penalty
-
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా
విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్ కట్టాలని అధికారులు తెలిపారు.ఇండిగో స్పందన..జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. -
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
రిలయన్స్ సెక్యూరిటీస్కు సెబీ గట్టి దెబ్బ
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ థిమాటిక్ ఆన్సైట్ పరిశీలన చేపట్టాయి.2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.అంతేకాకుండా ఎన్ఎస్ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్ఫామ్గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్ప్లేస్ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
యూనియన్ బ్యాంక్పై భారీ జరిమానా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) చర్యలు చేపట్టింది. అనుమానాస్పద లావాదేవీలను నివేదించడంలో విఫలమైనందుకు, ముంబై శాఖలలోని కొన్ని ఖాతాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు రూ.54 లక్షల జరిమానా విధించింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 13 కింద అక్టోబరు 1న యూనియన్ బ్యాంక్కు పెనాల్టీ నోటీసును జారీ చేసిన ఎఫ్ఐయూ బ్యాంక్ చేసిన రాతపూర్వక, మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్పై అభియోగాలు నిరూపితమైనవిగా గుర్తించింది.ఎఫ్ఐయూ ఈ మేరకు బ్యాంక్ కార్యకలాపాల సమగ్ర సమీక్ష చేపట్టబడింది. కేవైసీ/ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్)కి సంబంధించిన కొన్ని "వైఫల్యాలను" వెలికితీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై హిల్ రోడ్ బ్రాంచ్లో నిర్దిష్ట కరెంట్ ఖాతాలపై చేసిన స్వతంత్ర పరిశీలనలో ఒక ఎన్బీఎఫ్సీ దాని అనుబంధ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు వెల్లడైందని పబ్లిక్ ఆర్డర్ సారాంశంలో ఎఫ్ఐయూ పేర్కొంది. -
ఆకాసా ఎయిర్కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్కు గూగుల్కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్లకు సంబంధించిన బిడ్ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
నిధులు మళ్లింపు.. అంబానీపై రూ.25 కోట్ల పెనాల్టీ
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్హెచ్ఎఫ్ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. -
కన్ఫర్మ్ కాని టికెట్తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్తో రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్లోని కౌంటర్కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్తో రిజర్వ్ డ్ కోచ్లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి: సెబీ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదుబ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది. -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
నెట్వర్క్లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
నెట్వర్క్ సేవల్లో అంతరాయం కలగడం సాధారణంగా దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కోసారి 24 గంటలైనా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అయినా ప్లాన్ గడువులో ఎలాంటి మార్పులుండవు. సర్వీస్ ప్రొవైడర్లు ప్రతిపాదించిన రీచార్జ్ చెల్లించాల్సిందే. పోస్ట్పోయిడ్ కస్లమర్ల పరిస్థితి అంతే. ఇకపై ఏదైనా నెట్వర్క్ సమస్య తలెత్తితే అందుకు అనుగుణంగా బిల్లు చెల్లింపుల్లో రాయితీ పొందేలా టెలికాం ప్రాధికార సంస్థ(ట్రాయ్) నిబంధనలను తీసుకొచ్చింది.ట్రాయ్ విడుదల చేసిన క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం..టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో అందించే నెట్వర్క్ సేవల్లో 24 గంటల కంటే ఎక్కువసేపు అంతరాయం కలిగితే పరిహారం చెల్లించాలి. ఈమేరకు గతంలోని జరిమానాను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. దాంతోపాటు వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు ‘ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెస్ (వైర్లైన్స్ అండ్ వైర్లెస్), బ్రాడ్బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 2024’ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆరునెలల తర్వాత అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.గతంలోని సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల నాణ్యత వంటి మూడు నిబంధనలను భర్తీ చేస్తూ కొత్తవాటిని ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం..పోస్ట్పెయిడ్ కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయం ఏర్పడితే నెలవారీ బిల్లులో రాయితీ ఇవ్వాలి. ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ప్లాన్ వ్యాలిడిటీ గడువు పెంచాలి. అయితే ఏదైనా వాతావరణ విపత్తు వల్ల నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్కార్డు’ విడుదలఫిక్స్డ్-లైన్ సర్వీస్ ప్రొవైడర్లు(కేబుల్ నెట్వర్క్) కూడా పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల సమస్యలను మూడు రోజులలోపు పరిష్కరించాలి. లేదంటే పరిహారం చెల్లించాలి. మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్సైట్లో వినియోగదారులకు సహాయపడే సేవల వారీగా (2G, 3G, 4G, 5G) జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్లను అందించాలని ట్రాయ్ పేర్కొంది. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి భాష్యం చెప్పకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ బాధ్యత ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు అప్పటి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు వి.రామిరెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి ఎన్.శాంతిప్రభలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది. ఈ నేపథ్యంలో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. శాంతిప్రభకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. ఈలోపు అప్పీల్ దాఖలు చేయకుంటే నలుగురు అధికారులు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల కల్లా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. గతంలో∙మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని 2022లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అభ్యర్థులు మళ్లీ హైకోర్టులో వేర్వేరుగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇందులో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా, శాంతిప్రభలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ ధిక్కార వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ అధికారుల తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన వారికి కాకుండా తమకు నచ్చిన వారిని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా నియమించారంటూ ఆక్షేపించారు. ముఖ్యంగా శాంతిప్రభ తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోర్టు ఆదేశించిన వారిని కాకుండా తనకు నచ్చిన వారిని నియమించుకోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. మిగిలిన ముగ్గురు ఉన్నతాధికారులకు కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే వారు ఆమెపై నెట్టేశారన్నారు. -
నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ‘737 మ్యాక్స్’ ఎయిర్క్రాఫ్ట్లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా బోయింగ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్క్రాఫ్ట్ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
ఈపీఎఫ్వో పెనాల్టీ తగ్గింపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది. -
ఎల్&టీ కంపెనీకి ఐటీ శాఖ భారీ జరిమానా
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్లో తెలిపింది.2020-21 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పనిచేస్తున్నాయి. -
ఎస్బీఎమ్ బ్యాంక్కు రూ.88.70 లక్షలు ఫైన్: ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఎస్బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు భారీ జరిమానా విధించింది. ఇంతకీ ఈ బ్యాంకును జరిమానా ఎందుకు విధించింది? ఎంత జరిమానా విధించింది అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.ఆర్బీఐ షరతులను పాటించనందుకు ఎస్బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు ఏకంగా రూ. 88.70 లక్షలు జరిమానా విధించారు. అంతే కాకుండా.. తక్షణమే అమల్లోకి వచ్చేలా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద లావాదేవీలను నిలిపివేయాలని ప్రత్యేక సూచనలను జారీ చేశారు.ఆర్బీఐ సూచించిన ఆదేశాలు పాటించడంలో ఎస్బీఎమ్ విఫలమైనందుకు బ్యాంకుకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేసింది. ఇందులో కారణాలను పేర్కొనాలని సూచించింది. పెనాల్టీ అనేది రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని.. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తెలిపింది. -
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
ఎస్బీఐపై దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ చర్యలు
దక్షిణాఫ్రికాలోని ఎస్బీఐ శాఖపై ఆ దేశ కేంద్ర బ్యాంక్ ప్రుడెన్షియల్ అథారిటీ చర్యలు చేపట్టింది. తమ దేశ మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐపై పరిపాలనాపరమైన ఆంక్షలు, జరిమానా విధించింది.సౌత్ ఆఫ్రికా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టంలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు గానూ తమపై 10 మిలియన్ ర్యాండ్ (రూ.4.5 కోట్లు) జరిమానా విధించినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది.దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ తమపై విధించిన జరిమానాలో 5.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2.5 కోట్లు) వెంటనే చెల్లించాల్సి ఉండగా మరో 4.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2 కోట్లు) 36 నెలల్లో చెల్లించేందుకు వీలుందని ఎఎస్ఐ తెలిపింది. వీటిలో 5.5 మిలియన్ ర్యాండ్ల జరిమానాను ఎస్బీఐ చెల్లించింది. 4.5 మిలియన్ ర్యాండ్ల మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని బ్యాంక్ పేర్కొంది. -
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది. -
బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
ప్రకటించిన బరువు కంటే తక్కువ బరువున్న బిస్కెట్ ప్యాకెట్లను విక్రయించినందుకు ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా సంస్థకు భారీ జరిమానా విధించిన సంఘటనలో కేరళలో జరిగింది. రూ.60,000 నష్టపరిహారం చెల్లించాలని కేరళలోని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బ్రిటానియా ఇండస్ట్రీస్, స్థానిక బేకరీని ఆదేశించింది.వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బేకరీ నుంచి 300 గ్రాముల బరువున్న "బ్రిటానియా న్యూట్రి ఛాయిస్ థిన్ యారో రూట్ బిస్కెట్స్" రెండు ప్యాకెట్లను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ పాకెట్ల బరువుపై అనుమానం వచ్చిన వినియోగదారుడు వాటిని తూకం వేయగా ప్యాకెట్లు వరుసగా 268 గ్రాములు, 248 గ్రాములు ఉన్నాయి.ప్యాకెట్ ప్రామాణిక బరువు కంటే చాలా తక్కువ ఉండటంతో వినియోగదారుడు త్రిస్సూర్ లోని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్కు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన అధికారులు సైతం బిస్కెట్ పాకెట్ల బరువు తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. వినియోగదారుల రక్షణ చట్టం, 2009 లీగల్ మెట్రాలజీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దోపిడీ, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి విముక్తి పొందే వినియోగదారుడి హక్కును బ్రిటానియా కంపెనీ, స్థానిక బేకరీ ఉల్లంఘించాయని కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాదుదారుడికి నష్ట పరిహారం కింద రూ.50 వేలు, అతను భరించిన లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
టెక్సాస్లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పంత్కు రూ. 24 లక్షల జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్పై ఐపీఎల్ గవర్వింగ్ కౌన్సిల్ రూ. 24 లక్షల జరిమానా విధించింది. విశాఖపట్నంలో బుధవారం కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు బౌలర్లు నిర్ణీత సమయంలో కనీస ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు రెండోసారి స్లో ఓవర్రేట్ నమోదు చేసింది. -
ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా!
మూడు ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్లపై దాదాపు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తెలిపింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) పై రూ. 2 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, అడ్వాన్స్లకు సంబంధించిన ప్రొవిజనింగ్పై ప్రుడెన్షియల్ నిబంధనలు - ఎన్పీఏ ఖాతాలలో విభేదాలు' అలాగే కేవైసీకి సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్పై రూ. 66 లక్షల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్పై ఆర్బీఐ రూ.32.30 లక్షల జరిమానా విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఒడిశాలోని రూర్కెలాలోని ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్పై రూ.16 లక్షల జరిమానా విధించింది. -
బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ కట్టాలి.. ఎందుకో తెలుసా?
సాధారణంగా బ్యాంకులకు కస్టమర్లకు పైన్ కడుతుంటారు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోవడమో లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోగా చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తుంటాయి. మరి బ్యాంకుల నుంచి కస్టమర్లు కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు కూడా ఫైన్ కట్టాల్సిందే. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం బాగా విస్తృతం అయింది. దాదాపు అందరూ వీటిని ఉపయోగిస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు డబ్బు వాడుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాడుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా బాంకులు కస్టమర్ల నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నవారు, వాటి అవసరం లేదనుకున్నవారు క్లోజ్ చేస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఆదాయం పోతుందనే భావనతోనో లేదా మరేదైనా కారణంతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సంబంధిత బ్యాంక్ పై ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆ బ్యాంకు నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి రోజుకు రూ. 500 చొప్పున పెనాల్టీ రూపంలో బాధిత కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. -
కొంపముంచిన జడ్డూ, అశూ.. టీమిండియాకు షాక్! రోహిత్ రియాక్షన్
India vs England, 3rd Test Day 2: ఇంగ్లండ్తో మూడో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాటర్లు ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంగా అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. కాగా రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో రోజు ఆట మొదలైంది. 326/5 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన భారత్ ఆదిలోనే కుల్దీప్ యాదవ్(4) రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ ఆచితూచి ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ 102వ ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ వేసిన బంతిని అశ్విన్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడి.. పరుగు తీద్దామని భావించాడు. ఇంగ్లండ్కు ఐదు పరుగులు అయితే, జురెల్ అతడిని వెనక్కి వెళ్లమని సైగ చేశాడు. ఇంతలో ఫీల్డ్ అంపైర్ టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ.. ఇంగ్లండ్కు 5 రన్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ పిచ్ మధ్య భాగం(ప్రొటెక్టడ్) గుండా పరిగెత్తేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. కారణం ఇదే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం.. ‘‘ఉద్దేశపూర్వకంగా లేదంటే అనుకోకుండానైనా సరే పిచ్ పాడయ్యేలా ఆటగాడు వ్యవహరించడం తప్పు. ప్రొటెక్టడ్ ఏరియాలోకి స్ట్రైకర్ గనుక ప్రవేశిస్తే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. పిచ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితే గనుక వస్తే అంపైర్ వెంటనే జోక్యం చేసుకుని అతడు/ఆమెను కారణం చెప్పకుండానే బయటకు పంపే వీలు ఉంటుంది. ఎంసీసీ నిబంధన 41.15 ప్రకారం.. తొలిసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే బ్యాటర్లను అంపైర్ హెచ్చరిస్తాడు. ఇదే మొదటి.. చివరి తప్పిదం కావాలి. ఇన్నింగ్స్ మొత్తానికి ఒక్కసారి మాత్రమే మినహాయింపు ఉంటుంది. తొలుత జడ్డూ.. ఇప్పుడు అశూ రెండోసారి కూడా ఇలాంటి చర్యకు పాల్పడితే పెనాల్టీ విధిస్తారు. కాగా టీమిండియా రాజ్కోట్ టెస్టులో ఇలాంటి చర్యకు పాల్పడటం ఇది రెండోసారి. మొదటిరోజు ఆటలో రవీంద్ర జడేజా కూడా ఇలాగే పిచ్ సురక్షిత భాగంలోకి వచ్చాడు. తాజాగా అశ్విన్ కూడా ఇదే తప్పు పునరావృతం చేయడంతో అంపైర్ 5 పరుగుల పెనాల్టీ విధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ను 5/0తో మొదలుపెట్టనుంది. కాగా అంపైర్ తనను మధ్యలోనే వెళ్లిపొమ్మని చెప్పగా అశూ(37) అతడితో వాగ్వాదానికి దిగేందుకు సిద్ధం కాగా.. మరో ఎండ్లో ఉన్న ధ్రువ్ జురెల్ వచ్చి అతడిని సముదాయించాడు. ఇక ఇదంతా చూస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. నిరాశగా చూస్తూ ఇచ్చిన రియాక్షన్ హైలైట్గా నిలిచింది. Ravi Ashwin got a warning for running down in the middle of the pitch, which resulted in five penalty runs for India. England will start with 5/0 This was the second warning for Team India. 📸: Jio Cinema pic.twitter.com/79hwNciyKA — CricTracker (@Cricketracker) February 16, 2024 చదవండి: Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ! పాపం సర్ఫరాజ్.. రోహిత్ శర్మ ఆగ్రహం -
రూ. లక్ష జరిమానా.. పొగాకు కంపెనీలకు షాక్!
పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు జీఎస్టీ (GST) విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆయా ఉత్పత్తుతల ప్యాకింగ్ మెషినరీని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలో నమోదు చేసుకోవాలని, అలా చేసుకోకపోతే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. పొగాకు తయారీ రంగంలో పన్ను ఎగవేతను నిరోధించడమే దీని ఉద్దేశం. ఈమేరకు కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసినట్లు పేర్కొంది. జీసీస్టీ పరధిలో నమోదు కాని ప్రతి మెషిన్కు రూ. లక్ష జరిమానా విధిస్తారు. నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న మెషిన్లను కొన్ని సందర్భాల్లో సీజ్ కూడా చేస్తారు. పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్ మెషినరీల జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ప్రత్యేక ప్రక్రియను గత సంవత్సరమే జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. తాము వినియోగిస్తున్న ప్యాకింగ్ యంత్రాల వివరాలు, కొత్తగా ఇన్స్టాల్ చేసిన మెషీన్ల ప్యాకింగ్ సామర్థ్యం వంటి వివరాలను GST SRM-I ఫారంలో సమర్పించాలి. అయితే ఇలా వివరాలు ఇవ్వనివారికి ఇప్పటి వరకూ ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ ఇకపై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఉప్పందించిన సొంత ఉద్యోగి.. ఎయిర్ఇండియాకు భారీ పెనాల్టీ!
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని దీర్ఘ-శ్రేణి, టెరైన్ క్రిటికల్ మార్గాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ చర్య తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాల విషయంలో భద్రతా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు ఎయిర్లైన్ ఉద్యోగి నుంచి స్వచ్ఛంద భద్రతా నివేదిక అందిందని, వాటిపై సమగ్ర దర్యాప్తును చేపట్టినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి! ఎయిర్ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, దీంతో ఆ విమానయాన సంస్థ అకౌంటబుల్ మేనేజర్కి షోకాజ్ నోటీసు జారీ చేశామని డీజీసీఏ తెలిపింది. దీనికి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన స్పందనను సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు రెగ్యులేటరీ /ఓఈఎం పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. -
ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్కెజిఎస్బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్కెజిఎస్బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. గుజరాత్కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం. -
యస్ బ్యాంక్కు భారీ పెనాల్టీ
ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ పెనాల్టీ విధించింది. జీఎస్టీ సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జీఎస్టీ విభాగం నుంచి రూ.3 కోట్ల పన్ను నోటీసును యస్ బ్యాంక్ సోమవారం అందుకుంది. యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ రూ. 3,01,50,149 జరిమానా విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఇదీ చదవండి: వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా? కలవరపెడుతున్న అంచనాలు! కాగా యస్ బ్యాంక్ గతంలోనూ జీఎస్టీ నోటీసులు అందుకుంది. గతేడాది డిసెంబర్లో బిహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వరుసగా రూ. 20,000, రూ. 1,38,584 చొప్పున రెండు వేర్వేరు పన్ను నోటీసులను జారీ చేసింది. -
చిరిగిన నోట్లలో తేడాలు.. ప్రభుత్వ బ్యాంక్కు భారీ ఫైన్!
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) భారీ షాక్ ఇచ్చింది. చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం గుర్తించడంతో ఈ బ్యాంక్కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. చిరిగిన నోట్లలో నకిలీవి దీంతోపాటు చిరిగిన, పాడైన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ .. బ్యాంక్ ఆఫ్ బరోడాకు అదనంగా మరో రూ.2,750 ఫైన్ వేసింది. బీవోబీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానాలు ఆర్బీఐ విధించింది. క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ పెనాల్టీలను విధించినట్లు తెలుస్తోంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ గత నెలలో కూడా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గతంలో బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల జరిమానా విధించింది. -
కస్టమర్లకు రూ.5800 కోట్లు చెల్లించనున్న గూగుల్.. ఎందుకంటే..
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లే స్టోర్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కస్టమర్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. యాప్లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధిస్తుందని చెప్పారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్ధంగా కంపెనీకి సమకూరిన నగదును వారికి సెటిల్ చేయాలని ఆదేశించింది. దాంతో గూగుల్ 700 మిలియన్ డాలర్లు(రూ.5800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇదీ చదవండి: చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..? యాప్ల కొనుగోళ్లకు అధికమొత్తంలో చెల్లించిన వినియోగదారులకు 630 మిలియన్ డాలర్లు(రూ.5200 కోట్లు) అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల(రూ.600 కోట్లు) రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కంపెనీ తన ప్లేస్టోర్లోని కొన్ని యాప్స్కు సంబంధించి మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..!
చైనాలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిత్యం కొత్త విధానాలను రూపొందించి అమలు చేస్తుంటారు. తాజాగా చైనాలోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిచువాన్ ప్రావిన్స్లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(ఎస్సీఎంపీ) మీడియా సంస్థ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం కౌంటీలోని ప్రజలు తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు(రూ.120), భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8(రూ.220) డాలర్లు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంటే మొదటిసారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇంట శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్సీఎంపీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్ డైరెక్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇదీ చదవండి: నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు.. ‘కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇల్లంతా బూజుతో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. వారు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయి. ఈ సమస్యను జరిమానాలు పరిష్కరించలేవు. కానీ, ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు దోహదపడతాయని భావిస్తున్నాం’ అని వైస్ డైరెక్టర్ తెలిపారు. -
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం
-
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం.. డీఆర్ఐ కొరడా
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఝుళిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ చర్యలు తీసుకుంది. ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి అమ్మకం దారు చెల్లించాల్సి ఉంది. GST నిబంధనలను ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ తుంగలో తొక్కింది. ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఉండగా, ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా గుర్తించారు. ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే కాగా, విచారణలో ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నారు. నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ని(చంద్రబాబు సన్నిహితుడు) గుర్తించారు. టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఇంగ్రామ్ ఆశ్రయించింది. ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు ఇంగ్రామ్ తెలిపింది. సెప్టెంబర్ 2020 నుంచి ఫాస్ట్లేన్ కార్యకలపాలు నిలిపివేసింది. ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్కు ముందస్తు బెయిల్ రాగా, ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరిస్కరించింది. సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఇదీ చదవండి: స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం -
మరిన్ని బ్యాంకులకు ఫైన్.. కారణం ఇదే అంటున్న ఆర్బీఐ
గత కొన్ని రోజులుగా భారతదేశం నిబంధనలను ఉల్లఘించే చిన్న, పెద్ద.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏవైనా.. వాటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భారీ జరిమానాలు విధించడం, లైసెన్సులు రద్దు చేయడం వంటివి చేస్తోంది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి బ్యాంకుల మీద ఆర్బీఐ రూ. 10,000 (ఒక్కక్క బ్యాంకుకి రూ. 10000) జరిమానా విధించింది. నాన్-రెసిడెంట్ల నుంచి డిపాజిట్ల స్వీకరణపై ఆదేశాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మూడు బ్యాంకులపై మాత్రమే కాకుండా.. పాటలిపుత్ర సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పటాన్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, ద మండల్ నాగరిక్ సహకారి బ్యాంక్, ద బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద ధ్రంగధ్ర పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి కూడా జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. ఆర్బీఐ బ్యాంకులకు జరిమానాలు విధించించడం ఇదే మొదటి సారి కాదు, గత వారంలో రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు రూ. 10.34 కోట్లు జరిమానా విధించింది. దీన్ని బట్టి చూస్తే ఆర్బీఐ ఎంత పెద్ద బ్యాంకు మీద అయిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదని స్పష్టమవుతోంది. -
రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్!
రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్తో పాటు మరో రెండు ఫైనాన్స్ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్బీఎఫ్సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. -
ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా! భారీగా జరిమానాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝులిపించింది. పలు అంశాలలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమాలను విధించింది. ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మిజోరం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, బీర్భూమ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి. (Bank of Baroda: లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...) ప్రాథమిక (అర్బన్) కో-ఆపరేటివ్ బ్యాంక్లు, ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లను ఉంచడంపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గుజరాత్లోని వడోదరలోని ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ రూ.7 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్లోని పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు రూ.2 లక్షల పెనాల్టీని విధించిన ఆర్బీఐ ఖాతాల ప్రమాద వర్గీకరణను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్లో సెలవులు ఇవే..) రాష్ట్ర సహకార బ్యాంకులకు వర్తించే 'హౌసింగ్ ఫైనాన్స్'పై తమ ఆదేశాలను పాటించనందుకు ఐజ్వాల్లోని మిజోరాం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ రూ. 2 లక్షల జరిమానా విధించింది. అలాగే కేవైసీకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్లోని బీర్భమ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బీఐ రూ.1.10 లక్షల పెనాల్టీ వేసింది. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు రుణాలిచ్చే విషయంలో ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు గానూ గుజరాత్లోని షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమిస్తున్న బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం వంటివి చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా తాజాగా మరో నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ ఫైన్ వేసిన బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. 👉 గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్' డిపాజిట్ ప్లేస్మెంట్స్కు సంబంధించి మాత్రమే కాకుండా.. క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటెనెన్స్కు సంబంధించి రూల్స్ పాటించనందుకు ఆర్బీఐ రూ. 4.50 లక్షలు ఫైన్ వేసింది. 👉 గుజరాత్లోని బాబ్రా కేంద్రంగా పని చేస్తున్న నాగరిక్ సహకారి బ్యాంకుకు కూడా రూ. 2 లక్షలు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ - 1949లోని కొన్ని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించిన కారణంగా ఈ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. 👉 ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు పంపాల్సిన నగదును పంపకపోవడం వల్ల మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది. 👉 ది సెవాలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఆర్బీఐ రూ.50,000 జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోవడమే ఫైన్ వేయడానికి ప్రధాన కారణమని RBI స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే! ఇప్పటికే చాలా కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. ఈ కారణంగానే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధిస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు లేదా డబ్బు డిపాజిట్ చేసేముందు ఆ బ్యాంకు ఆర్ధిక స్థితిగతులను తప్పకుండా పరిశీలించాలి. -
వొడాఫోన్ ఐడియాకు షాక్.. మూలిగే నక్కపై తాటికాయ అంటే ఇదే..
మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే.. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ. కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్వర్క్ ద్వారా పంపిన అన్సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఆర్డర్ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్ ఐడియా ఫైలింగ్లో తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది. -
మూడు రూపాయల దాన్ని..ముక్కు పిండేదాకా తెచ్చుకున్నాడు!
మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్ షాప్ యజమానికి భారీ షాక్ తగిలింది. పైగా బెగ్గర్ అంటూ కస్టమర్ని దుర్బాష లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.25,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒడిశాలోని సంబల్పూర్లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని కస్టమర్కు రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన కేసును విచారించిన సంబల్పూర్ కోర్టు రూ. 25 వేలు 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే సంవత్సరానికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది. బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ల కురార్ దాస్ ఏప్రిల్ 28న జిరాక్స్ కోసం ఫోటో కాపీ సెంటర్కి వెళ్లాడు. కాపీ రూ.2 ల చార్జీకి గాను రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ. 3 తిరిగి అడగ్గా ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాదు బెగ్గర్ అంటూ దుర్భాషలాడాడు. అడగ్గా .అడగ్గా. ..పైగా బిచ్చమేశా అనుకుంటూ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో తనకు చిల్లర ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు రసీదు కూడా ఇవ్వలేదంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్కు ఫిర్యాదు చేశారు. తనకు ఆర్థిక నష్టంతోపాటు, మానసిక వేదన, అవమానానికి గురయ్యానంటూ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. వినియోగ దారులందరి హక్కులకు సంబంధించింది. అందుకే కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందాను అంటూ తెలిపారు. -
...
నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు ప్రభుత్వం రంగ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 25) ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో దేశీయ అతిపెద్ద పీఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఉన్నాయి. నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో వీటిపై భారీ జరిమానా విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ సహా మూడు బ్యాంకులకు షాక్ రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్లు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా విధించింది. ఆర్బీఐ తెలిపింది. రుణాలు- అడ్వాన్సులతో పాటు కేవైసీ, 2016లో ఆర్బీఐ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని గుర్తించింది. దీంతో ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్ల ద్రవ్య పెనాల్టీ వేసింది.. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సిదిగా ఆదేశించినట్టు ఆర్బీఐ తెలిపింది. దీంతోపాటు ఎన్బిఎఫ్సిలలో అక్రమాలను గుర్తించి ఆర్బీఐ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్పై రూ. 8.80 లక్షల పెనాల్టీని కూడా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలపై ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా
వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్తో సహా ఓ ఎన్బీఎఫ్సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది . ఏ బ్యాంకుకు ఎంత జరిమానా? 'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'రుణాలు, అడ్వాన్స్లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది. ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్ బ్యాంక్కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. -
ట్యాక్స్ ఆడిట్ చేయించారా? లేదా? లేదంటే..!
టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఆడిట్ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు. ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే.. ♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ను నిర్వహించేలా చూడటం. ♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి. ♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి. ♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా? ♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు) -కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు ) -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ: భారీ జరిమానా
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు , మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలు రుజువు కావడంతో ద్రవ్య పెనాల్టీ విధించబడుతుందని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీలను విధించింది. వీటిలో మూడు బ్యాంకులు గుజరాత్కు చెందినవి కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందింది. గుజరాత్కు చెందిన లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై అత్యధికంగా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గుర్తించి గుజరాత్, వడోదరలోని లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అలాగే పలు రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల రీపేమెంట్పై కస్టమర్లకు వడ్డీ సైతం చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే గుజరాత్, మెహసానలోని ద కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మెహసాన లిమిటెడ్ పై రూ. 3.50 లక్షల పెనాట్లీ వేసింది ఆర్బీఐ. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు ఇచ్చే లోన్లపై ఆర్బీఐ గైడ్లైన్స్ను ఈ బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం అతిక్రమించినట్లు తెలిపింది. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) దీంతోపాటు గుజరాత్ ద హర్జి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్కు రూ. 3 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. ఆర్బీఐ సమాచారం ప్రకారం CRR నిర్వహణ, ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ విషయంలో నిబంధనలను పాటించలేదు. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం ఉల్లంఘించింది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) డిపాజిట్ అకౌంట్ల నిర్వహణలో లోపాలు, నిలిచిపోయిన ఖాతాల వార్షిక సమీక్ష వైఫల్యం లాంటి కారణాలతో మహారాష్ట్ర, ముంబైకి చెందిన ద నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ. 1 లక్ష మానిటరీ పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. డి విఫలమవడం వంటి కారణాలతో ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చేలా బుధవారం ఉత్తర్వులిచ్చింది. రుణగ్రహీత రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను తొలగించాలని, అన్ని స్థిరాస్తి, చర ఆస్థి ఒరిజినల్ పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాదు జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయిని ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రతిరోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. డిసెంబరు 1, 2023 తర్వాత చరాస్తులు/ స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.(గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆర్బీఐ తాజా ఆదేశాలిచ్చింది. అలాగే చరాస్తులు/స్థిర ఆస్తి ఒరిజినల్ పత్రాల నష్టం/నష్టానికి సంబంధించి,ఆయా సంస్థలు, అటువంటి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో రుణ గ్రహీతకు సాయపడతాయని,, పరిహారం చెల్లించడంతో పాటు సంబంధిత ఖర్చులను భరిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సందర్బాల్లో ఈ విధానాన్ని పూర్తి చేయడానికి RE లకు 30 రోజుల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది (అంటే, మొత్తం 60 రోజుల వ్యవధి తర్వాత) లెక్కించబడుతుందని కూడా తెలిపింది. -
ఇన్ఫోసిస్కు ఎదురుదెబ్బ.. తప్పు చిన్నదైనా తప్పని జరిమానా!
Infosys Fined: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)కు ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ఏలోని సీటెల్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (Seattle Finance Administrative Services) నుంచి తమకు 1,764.84 డాలర్లు జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) 2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య కాలానికి స్థానిక పేరోల్ పన్నును ట్యాక్స్ అథారిటీకి తక్కువగా చెల్లించినందుకు గానూ జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలియజేసింది. దీని వల్ల కంపెనీ ఆర్థిక విషయాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. గతంలోనూ.. పన్ను చెల్లింపులో లోటు కారణంగా గత నెలలో కూడా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ నుంచి పెనాల్టీని ఎదుర్కొంది. ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అప్పట్లో 76.92 డాలర్ల పెనాల్టీని వసూలు చేసింది. కాగా పొరపాటున అధిక పన్ను రేటు కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలో పరిశీలిస్తున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది. -
సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం
న్యూఢిల్లీ: నమోదు చేసుకోని డీలర్ల ద్వారా సిమ్ కార్డులను విక్రయించి, కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టెల్కోలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దీనికి ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, టెలికాం ఆపరేటర్లు సెప్టెంబర్ 30 లోపు అన్ని ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) నమోదు చేసుకోవాలని సర్క్యులర్లో పేర్కొంది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు అన్ని పాయింట్ ఆఫ్ సేల్స్ను (పీవోఎస్) సెప్టెంబర్ 30లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీవోఎస్లు తగు పత్రాలను సమర్పించి, రిజిస్టర్ చేయించుకోవాలి. -
రష్యాలో సోషల్ మీడియా సంస్థ రెడిట్కు భారీ షాక్!
ఉక్రెయిన్లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ" సమాచారం ఉందనీ, సంబంధిత "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్ ఇంకా స్పందించలేదు. వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్ల జాబితాలో రెడిట్ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
మరో నాలుగు బ్యాంకులకు ఝలక్ - లక్షల్లో పెనాల్టీ!
కస్టమర్లకు సేవలు అందించే విషయంలో లేదా విధులను నిర్వహించడంలో ఏదైనా అవకతవకలు ఏర్పడినా 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసింది, కాగా ఇప్పుడు మరో నాలుగు బ్యాంకులకు ఫెనాల్టీ విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న 'ది తపిండు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు'కి రూ. లక్ష జరిమానా విధించింది. అంతే కాకుండా మహారాష్ట్రకు చెందిన మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది మహాబలేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు వరుసగా రూ. 1 లక్ష, రూ. 2 లక్షలు, రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతానికి జరిమానా విధించి ఊరుకున్నా.. ఇదే మళ్ళీ మళ్ళీ జరిగితే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. కావున బ్యాంకులు సరిగ్గా విధులు నిర్వహిస్తూ.. సజావుగా కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. -
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్లైన్ డాక్యుమెంటేషన్లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్కేసులో డెడ్బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
గుడ్న్యూస్: దిగివచ్చిన కేంద్రం.. ఫలించిన సీఎం జగన్ ఒత్తిడి
సాక్షి, అమరావతి/కొరిటెపాడు (గుంటూరు): పొగాకు రైతుకు శుభవార్త. రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి ఫలితంగా పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2022–23 సీజన్లో 81,635 హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్లో విరుచుకుపడిన మాండూస్ తుపాన్ కారణంగా సగానికిపైగా పొగాకు పంటతోపాటు శనగ, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 2021–22లో కిలో పొగాకు గరిష్ఠంగా రూ.210కు పైగా పలికింది. దీంతో పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులతో పాటు ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయం లేక పొగాకు సాగుకు మొగ్గు చూపారు. ఫలితంగా అనుమతికి మించి 85,763.50 హెక్టార్లలో పొగాకు సాగైంది. దీనికితోడు వాతావరణం కాస్త అనుకూలించడంతో హెక్టార్కు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. చరిత్రలో ఇదే అత్యధిక దిగుబడి కావడం గమనార్హం. మరోవైపు గతేడాది పొగాకుకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. ప్రస్తుతం సగటున కిలో రూ.245 నుంచి రూ.281 వరకు పలుకుతున్నాయి. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనా ల్టి తో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. గతంలో కూడా ఇలా అనుమతి ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది రెండోసారి విత్తుకోవడం, పంటను కాపాడుకోవడానికి, అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది. అదనపు అ«దీకృత ఉత్పత్తికి పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖమంత్రి పియూష్ గోయల్కు లేఖ రాశారు. కర్ణాటకలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట స్థానంలో రెండోసారి విత్తుకున్న సందర్భంలో పెనాల్టీ లేకుండా అదనపు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదేరీతిలో రాష్ట్ర రైతులకు కూడా అనుమతినివ్వాలని సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాదేశాలతో పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు బృందం ఢిల్లీ వెళ్లి పలుమార్లు సంప్రదింపులు జరిపింది. పెనాల్టీ లేకుండా అదనపు అ«దీకృత పొగాకు ఉత్పత్తి విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పొగాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 2022–23 పొగాకు పంట కాలానికి సంబంధించి రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును, రిజిస్టర్ కాని అనధికారిక పొగాకును బోర్డు వేలం కేంద్రాల్లో అపరాధ రుసుం లేకుండా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ గెజిట్ విడుదల చేసిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. -
ట్విటర్కు షాక్: రూ.50 లక్షల జరిమానా
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్కు భారీ షాక్ తగిలింది. కేంద్రం ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ విషయంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పిటీషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విటర్ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన అన్ని ప్లాట్ఫారమ్లు భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ జాక్ నేతృత్వంలోని ట్విటర పదే పదే ఉల్లంఘించిందని ట్వీట్ చేశారు. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం 10 సార్లు ట్విటర్ను బ్లాక్ చేసిందని ఆరోపించింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గత ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంఆదేశాలు, ఏకపక్షంగా వాక్, భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించింది. 2021లో రైతుల నిరసనల నిర్వహణపై విమర్శనాత్మకమైన ఖాతాలను పరిమితం చేయాలనే ఆదేశాలను పాటించకపోతే దేశంలో సోషల్ మీడియాను మూసివేస్తామని ఇండియా బెదరించిందని ట్విటర్మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆరోపించిన తరువాత తాజా తీర్పు వెలువడటం విశేషం. గత ఏడాది జూన్ 28న, జూలై 4లోగా ఉత్తర్వులను పాటించాలని కోరుతూ ప్రభుత్వం ట్విటర్కు లేఖ రాసింది, లేకపోతే మధ్యవర్తిగా తన చట్టపరమైన కవచాన్ని కోల్పోతారని హెచ్చరించింది. లీగల్ షీల్డ్ను కోల్పోతే,యూజర్లు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ట్విటర్ ఎగ్జిక్యూటివ్లకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. VIDEO | "Our relationship with (social media) platforms isn't adversarial. Our insistence is that law must be followed. I am glad that the court has today laid down that non-compliance isn't an option. All platforms in India have to comply with Indian law," says Union Minister… pic.twitter.com/ExO0jWugpD — Press Trust of India (@PTI_News) June 30, 2023 -
ఐవోబీకి ఆర్బీఐ షాక్! భారీ జరిమానా
ముంబై: ఆదాయ గుర్తింపు, అసెట్ వర్గీకరణ నిబంధనల అమల్లో లోపాల కారణంగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)కి రిజర్వ్ బ్యాంక్ రూ. 2.20 కోట్ల జరిమానా విధించింది. 2021 మార్చి 31న నాటికి బ్యాంకు పరిస్థితి సమీక్షించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్స్క్రీన్తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఆర్బీఐ నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఐవోబీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన లాభాల్లో 25 శాతం మొత్తాన్ని రిజర్వ్ ఫండ్కు బదిలీ చేయడంలో బ్యాంకు విఫలమైంది. అలాగే, మొండిబాకీలకు సంబంధించి బ్యాంకు రిపోర్టు చేసిన వాటికి, వాస్తవ ఎన్పీఏలకు మధ్య వ్య త్యాసం ఉండటం తదితర లోపాలు తనిఖీల్లో బైటపడ్డాయి. రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్ డోంట్ మిస్ టు క్లిక్: సాక్షిబిజినెస్ -
చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్
సాక్షి,ముంబై: ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్ఫ్లుయెన్సర్) పీఆర్ సుందర్కు సెబీ భారీ షాకిచ్చింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీనుంచి అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలపై ఫిర్యాదులు, భారీగా ఫీజు దండుకున్న ఆరోపణలపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రూ.6 కోట్ల పెనాల్టీ విధించింది. దీంతో పాటు ఒక సంవత్సంపాటు సెక్యూరిటీల లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. దీంతో కర్మ ఊరికే పోదు..ఏదో ఒక రోజు అనుభవించాల్సిందే అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. పీఆర్ సుందర్ తప్పుడు ట్రేడింగ్ కాల్స్ ఇస్తారని, దీనికి ఫీజులు కూడా బాగానే దండుకున్నారంటూ కొంతమంది ట్విటర్ వినియోగదారులు మండిపడ్డారు. అతని ఇంటి విలువ 30 కోట్లు రోల్స్ రాయిస్ , ల్యాండ్ రోవర్ కూడా ఉన్నాయంటూ మరొక యూజర్ కమెంట్ చేశారు. ఇది అతనికి పెద్ద లెక్కకాదని, ఇప్పటికే భారీగానే సంపాదించేశాడని, ఇపుడిక మరోదారి వెతుక్కుంటాడు అని ఇంకొందరు వ్యాఖ్యానించడం విశేషం. సుందర్ నిర్వహణలో అడ్వైజరీతోపాటు, టెలిగ్రామ్లో, యూట్యూబ్, ట్విటర్ ద్వారా రోజువారీ కాల్స్, లావాదేవీలపై సూచనలు సలహాలిస్తారనీ, దీనికి రేజర్పే లింక్తో సహా చెల్లింపు లింక్ను అందించింది. రేజర్పే, డైరెక్ట్ క్రెడిట్ ద్వారా మాన్సన్ బ్యాంక్ ఖాతాలో రూ. 4.36 కోట్లు ,రూ. 23.5 లక్షలకు పైగా వసూలు చేసిందని సెబీ సెటిల్మెంట్ ఆర్డర్లో పేర్కొంది. దీనికి రూ. 6 కోట్లు చెల్లించడంతోపాటు, సెటిల్మెంట్ ఆర్డర్ పాస్ అయినప్పటి నుండి ఒక సంవత్సరం పాటు సెక్యూరిటీలను కొనడం, విక్రయించడం లేదా ఇతరత్రా లావాదేవీలు చేయకుండా కట్టడి చేసింది. ఆరోపణలపై నోటీసులు జారీ తరువాత సెబీ హై-పవర్డ్ అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరి 22, 2023న జరిగిన సమావేశం జరిగింది. అనంతరం ఏప్రిల్ 3, 2023న సెటిల్మెంట్ రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 15 ప్రకారం, హోల్ టైమ్ మెంబర్స్ ప్యానెల్ సిఫార్సును ఆమోదించి, ఏప్రిల్ 06 దరఖాస్తుదారులకు తెలియజేసినట్టు సెబీ పేర్కొంది. దీని ప్రకారం సెటిల్మెంట్ మొత్తాన్ని చెల్లించి, ఆర్జించిన లాభంతో సహా రూ. 6 కోట్లకు పైగా సొమ్మును జమ చేసేందుకు అంగీకరించారు. మూడు సంస్థలు ఒక్కొక్కటి రూ. 15.60 చొప్పున మొత్తం రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1, 2020 నుండి ఫిబ్రవరి 2023లో చేరిన సవరించిన సెటిల్మెంట్ నిబంధనలను (RST) సమర్పించే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా రూ. 6,07,69,863 డిస్గోర్జ్మెంట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా పీఆర్ సుందర్, అతని కంపెనీ మన్సన్ కన్సల్టింగ్, కంపెనీ కో-ప్రమోటర్ మంగయార్కరసి సుందర్కు సెబీ గతంలో షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై తాజాగా చర్యను చేపట్టింది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్,ఇన్సూరెన్స్పై, ప్రధానంగా ఫేస్బుక్ ,ట్విటర్, టెలిగ్రాం లాంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో పెట్టుబడిదారులకు సలహాలిచ్చే వారినే ఫిన్ఫ్లూయన్సర్ అంటారు. దీనికి ఫీజును కూడా వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సేవలకు గాను సంబంధిత వ్యక్తులకు సెబీ రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి. He jumped to crypto 🤣 crypto bois watch out for this man, he has entered ur territory in rented Rolls Royce 🫢#Crypto #prsundar pic.twitter.com/scWAvmRdzU — Priyanka Gowda (@Priyankagowda22) May 26, 2023 Got to give it to this man. Working hard by trying to teach Crypto options the very evening he was imposed 4cr fine by SEBI 😂 Never give up even at 60? #PRSundar #StockMarket #Nifty pic.twitter.com/S94aOXFQac — kipaii (@kipai09) May 26, 2023 -
ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కంపెనీకి భారీ షాక్ తగిలిదింది. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీసీ) రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్బుక్ డేటాను,అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ జరిగిందని ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. మే 25, 2018 నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్డాగ్ తెలిపింది. ఇందుకు గాను 1.2 బిలియన్ యూరోలు లేదా 130 కోట్ల డాలర్లు అంటే 10వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.(అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) మెటా స్పందన అయితే ఈయూ నిర్ణయంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్యాయమైన , అనవసరమైన జరిమానా సహా, డీపీసీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇతర కంపెనీలకు ఇది తప్పుడు సందేశమిస్తోందని ఆరోపించింది. -
నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్ఎంఈ రుణాలను బాహ్య బెంచ్మార్క్తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) వడ్డీ రేట్లను బాహ్య బెంచ్మార్క్తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్మార్క్తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ అలాగే పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. -
గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..
టెక్ దిగ్గజం గూగుల్కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) ప్రకారం.. గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్లో వారి కంటెంట్ను విడుదల చేయకుండా అడ్డకుంది. వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ఆ ఒప్పందానికి సంబంధించిన ఈమెయిల్లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్లైన్లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్టీసీ తెలిపింది. ఎఫ్టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్టీసీ పేర్కొంది. కాగా కొరియన్ ఎఫ్టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. -
మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్కి రూ. 6.77 కోట్లు జరిమానా.. ఎందుకంటే?
లోన్స్ అందించే సమయంలో రుణగ్రహీతలకు వడ్డీరేట్లను వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను పాటించడంలో ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విఫలమైంది. నియమాలను అతిక్రమించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ రూ. 6.77 కోట్ల జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కెవైసి (Know Your Customer) నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఇండియన్ బ్యాంక్పై రూ. 55 లక్షలు జరిమానా విధించినట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తెలిపింది. అంతే కాకూండా 2016లో మోసాల పర్యవేక్షణలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఎర్నాకులంలోని ముత్తూట్ మనీ లిమిటెడ్పై రూ. 10.50 లక్షల జరిమానా విధించడం జరిగింది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?) పెనాల్టీలనేవి రెగ్యులేటరీ సమ్మతిలోని లోపాలపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లతో వారు కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై ఉచ్ఛరించడానికి ఉద్దేశించినది కాదని RBI స్పష్టం చేసింది. మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్పై చట్టబద్ధమైన తనిఖీ 2019 మార్చి 31 & 2020 మార్చి 31 నాటికి దాని ఆర్థిక స్థితికి సంబంధించింది. (ఇదీ చదవండి: మహీంద్రా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! థార్ కొనుగోలుపై ఏకంగా..) రుణాల కోసం పారదర్శక విధానాలకు సంబంధించి కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తించినట్లు తెలిపింది. నిజానికి రుణాలను మంజూరు చేసేటప్పుడు రుణగ్రహీతలకు విధించే వార్షిక వడ్డీ రేట్లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైంది. రుణగ్రహీతలకు వారి రుణాల నిబంధనలు, షరతులకు మార్పులు చేసినప్పుడు వారికి తెలియజేయలేదు. -
కరూర్ వైశ్యా బ్యాంక్పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా..
ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝులిపించింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించింది. మోసం వర్గీకరణ, రిపోర్టింగ్కు సంబంధించి తమ ఆదేశాలను పాటించడంలో కరూర్ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ తనిఖీలో వెల్లడైంది. దీంతో మార్చి 24న రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! ఆర్బీఐ సెలెక్ట్ స్కోప్ ఇన్స్పెక్షన్ (ఎస్ఎస్ఐ) నిర్వహించగా కరూర్ వైశ్యా బ్యాంక్లో కొన్ని ఫ్రాడ్ అకౌంట్లను గుర్తించింది. వాటికి సంబంధించిన వివరాలను వారం రోజుల్లోగా అందించాలని జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్దేశించగా అందులో కరూర్ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్కు కోవిడ్.. భారత్లో సమావేశాలన్నీ రద్దు! తాము జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కరూర్ వైశ్యా బ్యాంకుకు ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, విచారణ సమయంలో చేసిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తమ ఆదేశాలను సదరు బ్యాంక్ పాటించలేదని నిర్ధారణకు వచ్చి జరిమానా విధించినట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటనలో పేర్కొంది. -
Taxpayers-ITR Filing: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్లను గడువుకు ముందే సమర్పించాలి. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) ఆలస్యమైతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! -
హెచ్డీఎఫ్సీకి, ఐజీహెచ్ హోల్డింగ్స్కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) కి భారీ షాకిచ్చింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీకి ఈ జరిమానా విధించింది. దీంతోపాటు IGH హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏకంగా రూ. 11.25 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. 2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేక పోయిందని తమ పరిశీలనలో వెల్లడైందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ కంపెనీ వివరణ తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేదని నిర్ధారించి జరిమానా విధించింది. వారి డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. అలాగే నిబంధనలు పాటించని కారణంగా ముంబైలోని ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.11.25 లక్షల పెనాల్టీ విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లాభ, నష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో కంపెనీ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. -
హైదరాబాద్: వాహనదారులకు షాక్.. దొరికారో 200 శాతం పెనాల్టీ తప్పదు!
సాక్షి,హైదరాబాద్: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్ కాలం నుంచి పెండింగ్లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తేలికపాటి వాహనాలే అధికం.. గ్రేటర్లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్ విధించారు. తనిఖీలు ఉధృతం త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్లైన్లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్ చెకింగ్ రిపోర్ట్ (వీసీఆర్) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. –జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
అమెజాన్ పేపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది. (చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్తో, అతి తక్కువ ధరలో! ) -
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్తో తెలుగు ఆడియన్స్ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్పై బిగ్బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
ఎయిర్ఏషియాకు రూ.20లక్షల ఫైన్! ఎందుకంటే..
సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది. డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ఏషియా మేనేజర్కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే.. -
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ ఝలక్!
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ భారీగా జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎయిర్ ఏషియా చేయడం లేదని తేలడంతో డీజీసీఏ రూ. 20 లక్షల జరిమానా విధించింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు సదరు ఎయిర్ ఏషియా హెడ్ ట్రైనీని కూడా మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఏషియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్లకూ కూడా ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమాన విధించింది. ఈ మేరకు డీజీసీఏ సంబంధిత మేనేజర్, శిక్షణ అధిపతి, ఎయిర్ ఏషియా నియమించిన ఎగ్జామినర్లు తమ విధులను సరిగా నిర్వర్తించనందుకు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు ఎయిర్లైన్కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి రాత పూర్వక సమాధానాలను పరిశీలించాకే డీజసీఏ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. (చదవండి: వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్టేషన్కి వచ్చి..) -
గూగుల్ వివాదం.. జాతీయ ప్రాధాన్యతాంశం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ టెక్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్ వెంకటరమణన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. దీన్ని తిప్పి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)కి పంపి.. గూగుల్కు ’రెండో ఇన్నింగ్స్’ ఆ డే అవకాశం ఇవ్వొద్దని స్వయంగా సుప్రీం కోర్టే విచారణ జరపాలని కోరారు. అటు గూగుల్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ..ఏఎస్జీ సూచనలతో తాము కూడా ఏకీభవిస్తున్నామ ని, ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాల ని కోరుకుంటున్నామని విన్నవించారు. ఇరు పక్షా ల వాదనలు విన్న మీదట తదుపరి విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో గూగుల్కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
గూగుల్కు భారీ షాక్.. రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ: పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని నిర్ణీత గడువులోపు చెల్లించనందుకు గూగుల్కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గూగుల్కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది. పెనాల్టీ చెల్లించేందుకు గూగుల్కు ఇచ్చిన 60 రోజుల గడువు ఈ నెల 25నే ముగిసింది. దీంతో గూగుల్కు సీసీఐ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సీసీఐ నిబంధనల కింద జరిమానా చెల్లించేందుకు 30 రోజుల గడువే ఉంటుంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్కు వెళ్లామని, స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనుచిత వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సీసీఐ అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానాను విధించడం గమనార్హం. ప్లేస్టోర్ విధానాలపరంగా తనకున్న అధిక మార్కెట్ వాటాతో అనైతిక విధానాలు అనుసరిస్తున్నందుకు రూ.936 కోట్ల జరిమానా విధించాలంటూ అక్టోబర్ 25న మరో కేసు విషయంలో సీసీఐ ఆదేశించింది. చదవండి: న్యూ ఇయర్లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు! -
పెనాల్టీ కిక్ సందర్భంగా మెస్సీ ఎమోషనల్
ఖతర్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా ఫ్రాన్స్పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ వరల్డ్కప్లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్తో మెరిశాడు. ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్తో మెరవడంతో తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక పెనాల్టీలు కొట్టడంలో తనకు తానే సాటి అని మెస్సీ మరోసారి నిరూపించుకున్నాడు. ఆట 23వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన పెనాల్టీ అద్భుతమనే చెప్పాలి. అయితే పెనాల్టీ కొట్టడానికి ముందు మెస్సీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మెస్సీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిపా వరల్డ్కప్ ఫైనల్ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఓడితే కప్ లేకుండానే మెస్సీ కెరీర్ ముగుస్తుంది. అందుకే పెనాల్టీ కొట్టడానికి ముందు అంత ఎమోషనల్ అయ్యాడు. ఇక పెనాల్టీని గోల్గా మలిచిన తర్వాత మెస్సీ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఇక అర్జెంటీనాకు గోల్ వచ్చిన తర్వాత స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
అవి చూసే ఫెయిలయ్యా: 75 లక్షలకు ప్లాన్, సుప్రీం రియాక్షన్
న్యూఢిల్లీ: యూట్యూబ్లో అసభ్యకరమైన కంటెంట్ ప్రకటనల కారణంగా తన దృష్టి మళ్లిందని తదర్వారా పరీక్షలో ఫెయిల్ అయ్యానని దాఖలైన పిటీషన్పై సీరియస్గా స్పందించింది. "ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇదొకటి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రకమైన పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాతు పిటీషనర్కు భారీ జరిమానా కూడా విధించింది. దీంతో పిటీషనర్ లబోదిబోమన్నాడు. వివరాలను పరిశీలిస్తే..గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్లో వచ్చిన అశ్లీల ప్రకటనల కారణంగా తాను పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్కాలేక, ఎగ్జామ్ ఫెయిలయ్యానని ఇందుకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఆనంద్ కిషోర్ చౌదరి అనే ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ పోలీసు పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో తమ దృష్టిని మరల్చేలా లైంగిక, అసభ్యకరమైన యాడ్స్ చూపించారంటూ ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. నచ్చకపోతే యాడ్స్ చూడకండి, వాటిని చూడాలా వద్దా అనేమీ మీ హక్కు అని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని, క్షమించి జరిమానా తగ్గించాలని వాపోవడంతో కోర్టు కనికరించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ధర్మాసనం మందలించింది.జరిమానా తగ్గిస్తాం కానీ క్షమించ లేమంటూ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని అతగాడిని ఆదేశించింది. -
గన్ షాట్ : రాజకీయ లబ్ది కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా..?
-
కొత్త డేటా ప్రైవసీ చట్టం.. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. భారత్కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్ఏ పార్ట్నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. ► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు. ► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. ► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు. ► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి. ► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్ఫాంను అందుబాటులో ఉంచాలి. ► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు. ► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా ఆడిటర్ను నియమించుకోవాలి. ► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
డెలివరీ ఫెయిల్: జొమాటోకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్. -
ఎయిరిండియాకు భారీ షాక్, మిలియన్ డాలర్ల జరిమానా
సాక్షి, ముంబై: టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకుగాను భారీ జరిమానా విధించాలని అమెరికా ఆదేశించింది. 121.5 మిలియన్ డాలర్లు (దాదాపు 990 కోట్ల రూపాయలు) రీఫండ్తోపాటు జరిమానాగా 1.4 మిలియన్ డాలర్లు (రూ.11.35 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం! 600 మిలియన్ డాలర్లకు పైగా వాపసు చెల్లించడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సోమవారం ప్రకటించింది. ఎయిరిండియా ‘రిఫండ్ ఆన్ రిక్వెస్ట్’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని పేర్కొంది. తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ తెలిపారు. అలాగే ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ 222 మిలియన్ డాలర్లతోపాటు 2.2 మిలియన్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సిఉందన్నారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) -
ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కథనాలు వెలువరించిన వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్కు 2 మిలియన్ రబుల్స్(రూ.26 లక్షలు) జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఉక్రెయిన్పై సైనిక చర్యకు సంబంధించిన ఆర్టికల్స్ను తొలగించాలని రష్యా డిమాండ్ చేసినట్లు చెప్పారు రష్యాలోని వికీమీడియా ఫౌండేషన్ చీఫ్ స్టానిస్లావ్ కోజ్లోవ్స్కీ. వాటిని తొలగించకపోవటం వల్లే జరిమానా విధించిందని, దీనిపై వికీమీడియా ఫౌండేషన్ అప్పీలు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు.. వికీపీడియాలో ప్రచురించిన రెండు ఆర్టికల్స్ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ‘రష్యా దండయాత్ర సమయంలో ఉక్రెయిన్ ప్రజల అహింసాత్మక ప్రతిఘటన’, ‘రష్యా 2022 ఉక్రెయిన్ దండయాత్ర సమాచారం’. ఉక్రెయిన్పై చేపట్టిన యుద్ధాన్ని ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్గా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది రష్యా. గతంలో ఏప్రిల్ 26 వికిమీడియా ఫౌండేషన్కు మొత్తం 5 మిలియన్ రబుల్స్ జరిమానా విధించింది రష్యన్ కోర్టు. ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురించటంపైనే ఆ చర్యలు తీసుకుంది పుతిన్ సర్కార్. ఇదీ చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి -
పండగ వేళ ఓయో, మేక్మై ట్రిప్లకు సీసీఐ భారీ షాక్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్లో దీపావళి క్యాష్బ్యాక్ ఆఫర్లు) హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు) నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్ఫారమ్లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్మైట్రిప్ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్ఫారమ్లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్మై ట్రిప్ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా మహారాజాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వికెట్ కీపర్ హెల్మెట్ ఇండియా మహారాజాస్ కొంపముంచింది. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అశోక్ దిండా వేశాడు. ఓవర్ మూడో బంతిని ఫుల్లెంగ్త్తో వేశాడు. క్రీజులో ఉన్న పెరీరా టచ్ చేయాలని చూశాడు. కానీ బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్ పార్థివ్ పటేల్ వైపు వెళ్లింది. అయితే పార్థివ్ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో బౌండరీ వెళుతుందని మనం అనుకునేలోపే కీపర్ హెల్మెట్కు తాకిని బంతి అక్కడే ఆగిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్ బైస్ రూపంలో ఇండియా మహారాజాస్కు ఐదు పరుగుల ఫెనాల్టీ విధించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మహారాజాస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది.తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 5 Runs when ball Hits Keeper Helmet ⛑️😂😂 Dinda Parthiv Bhajji all Smiles 😊@llct20 #LLC pic.twitter.com/fON67VE3hm — Kagiso Rabada (@cricketer_jii) September 16, 2022 -
ఇన్స్టాకు భారీ షాక్: రికార్డ్ స్థాయిలో జరిమానా, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ (మెటా) సొంతమైన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్కు భారీ షాక్ తగిలింది. తన టీనేజ్ యూజర్ల గోప్యతా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇన్స్టాగ్రామ్కు ఐర్లాండ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల (402 మిలియన్డ డాలర్ల) జరిమానా విధించింది. ఇది చదవండి: Hyundai Venue N Line: వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే? 2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్ యూజర్ల డేటాపై నిబంధనలు పాటించలేదని తేల్చింది. పిల్లల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆరోపించింది. నివేదికల ప్రకారం దాదాపు 32 బిలియన్.. 17 కోట్ల 44 లక్షల 15 వేల రూపాయలుగా ఉంటుంది. ఇదీ క్లిక్ చేయండి: హాప్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్: అదిరే..అదిరే..! ఈ రికార్డు జరిమానాపై అప్పీల్ చేయాలని ఇన్స్టాగ్రామ్ యోచిస్తోందని పేరెంట్ మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్టాగ్రామ్ గత ఏడాది తన సెట్టింగ్లను అప్డేట్ చేసిందన్నారు. ముఖ్యంగా టీనేజర్ల వ్యక్తిగత డేటా సురక్షితంగా, ప్రైవేట్గా ఉంచడానికి కొత్త ఫీచర్లను లాంచ్ చేసినట్టు మెటా ప్రతినిధి తెలిపారు. ఈ జరిమానాతో విభేదిస్తున్నామనీ దీన్ని జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ.3,500 కోట్లు జరిమానా
కోల్కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గట్టి షాకిచ్చింది. రాష్ట్రంలో ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని రూ.3500 కోట్లు జరిమానా విధించింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి 12,819కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అయితే.. పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి చూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలి‘ అని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెత్త నిర్వహణపై ఇకనైనా బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలో రోజుకు 2,758 మిలియన్ల లీటర్ల మురుగు నీరు పోగవుతోందని, అయితే.. 44 ఎస్టీపీల ఏర్పాటుతో కేవలం 1,268 ఎంఎల్డీలు మాత్రమే శుభ్రం చేస్తున్నారని పేర్కొంది. రెండింటి మధ్య అంతరం భారీగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్ షా ఆరోపణలు -
ఫ్లిప్కార్ట్లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే ఈ సంగతి తెలుసుకోండి!
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు ఎదురుదెబ్బ తగిలింది. మేండేటరీ స్టాండర్స్ పాటించకుండా నిబంధనలనుఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ. 1 లక్ష జరిమానా విధించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, 45 రోజుల్లో సమ్మతి నివేదికను సమర్పించడంతో పాటు, ఆయా ఉత్పత్తులను రీకాల్ చేసి, వారి చెల్లింపులను రీయింబర్స్ చేస్తామని వినియోగదారులకు తెలియ జేయాలని సీసీపీఏని ఆదేశించింది. లోపాలున్న ప్రెషర్ కుక్కర్ల విక్రయాలను విక్రమించినట్టు సీసీపీఏతేల్చింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని మొత్తం 598 ప్రెషర్ కుక్కర్లు విక్రయం ద్వారా ఇ-కామర్స్ మొత్తం రూ. 1,84,263 వసూలు చేసిందని పేర్కొంది. ఇటీవల (ఆగస్టు 4న) లోపభూయిష్టమైన ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు లక్ష రూపాయల పెనాల్టీ చెల్లించాలని ఈ కామర్స్ సంస్థ అమెజాన్ను ఆదేశించింది. ఇలా అమెజాన్ మొత్తం 2,265 ప్రెషర్ కుక్కర్లు అమ్మిందని సీసీపీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం
సాక్షి, బెంగళూరు: ధూమపానం అటు ఆరోగ్యాన్ని, ఇటు జేబును నాశనం చేస్తుందని ఎందరు హితోక్తులు చెప్పినా ధూమపాన ప్రియులు చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్రంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దేశంలోనే అగ్రస్థానంలో కన్నడనాడు నిలిచింది. పబ్లిక్ స్థలాల్లో పొగతాగుతూ పట్టుబడిన వారి జాబితాలోనూ కర్ణాటకదే తొలిస్థానం. సుమారు 35 శాతంతో కర్ణాటక ఇందులో పై వరుసలో ఉంది. ఎన్నిసార్లు జరిమానాలు విధిస్తున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం చేయడం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ ఉంది. గడిచిన మూడేళ్లలో 5.07 లక్షల మంది పొగ తాగుతూ దొరికిపోయి జరిమానా కట్టారు. కోట్పా చట్టం చూస్తోంది సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా) అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం ఈ చట్టరీత్యా నేరం. కానీ ధూమపానప్రియులు యథావిధిగా రద్దీ ప్రాంతాల్లో పొగాకు కాలుస్తున్నారు. టీ స్టాళ్లు, పాన్ దుకాణాలు, పార్కులు, వీధుల్లో ఇది అధికంగా ఉంది. అధికారుల తనిఖీలలో దొరికితే ఈ నేరానికి రూ. 200 జరిమానా విధిస్తున్నారు. పొగరాయుళ్లు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తూర్పు జోన్ డీసీపీ శరణప్ప తెలిపారు. 5.07 లక్షల జరిమానాలు 2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు దేశంలో మొత్తం 14.40 లక్షల మంది బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేసి జరిమానాలు చెల్లించారు. ఇందులో కర్ణాటక నుంచే సుమారు 5.07 లక్షల మంది ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసులతో పోలిస్తే 35 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నాయి. మొత్తం జరిమానాల్లో 50 శాతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాటానే ఉంది. (చదవండి: చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా) -
ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!
ఇదే ప్రశ్నని పూర్తిగా అడుగుతున్నాం. మీకు రెండు పర్మనెంట్ అకౌంట్ నంబర్లు ఉన్నాయా? అదేనండి.. రెండు పాన్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్ శాశ్వతం. ప్రత్యేకం. మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్మెంట్ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీ కట్టాల్సిందే.. ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. సరెండర్ చేయండి.. మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఎక్కడా ఆ నంబరును ప్రస్తావించకండి. తెలియజేయకండి. డిక్లేర్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదు. అంతటితో ఆగిపోకుండా వెంటనే ఆ నంబరును సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయాలి.. సరెండర్ అంటే కార్డుని ఫిజికల్గా డిపార్ట్మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్లైన్లోనూ చేయవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్లోడ్ చేయండి. కొత్త పాన్ కోసం, మార్పుల కోసం దీన్ని వాడవచ్చు. కారణం అడగరు. వివరణ అక్కర్లేదు. విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు. దరఖాస్తు చాలు. వెంటనే సరెండర్ చేయండి. పెనాల్టీ వేసే ముందు.. నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి. ఎగవేతకు ఇదే నాంది కాగలదు. కాబట్టి, అలా చేయకండి. వాడిన సందర్భంలో ఎగవేత లేదని రుజువు చేయలేకపోతే పెనాల్టీ పడుతుంది. బండి అంతదాకా పోనివ్వకండి. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
ఓలా ఫైనాన్షియల్ సర్వీస్కు ఆర్బీఐ భారీ జరిమానా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓలా ఫైనాన్షియల్ సర్వీస్కు పెనాల్టీ విధించింది. ఆర్బీఐ రెగ్యులటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనే కారణంతో ఆర్బీఐ.. ఓలాకు రూ.1,67,80,000 (రూ.1.67 కోట్లు) ఫైన్ విధించింది. ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఆగస్ట్ 25, 2021లో జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(పీపీఐఎస్) తో పాటు.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు చేసే, చేసిన లావాదేవీలపై బోర్డు ఆమోదం తప్పని సరి చేస్తూ ఆర్బీఐ తెచ్చిన పాలసీ (మాస్టర్ డైరెక్షన్) కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 25,2016 లలో జారీ చేసిన కేవైసీలపై ఆర్బీఐ పైన పేర్కొన్నట్లుగా భారీ మొత్తంలో జరిమానా విధించింది. మార్గ దర్శకాల్ని పాటించనందు వల్ల పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 సెక్షన్ 30 కింద ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు తెలిపింది. అయితే ఆర్బీఐ విధించిన జరిమానాను ఓలా వ్యతిరేకిస్తే..అందుకు కారణాల్ని వెల్లడించాలని పేర్కొంది. సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించాలని నిర్ణయించినట్టు సమాచారం.\ -
విజయ్ మాల్యాకు భారీ షాక్, మొత్తం చెల్లించకపోతే: సుప్రీం కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్కు పారిపోయిన మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. -
ఆమ్నెస్టీ ఇండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఫెమా ఉల్లంఘనల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సదరు సంస్థకు భారీ పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. కంపెనీ మాజీ సీఈవో ఆకర్ పటేల్కూ భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ‘విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం’ (FCRA)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు రుజువు అయ్యాయని చెప్తూ.. ఉల్లంఘనల కింద రూ.51.72 కోట్లను పెనాల్టీని విధిస్తున్నట్లు ప్రకటించింది ఈడీ. అలాగే మాజీ హెడ్ ఆకర్ పటేల్కు సైతం పది కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు ఆమ్నెస్టీ స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని గతంలోనే పేర్కొంది. భారతదేశంలో తన ఎన్జీవో కార్యకలాపాలను విస్తరించేందుకు విదేశీ భాగస్వామ్య నియంత్రణ చట్టం (FCRA)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ (AIIFT), ఎఫ్సీఆర్ఏ క్రింద ఉన్న ఇతర ట్రస్టులకు ముందస్తు రిజిస్ట్రేషన్, అనుమతులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినప్పటికీ.. ఇది జరిగిందని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈడీ ఏం న్యాయవ్యవస్థ కాదని.. మళ్లీ పోరాడి కోర్టులో నెగ్గుతామని ఆకర్పటేల్ తాజాగా ట్వీట్ చేశారు. The Adjudicating Authority of ED has adjudicated a SCN issued to M/s Amnesty India International Pvt. Ltd.(AIIPL) and its CEO Shri Aakar Patel for contravention of the provisions of FEMA and imposed penalty of Rs. 51.72 Crore and Rs 10 Crore respectively. — ED (@dir_ed) July 8, 2022 the ed is the govt not the judiciary. we will fight it (again) and win (again) in court. — Aakar Patel (@Aakar__Patel) July 8, 2022 -
బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి
సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజులుగా జరిగిన హడావుడి ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ నేపథ్యంలో బీజేపీ స్వాగత ఆర్భాట హోర్డింగులు, ఫ్లెక్సీలు.. అందుకు ప్రతిగా టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాల ఫ్లెక్సీలు, హోర్డింగుల యుద్ధం ముగిసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులకు స్పందించిన సీఈసీ ఈ– చలానాలు జారీ చేస్తోంది. సోమవారం సాయంత్రం వరకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 22 లక్షలు, టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు రూ. 3 లక్షలకు పైగా ఈచలానాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫిర్యాదుల వరద కూడా తగ్గడంతో దాదాపుగా ఇక వీటికి బ్రేక్ పడినట్లే భావిస్తున్నారు. కాషాయం అలా.. గులాబీ ఇలా.. ► బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా అతిరథ మహారథులు హాజరు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ప్రధానిని ఆహ్వానిస్తూ స్వాగత తోరణాలతో పాటు భారీయెత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. అందుకు ప్రతిగా తామేం తక్కువ తినలేదన్నట్లు బీజేపీ ప్రభావం కనిపించకుండా నగరమంతా గులాబీరంగు కనిపించేలా టీఆర్ఎస్ శ్రేణులు సైతం నగరంలో అమల్లో లేని పథకాలతో సహ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ ప్రచార యుద్ధం ముగిసింది. ► వీటి ప్రభావం ఏమేరకు పడిందో పరిశీలిస్తే రెండు పార్టీలకు వెరసీ.. రూ. 25 లక్షల పెనాల్టీలు పడ్డాయి. వీటిల్లో రూ. 2వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలున్నప్పటికీ, రూ. 5 వేల పెనాల్టీలు అధికసంఖ్యలో ఉన్నాయి. సగటున రూ. 5 వేలు లెక్కలోకి తీసుకున్నా రెండు పార్టీలవి మొత్తం కలిపి దాదాపు 500 ఫ్లెక్సీలకు పెనాల్టీలు విధించారు. వీటిలో ఏపార్టీ ఎన్నింటికి చెల్లిస్తుంది.. ఎంత మొత్తం చెల్లిస్తుంది అనేది తెలియడానికి సమయం పట్టనుంది. గతంలోనూ ఆయా పార్టీలకు భారీగా ఈ–చలానాలు జారీ చేసినా ఎవరు ఎన్ని చెల్లించారో సంబంధిత అధికారులు వెల్లడించలేదు. ప్రైవేట్ సంస్థలు పెనాల్టీలు చెల్లించకపోతే వాటిని సీజ్ చేస్తున్న సీఈసీ విభాగం వీరి విషయంలో ఏం చేయనుందో వేచి చూడాల్సిందే. చెత్త చార్జీలు రూ. 5 లక్షలు.. ► సీఈసీ పెనాల్టీలు విధిస్తుంది తప్ప ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించడం లేదు. వీటి తొలగింపు బాధ్యతలు జీహెచ్ఎంసీలోని సంబంధిత సర్కిళ్లకు అప్పగించారు. గత రెండు రోజులుగా వీటి తొలగింపు పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో సాధారణ రోజుల్లో సగటున 6500 మెట్రిక్టన్నుల వ్యర్థాలు వెలువడేవి కాగా వర్షాకాలం మొదలయ్యాక సగటున రోజుకు 7000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ► గడచిన రెండు రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత్రా ప్రచార సామగ్రి తొలగింపు మొదలయ్యాక సగటున 7600 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 1223 మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా డంపింగ్ యార్డుకు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జవహర్నగర్కు వ్యర్థాలు తరలించేందుకు జీహెచ్ఎంసీ మెట్రిక్ టన్నుకు రూ. 400 ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన పార్టీల ప్రచార సామగ్రి వ్యర్థాల తరలింపునకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయింది. అంటే ప్రధానమంత్రి నగర పర్యటన ప్రభావం దాదాపు రూ. 30 లక్షలన్న మాట! బీజేపీ నేతల తిరుగు పయనం మూడ్రోజుల పాటు నగరంలోనే మకాం వేసి గ్రేటర్ కేడర్లో జోష్ నింపిన బీజేపీ జాతీయ నేతలు సోమవారం ఉదయం తిరుగుముఖం పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏపీలోని భీమవరం బయలుదేరారు. హోం మంత్రి అమిత్షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర మంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు పయనమయ్యారు. ఆదివారం జరిగిన విజయ సంకల్ప సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా జనం తరలిరావడం, రెండు గంటల పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతమంతా మోదీ నామస్మరణలతో మార్మోగడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. (క్లిక్: పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!) -
గెలాక్సీ ఫోన్లలోవాటర్-రెసిస్టెన్స్ ఫీచర్: శాంసంగ్కు భారీ షాక్
న్యూఢిల్లీ: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ల ఫీచర్కు సంబంధించి అవాస్తవాలను ప్రకటించిందంటూ ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) భారీ జరిమానా విధించింది. కొన్ని మోడళ్ల గెలాక్సీ స్మార్ట్ఫోన్లలో వాటర్-రెసిస్టెన్స్ ఫీచర్ గురించి తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని ఏసీసీసీ తేల్చింది. దీనికి గాను స్థానిక శాంసంగ్ యూనిట్కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 76 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని ఆస్ట్రేలియా కాంపిటీషన్ రెగ్యులేటరీ గురువారం తెలిపింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మార్చి 2016, అక్టోబర్ 2018 మధ్య, ఆస్ట్రేలియాలో గెలాక్సీ S7, S7 ఎడ్జ్, A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్ , ఎస్ నోట్ 8 మెడల్స్ 3.1 మిలియన్ ఫోన్లను శాంసంగ్ విక్రయించిందని పేర్కొంది. ఈ మేరకు కమిటీ చైర్ గినా కాస్-గాట్లీబ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గెలాక్సీ స్మార్ట్ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదని, లేదా నీటిలో తడిచిన తర్వాత పూర్తిగా పనిచేయడం మానేసాయంటూ వినియోగదారుల వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్లను కొలనులు లేదా సముద్రపు నీటిలో కూడా ఉపయోగించవచ్చని క్లెయిమ్ చేస్తూ, ఇన్-స్టోర్, సోషల్ మీడియా ప్రకటనలను కంపెనీ విడుదల చేసిందని రెగ్యులేటరీ ఆరోపించింది. ఈ మేరకు శాంసంగ్పై రెగ్యులేటరీ గతంలో దావా వేసింది. అయితే తాజా పరిణామంపై శాంసంగ్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్కు హక్కు ఉంటుందా?
టి20 బ్లాస్ట్లో భాగంగా డెర్బీషైర్, వార్విక్ షైర్ మధ్య మ్యాచ్లో కార్లోస్ బ్రాత్వైట్ చేసిన తప్పుకు ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ జట్టు తప్పు చేస్తే పీల్డ్ అంపైర్కు వెంటనే యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే క్రికెట్ పుస్తకాలు మాత్రం అంపైర్కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్ అంపైర్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టులోని ఒక ఫీల్డర్.. బ్యాటర్ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్ లేదా లెగ్ అంపైర్లో ఎవరో ఒకరు.. పీల్డర్ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్ లేదా బౌలర్ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్ జట్టుకు వార్నింగ్ ఇస్తూ డెడ్ బాల్గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్బాల్గా పరిగణించి.. బ్యాటర్ను నాటౌట్గా పరిగణిస్తారు. లా 45.5.5: ఫీల్డర్ లేదా బౌలర్.. బ్యాటర్లతో ఫిజికల్గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్ తీసుకోవాలి లా 45.5.6: బౌలింగ్ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్ అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్ జట్టు కెప్టెన్కు వివరిస్తారు. లా 45.5.7: బౌలర్ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్బాల్గా కౌంట్ చేస్తారు. లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు. లా 45.5.9: స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం. లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్ కౌన్సిల్కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్ జట్టుపై ఏ యాక్షన్ తీసుకున్నారనేది వివరించాలి. -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్బాల్గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్షైర్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
జియో-ఫేస్బుక్ డీల్: రిలయన్స్కు ఝలక్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు భారీ షాక్ తగిలింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించి ఫెయిర్ డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో ఇద్దరు అధికారులపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝుళిపించింది. రిలయన్స్, సావిత్రి పరేఖ్, కె సేతురామన్కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా సంయుక్తంగా, లేదా వేర్వేరుగా చెల్లించాలని ఆదేశించింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో మీడియాలో వెలువడ్డాయని, 9.99 శాతం వాటా కొనుగోలుకు ఫేస్బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేసిన తరువాత కూడా ఇవ్వలేదనీ, రెగ్యులేటరీ సెబీకి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని రిలయన్స్పై ఉందని సెబీ పేర్కొంది. అయితే ఆలస్యంగా 2020 ఏప్రిల్22న ఎక్స్ఛేంజీలకు అందించిందనీ తెలిపింది. ఈ 28 రోజుల ఆలస్యానికి జరిమానా విధించామని సెబీ అధికారి బర్నాలీ ముఖర్జీ తన ఉత్తర్వులో తెలిపారు. ఈ వార్తలతో రిలయన్స్ షేరు మంగళవారం మార్కెట్ ఆరంభంలో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. మరోవైపు సెబీ జరిమానాపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని మండిపడింది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. 2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. అదే 24 గంటలు దాటితే రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ పేర్కొంది. -
ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా
DGCA Fines Vistara, సాక్షి, ముంబై: విమానయాన సంస్థ విస్తారాకు భారీ షాక్ తగిలింది. సరియైన శిక్షణ లేని పైలట్కు విమాన ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినందుకుగాను సంస్థకు భారీ జరిమానా విధించింది. రూ. 10 లక్షల పెనాల్టీ విధిస్తూ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. సిమ్యులేటర్ శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విస్తారా విమానాన్ని ల్యాండ్ చేశారనేది ఆరోపణ. అయితే ఈ విమానం ఎక్కడ నుండి బయలుదేరింది, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టత లేదు. ఇండోర్ విమానాశ్రయంలో సరైన శిక్షణ లేని పైలట్ ప్రయాణీకుల విమానాన్ని ల్యాండింగ్కు అనుమతించినందుకు విస్తారాపై రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు గురువారం తెలిపారు. విమానంలో పైలట్, సిమ్యులేటర్లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని పేర్కొన్నారు. ఇది విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అంటూ అధికారులు మండిపడ్డారు. ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్లో పైలట్కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. కెప్టెన్, పైలట్ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన విషయమంటూ, నిబంధనలు ఉల్లఘించిన విస్తారాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఇండిగో ఓవర్ యాక్షన్: డీజీసీఏ స్ట్రాంగ్ రియాక్షన్
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కకుండా నిరాకరించి దివ్యాంగ బాలుడిని ఘోరంగా అవమానించిన విమానయాన సంస్థ ఇండిగోకు షాక్ తగిలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది. అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని కూడా ఆదేశించింది. ఇటీవల (మే 7న) చోటు చేసుకున్న ఈ ఘటనపై విమాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది. దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. -
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్టెక్ సంస్థలు బీఎన్పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్పెయిడ్, జెస్ట్మనీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్పీఎల్తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్ఫామ్లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్లో యాక్టివ్గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్ఫామ్లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: నిబంధనల ఉల్లంఘనలపై ప్రయివేట్ రంగ సంస్థలు యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్లకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. కేవైసీ సంబంధ మార్గదర్శకాలతోపాటు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంకుకు రూ. 93 లక్షల పెనాల్టీ విధించింది. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంకును సైతం రూ. 90 లక్షల ఫైన్ కట్టమంటూ ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ అంశంలో చార్జీల విధింపు, కేవైసీ మార్గదర్శకాలు తదితరాలలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక, మోసాల విషయంలో వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన వర్గీకరణ, రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను ఐడీబీఐ బ్యాంక్కు పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. కార్పొరేట్ కస్టమర్లు, స్పాన్సర్ బ్యాంకుల మధ్య చెల్లింపుల వ్యవస్థ నియంత్రణను పటిష్టపరచడంలో మార్గదర్శకాల ఉల్లంఘన సైతం వీటిలో ఉన్నట్లు వివరించింది. -
మాస్క్ ఇక తప్పనిసరి కాదు.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G — ANI (@ANI) April 1, 2022 కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు. -
పాన్–ఆధార్ లింక్ చేయకపోతే పెనాల్టీ
న్యూఢిల్లీ: ఆధార్తో పాన్ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్తో పాన్ లింకింగ్ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్ పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) పోతుంది. ‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్–ఆధార్ లింకింగ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు. అన్నింటికీ పాన్ అవసరమే.. ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్లు తదితర) ఇక మీదట పాన్ ను ఆధార్తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి. దీంతో పాన్ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్లు ఆధార్తో లింక్ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్లు జారీ అయ్యాయి. -
'టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్'
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. జీవం లేని పిచ్ను తయారు చేశారంటూ మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అంతా విమర్శించారు. నాసిరకం పిచ్ను తయారు చేసి టెస్టు క్రికెట్కున్న గొప్పతనాన్ని నాశనం చేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు. తాజాగా రావల్పిండి పిచ్పై ఐసీసీ స్పందించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే రావల్పిండి పిచ్ అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో నాసిరకమైన పిచ్ను తయారు చేశారంటూ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే పేర్కొన్నారు. ''ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య తొలి టెస్టుకు ఉపయోగించిన రావల్పిండి పిచ్లో తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు. అటు స్పిన్నర్లకు.. ఇటు పేసర్లకు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బ్యాటర్స్ పండగ చేసుకున్న ఈ పిచ్ కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో తయారు చేశారు. నిజం చెప్పాలంటే టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని చెప్పవచ్చు. అసలు బంతికి ఏ మాత్రం సహకారం అందలేదు. రెండు రోజులంటే పరవాలేదు.. ఐదు రోజులు ఒక పిచ్పై ఎలాంటి మార్పులు లేకపోవడమనేది ఆశ్చర్యం కలిగించింది. అందుకే రావల్పిండి పిచ్కు అత్యంత సాధారణ పిచ్గా రేటింగ్ ఇచ్చాం.'' అంటూ చెప్పుకొచ్చారు. ఐసీసీ రిఫరీ రంజన్ మదుగులే కాగా రిఫరీ రంజన్ మదుగలే వ్యాఖ్యలను సమర్థించిన ఐసీసీ నాసిరకం పిచ్ తయారు చేసినందుకు ఒక డీ మెరిట్ పాయింట్ను ఫెనాల్టీగా విధించింది. ఇక పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసింది. ఐదు రోజుల మ్యాచ్లో బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నారు. ఇరు జట్లు కలిపి 1187 పరుగులు చేయగా.. కేవలం 14 వికెట్లు మాత్రమే నేలకూలాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12 నుంచి జరగనుంది. చదవండి: Sakshi Singh Dhoni: క్రికెటర్ల భార్యలైతే స్వేచ్ఛ ఉండకూడదా?.. ధోని భార్య సాక్షి IND Vs SL: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్ -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ.2 వేల జరిమానా రూ.500కు తగ్గింపు
న్యూఢిల్లీ: కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోర్ వీలర్ వాహనాల్లో కలిసి ప్రయాణించేవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 28(సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు మాస్క్ తప్పనిసరి ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధలను విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు లేకుండా తిరిగితే విధించే రూ.2 వేల జరిమానాను రూ.500 తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఫోర్ వీలర్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మాస్క్ ధరించాలన్న నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది. కారులో ఒక్కరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్ చేయండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్ రివకరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్ అరీఫ్ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. -
ఎస్బీఐ సైనేజీ కేసు,7 సంస్థలకు సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది. వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్బీఐ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది. -
క్యాచ్ మిస్ చేసిన పుజారా.. ఐదు పరుగుల పెనాల్టీ
కేప్టౌన్ వేదికగా సఫారీలతో మూడో టెస్టులో పుజారా క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్ పంత్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..!
RBI Imposes Penalty On Union Bank: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గట్టి షాకిచ్చింది.ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా మరికొన్ని నిబంధనలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సోమవారం(నవంబర్ 29)న కోటి రూపాయల జరిమానా విధించింది. రెగ్యులేటరీ సమ్మతిలో భాగంగా బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాలను బహిర్గత పరచడానికి వీలు లేదు. ఈ విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019కు సంబంధించిన స్టాట్యూటరీ ఇన్స్పెక్షన్ ఫర్ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ను ఆర్బీఐ నిర్వహించింది. 2019 ఐఎస్ఈ సంబంధిత కరస్పాండెన్స్లు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ రెడ్ ఫ్లాగ్ ఖాతాలను వర్గీకరించడంలో, సెక్యూరిటీ రెసిపట్ల ప్రొవిజనింగ్ను బహిర్గతం చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫల్యం చెందినట్లు ఆర్బీఐ పేర్కొంది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫైన్ను విధించింది. అంతేకాకుండా బ్యాంకుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. చదవండి: ఎస్బీఐకు ఆర్బీఐ భారీ పెనాల్టీ! ఎంత? ఎందుకంటే.. -
రూల్స్ ఉల్లంఘన.. ఎస్బీఐకు భారీ పెనాల్టీ
RBI Impose Penalty To SBI: భారతీయ బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. రుణగ్రహీత కంపెనీల్లో ఆ కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉందన్న కారణంతో ఎస్బీఐకు ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 19 సబ్ సెక్షన్ 2 ప్రకారం.. నవంబర్ 26న ఈ పెనాల్టీ విధించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏ బ్యాంక్ కూడా 30 శాతం కంటే ఎక్కువ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ను కలిగి ఉండడానికి వీల్లేదు. చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. కేరళ సర్కార్ అసంతృప్తి ఈ మేరకు 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్బీఐ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఎస్బీఐకు షోకాజ్ నోటీసు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే షేర్ మార్కెట్లో ఎస్బీఐ నష్టాల బాటలో పయనిస్తోంది. -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
Paytm: పేటీఎంకు భారీ షాక్
డిజిటల్ పేమెంట్తో పాటు ఈ-కామర్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్న పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(PPBL)కు కోటి రూపాయల పెనాల్టీ విధించింది. పేమెంట్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007కు విరుద్దంగా వ్యవహరించిందన్న ఆరోపణలపై ఆర్బీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు నిజమని తేలడంతో పేటీఎంకు భారీ జరిమానా విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. ఆథరైజేషన్ సర్టిఫికెట్ కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పెట్టుకున్న అప్లికేషన్ సమాచారం సక్రమంగా లేదని సెంట్రల్ బ్యాంక్(ఆర్బీఐ) పెనాల్టీ విధించడానికి గల కారణాన్ని వెల్లడించింది. పీఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 26(2) ప్రకారం.. ఇది నేరమని పేర్కొంది ఆర్బీఐ. అంతేకాదు చెల్లింపుల పరిమితి నిబంధనను ఉల్లంఘించినందుకు(2019-2020 మధ్య చెల్లింపులకు సంబంధించి) వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు సైతం 27 లక్షల రూపాయల జరిమానా విధించింది ఆర్బీఐ. హాట్ న్యూస్: నువ్వేం తోపు కాదు.. ఫేస్బుక్కు 520 కోట్ల జరిమానా -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్
సాధారణంగా నింబంధనలు పాటించని వాహనాదారులను ఆపి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఫైన్ వేసినప్పుడు వావాహనదారుడి వివరాలను తీసుకొని రశీదు ఇస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన ఓ వాహనదారుడు చెప్పిన వివారాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేస్తాడు. అయితే అప్పటికే తాను ఫైన్ కట్టినట్లు ఆ వాహనదారుడు చెబుతాడు. అయితే తప్పనిసరిగా మళ్లీ జరిమానా కట్టాలని పోలీసులు అనడంతో.. చేసేదేంలేక ఆ వాహనదారుడు తన అసలు పేరు కాకుండా.. తన పేరు రామా(రామన్)అని, తండ్రి పేరు దశరథ, ఊరు అయోధ్య అని చెబుతాడు. ప్రభుత్వానికి ఫైన్ల రూపంలో డబ్బు వస్తున్నప్పుడు ప్రయాణికుడు ఏం చెప్పినా తనకు అవసరం లేదన్నట్టు పోలీసు రశీదు రాసి ఇస్తాడు. దీనికి సంబంధించిన రశీదును వాహనదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల కాలంలో కేరళలో ట్రాఫిక్ పోలీసులు కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు విచ్చలవిడిగా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా
ముంబై: మనం బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. అడిషనల్ ఛార్జీలను వసూలు చేస్తాయి.ఇప్పుడు బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది. నగదు ఉండని ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలను పరిష్కరించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. 2021 జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి. చదవండి: ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా -
కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్పై సెబీ రూ. 10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: రీగాలియా రియాలిటీ లిమిటెడ్ సంస్థలో షేర్లను కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే విషయంలో జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. నిర్దేశిత వ్యవధిలోగా తప్పనిసరిగా ప్రకటించకపోవడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే జరిమానా విధించామని సెబీ పేర్కొంది. వివరాల్లోకి వెడితే రీగాలియా ప్రమోటర్లు 55.56 శాతం వాటాలను తనఖా పెట్టి కార్వీ నుంచి రూ. 7 కోట్లు రుణం తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను కార్వీ స్వాధీనం చేసుకుంది. దీంతో రీగాలియాలో కార్వీ వాటాలు సెబీ నిర్దేశిత స్థాయికి మించి 55.56 శాతానికి చేరాయి. ఫలితంగా పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి షేర్ల కొనుగోలుకు 45 రోజుల్లోగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించినప్పటికీ కార్వీకి చుక్కెదురైంది. సెబీని సమర్థిస్తూ 2018 ఏప్రిల్లో శాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా కార్వీ బహిరంగ ప్రకటన చేయాల్సింది. కానీ 81 రోజుల తర్వాత 2018 ఆగస్టులో కార్వీ ఓపెన్ ఆఫర్ ప్రకటన చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘన కింద భావిస్తూ సెబీ తాజాగా జరిమానా విధించింది. -
గూగుల్కు భారీ షాకిచ్చిన రష్యా
మాస్కో: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్కు 3 మిలియన్ రూబిళ్లు ( సుమారు 31 లక్షల రూపాయల) జరిమానా విధించింది. ఈ విషయంలో గూగుల్కు ఇది మొదటి జరిమానా అని మాస్కో టాగన్స్కీ జిల్లా కోర్టు గురువారం తెలిపింది. ఈ జరిమానాను ధృవీకరించిన గూగుల్ దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రష్యాకు టెగ్ దిగ్గజాలకు ప్రధానంగా గూగుల్కు మధ్య ఇటీవల నెలకొన్న వైరుధ్యాల మధ్య ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేయనందుకు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్కు 6 మిలియన్ రూబిళ్లు వరకు జరిమానా విధించవచ్చని స్టేట్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్కోమ్నాడ్జోర్ గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధిత విషయాలను తొలగించడంలో వైఫల్యం, రష్యాలో విదేశీ టెక్ సంస్థల కార్యాలయాలను తెరవని కారణంగా సోషల్ మీడియా దిగ్గజాలకు రష్యా ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. నిషేధిత కంటెంట్ను తొలగించనందుకు గతంలో గూగుల్కు జరిమానా విధించింది. అలాగే అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ పైనా రష్యా చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. మరోవైపు ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా గూగుల్కు వ్యతిరేకంగా మూడు కేసులు నమోదు చేసింది. -
రాజ్కుంద్రాకు షాకిచ్చిన సెబీ
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. శిల్పా శెట్టి, రాజ్కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది.సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు వయాన్ సంస్థ ఉద్యోగులకు రాజ్కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్కుంద్రా బెయిల్ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్ పిటీషన్ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్పై భారీ జరిమానా
సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ తో సహా కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాల నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్ పై ₹5 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్ సీబిలు/యుసీబిల మధ్య చెల్లింపు పర్యావరణ వ్యవస్థ నియంత్రణలను బలోపేతం చేయడంపై ఆర్బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక స్టేట్ మెంట్ లో తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (చట్టం) సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద ఆర్బీఐ జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31, 2017(ఐఎస్ఈ 2017), మార్చి 31, 2018(ఐఎస్ఈ 2018), మార్చి 31, 2019 (ఐఎస్ఈ 2019) నాటికి యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన లావాదేవీలపై చట్టబద్దంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు తనిఖీల సమయంలో ఆర్బీఐ జారీ చేసిన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని సలహా ఇస్తూ సెంట్రల్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. తాము ఇచ్చిన నోటీసులకు బ్యాంకు సమాధానాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత ఆర్బీఐ ఆదేశాలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లఘించినట్లు తేలడంతో జరిమానా విధించినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. -
చైనా సంచలన నిర్ణయం: బిలియనీర్కు భారీ షాక్
బీజింగ్: బిలియనీర్, అగ్రికల్చరల్ టైకూన్ సన్ దావూకు (66) చైనా భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్పింగ్ ప్రభుత్వం తాజాగా సన్దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్ కోర్టు ప్రకటించింది. దీనిపై సన్ న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్ దావూ. ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై గొంతెత్తే సన్ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్ను అరెస్ట్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే 2021 మేలో సన్ను మరోసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
కార్ల కంపెనీలకు భారీ షాక్, ఏకంగా రూ.7,470 కోట్ల జరిమానా
బ్రసెల్స్: కాలుష్య ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అమలు చేయకుండా కుమ్మక్కయినందుకు గాను జర్మనీకి చెందిన నాలుగు దిగ్గజ కార్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి చర్యలు తీసుకుంది. 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,470 కోట్లు) జరిమానా విధించింది. దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వ్యాగన్, ఆడి, పోర్షె కంపెనీలు పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే టెక్నాలజీ విషయంలో పోటీపడకుండా కుమ్మక్కై వ్యవహరించాయని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు చేసిన ఈయూ నాలుగు సంస్థలపై తాజా పెనాల్టీ ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని వెల్లడించినందుకు గాను దైమ్లర్ను విడిచిపెట్టింది. ధరల విషయంలో కుమ్మక్కయినందుకు కాకుండా టెక్నాలజీలను అమలు చేయనందుకు గాను యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే ప్రథమం. ‘ఈయూ ఉద్గారాల ప్రమాణాలకు తగిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ తయారీ సంస్థలు వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టాయి. ఇది చట్టవిరుద్ధమైన చర్య. దీనివల్ల తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్లు కోల్పోయారు‘ అని ఈయూ యాంటీట్రస్ట్ చీఫ్ మార్గరెత్ వెస్టాజెర్ వ్యాఖ్యానించారు. సాధారణంగా డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కార్లలో యాడ్బ్లూ అనే యూరియా సొల్యూషన్ను ఉపయోగిస్తుంటారు. దీనికోసం వాహనాల్లో ప్రత్యేక ట్యాంకు ఉంటుంది. దీని పరిమాణం పెద్దగా ఉంటే ఉద్గారాల విడుదల మరింత తగ్గుతుంది. అయితే, వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశ్యంతో సదరు వాహన తయారీ సంస్థలు తమ కార్లలో యాడ్బ్లూకి సంబంధించి చిన్న ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయనేది ఆరోపణ. -
ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ చేస్తే, భారీ జరిమానా: ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ: అవాంఛనీయ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది. రూ.10,000 వరకు జరిమానా విధింపుతోపాటు, టెలీమార్కెట్లకు కనెక్షన్ల తొలగింపు కూడా ఇందులో భాగంగా ఉండనుంది. మళ్లి మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని ట్రాయ్ హెచ్చరించింది. 50 ఉల్లంఘనల తరువాత టెలిమార్కెటర్లు చేసే ప్రతీకాల్, లేదా ఎస్ఎంఎస్కు రూ. 10వేల దాకా పెనాల్టీ ఆ తరువాత కూడా ఉల్లంఘన కొనసాగితే, సంబంధిత ఐడీ, అడ్రస్ ప్రూఫ్లను రెండేళ్లపాటు బ్లాక్ చేయనుంది. ‘‘టెలికం చందాదారులు ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా ఉండేందుకు ‘ఎస్ఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1909’కు పంపించాలి. దీంతో లావాదేవీల సమాచారం మినహా అన్ని రకాల ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది’’అని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) తన నోటీస్లో పేర్కొంది. కేంద్ర స్థాయిలో టెలికం శాఖ ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను (డీఐయూ) ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, లైసెన్స్డ్ సర్వీస్ ప్రాంతంలోని క్షేత్రస్థాయి యూనిట్లలో టెలికం అనలైసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (టీఏఎఫ్సీవోపీ)ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి. జరిమానాలు.. ట్రాయ్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ నుంచి అవాంఛనీయ వాణిజ్య సమాచారం వినియోగదారులకు వెళితే పలు రకాల పెనాల్టీలను విధించనున్నారు. తొలుత రూ.1,000 జరిమానాతో సరిపెట్టి.. ఆ తర్వాత నిబంధన ఉల్లంఘనకు రూ.5,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు.. కనెక్షన్ రద్దు చేయడానికి సంబంధించి హెచ్చరిక జారీ అవుతుంది. మూడో ఉల్లంఘనను గుర్తిస్తే రూ.10,000 జరిమానాతోపాటు కనెక్షన్ను కూడా రద్దు చేయనున్నారు. ఇక నమోదు చేసుకోని టెలీమార్కెటర్ నుంచి అవాంఛనీయ కాల్ లేదా సందేశం వస్తే.. సంబంధిత టెలికం కనెక్షన్ను గుర్తిస్తారు. రోజుకు 20 కాల్స్, 20ఎస్ఎంఎస్ల పరిమితి అమల్లోకి వస్తుంది. గుర్తింపు ధ్రువీకరణ పూర్తయ్యే వరకూ డేటా వినియోగానికి అవకాశం ఉండదు. సిమ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ గైడ్లైన్స్ 2018 కింద అమలు చేయాల్సి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ. 5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు. -
Lockdown: 38 రోజులు.. రూ. 61 లక్షలు..
సాక్షి, సిరిసిల్లక్రైం: కరోనా వైరస్ను నివారించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. గత నెల 12 నుంచి ఈ నెల 19 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసులు కేసుల నమోదుతోపాటు జరిమానాలు విధించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జిల్లాలో రూ.61.03 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. ప్రతీ నిత్యం ఎస్పీ రాహుల్హెగ్డే లాక్డౌన్ అమలును పరిశీలించారు. కాలినడకనా.. బైక్పై కాలనీల్లో ! లాక్డౌన్ అమలు చేసే క్రమంలో ఎస్పీ, డీఎస్పీ, సీఐలు కాలినడకన ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేసిన సందర్భాలు అనేకం. శివారుప్రాంతాలు, కాలనీల్లో కొందరు లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదని బైక్లపై పోలీసులు గస్తీ చేపట్టారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలీసుల ప్రత్యేక ఐసోలేషన్ వ్యాన్ విధానం ఉల్లంఘనుల్లో భయాన్ని కల్పించింది. రూ.61.03 లక్షల జరిమానా జిల్లాలో 38 రోజులపాటు కొనసాగిన లాక్డౌన్లో నిబంధనలు అతిక్రమించినందుకు వాహనదారులపై పోలీసులు రూ.61.03 లక్షల జరిమానా విధించినట్లు గణాంకాలున్నాయి. జిల్లాలో 602 వాహనాలు, 80 దుకాణాలు సీజ్ చేశారు. 573 ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. మాస్కు ధరించని 682 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్ల డించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం 5,431 కేసులు నమోదైనట్లు తెలిపారు. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి కరోనా నియంత్రణకు అందరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. సామాజిక బాధ్యతగా లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలి. దీని ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగా, కుటుంబాన్ని కరోనా బారిన పడకుండా చూసిన వారవుతారు. – రాహుల్హెగ్డే, ఎస్పీ, సిరిసిల్ల చదవండి: 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్..! -
జీడీఆర్: సెబీ భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూల కృత్రిమ లావాదేవీల(మ్యానిప్యులేషన్) కేసులో 14 సంస్థలు, వ్యక్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భారీగా రూ. 31 కోట్లకుపైగా జరిమానాను విధించింది. సెబీ కన్నెర్ర చేసిన సంస్థలు, వ్యక్తులలో అరుణ్ పంచారియా, పాన్ ఆసియా అడ్వయిజర్స్ తదితరాలున్నాయి. వ్యక్తిగతంగా పంచారియాకు రూ. 25 కోట్ల జరిమానా విధించగా.. పాన్ ఆసియా అడ్వయిజర్స్, అల్టా విస్టా(వింటేజ్ ఎఫ్జెడ్ఈ)లపై రూ. 3 కోట్లు చొప్పున జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూలలో అక్రమ పథకం ద్వారా పంచారియా తదితర సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ. -
గూగుల్కు భారీ జరిమానా
ప్యారిస్: ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై టెక్ దిగ్గజం గూగుల్కు ఫ్రాన్స్ 220 మిలియన్ యూరోల (268 మిలియన్ల డాలర్లు) జరిమానా విధించింది. పోటీ సంస్థలను దెబ్బతీసే తరహా విధానాలను కంపెనీ పాటించిందని ఫ్రాన్స్ గుత్తాధిపత్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అథారిటీ నిర్ధారించింది. జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్ తన విధానాలను మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశాలు లభించగలవని కాంపిటీషన్ అథారిటీ పేర్కొంది. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు కంపెనీ మొగ్గు చూపిందని తెలిపింది. రూపర్ట్ మర్డోక్కి చెందిన న్యూస్ కార్ప్, ఫ్రాన్స్ పేపర్ గ్రూప్ లె ఫిగారో, బెల్జియంకి చెందిన రోసెల్ లా వాయిస్ తదితర సంస్థలు ఆరోపణలు చేసిన మీదట గూగుల్పై కాంపిటీషన్ అథారిటీ విచారణ జరిపింది. దీనిపై స్పందించిన గూగుల్ జరిమానా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాపార విధానాన్ని మార్చేందుకు సమ్మతించింది. చదవండి : stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్ నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్కు చైనా షాక్ బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం -
నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్ కంపెనీకి కోట్ల జరిమానా
కాలిఫోర్నియా: ఓ విద్యార్థిని నగ్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఐ ఫోన్ సంస్థ కొన్ని కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఓ విద్యార్థిని తన ఫోన్ రిపేర్కు వచ్చిందని సర్వీస్ సెంటర్కు ఇచ్చింది. అయితే ఫోన్ రిపేర్లో ఉన్నప్పుడే ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్టు చేసి ఉన్నాయి. వీటిని చూసి షాక్కు గురయిన ఆ యువతి ఐఫోన్ కంపెనీపై పోరాటం చేసింది. తత్ఫలితం ఆపిల్ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో కాలిఫోర్నియాలోని ఒరెగాన్కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్థిని తన ఫోన్ రిపేర్కు రావడంతో సమీపంలోని పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్కు వెళ్లింది. తన ఫోన్ బాగు చేయమని సర్వీస్ సెంటర్లో ఫోన్ ఇచ్చి వచ్చింది. కొన్నాళ్లకు ఫోన్లోని నగ్న ఫొటోలు, వీడియోలు ఆమె ఫేసుబుక్లో కనిపించాయని ఆమె స్నేహితులు చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని షాక్కు గురై వెంటనే తన ఫేస్బుక్లో నుంచి ఆ ఫొటోలు, వీడియోలను తొలగించారు. అనంతరం సర్వీస్ సెంటర్కు వెళ్లి నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయికి సంబంధించిన అంశం కావడంతో సంస్థ సున్నితంగా ఈ కేసును డీల్ చేసింది. అమ్మాయి పరువుకు సంబంధించిన విషయం కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టింది. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టగా మరమ్మతులు చేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేసినట్లు తేలింది. దీంతో ఆ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమ తప్పిదం జరగడంతో ఐఫోన్ రహాస్య ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. సామరస్యంగా మాట్లాడుకుని 5 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇచ్చేందుకు ఐఫోన్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ విషయాలు రహాస్యంగా ఉంచారు. కానీ టెలిగ్రాఫ్ బహిర్గతం చేసింది. ‘వినియోగదారుడు మానసిక క్షోభ అనుభవించారు’ అని భావించి ఐఫోన్ అంత భారీ మొత్తంలో పరిహారం అందించినట్లు తెలుస్తోంది. సంస్థకు చెడ్డపేరు రాకుండా ఈ విధంగా రహాస్య ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. ఈ పరిహారం త్వరలోనే ఆమెకు అందించనున్నారు. -
యస్ బ్యాంకునకు మరో షాక్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోషాక్ తగిలింది. బాండ్లకు సంబంధించిన మోసపూరిత చర్యల పాల్పడిందంటూ యస్ బ్యాంకుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించారనేది ఆరోపణ. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న తర్వాత విచారణ జరపగా, ఏటి-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది. 2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యకాలంలో వీటిని విక్రయించినట్టు సెబీ తెలిపింది. యస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్లోని 1300 మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించిందనీ, ఆయా పెట్టుబడులను సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండా రిస్కీ బాండ్లలోకి మార్చి విక్రయించిందని ఆరోపించింది. అధిక రాబడుల పేరుతో బ్యాంకు ఉద్యోగులు మోసంగించారని సెబీ నిర్ధారించింది. తద్వారా 70,80,90 ఏళ్ల వయసున్న చాలామంది వినియోగదారులు ప్రభావితమయ్యారని వాదించింది. ఫలితంగా యస్ బ్యాంక్ ప్రవేట్ వెల్త్ మేనేజ్మెంట్కి చెందిన వివేక్ కన్వర్పై కోటి రూపాయలు, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలా రూ.50లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సెబీ. -
జోష్గా బర్త్ డే పార్టీ.. ప్రధానమంత్రికి భారీ జరిమానా
ఓస్లో: కరోనా మహమ్మారి భూగోళాన్నంతా చుట్టేస్తో మానవాళిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశిస్తున్నా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే నార్వే దేశంలో ఏకంగా ప్రధానమంత్రే కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలు ఉల్లంఘించి తన జన్మదిన వేడుకను పర్వతప్రాంతంలోని ఓ రిసార్ట్లో ఘనంగా నిర్వహించుకుంది. దీంతో ఆమెకు అక్కడి అధికారులు భారీగా జరిమానా విధించారు. నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బర్గ్ ఇటీవల 60వ జన్మదిన వేడుక ఘనంగా చేసుకున్నారు. మొత్తం 13 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆ పార్టీలో పాల్గొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ఆమెకు జరిమానా విధించారు. ఎందుకంటే కరోనా సమయంలో ఏ కార్యక్రమమైనా పది మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దు. కానీ ప్రధాని ఎర్నా నిబంధనలు ఉల్లంఘించి తన కుటుంబసభ్యులు 13 మంది పాల్గొన్నారు. ఇది గమనించిన అధికారులు ఆమెకు తాజాగా నార్వే కరెన్సీలో రూ.20 వేలు జరిమానా విధించారు. అది మన కరెన్సీలో దాదాపు రూ.1.75 లక్షలుగా ఉంది.జర -
కూకట్పల్లిలో టు లెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: పైన కనిపిస్తున్న స్తంభానికి టులెట్ పేపర్ అంటించిన వారిని అద్దెకోసం ఎవరైనా సంప్రదించారో లేదో తెలియదు కానీ.. జీహెచ్ఎంసీ ఈవీడీఎం (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది. కూకట్పల్లిలోని దీన్ని ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్ చేస్తూ వీటివల్ల పోల్స్, గోడలు అంధ వికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జరిమానా విధించారు. ఇంతకీ జరిమానా విధించిన వ్యక్తి చిరునామా సైతం నగరంలో లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంగా పేర్కొంటూ ఈవీడీఎం జరిమానా జారీ చేసింది. మరోవైపు, అంతటితో ఆగని సదరు సొసైటీ అదే పిల్లర్పై ఉన్న ‘యాక్ట్ ఫైబర్నెట్’ సంగతేమిటని ప్రశ్నించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఈవీడీఎం నుంచి తిరిగి ఎలాంటి ప్రతి స్పందన కనిపించలేదు. చదవండి: ఎవరు పడితే వాళ్లు సీఎం కేసీఆర్ను తిడుతుండ్రు -
IPL 2021: మూడోసారి తప్పుచేస్తే మ్యాచ్ నిషేధం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్కు సంబంధించి బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, షార్ట్ రన్పై థర్ఢ్ అంపైర్ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్ పూర్తి చేయడం( 20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రూల్స్ అన్ని ఈ సీజన్ ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజాగా బీసీసీఐ మరో కీలక ప్రతిపాధనతో ముందుకొచ్చింది. స్లో ఓవర్రేట్ కారణంగా కొన్ని మ్యాచ్లు అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు జరుగుతున్నాయి. దీంతో స్లో ఓవర్రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ దండిగానే జరిమానా విధించనుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒకజట్టు మొదటిసారి స్లోఓవర్ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని సభ్యులందరి నుంచి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కెప్టెన్కు మినహాయింపు ఉంటుంది. ఇక మూడోసారి అదే తప్పు రిపీట్ అయితే మాత్రం కెప్టెన్కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. దీని నుంచి కూడా కెప్టెన్కు మినహాయింపు ఉంటుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్తో ఆరంభం కానుంది. చదవండి: ఐపీఎల్ 2021: వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా! -
మైక్రోసాఫ్ట్పైనే రివెంజా...టెకీకి భారీ షాక్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగికి కాలిఫోర్నియా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తనను ఉద్యోగంనుంచి తొలగించారన్న ఆక్రోశంతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగి దీపాంశు ఖేర్ ప్రతీకారం తీర్చు కోవాలనుకున్నాడు. సుమారు 1200 యూజర్ అకౌంట్లను డిలీట్ చేసి పారేసి సైబర్ నేరానికి పాల్పడ్డాడు. దీనిపై విచారించిన అమెరికా కోర్టు దీపాంశుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. అలాగే మరో మూడేళ్లు అతనిపై నిరంతర పర్యవేక్షణతోపాటు, 5,67,084 డాలర్ల (సుమారు నాలుగుకోట్ల రూపాయలు) జరిమానా కూడా విధించింది. (మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు) ఉద్యోగంలో ఉద్వాసనకు గురైన తర్వాత దీపాంశు ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో కక్షపూరితగా కంపెనీ సర్వర్ను హ్యాక్ చేసి మరీ 1200 ఖాతాలను తొలగించాడు. సర్వర్లోని 1500 యూజర్ అకౌంట్లలో 1200 అకౌంట్లను డిలీట్ చేశాడు. ఆ తర్వాత కామ్గా ఢిల్లీకి వచ్చేశాడు. ఈ చర్య మైక్రోసాఫ్ట్ కంపెనీనీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ అకౌంట్లకు సంబంధించిన ఈమెయిల్స్, కాంటాక్టులు, కీలక జాబితాలు, సమావేశాల తేదీలు, డాక్యుమెంట్లు, డైరీలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల వివరాలన్నీ గల్లంతు కావడంతో కంపెనీ బాగా నష్టపోయింది. కంపెనీని ఏకంగా రెండు రోజుల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. (గుడ్ న్యూస్ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ) చివరికి అతగాడు చట్టానికి దొరకక తప్పలేదు. దీనిపై విచారణ జరుగుతోందని గమనించని దీపాంశు గత జనవరి 11న మళ్లీ అమెరికాకు వెళ్లాడు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నపోలీసులు అతనికి విమానాశ్రయంలోనే చెక్పెట్టారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఉద్దేశపూరకంగా విధ్వంసక నేరం చేసి ఖేర్ ఎంతో తెలివిగా తప్పించు కోవాలను కున్నాడని, కంపెనీ మీద ప్రతీకారంతో, పథకం ప్రకారమే సైబర్ నేరానికి పాల్పడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి మేరిలిన్ హఫ్ వ్యాఖ్యానించారు. ఖేర్ చేసిన కుట్రపూరితమైన చర్య ఫలితంగా కంపెనీ తీవ్రంగా నష్టపోయిందని అమెరికా అటార్నీ రాండీ గ్రాస్మన్ పేర్కొన్నారు. (వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర) కోర్టు పత్రాల ప్రకారం, ఖేర్ను 2017 నుండి మే 2018 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ కార్ల్స్ బాడ్ నియమించింది. అయితే ఖేర్ పనిపై సంతృప్తి చెందని కంపెనీ కన్సల్టింగ్ సంస్థకు తన అసంతృప్తిని తెలియజేసింది. దీంతో జనవరి 2018 లో, కన్సల్టింగ్ సంస్థ ఖేర్ను సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తొలగించింది. చివరికి మే 4, 2018న ఖేర్ను ఉద్యోగంనుంచి తొలగించింది. -
కావాలనే బౌండరీ లైన్ తొక్కాడు..
అబుదాబి: అప్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్ఘన్ ఆటగాడు హస్మతుల్లా షాహిది చేసిన తప్పిదం జింబాబ్వే జట్టుకు ఒక అదనపు పరుగు వచ్చేలా చేసింది. విషయంలోకి వెళితే.. మూడో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఆడుతుంది. క్రీజులో సికందర్ రజా 79, ముజరబనీ 0 పరుగులతో ఉన్నారు. ఇన్నింగ్స్ 90వ ఓవర్ చివరి బంతిని షిర్జాద్ యార్కర్ వేయగా.. రజా దానిని కవర్స్ దిశగా ఆడాడు. కవర్స్లో ఉన్న హస్మతుల్లా బంతిని అందుకొని బౌండరీ లైన్ ఆవల తన పాదాన్ని ఉంచాడు. రూల్ ప్రకారం ఒక ఆటగాడు బంతి చేతిలో ఉండగా బౌండరీ లైన్ దాటితే.. దానిని ఫోర్గా భావిస్తారు. కానీ ఇక్కడ హస్మతుల్లా కావాలనే అలా చేశాడని వీడియోలో కనిపించింది. ఆఖరి బంతికి సింగిల్ లేదా మూడు రన్స్ వస్తే రజా స్ట్రైక్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన హస్మతుల్లా రజాకు స్ట్రైక్ రాకూడదనే ఉద్దేశంతో.. తర్వతి ఓవర్లో స్ట్రైకింగ్కు వచ్చే ముజరబనీ ఔట్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐసీసీ నిబంధనల్లోని రూల్ 19.8 ప్రకారం.. స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మన్ ఆడిన షాట్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఒక పరుగు ఇస్తారు. అలా జింబాబ్వే జట్టుకు అదనపు పరుగు రావడంతో పాటు.. తదుపరి ఓవర్లో రజా స్ట్రైక్లోకి వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రజా ఔట్ కావడంతో జింబాబ్వే 287 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్లో పడింది. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామం ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లెర్ చేసింది. చదవండి: పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్ -
కోకాకోలా, బిస్లేరి, రామ్దేవ్బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పాత వేపచెట్టు : భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: ‘మొక్కే కదా అని పీకేస్తే...మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇంద్ర సినిమాలోని డైలాగ్ గుర్తుందా.. అచ్చంగా పర్యావరణం పట్ల ఇలాగే స్పందించాడో బాలుడు. దీంతో 42 ఏళ్ల వేపచెట్టును నరికి పారేసిన వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారీ వేపచెట్టును కొట్టివేసిన ఘటనను గమనించిన 8వ తరగతి ఒక విద్యార్థి అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా చెట్టును నరికివేసినట్లు ధృవీకరించారు. ఇందుకు ఆ వ్యక్తికి 62,075 రూపాయల జరిమానా విధించారు. అలాగే ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఇచ్చిన బాలుడికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల నాటి పాత వేప చెట్టును నరికివేశాడు ఒకవ్యక్తి. ఇంటి నిర్మాణాకి అడ్డుగా ఉండటంతో వేరే ప్రత్యామ్నాయం వైపు ఏమాత్రం ఆలోచించలేదు. రాత్రికి రాత్రికే ఆ చెట్టును కొట్టించి, అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించడకుండా హుటాహుటిన కలపను కూడా తరలించేశారు. అయితే దీన్ని గమనించిన పిల్లవాడు అందరిలాగా తనకెందుకులే అనుకోలేదు...ఇది మామూలేలే అని అస్సలు మిన్నకుండి పోలేదు.. వెంటనే అటవీశాఖ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేశాడు. చెట్టును నరికించిన వ్యక్తి, ఇందుకు సహాయం చేసిన ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై రూ .62,075 జరిమానా విధించినట్లు హైదరాబాద్ (తూర్పు) అటవీ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించిన విద్యార్థిని అభినందించారు. ఒక పిల్లవాడు ఫిర్యాదుపై స్పందించి, జరిమానా విధించడం విశేషమే మరి. -
హెచ్డీఎఫ్సీకి సెబీ షాక్ : నష్టాల్లో షేర్లు
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సెబీభారీ జరిమానా విధించింది. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కోటి రూపాయల పెనాల్టీ విధించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో హెచ్డీఎఫ్సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇవాళ ఈ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. 2.24 శాతం నష్టంతో 1443 వద్ద కొనసాగుతోంది. సెబీ చట్టంలోని సెక్షన్ 15హెచ్బీ, ప్రకారం స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిఆర్హెచ్ వెల్త్ క్రియేటర్స్ లిమిటెడ్ విషయంలో హెచ్డీఎఫ్సీ నిబంధనలు ఉల్లంఘించినట్టు సెబీ ఆరోపించింది. 2019 అక్టోబర్ 14న డబ్బులు చెల్లించాలని తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించనందుకు కోటి జరిమానా విధించినట్టు సెబీ వెల్లడించింది. అక్టోబర్ 14, 2019 నుంచి ఇప్పటి వరకు వడ్డీతో పాటు రూ.158.68 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
గ్రామంలో ఇలా.. నగరంలో అలా...
సాక్షి, నారాయణఖేడ్: పై చిత్రంలో ముఖానికి మాస్కు లేకుండా చూస్తున్న వ్యక్తి నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామ సర్పంచ్. అతన్నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి రశీదు ఇస్తున్నది పంచాయతీ కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా పంచా యతీ అధికారి సురేశ్ మోహన్ ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉపసర్పంచ్తో కలసి మాస్కు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు అధికారి వారిద్దరికీ రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ఈ ఫొటో చూశారుగా... ముఖానికి మాస్కుల్లేకుండా, భౌతికదూరం నిబంధన పట్టించుకోకుండా నగరవాసులు ఇలా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కా పూర్ పూల మార్కెట్కు వీరంతా ఇలా పోటెత్తారు. గ్రామాల్లో చూపుతున్న స్ఫూర్తిని నగరవాసులు కూడా ప్రదర్శిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. -
ఒకే రోజు 12 వేల మందికి జరిమానా
సాక్షి, ముంబై: కరోనా వైరస్ను నియంత్రించేందుకు బీఎంసీ సిబ్బంది చాలా హుషారుగా పని చేస్తున్నారు. ఒకే రోజు మాస్క్ ధరించని 12 వేలకుపైగా మందిని పట్టుకుని రూ.24 లక్షలు జరిమాన వసూలు చేశారు. ఇలా బీఎంసీ సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల మంది నుంచి రూ.14 కోట్లకుపైనే జరిమాన వసూలు చేయడంతో బీఎంసీ ఖజానాలోకి భారీగా అదనపు ఆదాయం వచ్చి చేరింది. కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే విషయమే. కానీ, మాస్క్ ధరించకుండా పట్టుబడుతున్న కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో బీఎంసీకి చెందిన ఆరోగ్య శాఖ ఆందోళనలో పడిపోయింది. 20 వేలకు తగ్గొద్దని.. కరోనా వైరస్ను నియంత్రణలో ఉంచాలంటే జనాలు మాస్క్ ధరించడం తప్పని సరిచేశారు. కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు బీఎంసీ ఆరోగ్య సిబ్బందితోపాటు క్లీన్ అప్ మార్షల్స్, అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్లు దాడులు చేస్తున్నారు. ప్రతీరోజు 20–24 వేల మందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్సింగ్ చహల్ ఆంక్షలు విధించారు. ఆ మేరకు దాడులు మరింత ఉధృతం చేశారు. రోజు ఐదారు వేల మందిని పట్టుకుని జరిమానా విధించేవారు. కానీ, మంగళవారం రోజంతా దాదర్, మాటుంగా, సైన్, అంధేరీ, గోరేగావ్, మలాడ్ తదితర రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరిగి మాస్్కలు ధరించని 12 వేలకుపైగా జనాలకు జరిమానా విధించారు. ఒకేరోజు ఇలా భారీ సంఖ్యలో జనాకు జరిమానా విధించడం ఇదే ప్రథమమని బీఎంసీ తెలిపింది. ఇదిలాఉండగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 68,38,060 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జరిమాన వసూలు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి.