ మరియు టాక్సేషన్) బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. జనవరి 2023లో విధి పట్ల అత్యుత్తమ అంకితభావానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ను అందుకున్నాడు. ఇక, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం సముద్ర మట్టానికి 5,642 మీటర్లు (18,510 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఎల్బ్రస్ పర్వతం చుట్టూ మంచుతో కప్పబడి ఉంటుంది. బక్సాన్, మల్కా, కుబన్ అనే మూడు నదులు, 22 హిమానీనదాలకు ఈ పర్వతం నిలయం. ఇది కూడా చదవండి: చెలామణిలో రూ.10 నాణేలు -
క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి
క్రికెట్ మ్యాచ్ల్లో కొన్నిసార్లు క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి పరిగెత్తుకురావడం చూస్తుంటాం. ఒక్కోసారి క్యాచ్ మిస్ కావొచ్చు.. లేదంటే క్యాచ్ అందుకునే సమయంలో ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం జరగొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్ మాత్రం కాస్త వెరైటీ పద్దతిలో ఉంటుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్లో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఈసీఎస్ చెకియా టి10 లీగ్లో భాగంగా నో క్రికెట్ క్లబ్, పరాగ్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టైగర్స్ ఓపెనర్ జిఎమ్ హసంత్ భారీ షాట్ ఆడబోయి బ్యాడ్ ఎడ్జ్ తగిలిన బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ రహత్ అలీ, బౌలింగ్ చేసిన రియాజ్ అఫ్రిదిలు ఒకేసారి దూసుకొచ్చారు. అయితే రహత్ అలీ క్యాచ్ ఈజీగా అందుకునే చాన్స్ ఉన్నా రిస్క్ చేసిన రియాజ్ అఫ్రిది తానే క్యాచ్ అందుకున్నాడు. అదృష్టవశాత్తూ ఇద్దరిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలో రహత్ అలీ రియాజ్ వైపు కోపంగా చూస్తూ..''నేను పట్టుకునేవాడిని కదా.. నాపై నమ్మకం లేదా'' అంటూ పేర్కొన్నాడు. దీనిపై రియాజ్ అఫ్రిది స్పందిస్తూ.. ''నమ్మకం లేక కాదు క్యాచ్ అందుకోవాలనే వచ్చాను'' అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Tag a teammate you wouldn't trust under the high ball...😄 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/oxQx5HMPa7 — European Cricket (@EuropeanCricket) July 26, 2023 చదవండి: అప్పట్లో శుబ్మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్.. ఫొటో వైరల్ వెస్టిండీస్తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
యూరోపియన్ స్టైల్లో..సాగర తీరాన ఈట్ స్ట్రీట్స్..
చల్లనిగాలి..సముద్ర అందాలు.. ఇష్టమైన ఆహారం..లైఫ్ బిందాసే కదా..అటువంటి యూరోపియన్ ఫుడ్స్టైల్స్ ఇక విశాఖలో నోరూరించనున్నాయి. ఇష్టమైన వంటకాలను తినాలనే కోరిక ఉండే ఆహారప్రియుల కల త్వరలో నెరవేరనుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యూరోపియన్ స్టైయిల్లో ‘ఈట్ స్ట్రీట్స్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్నగర్ వద్ద ఒకటి, డిఫెన్స్ కాలనీ వద్ద మరొకటి ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకు అనుగుణంగా టెండర్లను కూడా ఆహా్వనించింది. ఈట్ స్ట్రీట్స్ పేరుతో అందమైన ఆర్చ్తో ఆహార ప్రియులను ఆహ్వానించనున్నాయి. మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్.. వైజాగ్ వాసులకు కొత్త వంటకాల రుచులను పరిచయం చేయనున్నాయి. ఆధునిక పద్ధతిలో.. ఆధునిక పద్ధతిలో ఈట్ స్ట్రీట్స్ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు పెద్దగా ఉపయోగించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశాం. యూరోపియన్ స్టైల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. వెరైటీ వంటకాలకు ఈట్ స్ట్రీట్స్ కేంద్రంగా మారనున్నాయి. నగరవాసులు ఆహ్లాదంగా సేద తీరేందుకు ఈట్ స్ట్రీట్స్ రానున్న రోజుల్లో దోహదం చేయనున్నాయి. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ నగర వాసుల కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు కొంగొత్తగా విశాఖ నగరాన్ని పరిచయం చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ వ్యూ పాయింట్తో పాటు రోడ్లు, ఫుట్పాత్లు, సెంట్రల్ మెరిడీయన్ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బీచ్లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింతగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆహార ప్రియులకు కొంగొత్త వంటకాలతో పాటు ప్రశాంతమైన వాతావరణంతో ఈట్ స్ట్రీట్స్ను అభివృద్ధి చేస్తున్నాం. అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్ నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. టెండర్లు పూర్తి అయిన తర్వాత 6 నెలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం. – గొలగాని హరి వెంకట హరికుమారి, జీవీఎంసీ మేయర్ రూ. రూ. 6.24 కోట్లతో.. వాస్తవానికి ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో పార్క్ హోటల్కు ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాలనీ వద్ద, సాగర్నగర్లో ఒకటి ఏర్పాటు చేసేందుకు తాజాగా జీవీఎంసీ అడుగులు వేసింది. డిఫెన్స్ కాలనీ వద్ద రూ. 3.24 కోట్ల వ్యయంతో, సాగర్నగర్ వద్ద రూ.మూడు కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ స్టైయిల్లో ఈ ఈట్ స్ట్రీట్స్ను అభివృద్ధి చేయనున్నారు. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని వేళల్లో అందుబాటులో.. జీవీఎంసీ ఏర్పాటు చేయనున్న ఈట్స్ట్రీట్స్ను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. మనకు కావాల్సిన వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభించడంతో పాటు అప్పటికప్పుడు మన కళ్ల ముందే తయారుచేయడాన్ని కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. అంతేకాకుండా విశాలమైన స్థలం...ప్రశాంతంగా వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో అందుబాటు ఉండనుంది. ఇష్టమైనవి తింటూ..కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసేలా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తీర్చిదిద్దనుంది. ఈట్స్ట్రీట్స్ డిజైన్లను కూడా ఇప్పటికే జీవీఎంసీ తయారు చేసింది. మొత్తంగా విశాఖ వాసులకు త్వరలో వెరైటీ వంటకాల కోసం ఈట్ స్ట్రీట్స్ అందుబాటులోకి రానున్నాయి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల చుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..) -
పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా? నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆడడం ఎందుకు?
యూరోపియన్ క్రికెట్ గేమ్లో సీరియస్నెస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్ ఉన్నా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్ చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లెగ్సైడ్ దిశగా ఆడి సింగిల్ కంప్లీట్ చేశాడు. ఫీల్డర్ బంతి అందుకొని కీపర్కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్ పూర్తి చేసిన స్ట్రైకింగ్ బ్యాటర్ రెండో పరుగు వద్దని సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించని నాన్స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్గా భావించిన కీపర్ నేరుగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు డైరెక్ట్ త్రో వేయడం.. బ్యాటర్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్గారూ చేసేదేం లేక పెవిలియన్కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్ క్రికెట్లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్నెస్ కూడా లేదు.. ''పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్తో రెచ్చిపోయారు. 😴 😴 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ZX7kP0OECa — European Cricket (@EuropeanCricket) June 23, 2023 చదవండి: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు -
భారత్పై ఆశావహంగా విదేశీ ఇన్వెస్టర్లు
ముంబై: భారత్పై అమెరికా, యూరప్లోని విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది. చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్ ఎఫ్పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ వివరించింది. -
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) టాలీవుడ్ జంట ఎయిర్పోర్ట్లో స్పెషల్ లుక్లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) ICON star @alluarjun and #AlluSnehaReddy at Mumbai airport Bunny boy looks 😎😍#Pushpa2TheRule pic.twitter.com/YoPTySfKyx — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 7, 2023 #TFNExclusive: AA slays in Black🖤 Icon Star @alluarjun along with his wife #AlluSnehaReddy get papped at Mumbai airport!!😎#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/rkVKbbpj4A — Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023 -
మీరు ఇప్పటి వరకు చూడని విచిత్రమైన కార్లు (ఫోటోలు)
-
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్కు సైకిల్పై
ప్రేమకు అవధులు లేవు. ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎంతో మంది ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ప్రేమను దక్కించుకున్న వారు ఉన్నారు. ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. అలాంటి కోవకే చెందినదే పీకే మహానందియా, షార్లెట్ వాన్ షెడ్విన్ ప్రేమ.. వీరి ప్రేమ దేశాలు కాదు ఏకంగా ఖండాంతరాలే దాటింది. అయితే ఇది దాదాపు 50 ఏళ్ల నాటి కథ. ఇటీవల తన ప్రేమ కోసం చేసిన సాహసాలను మహానందియా ఓ మీడియాతో పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం.. 22 రోజులు వ్యాన్లో ప్రయాణించి ఢిల్లీకి చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా పేదరిక కుటుంబంలో పుట్టిన గొప్ప కళాకారుడు. పెయింటింగ్ అంటే పిచ్చి. పెయింటింగ్లో తనకంటూ మంచి పేరు సంపాదించాలనే ఆశతో ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో చేరాడు.. ఈ క్రమంలో ప్రద్యుమ్న పెయింటింగ్ గురించి యూరప్లోని స్వీడన్కు చెందిన 19 ఏళ్ల షార్లెట్ వాన్ షెడ్విన్ తెలిసింది. ఎలాగైనా అతనితో తన పెయింటింగ్ వేయించుకోవాలని నిర్ణయించుకొని ఢిల్లీకి పయనమైంది. 22 రోజులు వ్యాన్లో ప్రయాణించి చివరికి అతన్ని చేరుకుంది. అలా 1975లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి.. అదృష్టం కొద్దీ మహానందియాను కలిసి తన పోర్ట్రెయిట్ను తయారు చేస్తున్న సమయంలో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతను ఆమె అందానికి ప్రేమలో పడగా.. ఆమె అతని సింప్లిసిటీకి ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మహానందియా తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె అతని తల్లిదండ్రులను కలిసే సమయంలో మొదటిసారీ చీర కట్టుకుంది. విదేశీయురాలైన ఆమె చీరను ఎలా మేనేజ్ చేసిందో తనకిప్పటికీ ఆశ్యర్చంగానే అనిపిస్తుందని మహానందియా చెప్పాడు. చివరికి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: Palestina: 75 ఏళ్లయినా.. గుండెల్లో అవే గుర్తులు, ఇంటికి తిరిగి రాగలమా? భర్తపై నమ్మకంతో షెడ్విన్ స్వీడన్ వెళ్లే సమయం దగ్గరకు రాగా.. తనతో రావాలని ఆమె భర్తను కూడా కోరింది. అయితే మహానందియా మొదట తన చదువును పూర్తి చేయాల్సి ఉందని చెప్పాడు. తరువాత స్వీడిష్ టెక్స్టైల్ పట్టణం బోరాస్లోని తన ఇంటికి తప్పక వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. అతనిపై నమ్మకంతో ఒక్కతే ఆమె తన స్వదేశానికి పయనమైంది. తరువాత ఇద్దరు ఉత్తరాల ద్వారా సన్నిహితంగా ఉండేవారు. రోజూ 70 కిమీ ప్రయాణం ఏడాది తర్వాత తన చదువు పూర్తి కావడంతో మహానందియా స్వీడన్ వెళ్లి తన భార్య షెడ్విన్ను కలవాలనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి అసలు విషయం గుర్తొచ్చింది. విమాన టికెట్ కొనుగోలు చేయడానికి తన వద్ద తగిన డబ్బు లేదని గుర్తొచ్చింది. దీంతో తనకున్నదంతా అమ్మేసి సైకిల్ కొన్నాడు. 1977 జనవరి 22న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోజు దాదాపు 70 కిమీ ప్రయాణించాడు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి పాకిస్తాన్, అప్గనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటుకొని వెళ్లాడు. మార్గ మధ్యలో ఎన్నోసార్లు తన సైకిల్ పాడైపోయింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి తన ఒళ్లు పూనకం అయిపోయింది. అయినా అవేవి అతని సంకల్పాన్ని చెదర్చలేదు. స్వీడన్ చేరుకొని తన కళే అతన్ని ఆమె వద్దకు చేర్చిందని చెబుతుంటాడు. దారిలో కలిసిన వ్యక్తుల చిత్రాలను పెయింటింగ్ వేస్తే కొందరు డబ్బులు ఇచ్చేవారని.. మరికొందరు ఆహారం, ఆశ్రయం కల్పించారని చెప్పాడు. ఎట్టకేలకు మే 28న యూరప్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇస్తాంబుల్, వియన్నా మీదుగా, ఆపై రైలులో స్వీడన్లోని బోరస్ చేరుకొని ఆమెను కలుసుకున్నాడు. అక్కడ ఇద్దరూ అధికారికంగా స్వీడన్లో మళ్లీ పెళ్లిచేసుకున్నారు. చదవండి: Video: ఎయిర్పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు.. నేటికి అదే ప్రేమలో యూరోపియన్ సంస్కృతి గురించి తనకేం తెలియదని.. కానీ తన భార్య అడుగడుగునా మద్దతు నిలచిందని తెలిపారు. ఆమె ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. 1975లో తొలిసారి తనను చూసి ప్రేమలో పడిన రోజులానే.. నేటీకి అదే ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ కుటుంబం స్వీడన్లో నివసిస్తున్నారు. మహానందియా అక్కడే ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. చివరగా.. ప్రేమ గొప్పతనం అందరికీ తెలియదంటారు. కానీ మహానందియాకు దాని విలువ బాగా అర్థమైంది. అందుకే మనసిచ్చి మనువాడిన ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద మూడు నెలల ప్రయాణం చేశాడు. నచ్చిన చెలితో జీవితం గడుపుతున్నాడు. నేటి తరం యువతకు ప్రేమ అంటే కొత్త నిర్వచనాన్ని అందించాడు. View this post on Instagram A post shared by @mignonettetakespictures -
సెగ పుట్టిస్తున్న ఎండలు.. చిల్ అవుదాం.. పద!
సాక్షి, అమరావతి: ఎండలు సెగ పుట్టిస్తున్నాయి. ఫ్యాన్ కింద కూర్చున్నా ఉక్కపోతే. ఏసీ వేసుకుంటే కొంతసేపే చల్లదనం. పగలంతా ఇదే తీరు. సాయంత్రం సరదాగా నాలుగడుగులు బయటకు వేద్దామంటే భగ్గుమనే వేడిగాలులు... ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర వేసవి సెలవుల్ని ఏం ఎంజాయ్ చేస్తామంటూ.. సుదీర్ఘ ప్రయాణాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వేసవి ట్రిప్లను చూస్తే కరోనా మునుపటి స్థితిని అధిగమించేలా కనిపిస్తున్నాయని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ థామస్ కుక్ (ఇండియా), ఎస్ఓటీసీ ట్రావెల్ విడుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్–మే 2023’ వెల్లడించింది. పర్యాటకుల ప్రయాణాలు చాలాకాలంగా పెండింగ్లో ఉండటంతో ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు సులభంగా ప్రయాణ వీసాలు పొందే దేశాలకే మొగ్గు చూపుతున్నారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన విదేశీ వేసవి విడిది ప్రాంతంగా యూరప్ అగ్రస్థానంలో నిలుస్తోంది. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలు ప్రాధాన్య గమ్యస్థానాలుగా ఎక్కువ ట్రావెల్ బుకింగ్లు చేస్తున్నారు. సుదూర ప్రయాణాలకు సమయం వెచ్చించలేని పర్యాటకులు థాయ్లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, అబుదాబి, ఒమన్తో పాటు మాల్దీవులు, మారిషస్ వంటి ద్వీపాల్లో సేద తీరేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కొత్తగా జపాన్, దక్షిణ కొరియా పర్యటనలపై కూడా ఆసక్తి పెరిగినట్టు సర్వే నివేదిక చెబుతోంది. విచిత్రంగా అమెరికా కంటే ట్రావెల్ బుకింగ్లలో 20 శాతం అధికంగా ఆస్ట్రేలియాకు ఉంటున్నాయి. వీసాలు పొందడంలో ఇబ్బందుల ఫలితంగా అమెరికాకు ట్రావెల్ బుకింగ్లలో తగ్గుదల కనిపిస్తోంది. చల్లని కాశ్మిరానికి ఛలో! దేశీయంగా వేసవి పర్యటనలకు అనుకూలమైన గమ్యస్థానంగా కశ్మిర్కు మద్దతు లభిస్తోంది. ఆ తర్వాత హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్ధాఖ్, ఈశాన్య ప్రాంతాలు, కేరళ, అండమాన్, గోవాతో పాటు భూటాన్కు వెళ్లేందుకు లగేజీలు సర్దేస్తున్నారు. సర్వేలో మెట్రో, మినీ మెట్రో నగరాలు పుణే, చండీగఢ్, కోయంబత్తూర్, టైర్ 2, 3 సిటీలైన జైపూర్, ఇండోర్, తిరుచిరాపల్లి, మధురై, నాగ్పూర్, సూరత్, బరోడా, భువనేశ్వర్, లక్నో, మైసూర్, విశాఖపట్నం, గౌహతి, పాటా్నలో ఆన్లైన్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 40 శాతం మంది దేశీయంగా, 60 శాతం మంది విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడైంది. -
బ్రిటన్లో రాజుగారి ఏలుబడి!
మరికొన్ని గంటల్లో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జి మౌంట్బాటన్ (చార్లెస్–3) పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా ప్రపంచపటంలో ధగ దగలాడిన బ్రిటన్ నేడు తానున్న యూరప్ ఖండంలో కూడా ఒంటరి పయనం సాగించడాన్ని ఎంచుకున్న చిన్న దేశంగా మిగిలిపోయింది. ఆ దేశంలో 18వ శతాబ్దంలోనే రాచరికం నామమాత్రంగా మిగిలి సర్వాధికారాలూ పార్లమెంటుకు బదిలీ అయ్యాయి. మరో మూడు శతాబ్దాలు గడి చినా అది తన గత వైభవానికీ, అగమ్యగోచరమైన భవిష్యత్తుకూ మధ్య ఊగిసలాడుతూనే ఫ్యూడల్ అవశే షమైన సంప్రదాయాలనూ, లాంఛనాలనూ వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటంలేదని శనివారంనాటి పట్టాభిషేకం రుజువుచేయబోతోంది. ఆరు గుర్రాలు పూన్చిన రథంలో ముందే నిర్దే శించిన సెంట్రల్ లండన్ వీధులగుండా వెస్ట్ మినిస్టర్ అబీగా పిలిచే సెయింట్ పీటర్ చర్చిలో ఉదయం 11 గంటలకల్లా చార్లెస్ ప్రవేశించి ఏడువందల ఏళ్లనాటి సింహాసనాన్ని అధిష్టిస్తారు. ‘గాడ్ సేవ్ ద కింగ్ చార్లెస్’ అనే ఆశీర్వచనంలాంటి నినాదం మార్మోగుతుండగా మణులు, మాణిక్యాలు, కెంపులు, గోమేధికాలు, గరుడపచ్చలు పొదిగిన దాదాపు నాలుగు వందల ఏళ్లనాటి బంగారు కిరీటం ఆయన శిరస్సును అలంకరిస్తుంది. ఈ పట్టాభిషేక తంతులో కాలం గడిచేకొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు మొత్తంగా చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధిపత్యమే ఉండే ఆ కార్యక్రమంలో ఇప్పుడు భిన్న మతవిశ్వాసాల ఆచార్యులుంటున్నారు. కేవలం సంపన్నులకూ, దేశా ధినేతలకూ మాత్రమే ప్రవేశముండే ఆ కార్యక్రమంలో సాధారణ పౌరులకు కూడా చోటుదక్కుతోంది. దాంతోపాటే ఒకనాడు పట్టాభిషేక సందర్భంలో ఇంటింటా పండుగ వాతావరణం కనబడిన చోటే ‘ఎందుకిదంతా?’ అనే ప్రశ్నలు మొలకెత్తడం కూడా మొదలైంది. రాచ రికాన్ని వదుల్చుకుంటే తప్ప బ్రిటన్ సంపూర్ణ ఆధునికతను సంతరించుకోదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఫ్యూడల్ చిహ్నమైన రాచరికం స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే రాజ్యాధినేత ఉండటం వర్తమాన అవసరమని అటువంటివారు వాదిస్తున్నారు. ‘రాచరికంలోకి ఒక్కసారి తొంగి చూశామా.. దాన్ని కీర్తించటం అసాధ్యం’ అని బ్రిటన్ రాజ్యాంగనిపుణుడు వాల్లర్ బాజెట్ ఒకప్పుడు అననే అన్నారు. అయితే ప్రపంచంలో బ్రిటన్ రాచరికం ఏకాకి కాదు. మరో 28 దేశాల్లో కూడా ఆ వ్యవస్థలే వర్థిల్లుతున్నాయి. అందులో పూర్తి స్థాయి నియంత్రణాధికారాలుండే రాజులు మొదలుకొని సగం సగం అధికారాలతో సరిపెట్టుకొనేవారూ, పూర్తి అలంకారప్రాయంగా మిగిలిపోయినవారూ కూడా ఉన్నారు. అలాగే తిరుగులేని సంపదలతో తులతూగేవారూ, ప్రభుత్వాలు దయతో ఇచ్చే జీతభత్యా లతో సరిపుచ్చుకునే రాజులు కూడా ఉన్నారు. లాంఛనప్రాయపు హోదాయే కావొచ్చుగానీ చార్లెస్ ఒక్క బ్రిటన్కు మాత్రమే కాదు... మరో 14 దేశాలకు సైతం రాజ్యాధిపతిగా కొనసాగుతారు. ప్రపంచంలోని ఇతర దేశాల మాట అటుంచి సంపన్న దేశాల క్లబ్ అయిన జీ–7లో కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నాసిరకమైనదే. అక్కడ ప్రస్తుతం ‘జీవన వ్యయ సంక్షోభం’ రాజ్యమేలుతోంది. తడిసిమోపడయ్యే వడ్డీ రేట్లతో, భరింపశక్యంకాని ద్రవ్యోల్బణంతో, ఆకాశాన్నంటే ఇంధన ధరలతో అక్కడి జనం ఈసురోమంటున్నారు. గత ఇరవైయ్యేడేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్డీరేట్లు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఆఖరువరకూ అది కోలుకునే అవకాశం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగిత 3.9 శాతం. దాదాపు 13 లక్షలమంది పౌరులు ఉపాధి కోల్పోయారని జాతీయ గణాంకాల విభాగం గత నెలలో తెలిపింది. సగటున ప్రతి అయిదుగురు బ్రిటన్ పౌరు ల్లోనూ ఒకరు పేదరికంలో కూరుకుపోయారని గణాంకాలు కోడై కూస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చాలీచాలని ఆదాయాలతో అర్థాకలితో నెట్టుకొచ్చే కుటుంబాలూ.. దాతృత్వ సంస్థల సాయంతో, చర్చిల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న కుటుంబాలూ ఎక్కువేనని ఒక అంచనా. అందుకే కాబోలు ఈసారి పట్టాభిషేక మహోత్సవ కార్య క్రమంలో అట్టహాసాలు తగ్గించాలని నిర్ణయించారు. కార్యక్రమం నిడివి బాగా తగ్గిపోగా, అతిథుల జాబితా కూడా చిన్నబోయింది. అయితే ఈ కార్యక్రమానికయ్యే మొత్తం వ్యయం ఎంతో చెప్పటం వెంటనే సాధ్యం కాకపోయినా అది ఎలా చూసినా 12.5 కోట్ల డాలర్లకు తగ్గకపోవచ్చని మీడియా లెక్కలేస్తోంది. వర్తమాన చేదు వాస్తవాలనూ, సంక్లిష్టతలనూ పరిగణనలోకి తీసుకోకుండా భూత కాలం చూరుపట్టుకుని వేళ్లాడటం ఇంకా ఎన్నాళ్లని పలువురు ప్రశ్నించటానికి ఇలాంటి కథనాలు కారణం కావొచ్చు. నెపోలియన్తో సాగిన వరస యుద్ధాల పరంపరలో గెల్చామన్న సంబరంతో బ్రిటన్ 1821లో నాలుగో జార్జి పట్టాభిషేకాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా జరుపుకుంది. దానిపై విమర్శకులు విరుచుకుపడటంతో మరో పదేళ్లకు 1831లో అతని వారసుడు నాలుగో విలియం మాత్రం అతి నిరాడంబరంగా, క్లుప్తంగా పట్టాభిషేకం తంతు ముగించారు. మొత్తానికి ఏడుపదుల కాలం తర్వాత బ్రిటన్లో పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. రాచరికంపై దేశ పౌరుల్లో ఉండే వ్యతిరేకత కనుమరుగు కావటం, కనీసం అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం అనేవి చార్లెస్ వ్యవహారశైలిపై ఆధారపడివుంటాయి. ఆయన శనివారం ధరించబోయే కిరీటం బరువు 5 పౌండ్లు (సుమారు 2.27 కిలోలు). కానీ ‘మూడో చార్లెస్’గా ఆయనపై ఉండ బోయే బాధ్యతల బరువు అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలిగితే చరిత్రలో ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. -
యూఎస్కు భారతీయ బొమ్మలు
ప్యారిస్: భారత్లో తయారైన బొమ్మలను దిగుమతి చేసుకునేందుకు యూఎస్, యూరప్కు చెందిన దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి ఆయా దేశాల్లో విక్రయించాలని భావిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల సమాచారం. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారీ చేపట్టేందుకు వీలుగా ఇక్కడి కంపెనీలకు సాయం అందించేందుకూ ముందుకు రానున్నాయి. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ).. ఎగుమతులను పెంచడానికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యానికి కూడా సహాయం చేస్తోంది. డీపీఐఐటీ తోడ్పాటు.. బొమ్మల కొనుగోలుకై ఇటీవలే యూఎస్కు చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ ఒకటి ఇక్కడి పరిశ్రమను సంప్రదించిందని ప్లేగ్రో టాయ్స్ ప్రమోటర్, టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మను గుప్తా తెలిపారు. రూ.3,280 కోట్ల విలువైన రైడ్ ఆన్, ఔట్డోర్, మెకానికల్, ఎలక్ట్రికల్ టాయ్స్ను దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అలాగే ఇటలీ కంపెనీ సైతం ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యానికి, ఆర్డర్లు పొందేందుకు ఇక్కడి కంపెనీలకు డీపీఐఐటీ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. భారత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యం మెరుగుపరిచేందుకు విదేశీ కంపెనీలు చేయి అందించనున్నాయని తెలిపారు. విదేశీ సంస్థలతో చేతులు కలిపేందుకు 82 భారతీయ కంపెనీలు అడుగు ముందుకు వేశాయన్నారు. ఎగుమతులు ఇలా.. భారత్ నుంచి 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.1,017 కోట్ల విలువైన ఆట వస్తువులు ఎగుమతి అయ్యాయి. 2021–22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. 2013–14 ఏప్రిల్–డిసెంబర్లో ఇక్కడి నుంచి విదేశాలకు చేరిన బొమ్మల విలువ కేవలం రూ.167 కోట్లు మాత్రమే. విదేశాల నుంచి భారత్కు దిగుమతైన బొమ్మల విలువ 70 శాతం క్షీణించి 2021–22లో రూ.870 కోట్లుగా ఉంది. 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 70 శాతం ఉంది. దిగుమతులను నిరుత్సాహపర్చడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని బొమ్మల తయారీకి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది. -
పిట్టంత పిపీలికం.. హమ్మింగ్ బర్డ్ సైజులో ఉండే చీమ శిలాజం గుర్తింపు
చీమ.. ఓ అల్పజీవి. కానీ.. ఒకప్పుడు పరిమాణంలో హమ్మింగ్ బర్డ్ అంత పెద్ద చీమలు పిపీలిక సామ్రాజ్యాన్ని ఏలాయట. ఇటీవల లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్ ఏళ్ల కిందట మహా భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు తేల్చారు. చీమ జాతుల్లో ఏకంగా 30 ఏళ్లు జీవించేవి కూడా ఉండటం విశేషమే. కాగా.. చీమలు వేడి వాతావరణంలోనే జీవించడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షాకాలం, శీతాకాలంలో చలికి తట్టుకోలేక మన ఇళ్లల్లోకి చొరబడి తలదాచుకుంటాయని.. వంటింట్లోని ఆహార పదార్థాలను దోచుకుపోతాయని వెల్లడించారు. సాక్షి, అమరావతి: అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో 47 మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు అక్కడి కాలనీలను పాలించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హమ్మింగ్ బర్డ్ పరిమాణంలో ఉండే రాణి చీమ శిలాజాన్ని 2011లో కనుగొన్నారు. రెండు అంగుళాలకు పైగా సైజులో ఉన్న ఈ శిలాజాన్ని డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ సైన్సెస్లో భద్రపరిచారు. అంతకు ముందు టైటానోమైర్మా జాతికి (2 అంగుళాల పొడవు, 16 సెంటీమీటర్ల రెక్కలు) చెందిన చీమ శిలాజాన్ని జర్మనీలో గుర్తించారు. చీమలు చల్లటి రక్తం (కోల్డ్ బ్లడెడ్) కలిగిన జాతికి చెందినవి. వాటి శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని సూర్యరశి్మపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికే ఇష్టపడతాయి. గ్లోబల్ వారి్మంగ్ చీమ జాతిని భయపెడుతున్నా.. కొంచెం తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలుతున్నాయి. అందుకే శీతాకాలంలో (డిసెంబర్–జనవరి మధ్య) బయట చీమలు కనిపించవు. ఆహార పదార్థాలు ఉండే ఇళ్లలోకి చొరబడి జీవనం సాగిస్తాయి. డైనోసార్లు అంతరించినా.. ఇవి బతికే ఉన్నాయ్ జీవుల్లో అత్యంత సంపన్నమైన (సోషల్ ఇంజనీరింగ్), శక్తివంతమైన సమూహాలలో చీమలకు ప్రత్యేక స్థానం ఉంది. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. చీమలకు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కిందట మయన్మార్లో 99 మిలియన్ సంవత్సరాల క్రితం ‘హెల్ యాంట్’ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్బర్గ్లోని జూలియస్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భూమిపై 20 క్వాడ్రిలియన్ (20 వేల ట్రిలియన్) చీమలు ఉన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్లో ప్రచురించింది. వీటి సంఖ్య గతంలో కంటే రెండు నుంచి 20 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 2.5 మిలియన్ చీమల జనాభా ఉండటం గమనార్హం. వీటి బరువు 12 మిలియన్ టన్నులు ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు (చీమల బయోమాస్ 12 మిలియన్లు) ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల బయోమాస్లో దాదాపు 20 శాతం. బయోమాస్ అనేది జీవుల్లోని కర్బనాల మొత్తం బరువుగా కొలుస్తారు. చీమలు మొక్కల విత్తనాల పంపిణీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ సంచార ప్రాంతాలతో పోలిస్తే అడవుల్లో, ఆశ్చర్యకరంగా శుష్క ప్రాంతాల్లో చీమలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ల జీవన కాలం చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్ల్యాండ్, గ్రీన్ల్యాండ్ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారి్మక చీమల జీవిత కాలం మూడేళ్లలోపు (కొన్ని కారి్మక చీమలు స్వల్పకాలమే జీవిస్తాయి) ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణీ చీమ కాలనీ స్థాపకురాలు. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అమెరికాలోని ఇడాహోలోని తన సహజ నిర్మాణంలో ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు నివసించింది. క్వీన్ బ్లాక్ గార్డెన్ చీమలు ల్యాబ్ సెట్టింగ్లలో 28 సంవత్సరాల వరకు జీవించినట్టు గుర్తించారు. మారికోపా హార్వెస్టర్ చీమకు 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి (ట్రోఫాలాక్సిస్ ప్రక్రియ) ఉపయోగిస్తాయి. ఏడాదిలో 50 టన్నుల మట్టి తరలింపు చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమల జట్టు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. శరీరంలోని రంధ్రాల వ్యవస్థను (స్పిరకిల్స్) శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు. ఇదే అతిపెద్ద చీమల కాలనీ ఐరోపా, జపాన్, అమెరికా అంతటా అతిపెద్ద చీమల కాలనీ వ్యాపించింది. తొలుత వీటిని మూడు ప్రత్యేక కాలనీలుగా భావించారు. ఇక్కడ అర్జెంటీనా చీమ జాతి ఒక్కటే ఉండటంతో మనుగడ కోసం ఒకదానితో మరొకటి పోరాడుకోవడానికి నిరాకరించడంతో కాలనీ చాలా పెద్దదిగా పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ కాలనీ 3,750 మైళ్ల మేర విస్తరించి ఉందని.. అందులో 370 మిలియన్ చీమలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్కు విజ్ఞప్తి చేశారు. -
పాపం తగలరాని చోట తగిలి..
క్రికెట్లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం అనుకుంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవెన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశారు.. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్స్ట్రైక్ ఎండ్వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవెన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది. Timeline cleanser. Sound on for maximum dopamine injection. pic.twitter.com/Vk0bw7B71U — Georgie Parker (@georgieparker) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్లో తొలి హ్యాట్రిక్ ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు -
బ్యాంక్.. క్రాష్
ఉన్నట్టుండి యూఎస్ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)ను మూసివేయడంతో మరోసారి ప్రపంచ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో యూరప్, ఆసియాసహా దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించగా.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,238 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 259 పాయింట్లు దిగజారి 17,154 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1,040 పాయింట్లు పడిపోయి 58,095 దిగువకు చేరింది. నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 17,113ను తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి యూఎస్లో తిరిగి ఒక పెద్ద బ్యాంకు దివాలా స్థితికి చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సిల్వర్గేట్ క్యాపిటల్ కార్ప్ ఇప్పటికే మూతపడటానికితోడు సిగ్నేచర్ బ్యాంక్లో సంక్షోభం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. కాగా.. తొలుత మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు ఎగసి 59,511కు చేరింది. తదుపరి అమ్మకాలతో పట్టుతప్పి ఆ స్థాయి నుంచి మధ్యాహ్నానికల్లా 1,416 పాయింట్లు జారింది. మార్కెట్ పతనం నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 4.43 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. రూ. 2,58,56,296 కోట్లకు పరిమితమైంది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. బ్యాంకింగ్, మీడియా, ఆటో 2.5 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ గ్యాస్ 2–1 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్లో కేవలం టెక్ మహీంద్రా(7%) జంప్చేయగా.. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ సైతం నిలదొక్కుకున్నాయి. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 7% కుప్పకూలింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఐషర్, యాక్సిస్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరోమోటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ, టైటాన్, ఆర్ఐఎల్ 3–1.5% మధ్య క్షీణించాయి. యస్ బ్యాంక్ డౌన్ మూడేళ్ల లాకిన్ గడువు ముగియడంతో సోమవారం యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. తొలుత 13% క్షీణించి రూ.14.4కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ.15.65 వద్ద క్లోజైంది. విదేశీ బ్యాంకులు వెలవెల.. ఎస్వీబీ వైఫల్యం నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్లో పలు బ్యాంకింగ్ స్టాక్స్ కుప్పకూలాయి. రీజనల్ బ్యాంకు స్టాక్స్లో వెస్టర్న్ అలయెన్స్ 75 శాతం, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 65 శాతం, పాక్వెస్ట్ బ్యాంక్కార్ప్ 46 శాతం చొప్పున పడిపోయాయి. ఇక యూరోపియన్, అమెరికన్ దిగ్గజాలలో క్రెడిట్ స్వీస్, డాయిష్ బ్యాంక్, యూబీఎస్, బార్క్లేస్, ఐఎన్జీ, లాయిడ్స్, హెచ్ఎస్బీసీ 8–3 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ఫార్గో, సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్మన్ శాక్స్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. పసిడి జోరు బ్యాంకింగ్ వ్యవస్థపై భయాలతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ పెరిగింది. దీంతో కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2.4 శాతంపైగా(44 డాలర్లు) ఎగసి 1,911 డాలర్లను అధిగమించింది. దేశీయంగా(న్యూఢిల్లీ) 10 గ్రాముల ధర రూ. 970 బలపడి రూ. 56,550ను తాకింది. వెండి సైతం కేజీ రూ. 1,600 పుంజుకుని రూ. 63,820కు చేరింది. అయితే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ క్షీణించాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి, రెండేళ్ల బాండ్ల ఈల్డ్ 3.7 శాతం నుంచి 3.46 శాతానికి నీరసించింది. ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలివ్వగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్లలో అత్యవసర కోతలు అవసరమంటూ కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. -
కొత్త పోకడ...రైలెక్కి రయ్.. రయ్
ఇంటి నుంచి కాలు బయట పెడితే విమానాలు ఎక్కడమే వారికి తెలుసు. రయ్యిమంటూ గాల్లో తేలిపోతూ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. హాయిగా రాత్రిపూట రైలెక్కి బెర్త్ వాల్చితే ఉదయానికల్లా ఊరు చేరుకోవడంలో ఎంత సదుపాయముందో యూరప్ వాసులు గ్రహించారు. చుకు బుకు చుకు బుకు రైలును, అదిరిపోయే దాని స్టైలును, ఆ ప్రయాణంలోని మజాను ఆస్వాదిస్తున్నారు. విమాన ప్రయాణాలతో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి యూరప్లో పలు దేశాలు కూడా రైలు ప్రయాణాలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో వారు కూడా తక్కువ దూరాలకు విమానానికి బదులుగా రైలు వైపే మొగ్గు చూపిస్తున్నారు... యూరప్లో రైలు ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎమ్ వంటివి రైలు రవాణా నెట్వర్క్లో భాగస్వాములవుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా 2021ని ఇయర్ ఆఫ్ యూరోపియన్ రైల్గా ప్రకటించి రైలు ప్రయాణికులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం, రైలు టికెట్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలతో ఇప్పుడు చాలామంది రైలు జర్నీయే సో బెటరని అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలకు రైళ్లల్లో వెళ్లడానికి యూరప్ పౌరుల్లో 62% మంది ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. 1990 తర్వాత మళ్లీ ఇప్పుడు రాత్రిళ్లు ప్రయాణించే స్లీపర్ రైళ్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు... యూరప్లో విమాన ప్రయాణాల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల 2013–2019 మధ్య ఏడాదికి సగటున 5% చొప్పున నమోదైంది! ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కేవలం స్వల్ప దూరాల విమానాలను మాత్రమే నిరుత్సాహపరుస్తూ అధిక దూరం ప్రయాణించే విమానాలకు ప్రోత్సాహకాలు కొనసాగించడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వచ్చే పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పెదవి విరుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ వాటి కాలుష్యమే అధికం ప్రపంచవ్యాప్తంగా అధిక దూరాలు ప్రయాణించే విమానాల నుంచి వెలువడే కాలుష్యమే ఎక్కువ! జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జియోగ్రఫీ తాజా నివేదిక ప్రకారం 500 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాల యూరోపియన్ యూనియన్లో 27.9 % కాగా వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 5.9%. 4 వేల కి.మీ. కంటే అధిక దూరం వెళ్లే విమానాలు కేవలం 6.2% మాత్రమే. కానీ వాటినుంచి వెలువడే కాలుష్యం ఏకంగా 47 శాతం! అలాంటప్పుడు కేవలం తక్కువ దూరాలు ప్రయాణించే విమానాల రద్దుతో ఒరిగే ప్రయోజనాలేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. రైల్వేలకున్న అడ్డంకులివే..! కొన్ని దశాబ్దాలుగా విమాన ప్రయాణానికే అలవాటు పడడంతో చాలా మార్గాల్లో రైలు సదుపాయం లేదు. కొత్త ట్రాక్లు నిర్మించడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం వంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలు ఎక్కువ ఖరీదు. అధిక చార్జీలు కూడా రైలు ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యూరప్ రైలు ఆపరేటర్లకు లాభార్జనే ధ్యేయం. మార్కెట్ షేర్ కంటే అధిక లాభాలు ప్రజల నుంచి గుంజాలని చూస్తుంటాయి. ఇవన్నీ రైల్వేల విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫ్లైట్ షేమ్ ఉద్యమంతో దశ మారిన రైల్వే యూరప్లో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపించడానికి ఫ్లైట్ షేమ్ ఉద్యమం ప్రధాన కారణం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వీడన్కు చెందిన టీనేజ్ ఉద్యమకారిణి గ్రేటా థెన్బర్గ్ 2019లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్లో జరిగిన ఐక్య రాజ్యసమితి పర్యావరణ సదస్సుకి హాజరవడానికి ఆమె విమాన ప్రయాణం చెయ్యకుండా అట్లాంటిక్ సముద్రంలో నౌకలో కొద్ది రోజుల పాటు ప్రయాణించి మరీ అమెరికా చేరుకున్నారు. విమానం నడపడానికి భారీగా చమురు ఖర్చు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని అందుకే విమానానికి బదులుగా పడవలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని గ్రేటా థెన్బర్గ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ప్రభావంతో యూరప్ వాసులు విమానాలకి బదులుగా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. యూరప్ దేశాలు తీసుకుంటున్న చర్యలివే... ► జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలన్నీ రైలు ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► తక్కువ దూరం ఉండే మార్గాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. ఆయా మార్గాల్లో కొత్త రైళ్లను నడపడం ప్రారంభించింది. ► రెండున్నర గంటల కంటే తక్కువ సమయం పట్టే రెండు ఊళ్ల మధ్య రైళ్లలోనే ప్రయాణం చేయడం తప్పనిసరి చేసింది. ► దీని వల్ల దేశీయంగా విమానం ద్వారా వెలువడే గ్రీన్హౌస్ వాయువుల్ని 3% తగ్గించగలిగింది. ► 2020లో ఆస్ట్రియా ప్రభుత్వం రైలులో ప్రయాణిస్తే మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టే అన్ని మార్గాల్లోనూ విమానాలను రద్దు చేసింది. ► ఆస్ట్రియాలో 350 కి.మీ. కంటే తక్కువ దూరం విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి 30 యూరోల పన్ను వసూలు చేస్తోంది. ► మరోవైపు 2050 నాటికి 2.5 గంటల కంటే తక్కువ సమయాల్లో వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడానికి స్పెయిన్ సన్నాహాలు చేస్తోంది. -
వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్
సండే.. దేశంలో చాలామంది ఉద్యోగుల సేదతీర్చే రోజు.. వారమంతా పనిలో పడ్డ కష్టం నుంచి వారికి విశ్రాంతినిచ్చే ఒకే ఒక్క సెలవు రోజు.. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ కంపెనీలు, ఐటీ, అనుబంధ రంగాల వంటి వాటిలో పనిచేసే ఉద్యోగులైతే వారానికి రెండు రోజులపాటు సెలవులు పొందుతుంటారని మనకు తెలుసు. మరి వారానికి మూడు రోజులపాటు సెలవులు అందుకుంటున్న ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా?! అదేంటి.. మన దేశంలో ఎవరిస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇంకా మన దేశంలో అమల్లోకి రాలేదులేండి... ప్రస్తుతానికి యూరప్లోని కొన్ని దేశాలు ఈ ట్రెండ్ను సెట్ చేసే పనిలో ఉన్నాయి.. అదేంటో తెలుసుకుందామా? సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్డే వీక్ విధానాన్ని పరిశీలించాయి. ఇరుపక్షాలకూ లాభమే.. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. భారత్లో నిపుణుల స్పందనేంటి? మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే భారత్లో ఈ విధానం అమలుపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమిస్తూ పక్కా ప్రణాళికలతో చేపడితేనే మన దేశంలో సత్ఫలితాలు సాధ్యమని వాల్యూ మ్యాట్రిక్స్.ఏఈ వ్యవస్థాపకుడు ఆదిత్య మాలిక్ పేర్కొన్నారు. ఈ విధానానికి తగ్గట్లుగా నియమ, నిబంధనలు ఇతర అంశాలను మార్చాల్సి ఉంటుందన్నారు. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని డే కొలాబ్ కో–ఫౌండర్, సీఈవో రాజేశ్వరీసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ఈ పని పద్ధతికి సరిపోయే పరిశ్రమ ఎంపికతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించకుండా ఇందుకు అర్హమయ్యే సంస్థలనే ఎంపిక చేయాలని కర్మ వీ ఫౌండర్, సీఈవో ఉజ్జల్ డే సూచించారు. ప్రతి పరిశ్రమ, సంస్థకు 4 రోజుల పని విధానం సరిగ్గా వర్తించకపోవచ్చని, అయితే కోవిడ్ వ్యాప్తి తర్వాత పనిప్రదేశాలు మారిపోతున్న నేపథ్యంలో టెక్నాలజీ సహకారంతో నూతన ప్రక్రియలను చేపట్టడంలో నష్టమేమీ లేదని ఐమోచా సీఈవో అమిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్లో ఫోర్ డే వర్క్ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్ కాస్ట్లు, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగవుతుందని జెన్లీప్ ఫౌండర్ సచిన్ తెలిపారు. ఫోర్ డే వీక్ ఆహ్వానించదగ్గదే.. మన దేశంలో ఈ విధానం పనిచేయదనుకోవడానికి లేదు. గత పదేళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే మనం ‘మెంటల్ వెల్నెస్’కు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 5–10 ఏళ్లలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్త పనివిధానంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైవ్ డే వీక్ బదులు రోజుకు మరో గంటన్నర, రెండు పనిగంటలు పెంచి ఫోర్ డే వీక్ చేస్తే ఉద్యోగులకు మూడు రోజులు వెసులుబాటుగా ఉంటుంది. ఈ దిశగా యాజమాన్యాలు ఆలోచించాలి. – సాక్షితో డాక్టర్ బి.అపర్ణారెడ్డి, హెచ్.ఆర్. నిపుణురాలు ఈ విధానం ఎలా అమల్లోకి...? దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్ డే వీక్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి. మారుతున్న కాలం, అభిరుచులను బట్టి ఐర్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించాయి. ఈ పని పద్ధతిపై న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్ డే వర్క్’సిస్టమ్ను 2018లోనే టెక్ కంపెనీ అమెజాన్ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్లో మైక్రోసాఫ్ట్ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్ న్యూజిలాండ్లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ స్టార్టప్ ‘త్రీడే వీక్’! దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది. -
ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు
ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రమాదంలో 59 మంది గల్లంతవ్వగా, వారిలో 24 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సుమారు 81 మంది ప్రాణాలతో బయటపడగా, ఇంటెన్సివ్ కేర్లో చికిత్స తీసుకుంటున్న వ్యక్తితో సహా 20 మంది ఆస్పత్రి పాలైనట్లు ఇటాలియన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 58 మృతదేహాలను వెలికితీశారని, 61 మంది ప్రాణాలను రక్షించినట్లు వెల్లడించారు. టర్కీ నుంచి బయలుదేరిన ఈ చెక్క పడవలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు డజన్ల మందికి పైగా పాకిస్తానీయులు మునిగిపోయారన్న నివేదికలు త్రీవ ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాస్తవాలను నిర్థారించాలని విదేశాంగ కార్యాలయాన్ని ఆదేశించారు. కాగా, మానవ స్మగ్లర్లు యూరప్లోకి వలసదారులను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించే మార్గాలలో టర్కీ ఒకటి. (చదవండి: ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక ) -
IndiGo:ఎయిర్బస్ నుంచి 500 విమానాలు ఆర్డర్
సాక్షి,ముంబై: ఎయిరిండియా మెగా డీల్ తరువాత దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వేగం పెంచింది. ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్లైన్స్తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం యూరోపియన్ దిగ్గజం ఎయిర్బస్ నుండి ఇప్పటికే ఆర్డర్ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్లైన్ తెలిపింది. ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియానుంచి ఇస్తాంబుల్ ,ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని చెప్పారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం ఇది మునుపెన్నడూ లేని విధంగా యూరప్లోకి చొచ్చుకుపోనున్నట్టు మల్హోత్రా అన్నారు. భారతదేశం లోపల లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించే ప్రయాణికులకు భారీ అవకాశం ఉంది. ప్రస్తుతం పాస్పోర్ట్ ఉన్నవారు దాదాపు 7.3 శాతం అంటే 100 మిలియన్ల కంటే తక్కువ మంది ఉన్నారు. భారతీయ ప్రజలు పాస్పోర్ట్ను పొందుతున్నందున వారు చేయాలనుకుంటున్న మొదటి పని విదేశాలకు విమానంలో ప్రయాణించడమే. ఈ నేపథ్యంలోవారి ఆకాంక్షల్ని తీర్చేందుకు సరియైన సమయమని భావిస్తున్నామన్నారు. -
ఫోర్డ్లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా జర్మనీలో 2,300 మందిని, యూకేలో 200 మందిని తొలగిస్తున్నట్లు ఫోర్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోర్డ్ భవిష్యత్ ప్రణాళికల్ని వివరించింది. 2035 నాటికల్లా యూరప్ అంతటా ఈవీ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొనుగోలు దారులు ఈవీ కార్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల అవసరం తక్కువ ఉంటుందని భావిస్తుంది. యూరప్లో 3,400 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా.. 2025 నాటికి వారిలో 2,800 మంది ఇంజనీర్లకు పింక్ స్లిప్లు జారీ చేయనుంది. ఇక మిగిలిన 1000 మందిని అడ్మినిస్ట్రేటీవ్ విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది అంత్యత కఠినమైన నిర్ణయం. మా టీం సభ్యుల మధ్య ఈ తొలగింపులతో అనిశ్చితి నెలకొంది. తొలగించిన ఉద్యోగులకు మా మద్దతు ఉంటుందని యూరప్ ఫోర్డ్ ఈ మోడల్ జనరల్ మేనేజర్ మార్టిన్ సుందర్ అన్నారు. -
వయసు 84.. చలో యూరప్
మహిళ తన కలలను సాకారం చేసుకోగలిగేది కుటుంబ అవసరాలన్నీ పూర్తయిన తర్వాతే. అంటే అన్ని బాధ్యతలు తీరాక అప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే అది ఆమె అదృష్టంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోయంబత్తూర్ వాసి 84 ఏళ్ల లలితాంబాల్ భారతదేశం బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆరు దశాబ్దాల తన కలను నెరవేర్చుకుంటోంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ రిటైర్డ్ టీచర్ అధిగమిస్తున్న విధానం చాలా ఆసక్తిదాయకంగానూ, ఎంతోమంది అనుసరించదగినదిగానూ ఉంటుంది. 60వ దశకంలో లలితాంబాల్ జాగ్రఫీ, హిస్టరీ టీచర్గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమె ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనేవారట. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక విదేశీ గడ్డపై అడుగుపెట్టింది. పాస్పోర్ట్ వచ్చిన వేళ ‘‘చిన్నవయసులోనే పెళ్లి అవడం, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలకేప్రా ధాన్యం ఇస్తూ వచ్చాను. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆర్థిక కష్టాలు, ఇతరప్రా ధాన్యాలతో కుటుంబ భవి ష్యత్తు వైపే ఉండటానికి నిర్ణయించు కున్నాను. నా సమయమంతా అందుకే కేటాయించాను. అయితే, నా కలలు మాత్రం ఎప్పుడూ నన్ను వీడిపోలేదు. పుస్తకాల్లో చదివిన విషయాలు, విద్యార్థులకు బోధించే సమయంలోనూ ‘ఎప్పుడైనా బయట ప్రపంచం వైపుగా ప్రయాణం చేయగలనా..’ అని అనుకునేదాన్ని. కానీ, ప్రయాణం మాట అటుంచితే కనీసం పాస్పోర్ట్ కూడా తీసుకోలేకపోయాను. రెండేళ్ల క్రితం నా కూతురు మేఖల పాస్పోర్ట్కు అప్లై చేయమని చెప్పింది. ప్రయత్నించాను. 83 ఏళ్ల వయసులో నా చేతుల్లోకి పాస్పోర్ట్ వచ్చింది. నాలుగేళ్ల క్రితం.. నెదర్లాండ్స్లో నా మనవరాలు స్థిరపడింది. తన పొదుపు మొత్తంతో నా కలను నిజం చేయడానికి తను బాధ్యత తీసుకుంది. నా దగ్గర కూడా కొంత పొదుపు మొత్తాలున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా నా భర్త మరణించడంతో అన్నీ ఆగిపోయాయి. యూరప్ అంతా... ప్రస్తుతం ఉన్న వయసు, ఆరోగ్యస్థితి కారణంగా విదేశాలకు వెళ్లగలనా, కుటుంబంలో మిగతా అందరికీ ఆందోళనగా మారుతుందా అని మొదట్లో సంకోచించాను. కానీ, పిల్లలు ఇచ్చిన ధైర్యంతో ఎట్టకేలకు ఆమ్స్టర్డామ్లో దిగాను. మా అమ్మాయితో కలిసి మూడు నెలల పాటు యూరప్ అంతా ప్రయాణించాను. భౌగోళికం, చరిత్రలో విద్యార్థులకు బోధించిన విషయాలు కళ్లారా చూడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందులో ఒక ఉదాహరణ.. రిజ్క్ మ్యూజియంలోని అతి పెద్ద వాటర్లూ యుద్ధం పెయింటింగ్ చూసి ఊపిరి పీల్చుకున్నాను. ఊహల్లోకంటే వాస్తవికంగా చూసినప్పుడు ఆ పెయింటింగ్ మరింత అద్భుతంగా అనిపించింది. ఈతరాణిగా.. విమానాల్లో తిరగడం, నీటిపై లాంచీలో విహారం ఎన్నో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతితో కలిసి ప్రజలు సాగిస్తున్న జీవితాలను చూశాను. ఒక ట్రిప్ నుండి మరొక ట్రిప్కు వెళ్లడంలో ఎన్నో భయాలు దూరమయ్యాయి. నా చిన్నతనం కేరళలో గడిచింది. మేమున్నప్రా ంతంలో ‘ఈతరాణి’ అనే పేరుండేది నాకు. కానీ, ఆ తర్వాత జీవనంలో అదీ మర్చిపోయాను. 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈత కొడుతున్నాను. ఒకప్పుడు స్వేచ్ఛగా ఈదుతూ భవిష్యత్తు గురించి కొంచెం ఎక్కువ కలలు కనే అదే చిన్న అమ్మాయిగా ఇప్పుడు మారిపోయాను. లొంగిపోవద్దు.. నాకు స్వతంత్రంగా ఉండే మహిళలంటే చాలా గౌరవం. వారి శక్తి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలోనే ఎన్నో పోరాటాలు, గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు లేదా వ్యక్తులకు ఎప్పుడూ వంగి, ఆధిపత్యానికి లొంగిపోవద్దు. మీ మూలాలను అస్సలు మరచిపోవద్దు. ఆర్థిక స్వాతంత్య్రం ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో సొంత నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఇదే విషయం చెబుతూ నా ఇద్దరు పిల్లలను, ముగ్గురు మనవళ్లను పెంచాను. ఇప్పుడు వారి సాయంతో నా దశాబ్దాల కలను నెర వేర్చుకుంటున్నాను’’ అని చెబుతుంది లలితాంబాల్. 84 ఏళ్ల వయసులో మహిళలు విస్తృతంగా ప్రయాణించడం చాలా అరుదు. కానీ, లలితాంబాల్ జీవన ప్రయా ణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
దగ్గర్నుంచి కొట్టడంలోనూ ఇంత బద్దకమా!
యూరోపియన్ క్రికెట్ అంటేనే ఫన్నీకి పెట్టింది పేరు. అక్కడ ఆడే పిచ్లు చాలా చిన్నగా ఉంటాయి. క్లబ్ క్రికెట్కు మారుపేరుగా నిలిచే యూరోపియన్ లీగ్లో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా బౌలర్.. రనౌట్ చాన్స్ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో నేరుగా వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడం బ్యాటర్కు కలిసివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్టా లీగ్లో బుగిబ్బా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. బ్లాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేశాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంతలో కీపర్ బంతిని విబోర్కు విసిరాడు. బంతిని సక్రమంగానే అందుకున్న అతను వికెట్లకు గిరాటేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి మిస్ అయిదంటే పర్వాలేదు.. కానీ ఒక అడుగు దూరం నుంచి కూడా రనౌట్ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపించింది. Power ✅ Accuracy ❌ Missed from point-blank range😱 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether #CricketinMalta pic.twitter.com/xTORBNPQx6 — European Cricket (@EuropeanCricket) February 6, 2023 చదవండి: ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం -
'దరిద్రం నెత్తిన ఉందంటారు'.. అది ఇదేనేమో?
రనౌట్లు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్మెన్ గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అలాంటి రనౌట్స్ మనకు నవ్వు తెప్పించినప్పటికి బ్యాటర్కు మాత్రం చిర్రెత్తిస్తాయి. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్లో భాగంగా ఒక ఫన్నీ రనౌట్ చోటుచేసుకుంది. ఫ్యాన్కోడ్ ఈసీఎస్ మాల్టా గేమ్లో భాగంగా ఓవర్సీస్ క్రికెట్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఓవర్సీస్ బ్యాటర్ హెన్రిచ్ గెరిక్ బౌన్స్ అయిన బంతిని ఆఫ్సైడ్ దిశగా ఆడాడు. అయితే బౌలర్ బంతిని అందుకునే ప్రయత్నంలో మిస్జడ్జ్ అయ్యాడు. దీంతో బంతి అతని నెత్తికి తాకి దిశను మార్చుకుంది. ఇంతలో పరుగు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా వికెట్లవైపు విసిరాడు. అంతే 20 బంతుల్లో 44 పరుగులతో దాటిగా ఆడుతున్న గ్రీక్ కథ అక్కడితో ముగిసింది. '' దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.. అయితే ఇక్కడ దరిద్రం బ్యాటర్ నెత్తిలో కాకుండా బౌలర్ నెత్తిపై ఉండడం అది బ్యాటర్కు శాపంగా మారిదంటూ..'' కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఓవర్సీస్ క్రికెట్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 104 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన స్వికీ యునైటెడ్ నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Sometimes you gotta use your head to get a wicket🤭😝 #EuropeanCricket #EuropeanCricketSeries #CricketinMalta pic.twitter.com/fpqDXrsVY1 — European Cricket (@EuropeanCricket) December 24, 2022 చదవండి: చిన్న టార్గెట్కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా? -
విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను గొడుగు మొనలతో పొడిచి..
మా చిన్నతనంలో చెంచులో.. మరెవరో.. నల్లమల అడవుల నుంచి ఎలుగుబంట్ల ముక్కుకు తాడు కట్టి తీసుకుని వచ్చేవారు. ఆ జీవి చుట్టూ జనం మూగేవారు. దాని వీపుపై తమ పిల్లలను సవారీ చేయించేవారు. దానిని తడిమేవారు, తట్టేవారు. అల్లరి మనుషులు కొందరు కర్ర పుల్లతో పొడిచేవారు, మరి కొంతమంది ఆ ఎలుగ్గొడ్డు వెంట్రుకలను పీక్కునేవారు. ఆ వెంట్రుకలను దారంగా పేనుకుని కాలి బ్రోటన వేలుకు కట్టుకుంటే శుభమని భావించేవారు. లేదా దాని యజమానికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అతనితోనే దాని వెంట్రుకలను పీకించే వారు. Duniyaa banaane wale, kyaa tere man me samaai ? Kaaheko duniyaa banaai? అని ఆడుగుతారు కవి శైలేంద్ర ఒక పాటలో. ఈ పాట తెలిసిన వాళ్ళే కాదు, తెలీని వాళ్ళు కూడా భగవంతుడిని ఈ మాట అడిగే ఉంటారు తమ తమ మూగభాషలో. ఒక విధివంచితురాలి యథార్థ గాధ 20 ఏళ్ల సారా బార్ట్మాన్ 1810లో బతుకు తెరువు కోసమన్న తలంపుతో కేప్టౌన్ నుంచి లండన్కు బయలుదేరడానికి పడవ ఎక్కినప్పుడు, ఆమె ఇక తన ఇంటిని మళ్లీ చూడదని ఆమెకు తెలియదు. అక్కడి గాలిని, అక్కడి గడ్డిని, అక్కడి సూర్యుడి వెలుతురును ఇక తన జీవితకాలంలో మరెప్పుడు తాకలేదని ఆవిడకు తెలీదు. మా ప్రాంతాల ఎలుగుబంటి కన్నా అన్యాయమైన జీవితం ఆవిడకు సంప్రాప్తించినపుడు ఆవిడ పదే పదే అదే ప్రశ్న భగవంతుడిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. మా ఊరి ఎలుగు బంటిని నేను బోనులో చూడలేదు. కానీ మనిషి పుట్టుక పుట్టిన సారా బార్ట్మన్ని బోనులో నుండి బయటకు లాగేవారు. ధృఢమైన ఎలుగు శరీరాన్ని జనం పుల్లలతో తాకేవారు. సారా శరీరాన్ని, ఆవిడ వంటిని, ఆవిడ శరీర భాగాలను ఆడా మగ, పిల్లా జెల్లా, ముసలీ ముతక ప్రేక్షకులు అంతా తాకేవారు, గొడుగు మొనలతో పొడిచి పొడిచి పులకించి పోయేవారు. ఎలుగుబంటి వెంట్రుకలతో తమ ధైర్య సాహాసాలని పెంచుకోవడానికి చూశారు. సారా బార్ట్మన్ శరీరాంగాలను చూసుకుంటూ లండన్ సభ్య సమాజం, ఇంగ్లీష్ నాగరిక ప్రపంచం ప్రేరేపణలో మునిగి తేలారు. అచ్చు ఎలుగుబంటి మీద స్వారీ చేసినట్లు నల్ల పిల్ల, అఫ్రికా అమ్మాయి సారాబార్ట్మన్ మీద ఊరేగింది మానవజాతి. దునియా బనానే వాలే, క్యా తేరే మన్ మే సమాయి? కాహికో దునియా బనాయి తూనే, కాహికో దునియా బనాయి? మనుష్యులు కాదు.. రాక్షసులు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో మానవ ఉన్మాద హింసతో మరణించింది సారా బార్ట్మన్. మరణించినా ఆమె శరీరాన్ని విడిచిపెట్టలేదు జాత్యహంకారం. 1815 నుండి ఆమె మెదడు, ఆమె తాలూకు శరీర తోలు తిత్తి బొమ్మ , ఆమె శరీర భాగాలను 1974 వరకు పారిస్ మ్యూజియంలో ప్రదర్శనలో పెట్టారు. సారా బార్ట్మన్ జీవితాన్ని 2010 బ్లాక్ వీనస్ అనే సినిమాగా తీశారు. సున్నిత మనస్కులు, మానవ జాతి మీద ప్రేమ, గౌరవం, ఔన్నత్యం కలవారు ఎవరూ ఈ సినిమా భరించలేరు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. 'మానవ జూ'ల ఏర్పాటులో భాగంగా యూరోపియన్ సమాజం సారా బార్ట్మన్ పట్ల వ్యవహరించిన తీరు అమానుషం. 1789లో జన్మించిన ఆమెను యూరప్లో దేశాల్లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించేవాళ్లు. 1815లో ఆమె చనిపోయారు. అయినప్పటికీ సారా అస్తిపంజరం, మెదడు సహా లైంగిక అవయవాలను పారిస్లోని ఓ మ్యూజియంలో 1974 వరకూ ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 2002లో సారా అవశేషాలను తిరిగి సౌతాఫ్రికాకు అప్పగించినట్లు కథనాలు ఉన్నాయి. చదవండి: Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి.. -
యూకే, యూరోప్ లలో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవాలు..
-
యూకే, యూరప్ దేశాలలో ముగిసిన దేవదేవుడి కల్యాణోత్సవాలు
తాడేపల్లి: యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్-ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ -నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ - ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్-స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్, 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ఈ 11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ అండ్ కామర్స్) బెల్జియం భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. ఇక పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకొస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మేడపాటి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. -
వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్
సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర వెళ్తున్నటు ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఈ యూరోపియన్ ఆర్బిటర్ ద్వారా ఈ సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అవి సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది. దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12న సోలార్ ఆర్బిటర్ సూర్యుని వైపు ప్రయాణిస్తున్నందున ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు. అదీగాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. సోలార్ ఆర్బిటర్ అనేది ఫిబ్రవరి 2020లో ప్రారంభమైన అమెరికా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్సేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు. Spot the solar snake slithering across the #Sun! 🐍 This ‘tube’ of cooler atmospheric gases snaking its way through the Sun’s magnetic field was captured by @esasolarobiter’s @EuiTelescope on 5 September, ahead of a large eruption 💥 📹 https://t.co/FJgXYq1vwp #ExploreFarther pic.twitter.com/02uIJMMCBH — ESA Science (@esascience) November 14, 2022 (చదవండి: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు) -
‘ఒక్కో బిజినెస్ షట్డౌన్’..అనుకున్నది సాధిస్తున్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా క్యాబ్స్ ప్రయాణంలో కస్టమర్లకు అందించే ఓలా ప్లే సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఓలా 2016లో క్యాబ్లో ప్రయాణించే కస్టమర్ల కోసం క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే టాటా ప్లే సర్వీసుల్ని ప్రారంభించింది. ప్రయాణంలో ప్యాసింజర్లు వారికి నచ్చిన మ్యూజిక్ వినొచ్చు. ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని వీక్షించొచ్చు. క్యాబ్ ప్రయాణాన్ని ట్రాక్ చేయొచ్చు. అయితే తాజాగా ఓలా నవంబర్ 15నుంచి కస్టమర్లకు ఆ సదుపాయాల్ని అందివ్వబోమని స్పష్టం చేసింది. తన బిజినెస్ ఫోకస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్పై పెడుతున్నట్లు తెలిపింది. కాబట్టే ఖర్చును తగ్గిస్తూ ఆదాయం లేని సర్వీసుల్ని నిలిపి వేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తుంది. ప్రారంభించిన ఏడాది లోపే సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా డాష్ పేరుతో గ్రాసరీ డెలివరీ మార్కెట్లో అడుగు పెట్టారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన నిత్యవసర సరకుల్ని 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఆ సందర్భంగా ప్రచారం చేశారు. ప్రచారం, బ్రాండ్ కలిసి రావడంతో ఓలా డాష్ వ్యాపారం బాగానే జరిగింది. కానీ భవిష్ ఓలా ఎలక్ట్రిక్పై దృష్టిసారించడంతో క్విక్ కామర్స్ బిజినెస్ నష్టాల బాట పట్టింది. వెరసీ బిజినెస్ ప్రారంభించిన ఏడాది లోపే షట్డౌన్ చేశారు. ఉద్యోగుల తొలగింపు ఓలా డాష్ షట్డౌన్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ పేరుతో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టారు. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో వెహికల్స్ను ఆటోమొబైల్ మార్కెట్కు పరిచయం చేశారు. కానీ ఓలా ఈవీపై క్రియేట్ అయిన హైప్ కారణంగా కొనుగోలు దారుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఒకానొక దశలో ఓలా వెహికల్స్ అగ్నికి ఆహుతవ్వడం, చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్స్ పార్ట్లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఖర్చు తగ్గించుకునేందుకు భవిష్ అగర్వాల్ గట్టి ప్రయత్నాలే చేశారు. ఒక్కో బిజినెస్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. కాస్ట్ కటింగ్ పేరుతో 400 నుంచి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. ఇలా భవిష్ అగర్వాల్ ఆటోమొబైల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చివరికి అనుకున్నది సాధిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టార్గెట్ యూరప్ దేశీయంగా 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ మధ్య కాలానికి ఏకంగా లక్ష వెహికల్స్ను తయారు చేశారు. నవంబర్ 24 కల్లా కోటి ఈవీ బైక్స్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఈవీ మార్కెట్పై భవిష్ అగర్వాల్ కన్నేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే నేపాల్కు ఈవీ వెహికల్స్ను ఎగుమతులు ప్రారంభించింది.ప్రస్తుతం యూరప్ దేశమైన ఇటలీలో జరుగుతున్న ఎస్పోసిజియోన్ ఇంటర్నేషనల్ సిక్లో మోటోసిక్లో ఇ యాక్సెసోరి (EICMA) మోటర్ సైకిల్ షోలో ఓలా ఎస్1 ప్రోను ప్రదర్శిస్తున్నట్లు భవిష్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది క్యూ1లో యూరప్ కంట్రీస్లో భారత్ నుంచి వరల్డ్ ఈవీ ప్రొడక్ట్ను అందిస్తామని పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!