బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తాం’ | Young Adults Prefer Direct Stock Investing | Sakshi

బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తాం’

Nov 16 2024 2:36 PM | Updated on Nov 16 2024 3:27 PM

Young Adults Prefer Direct Stock Investing

న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్‌ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్‌’ అధ్యయనంలో వెల్లడైంది.

58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ టూల్స్‌ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్‌ నివేదికను విడుదల చేసింది.  
    
» పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు.  
» ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు.  
» పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్‌ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది.  
» యువతరం టెక్‌ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్‌ సేవింగ్‌ టూల్స్‌ వాడుతున్నారు.  
» 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement