14న బడ్జెట్‌పై ఆర్‌బీఐ బోర్డ్‌ చర్చ | RBI Board Meeting Will Be Held On Feb 14 To Discuss About Budget 2023 | Sakshi
Sakshi News home page

14న బడ్జెట్‌పై ఆర్‌బీఐ బోర్డ్‌ చర్చ

Published Thu, Feb 10 2022 8:35 AM | Last Updated on Thu, Feb 10 2022 8:44 AM

RBI Board Meeting Will Be Held On Feb 14 To Discuss About Budget 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ బోర్డ్‌ ఈ నెల 14వ తేదీన బడ్జెట్‌ అనంతర సాంప్రదాయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్‌ ముఖ్యాంశాలపై చర్చించనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్‌ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement