
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే.. RPG గ్రూప్ చైర్మన్ 'హర్ష్ గోయెంకా' భార్యల తెలివితేటలను ప్రశంసిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
10 సంవత్సరాల క్రితం.. నేను రూ. 8 లక్షలకు కారు కొన్నాను. ఆమె రూ. 8 లక్షలకు బంగారం కొన్నది. ఈ రోజు ఆ కారు విలువ రూ. 1.5 లక్షలకు చేరింది. బంగారం విలువ రూ. 32 లక్షలకు చేరింది. నేను బంగారం కొనడం మానేద్దాం.. వెకేషన్కు వెళ్దాం అన్నాను. వెకేషన్ 5 రోజులు మాత్రమే ఉంటాయి, బంగారం ఐదు తరాలు ఉంటుందని ఆమె చెప్పిందని హర్ష్ గోయెంకా చెప్పారు.
ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
నేను ఒక లక్ష రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొన్నాను. అదే ధరకు ఆమె బంగారం కొన్నది. నా ఫోన్ ధర ఇప్పుడు రూ. 8వేలు. ఆమె కొన్న బంగారం రూ. 2 లక్షలు. దీన్ని బట్టి చూస్తే 'భార్యలు చాలా తెలివైనవారు' అని గోయెంకా చెప్పారు. ఈ ట్వీట్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్శించింది. చాలామంది ఈ విషయంలో ఏకీభవించారు. ఇప్పటికైనా భార్యలు మాట వినాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
10 yrs ago, I bought a car for ₹8L. She bought gold for ₹8L.
Today- car’s worth ₹1.5L. Her gold? ₹32L.
I said, “Let’s skip gold, go on a vacation?”
She said, “Vacation lasts 5 days. Gold lasts 5 generations.”
I bought a phone for ₹1L. She bought gold.
Now? Phone’s worth…— Harsh Goenka (@hvgoenka) April 23, 2025