
ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ సినిమా కథ తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పకనే చెబుతున్నారు.తాజాగా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య శ్రద్ధా జోషి దంపతులో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వ్యాపారవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర 12th ఫెయిల్ సినిమా కథ తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పకనే చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ కుమార్, ఆయన భార్య ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషికలిసారు. ఈ దంపతుల ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు అంటూ ప్రశంసిస్తూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పంచుకున్నారు.
‘‘12th ఫెయిల్ మూవీ రియల్ హీరోలు, అసాధారణ జంటను ఈ రోజు లంచ్లో వారి కలిసాను. ఇప్పటికే చిత్తశుద్ధితో కూడిన జీవితాన్ని గడపాలనే ఆలోచనతోనే ఉన్నారు. గర్వంగా నేను పట్టుకొని ఉన్న ఈ ఆటోగ్రాఫ్ల వారిని అడిగినపుడు నిజంగా వారు చాలా సిగ్గుపడ్డారు. మరింత వేగంగా భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగాలంటే.. ఎక్కువ మంది వీరి జీవన విధానాన్ని అవలంబించాలి. వారే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు. వారి ఆటోగ్రాఫ్లు వారసత్వ సంపద. వారిని కలిసిన ఈ రోజు సంపన్నుడిని’’ అంటూ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్గా ఉంటూ అనేక ఆసక్తికర, స్ఫూర్తిదాయక కథనాలను తన అభిమానులతో పంచుకోవడం ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12th ఫెయిల్ సినిమా రివ్యూను ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ను నమోదు చేసింది. ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ హీరో విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.
They were shy when I requested them for their autographs, which I am proudly holding.
— anand mahindra (@anandmahindra) February 7, 2024
But they are the true real-life heroes Manoj Kumar Sharma, IPS and his wife Shraddha Joshi, IRS. The extraordinary couple on whose lives the movie #12thFail is based.
Over lunch today, I… pic.twitter.com/VJ6xPmcimB