
నవంబర్ నెల ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పసిడి రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో నేడు (నవంబర్ 6) దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు పసిడి ధర వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చెన్నైలో కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,350 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,650 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. చెన్నైలో బంగారం ధరలు ఒకే మాదిరిగా ఉన్నాయి.
దేశ రాజధానిలో బంగారం ధర రూ. 110 (10 గ్రా 24 క్యారెట్స్) & రూ. 100 (10 గ్రా 22 క్యారెట్స్) పెరిగింది. అయితే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేట్లు వరుసగా రూ. రూ. 80,500.. రూ. 73,800 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్న ప్రాంతం ఢిల్లీ అని స్పష్టమవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).