యూరప్‌ ట్రిప్‌ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు | Schengen Visa: Europe Trip Gets Costlier As Fee Hiked By 12% From Today | Sakshi
Sakshi News home page

యూరప్‌ ట్రిప్‌ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు

Published Tue, Jun 11 2024 8:09 PM | Last Updated on Tue, Jun 11 2024 8:25 PM

Europe Will Now Have To Pay Higher Visa Application Hiked By 12 Percent From Today

ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్‌11)షెంజెన్‌ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది. 

గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్‌ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్‌ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement