6న కోకో రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

6న కోకో రైతుల ధర్నా

Published Tue, Mar 4 2025 12:41 AM | Last Updated on Tue, Mar 4 2025 12:40 AM

6న కోకో రైతుల ధర్నా

6న కోకో రైతుల ధర్నా

పెదవేగి: కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, కిలో గింజలకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఏపీ కోకో రైతు ల సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం పెదవేగి మండలం విజయరాయిలోని కోకోనట్‌ గ్రోయర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద చలో కలెక్టరేట్‌ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజలకు రూ.900 వరకు ధర ఉన్నా కొనుగోలు కంపెనీలు ఆ ధరను చెల్లించడం లేదన్నారు. ప్రాంతీయ కొబ్బరి రైతుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు రా మకృష్ణ, కోకో రైతుల సంఘం నాయకులు కోనేరు సతీష్‌, రాపర్ల తేజ కృష్ణ, వట్టికూటి రామవతారం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement