Sitharaman pitches for strengthening of MDBs - Sakshi
Sakshi News home page

బహుళపక్ష బ్యాంకులను పటిష్టం చేయాలి

May 13 2023 8:21 AM | Updated on May 13 2023 11:55 AM

Sitharaman Pitches For Strengthening Of Mdbs - Sakshi

న్యూఢిల్లీ: సీమాంతర సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

జీ20కి భారత్, జీ7కు జపాన్‌ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని ఆమె సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది. సంక్షేమానికి పాటించాల్సిన ఆర్థిక విధానాలపై జపాన్‌లోని నైగతాలో నిర్వహించిన జీ7 సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

పేద వర్గాలకు మార్కెట్లను, ప్రాథమిక సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీ తోడ్పడగలదని మంత్రి చెప్పారు. డిజిటల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సాధికారత లభిస్తోందని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement