కన్నవారికే ‘ప్రాణ భయం’ .. | Sakshi
Sakshi News home page

Property Disputes: కన్నవారికే ‘ప్రాణ భయం’ ..

Published Fri, Sep 24 2021 11:18 AM

Property Disputes: Son Cruel Behaviour On Parents In Hyderabad - Sakshi

సాక్షి, నాగోలు(హైదరాబాద్‌): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతే కాకుండా వేధింపులకు గుర్తి చేస్తున్న తన కుమారుడిపై తల్లి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం ఎల్‌బీనగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మాన్సూరాబాద్‌ శ్రీరాంనగర్‌కాలనీ చెందిన కౌసల్యదేవి, లింగయ్య భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ముగ్గురి వివాహం జరిగింది. పెద్ద కుమారుడు భార్యాపిల్లలతో మరో ప్రాంతంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు రాజశేఖర్‌ తల్లిదండ్రులతో ఉంటూ ఆస్తి కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రెండేళ్లుగా తమను చీకటి గదిలో బంధించి సరిగా తిండి పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. చిన్న కుమారుడు రాజశేఖర్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎల్‌బీనగర్‌ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి:  మాటల్లో దించి.. మాయచేసి.

Advertisement
 
Advertisement
 
Advertisement