రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఝలక్‌ ఇచ్చిన మొదటి భార్య | First Wife Shocks The Man Who Is Ready For Second Marriage In Tirumala | Sakshi

రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఝలక్‌ ఇచ్చిన మొదటి భార్య

Aug 9 2024 11:29 AM | Updated on Aug 9 2024 11:45 AM

First Wife Shocks The Man Who Is Ready For Second Marriage In Tirumala

తిరుమలలో రెండో వివాహానికి సిద్ధమైన వ్యక్తికి తన భార్య ఝలక్ ఇచ్చింది.

సాక్షి, తిరుపతి: తిరుమలలో రెండో వివాహానికి సిద్ధమైన వ్యక్తికి తన భార్య ఝలక్ ఇచ్చింది. కోర్టులో కేసు విచారణలో ఉండగా తెలంగాణకి చెందిన రాకేష్‌ అనే వ్యక్తి మౌన స్వామి మఠంలో వివాహానికి సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకున్న భార్య సంధ్యా ఉదయం మండపం వద్ద వివాహాన్ని అడ్డుకుంది.

వెంటనే మఠం వద్దకు పోలీసులు రావడంతో రెండవ పెళ్లి పంచాయితీ స్టేషన్‌కి చేరింది. 2016లో రాకేశ్ సంధ్యాల​కు వివాహం జరగ్గా, ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. దీంతో తన భార్య కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం విచారణ జరుగుతుంది.. కానీ కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి రాకేష్‌ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement