Anand Mahindra
-
బుకింగ్స్లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత 30,179 బుకింగ్లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.Mahindra Electric Origin SUVs create a new record in EV category by clocking 30,179 Bookings on Day 1 with booking value of ₹8,472 Crore (at ex-showroom price).There are only two more words needed:THANK YOU! pic.twitter.com/X2Ftj9CMED— anand mahindra (@anandmahindra) February 14, 2025 -
ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్
జనవరిలో ఢిల్లీలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025''లో.. భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు భారతీయులను మాత్రమే కాకుండా.. విదేశీయులను సైతం ఫిదా చేశాయి. జపాన్, కొరియా నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ కార్లను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ను భావోద్వేగానికి గురిచేసింది.దశాబ్దాల క్రితం, నేను ఆటో పరిశ్రమలో నా కెరీర్ను ప్రారంభించినప్పుడు, విదేశాలలో తయారైన అధునాతన కార్లను ఫోటో తీయడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి భారతీయ ప్రతినిధులు అంతర్జాతీయ ఆటో షోలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు దేశీయ వాహనాలను విదేశీయులను ఆకట్టుకుంటున్నాయని.. తన ఎక్స్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా భవోద్వేగ పోస్ట్ చేసారు.మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈభారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కూడా ఉన్నాయి. ఇవి సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ తమ భవిష్యత్ డిజైన్లు, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటం వల్ల హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.స్పోర్టీ డిజైన్ను కలిగి ఉన్న BE 6.. సొగసైన కూపే లుక్ను స్వీకరించే XEV 9e రెండూ 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్లను పొందుతాయి. ఇవి 170kW, 210kW మోటార్ ద్వారా పవర్ డెలివరీ చేస్తాయి. పూర్తి ఛార్జ్పై 683 కిమీ (BE 6) మరియు 656 కిమీ (XEV 9e) వరకు పరిధిని అందిస్తాయి.ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 బుకింగ్స్ & డెలివరీమహీంద్రా కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.Decades ago, when I began my career in the auto industry, it was our Indian delegations that would make the pilgrimage to International Auto shows to photograph & study the advanced cars made overseas.At the recent Bharat Mobility Show in Delhi, you can imagine my emotions when… pic.twitter.com/z3x4su5JSA— anand mahindra (@anandmahindra) February 6, 2025 -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్టాప్ టెంట్కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: శీతల్ దేవికి గిఫ్ట్
పారిస్ పారాలింపిక్స్ 2024లో.. 'శీతల్ దేవి' (Sheetal Devi) మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. ఆ సమయంలో పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) శీతల్కు కారు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశారు, అది ఇప్పుడు నిలబెట్టుకున్నారు.శీతల్ దేవిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన సంకల్పం, దృఢత్వం, దృష్టిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక బాణాన్ని బహుమతిగా ఇచ్చింది. ఒక ఆర్చర్గా ఇది తన గుర్తింపు. శీతల్ మనందరికీ స్ఫూర్తిదాయకం.. ఆమె కొత్త ఎత్తులకు ఎదుగుతున్నప్పుడు.. స్కార్పియో ఎన్ (Scorpio N)తో చూడటం గర్వంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.శీతల్ దేవి కేవలం 17 సంవత్సరాల వయస్సులో.. 2024 పారిస్ పారాలింపిక్స్లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. 2022 ఆసియా పారా గేమ్స్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం.. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఒక రజతం, ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లలో ఒక స్వర్ణం, రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం ఈమెను అర్జున అవార్డుతో సత్కరించింది.మహీంద్రా స్కార్పియో ఎన్భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలను పొందిన మహీంద్రా కార్లలో 'స్కార్పియో ఎన్' ఒకటి. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఐదు వేరియంట్లు.. మూడు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ఈ కారు, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్.. డ్యూయల్-టోన్ డాష్బోర్డ్తో 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా, ఆటో స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 12 స్పీకర్ 3డి సోనీ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటి ఎన్నో ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో.. ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు 6, 7 సీటింగ్ ఆప్షన్లలో లభిస్తుంది.I have long admired @archersheetal ’s talent from afar. Meeting her in person, I was struck by her remarkable determination, tenacity and focus. Speaking to her mother and sister, it was clear that it runs in the family!She gifted me an arrow, a symbol of her identity as an… pic.twitter.com/SFY8RCf6iM— anand mahindra (@anandmahindra) January 28, 2025 -
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'
ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025 -
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు'
పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy), ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వివిధ రకాలుగా స్పందించారు. ప్రస్తుతం పనిగంటలపై సర్వత్రా చర్చ మొదలైపోయింది. తాజాగా దీనిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా స్పందించారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.వారానికి 70 గంటల పనిఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.వారానికి 90 గంటల పనిఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు.వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందనభారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్పై గౌతమ్ అదానీ (Gautam Adani) మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..70 గంటల పనిపై నిమితా థాపర్ వ్యాఖ్యలుహ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' (Namita Thapar) మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.పని గంటల పెంపు.. ఉద్యోగులపై తీవ్రమైన పని భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తుందని కొందరు తీవ్రంగా ఖండిస్తే.. మరికొందరు పని గంటలు పెంచడం సరైనదే అని సమర్ధించారు. ఏది ఏమైనా పనిగంటలు వ్యవహారం రోజు రోజుకి తీవ్రమైన చర్చలకు దారితీస్తోంది. -
కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్ క్లీన్ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.That’s one way of starting a New Year. Baby steps. The first steps towards fulfilling our new resolutions…🙂 pic.twitter.com/Qs7GGZEx9b— anand mahindra (@anandmahindra) January 1, 2025ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు. -
పటిష్ట స్థితిలో భారత్..
న్యూఢిల్లీ: సైనిక శక్తి, రాజకీయ సుస్థిరత, బలమైన ప్రజాస్వామ్యం తదితర అంశాల దన్నుతో అంతర్జాతీయంగా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని, మరింతగా ఎదిగే సత్తా దేశానికి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అనిశ్చితులను.. భారత్ అవకాశాలుగా మల్చుకోవచ్చని మహీంద్రా చెప్పారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగంగా మారొచ్చని నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు ఇచి్చన సందేశంలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువగా ఉంటుందని మహీంద్రా తెలిపారు. తమ గ్రూప్ అధిగమించిన కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ .. అత్యంత విలువైన వాహనాల తయారీ దిగ్గజంగా ప్రపంచంలోనే 11వ స్థానానికి చేరడం, ఎలక్ట్రిక్ వాహనాలు అంచనాలకు మించి విజయవంతం కావడం గర్వించతగ్గ విషయాలని ఆయన పేర్కొన్నారు. గ్రూప్లోని ఇతర కంపెనీల పనితీరును కూడా ప్రశంసించారు. ఆకాంక్షలను సాకారం చేసుకోగలమనే స్ఫూర్తితో భవిష్యత్తుపై ఆశావహంగా ఉండాలని సూచించారు. -
నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..
ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.OMG this is so sweet.I am glad you took the criticism constructively, I had to delete the tweet after a call from yiur team because I thought they are unhappy with the harsh words.— Sushant Mehta (@SkyBarrister) December 1, 2024 -
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్లో ఈ క్రూయిజర్ మోటార్బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
పర్ఫెక్ట్ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్ఫెక్ట్ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్న ప్రదేశంలో వివిధ రకాల వాహనాలు ఉండటం చూడవచ్చు. అయితే ఇవన్నీ రిమోట్ ద్వారా పనిచేసే బొమ్మ వాహనాలను. వీటిని అక్కడే నిలబడి ఉన్న యువకులు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి కదులుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ వాహనాలన్నీ బ్రిడ్జ్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ సండే పర్ఫెక్ట్ రీక్రియేషన్ అంటూ ట్వీట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికే రెండు వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Perfect recreation on a #Sunday Can we create something like this out here @MahindraTrukBus @Mahindra_CE ??pic.twitter.com/DqJmTqKkpa— anand mahindra (@anandmahindra) November 24, 2024 -
క్రియేటివిటీ ఉంటే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivationpic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024 -
విచిత్ర వాహనాలు: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు. ఇందులో షూ ఆకారంలో ఉన్న వాహనం రోడ్డుపై ప్రయాణిస్తుండటం చూడవచ్చు. ఈ వాహనం ఒక వ్యక్తి అభిరుచి వల్ల పుట్టినట్లు తెలుస్తోంది.వీడియో షేర్ చేస్తూ.. ''ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకుంటే ఈ ప్రపంచ ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వెహికల్ చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాము అని అన్నారు. నేను ఈ సారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను'' అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..నిజానికి ఇలాంటి కార్లను హైదరాబాద్ వ్యక్తి సుధాకర్ రూపొందిస్తున్నారు. విచిత్ర రూపాలలో తయారు చేసిన కార్లను సుధా కార్ మ్యూజియం పేరుతో ఓ మ్యూజియం సృష్టించి అక్కడ ప్రదర్శించారు. ఇక్కడ వివిధ ఆకారాల్లో వాహనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివిధ ఆకారాల్లో వాహనాలను తయారు చేయడంతో ఈయన గిన్నిస్ రికార్డులో సైతం చోటు సంపాదించుకున్నారు.If there weren’t any people who doggedly pursued their passions—no matter how quirky—this world would be far less interesting..I’m embarrassed to say I hadn’t heard about the Sudha Car Museum in Hyderabad—even though I travel there often—until I recently saw this clip.… pic.twitter.com/c4LASs1JRV— anand mahindra (@anandmahindra) October 26, 2024 -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్నెస్కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
ఆనంద్ మహీంద్రా మెచ్చే వంటకాలివే..! శాకాహారుల..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ మంచి ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. ఆయన ఇతరుల టాలెంట్ని, గమ్మత్తైన విషయాలను షేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి మహింద్రా ఈసారి తన కిష్టమైన వంటకాలు గురించి చెప్పుకొచ్చారు. తాను కూడా మంచి ఆహారప్రియుడేనని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఆయన మెచ్చే వంటకాలేంటంటే..ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో శాకాహార పంజాబీ వంటకాల పోస్ట్తో నెటిజన్లను ఆకర్షించారు. వంటకాల్లో మాంసాహార వంటకాల రుచే అగ్ర స్థానం అయినా ఆయన శాకాహార వంటకాలకే ప్రాధాన్యాత ఇచ్చారు. అంతేగాదు పంజాబ్ వంటకాలను శాకాహారుల స్వర్గంగా అభివర్ణించారు. ఎప్పుడైన సరదాగా పంజాబ్ నడిబొడ్డున తప్పనిసరిగా ఘుమఘుమలాడే ఈ ఏడు రకాల పంజాబీ వంటకాలను ట్రై చేయాల్సిందే అంటూ వాటి గురించి సవివరంగా వివరించారు.షాహి పనీర్పర్ఫెక్ట్ రుచి కోసం క్రీమీ గ్రేవీతో ఉంటే పనీర్ క్యూబ్స్ వంటకం బెస్ట్. ఇది తేలికపాటి సుగంధద్రవ్యాలు, పెరుగుతో రుచికరంగానూ, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని పరాఠాతో ఆస్వాదిస్తే ఆ రుచే వేరు అని చెబుతున్నారు మహీంద్రా. రాజ్మా చావల్గ్లూటెన్ ఫ్రీ మీల్ కోసం ట్రై చేయాలనుకుంటే..రాజ్మా డిష్ని తినాల్సిందే. చక్కగా ఉల్లిపాయలు, టమోటాలు, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో చేసే వంటకం లంచ్లో కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీన్ని రైతా, ఊరగాయలతో తింటే టేస్ట్ అదుర్స్.పాలక్ పనీర్పంజాబీ-స్టైల్ పాలక్ పనీర్ను ఆస్వాదించాలంటే ముందుగా పాలక్ని మెత్తని పేస్ట్గా చేయాలి. ఆ మిశ్రమన్ని ఉల్లిపాయాలు, టమాటాల మిశ్రమంలో వేసి ఉడికించి చివరగా క్యూబ్డ్ పనీర్లతో ఉడికించి తింటే అబ్బబ్బా..! ఆ రచే వేరేలెవెల్..!దాల్ మఖానీకిడ్నీ బీన్స్తో తయారు చేసే వంటకం. దీన్ని వెన్నతో తయారు చేసే క్రీమ్ లాంటి గ్రేవీతో కూడిన వంటకం. ఉత్తర భారతీయుల వంటకాల్లో అత్యంత టేస్టీ వంటకం ఇదే. తప్పక రుచి చూడాల్సిందే.పనీర్ టిక్కామంచి ఆకలితో ఉన్నవారికి తక్షణమే శక్తినిచ్చి సంతృప్తినిచ్చే మంచి వంటకం. చక్కగా మెరినేషన్ చేసిన క్యూబ్డ్ పనీర్ని బంగారు రంగులో వేయించి వివిధ కూరగాయలతో సర్వ్ చేస్తారు. ఇది ప్రతి వేడుకలో ఉండే అద్భుతమైన వంకటం. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చోలే భాతురేశెనగలతో చేసే కర్రీ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వండే రుచికరమైన వంటకం. పూరీ, పరాఠాలలో అదిరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు, ఊరగాయ వేసుకుని చాట్ మాదిరిగా తిన్నా ఆ టేస్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. మక్కీ డి రోటీ విత్ సర్సన్ డా సాగ్సార్సన్ డా సాగ్ అనేది సుగంధ ద్రవ్యాలు, ఆవపిండితో చేసే కర్రీ. మక్కీ డి రోటీ అంటే మొక్కజొన్న పిండితో చేసే ఒకవిధమైన రోటీ. వీటిని పెనంపై కాల్చరు. బోగ్గుల మీద లేదా వేడి గ్రిడిల్పై నేరుగా కాల్చుతారు. ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ మహీంద్రా మెచ్చే ఈ వంటకాలను ఓసారి ట్రై చేయండి మరీ..!.(చదవండి: యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?) -
విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే..
విమానాశ్రయం అంటే.. అక్కడ మెట్లు లేదా ఎస్కలేటర్స్ వంటివి ఉంటాయి. కానీ సింగపూర్లోని చాంగి విమానాశ్రయంలో ఎత్తైన ఇండోర్ స్లయిడ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఇండోర్ స్లయిడ్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెండు గేట్స్ ఉన్నాయి. వీటిని దాటేసిన తరువాత స్లయిడ్ దగ్గరకు వెళ్ళవచ్చు. దీని ద్వారా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్ళవచ్చు. అంటే మెట్లు వంటివి ఉపయోగించకుండానే.. కిందికి వెళ్లొచ్చన్నమాట.నిజానికి ఇలాంటివి పార్కుల్లో లేదా ఎగ్జిబిషన్స్ వంటి వాటిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో కనిపించడంతో.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్చాంగీ విమానాశ్రయంలో ఇప్పటికే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా టెర్మినల్ 3లో ఈ స్లయిడ్ను ఇన్స్టాల్ చేసారు. దీనిని స్లయిడ్@T3 అని పిలుస్తారు. 12 మీటర్ల ఎత్తైన ఇండోర్ స్లయిడ్, ప్రయాణికులు సెకనుకు 6 మీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనిని పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు.Apparently at Singapore’s Changi airport you can take a slide to your gate. That’s the way to view Monday mornings & a new week…Beat uncertainty by sliding right into it… #MondayMotivation pic.twitter.com/ZZPuyJX7Kf— anand mahindra (@anandmahindra) October 21, 2024 -
మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.ఈ ఆదివారం స్పేస్ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్ను ప్రశంసించారు.And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made. This experiment may just be the critical moment when space travel was democratised and made routine. Where can I buy my ticket, @elonmusk ? 👏🏽👏🏽👏🏽pic.twitter.com/yruGSwL2Y4— anand mahindra (@anandmahindra) October 13, 2024మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్గా.. స్టార్షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు. -
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
ఆనంద్ మహీంద్రను ఫిదా చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియన్
వ్యాపారవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్భుతమైన పోస్ట్తో అభిమానులను ఫిదా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ,ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలను, విజ్ఞానదాయక అంశాలను పంచుకునే ఆయన తాజాగా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే...ఇటీవల అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ చెన్నైలోని ఒక వీధి వ్యాపారి గురించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్లో పనిచేస్తున్న పీహెచ్డీ స్టూడెంట్ రేయాన్ని పరిచయం చేశాడు. అంతేకాదు ఇందులో యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి రేయాన్ ప్రశ్నించగా, దానికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్లో చూపించడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. దీంతో రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. అతణ్ని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడంతో పాటు, ఇన్క్రెడిబుల్..యూనిక్. ఇండియన్ అంటూ అభినందించడం విశేషం. దీంతో ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన వ్యక్తి అంటూ తెగపొగిడేస్తున్నారు.This clip went viral a while ago. An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG— anand mahindra (@anandmahindra) October 4, 2024 -
నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. నీటిపై తేలియాడే ఇంటిని చూడవచ్చు. దీనిని మొత్తం నేచురల్ మెటీరియల్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ అనే ఇంజినీర్.. వర్షాలు పడినప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని అలోచించి ఇలాంటి ఓ అద్భుతమైన నిర్మాణం రూపొందించారు.ఇలాంటి ఇల్లు డిజైన్ చేయాలని 2020లోనే అనుకున్నట్లు.. ఆ తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ ఇంటికి కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కూడా సెట్ చేసి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇల్లు పూర్తిగా నీటిపైన తేలడానికి అవసరమైనవన్నీ ప్రశాంత్ ఉపయోగించారు.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకంఈ వీడియో షేర్ చేస్తూ.. వాతావరణ మార్పుల వల్ల జీవితాల్లో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించడానికి ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇలాంటి ఆవిష్కరణలు కనిపిస్తాయి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రశాంత్ను సంప్రదిస్తాను, నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలనో చూస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు.Prashant Kumar came back to Bihar and…With a Modest budget & Modest materials—combined with dramatic ambition & a desire to drive positive change—he’s created a disruptive solution to mitigate the disruption of lives by climate change. I’ve always believed that… pic.twitter.com/jFs18eznFm— anand mahindra (@anandmahindra) September 26, 2024 -
అప్పుడు జపాన్లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. వాషింగ్ మెషీన్లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది.ఇదీ చదవండి: మస్క్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్రూమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు. -
మస్క్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాన్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.If this device lives up to these expectations then, much more than Tesla or Space X, THIS will be your most enduring gift to humankind. https://t.co/BtnbEEIvyn— anand mahindra (@anandmahindra) September 19, 2024 -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.Given Mr. Anand Mahindra’s strong advocacy for “Made in India,” why does he opt to drive BMW and Mercedes cars instead of a Mahindra Thar, which is built by his own company? @anandmahindra pic.twitter.com/aHl299W1DI— Rattan Dhillon (@ShivrattanDhil1) September 1, 2024ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ, బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్కార్ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.Hormazd, you have covered Mahindra since the time I joined the company. So you are in a unique position to call out this fabricated and fake story. Thank you.And for the record:I was taught how to drive by my mother, in her light sky-blue colour Premier car (earlier known as… https://t.co/BXFr3hfYVU— anand mahindra (@anandmahindra) September 2, 2024 -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
'సూపర్ టాలెంట్ బ్రో.!’ దెబ్బకి ఆనంద్ మహీంద్ర ఫిదా!
టాలెంట్ ఓ ఒక్కరి సొత్తూ కాదు. ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక స్పెషాల్టీ సాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభను సొంతం చేసుకోవాలి. అందరికంటే భిన్నంగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతిభకు గుర్తింపు,పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో ప్రముఖ గాయకుడు, రచయిత ఒకరు రాఘవ్ సచార్. అందుకే ఆయన ఆనంద్మహీంద్ర పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. అసమాన ప్రతిభ అంటూ రాఘవ్ సచార్ అద్భుమైన టాలెంట్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు వాయించాడు అనే కాప్షన్తో రాఘవ్ సచార్ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రాఘవ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు తన వీడియో షేర్ చేయడంపై స్పందించిన రాఘవ్ ఆనంద్ మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.Thank you so much sir. Means the world coming from you 🙏. Am truly honoured for your kind words 😊❤️ https://t.co/23AkRAa6y0— Raghav Sachar (@raghavsachar) September 1, 20242001 నాటి హిట్ ‘దిల్ చాహ్తా హై ’ టైటిల్ ట్రాక్ను విభిన్న వాయిద్యాలతో వీనుల విందుగా వాయించాడు. శాక్సోఫోన్ ,వేణువు, హ్యాండ్ ప్యాన్ ఇలా పలు రకాల వాయిద్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్.. అంటారు.ఎవరీ రాఘవ్ సచార్ మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ సచార్కు చిన్నప్పటినుంచీ సంగీతం మీద ఆసక్తి. ముఖ్యంగా ఒకేసారి పలు వాయిద్యాలను వాయించడంలో ఆరితేరాడు. 2003లో స్పెషల్ ఆల్బబ్తో గాయకుడు పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాబూల్ ఎక్స్ప్రెస్ (2006)లో బాలీవుడ్ సంగీత దర్శకుడి అరంగేట్రం చేశాడు. ఇంకా బిట్టూ బాస్, వన్టూత్రీ లాంటి సినిమాలకు పనిచేశాడు. అలాగే సలామ్ నమస్తే, పరిణీత, ధూమ్, కల్, హమ్ తుమ్, యహాన్, బ్లాక్ ఫ్రైడే, కల్ హో నా హో, డాన్ కొన్నింటిని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో తన వాయిద్య ప్రతిభను చాటుకున్నాడు. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఆస్కార్విన్నర్ ఏఆర్ రెహ్మాన్,విశాల్-శేఖర్, శంకర్-ఎహసాన్-లాయ్, సలీం-సులైమాన్, అను మాలిక్ సహా అనేకమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ జాజ్ డ్రమ్మర్ డేవ్ వెక్ల్ , సోను నిగమ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, అద్నాన్ సమీ, శుభా ముద్గల్, నీరజ్ శ్రీధర్, కునాల్ గంజావాలా, శివమణి, నిలాద్రి వంటి ప్రముఖ కళాకారులతో కూడా రికార్డ్ చేసి ప్రదర్శించారు. కుమార్, తౌఫిక్ ఖురేషి, లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, తదితరులో కలిసి అనేక ప్రదర్శనలిచ్చాడు. రాఘవ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చాట్జీపీటీ ఫోటో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్జీపీటీ 4oను ఉపయోగించారు.ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్ను రూపొందించమని చాట్జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు. I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck. This outcome isn’t bad at all! It adequately showcases my sentiments—my excitement about our Team’s potential. 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024 -
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ని డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupationWish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy— anand mahindra (@anandmahindra) August 25, 2024 -
దోమల అంతానికి లేజర్ ఫిరంగి!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes! An Iron Dome for your Home…pic.twitter.com/js8sOdmDsd— anand mahindra (@anandmahindra) August 24, 2024 -
అన్నింటా టెక్నాలజీ అన్వేషించాలి: ఆనంద్ మహీంద్రా
అభివృద్ధి చెందిన భారత్ (వికసిత భారత్) మన లక్ష్యం అంటూ ప్రధాన చెబుతూనే ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీని మరింత విస్తరించాలని.. పునరుత్పాదక వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రమంత్రులు సైతం అనేక సమావేశాలలో పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి జరుగుతున్న పనులు చూడవచ్చు. ఇందులో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ వంటి పరికరాలను అమర్చుతూ ఉండటం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. సౌర శక్తి పరిశ్రమలో ఆవిష్కరణల వేగం కేవలం నమ్మశక్యం కాదు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తున్నప్పుడు.. మన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కొత్త టెక్నాలజీలను ఆన్చేసించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ చాలా అవసరమని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.The pace of innovation in the solar energy industry is simply incredible. As the fastest growing large economy in the world, our energy needs are going to be daunting…So we need to explore not one, but each and EVERY one of these new technologies…. pic.twitter.com/kcG6YVLYL2— anand mahindra (@anandmahindra) August 21, 2024 -
భారత్లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్నకు చెందిన మోటార్సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
ఆర్బీఐ గవర్నర్తో ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్తో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఢిల్లీ బోర్డు సమావేశానికి మొదటిసారి హాజరవుతున్నాను. సంసద్ మార్గ్లో చాలా అద్భుతమైన, చారిత్రాత్మకమైన ఆర్ట్ డెకో ప్రధాన కార్యాలయ భవనం ఉంది. పాతరోజుల్లో ఇక్కడికి రిటైల్ ట్రాన్సక్షన్స్ కోసం ప్రజలు ఇక్కడికి వచ్చేవారని ఆయన నాతో చెప్పారని ట్వీట్ చేశారు.My first time attending an RBI Delhi board meeting this morning. What a splendid, historic, Art Deco Headquarters building they have on Sansad Marg. With Governor @DasShaktikanta just above the well of the iconic Banking Hall, where he told me people would flock in the old… pic.twitter.com/L7LDVaPHZH— anand mahindra (@anandmahindra) August 10, 2024కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ తర్వాత.. లోక్సభ ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత, ప్రభుత్వం పార్లమెంట్లో కొన్ని సవరణలతో సమావేశమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇతర డైరెక్టర్ల బోర్డు పాల్గొన్నారు. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిచాడు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. విభిన్న అంశాలపై ‘ఎక్స్’లో (ట్విటర్) ద్వారా తన స్పందనను పంచుకుంటుంటారు. భిన్న అంశాలలో ప్రతిభావంతులను, క్రీడాకారులను ప్రశంసిస్తుంటారు. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పతక విజేత నీరజ్ చోప్రా పట్ల స్పందించారు.నీరజ్ రెండో బంగారు పతకానికి దూరమైనప్పటికీ, అతని అద్భుతమైన ప్రదర్శన, తిరుగులేని నిలకడను ఆనంద్ ప్రశంసించారు. అలాగే స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డ్-బ్రేకింగ్ విజయాన్నీ అభినందించారు. నీరజ్తో అతని క్రీడాస్ఫూర్తిని, స్నేహాన్ని మెచ్చుకున్నారు."నేను ఒప్పుకుంటున్నాను. నిన్న రాత్రి నీరజ్ చోప్రాకు రెండో ఒలింపిక్ బంగారు పతకం చేజారిన వేళ నిశ్చేష్టుడనయ్యాను. కానీ, ఈ ఉదయం ముందుగా రికార్డ్ బద్దలు కొట్టిన అర్షద్ నదీమ్ని, నీరజ్తో అతని క్రీడాస్ఫూర్తి, స్నేహాన్ని అభినందించాలనుకుంటున్నాను. ఇక అత్యంత నిలకడను ప్రదర్శించిన నీరజ్ కూడా గోల్డ్ గెలిచినట్టేనని నేను చెప్పాలనుకుంటున్నాను. నీరజ్ భారత్కు మొదటి రజత పతకాన్ని అందించారు. నీరజ్ మీరు నిజంగా గొప్ప అథ్లెట్, మంచి మనిషి. మా అందరినీ గర్వపడేలా చేశారు" అని ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్ట్ చేశారు.I confess. I was devastated last night when @Neeraj_chopra1 didn’t win his second Olympic gold medal. But, this morning, I first want to congratulate Arshad Nadeem for his record-breaking throw. AND his sportsmanship & camaraderie with Neeraj. Then I want to tell Neeraj… pic.twitter.com/4KjPPrDh2e— anand mahindra (@anandmahindra) August 9, 2024 -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు ప్రపంచంలోని అగ్ర దేశాలను సైతం ఆర్ధిక మాంద్యంలోకి నెడతాయేమో అన్న భయం పుట్టిస్తున్నాయి. దీంతో ఈ రోజు (సోమవారం) గ్లోబల్ స్టాక్మార్కెట్లు భారీగా క్షిణించాయి. దీనిపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రాచీన భారతీయ అభ్యాసం ప్రాణాయమాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నటికీ రాదు. గట్టిగా శ్వాసతీసుకుని లోతుగా చూడండి. మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎవరి దుగుదలకు ఆటంకం కలగదు. లాంగ్ గేమ్ ఆడండి అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆర్ధిక మాంద్యం భయాల మధ్య.. మార్కెట్ సోమవారం సెన్సెక్స్ 3 శాతం క్షీణించగా, నిఫ్టీ కూడా విస్తృత అమ్మకాలతో దాదాపుగా పతనమైంది. స్టాక్ మార్కెట్ క్రాష్ బీఎస్ఈలో జాబితాని సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో దాదాపు రూ. 457 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 442 లక్షల కోట్లకు తుడిచిపెట్టుకుపోయింది.ఈ రోజు సెషన్లో పెట్టుబడిదారులు దాదాపు రూ. 15 లక్షల కోట్లను కోల్పోయారు, అయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో కూడా తిరోగమనం ఉంది. జపాన్ బెంచ్మార్క్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ దాదాపు 13 శాతం క్షీణించడంతో ఆసియా మార్కెట్లు పడిపోయాయి.Never a better time to deploy the ancient Indian practice of Pranayama. It’s about breathing deeply and looking inwards.What I see is an India that is an oasis in the world. Whose Rise will not be impeded in the medium to long term. Play the long game… https://t.co/UASfOSjQ10— anand mahindra (@anandmahindra) August 5, 2024 -
తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా వ్యహరించమని టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కోరినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని.. రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా.. వర్సిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.Anand Mahindra to be chairman of Young India Skills University.- CM Revanth Reddy📍New Jersey, USA #RevanthReddyinUSA#RevanthReddy• @revanth_anumula pic.twitter.com/cFjjqzG4Oi— Team Congress (@TeamCongressINC) August 5, 2024 ఆనంద్ మహేంద్ర..ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్.ఈ దేశ యువత ఎవరైనా తమ స్కిల్ ను ప్రదర్శిస్తే ఆ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టి వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.అటువంటి వ్యక్తిని తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ… pic.twitter.com/2pnRjKlkB1— Telangana Congress (@INCTelangana) August 5, 2024కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రూ.100 కోట్లతో 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు.తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్ర ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ దేశ యువత ఎవరైనా తమ స్కిల్ను ప్రదర్శిస్తే ఆ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టి వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారని తెలిపారు. అటువంటి వ్యక్తిని తెలంగాణలో ఏర్పాటుకాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మనన్గా సీఎం ఎంపిక చేయడం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు. -
‘సాహో సీత’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
కేరళ వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్ఫుల్ ఉమెన్ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్గా మారింది. The WonderWoman of Wayanad. No need for DC Super Heroes. We have them in real life out here…💪🏽💪🏽💪🏽 pic.twitter.com/DWslH6nKln— anand mahindra (@anandmahindra) August 3, 2024 ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కో ఎవరు?భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్లో ముందక్కై, చురాల్మల్లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. If possible, don’t destroy this bridge once a more permanent structure is restored. It should serve as a symbol of our pride in our army and the sense of security we derive from our soldiers. https://t.co/ZwNJZR4xbw— anand mahindra (@anandmahindra) August 4, 2024 -
బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవం (ఫొటోలు)
-
ఆనంద్ మహీంద్రా మెచ్చిన ట్రాఫిక్ పోలీస్.. డ్యాన్స్కు ఫిదా
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు . ఆయన ఏ పోస్టునైనా అలా షేర్ చేశారో లేదో.. నిమిషాల్లో వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. తాజాగా ఆయన రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ వీడియోను షేర్ చేశారు.మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కడ అతను 16 ఏళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందరూ చేతులతో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం తన డ్యాన్స్తో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తాడు. గంటల కొద్దీ రోడ్డుపై నిల్చొని ఎలాంటి నీరసం, విసుగు లేకుండా ట్రాఫిక్లో ఆగి ఉన్న జనాలకు తన స్టెప్పులతో అలరిస్తాడు. అయితే ఇటీవల రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా. తన వీడియోను షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘ఈ పోలీస్ బోరింగ్ పని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మన పనిని మనం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ ’అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.This cop proves that there is NO such thing as boring work.It is whatever you choose to make of it.#MondayMotivationpic.twitter.com/ItrI7yjAe2— anand mahindra (@anandmahindra) July 29, 2024 View this post on Instagram A post shared by Devanshu Gupta BUNNY (@iamdevanshugupta) View this post on Instagram A post shared by Ranjeet Singh (@thecop146) -
డిజైన్ అద్భుతం, ఇదొక జీవితం లాంటిది!.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి బాస్కెట్ బాస్కెట్ బాల్ను.. గోల్లో వేశారు. ఆ బాల్ అలా వెళ్లి.. తిరిగి తిరిగి.. సెట్ చేసిన ప్రదేశంలో పడటం చూడవచ్చు. ఇది గొప్ప డిజైన్ అని.. ఇది ఒకరకమైన జీవితం లాంటిదని, లవ్ రూబ్ గోల్డ్బెర్గ్ క్రియేషన్స్ చాలా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.Each individual cause and effect seems isolated. But someone had a grand design for how it all came to be…Sort of like life itself. Love Rube Goldberg inspired creations. #SundaySpace pic.twitter.com/3uvGhwkxH5— anand mahindra (@anandmahindra) July 28, 2024 -
రొమ్ము కేన్సర్ను ఐదేళ్లముందే ఏఐ పసిగట్టేస్తుంది
మహిళల్లో ప్రమాదకరంగా వ్యాపిస్తున్న కేన్సర్లలో రొమ్ము కేన్సర్ ఒకటి. కేన్సర్లను ముందుగా గుర్తించడం చాలా అవసరం. వ్యాధి బాగా ముదిరిన తరువాత గుర్తించడం వల్ల మరణాల రేటు బాగా పెరుగుతోంది. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో రొమ్ము కేన్సర్ను ఐదేళ్ల ముందే గుర్తించవచ్చని తేలింది. అధునాతన సాంకేతికత చికిత్స ఫలితం.. రోగ నిరూపణకి, కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది.యుఎస్లోని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం మామోగ్రామ్ల సాయంతో ఐదేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొత్త, అర్థమయ్యే కృత్రిమ మేధస్సు నమూనాను అభివృద్ధి చేసింది. రేడియాలజీ జర్నల్లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం రొమ్ము కేన్సర్ ముప్పును ఐదు సంవత్సరాల ముందే ప్రమాదాన్ని అంచనా వేjడంలో ఏఐ అల్గారిథమ్లు ప్రామాణిక క్లినికల్ రిస్క్ మోడల్ను అధిగమించాయని తెలిపింది.బయాప్సీ, మైక్రోస్కోప్ల క్రింద హిస్టోలాజికల్ పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ, పెట్ స్కాన్ల వంటి ఇమేజింగ్ పరీక్షలు కేన్సర్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు. వీటిని ఏఐ సిస్టమ్లు మరింత లోతుగా, అద్భుతమైన ఖచ్చితత్వంతో విశ్లేషించగలవు. ఫలితంగా సాధారణ పరీక్షల్లో కనిపించ కుండా పోయిన సూక్ష్మకణాలను ఏఐ ముందస్తుగా గుర్తించగలదు. ఇది చికిత్స ఫలితాలను పెంచి, రోగులను రక్షించడంలో వైద్యులకు మార్గం సుగమం చేసి, ముందస్తు మరణాలను నివారించగలదని భావిస్తున్నారు. తాజా పరిశోధన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు. మనం ‘‘మేము ఊహించిన దానికంటే కృత్రిమ మేధస్సు ఎంతోవిలువైందని వ్యాఖ్యానించారు. -
మన ముందున్న కర్తవ్యం ఇదే!.. బడ్జెట్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెన్ను ఉద్దేశించి, తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. వికసిత భారత్ను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలలో ఉద్యోగ కల్పన గురించి వెల్లడించడాన్ని అంశాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం ప్రశంసనీయం. దీనికి తగిన విధంగా ప్రైవేట్ రంగం కృషి చేయాలి. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రైవేట్ రంగం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, మన ముందున్న కర్తవ్యం ఇదే అని.. ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే.. రాబోయే రోజుల్లో విపత్తుగా మారే అవకాశం ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో మనదేశం ప్రపంచమే అసూయపడేలా మనదేశం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.We are the envy of the world in terms of our growth in GDP.We are the preferred destination of the world for investment because of the belief in our future.But the vital task ahead for us is to ensure that this growth is now accompanied by an explosion in job-creation.… pic.twitter.com/Z73BKJwWR1— anand mahindra (@anandmahindra) July 24, 2024 -
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా..!
-
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా!.. బంపరాఫర్
ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వీడియోలో 'సుధీర్ భావే' రకరకాల సైకిల్స్ రూపొందించారు. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈయన సృజాత్మకత చూపరులను ఎంతగానో మంత్రం ముగ్దుల్ని చేస్తోంది. దీనికి ఆనంద్ మహీంద్రా సైత ఫిదా అయ్యారు. క్రియేటివిటీ అనేది కేవలం యువకుల సొంతం మాత్రమే కాదని.. సుధీర్ భావేను ప్రశంసించారు.ప్రయోగశాల అవసరమైతే.. గుజరాత్లోని వడోదరలోని మహీంద్రా వర్క్షాప్ను ఉపయోగించుకోవచ్చని భావేకు.. ఆనంద్ మహీంద్రా అవకాశం కల్పించారు. సుధీర్ మీరు రిటైర్డ్ కాదు.. జీవితంలో చురుకైన & వినూత్నమైన కాలంలో ఉన్నారని కొనియాడారు.సుధీర్ భావే రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్. కాబట్టి అనేక సైకిల్స్ వ్యాయామాలకు ఉపయోగపడే విధంగా కస్టమైజ్ చేశారు. ఇందులో ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఉంది. భావే సుమారు 40 ఏళ్లపాటు స్టీల్ పరిశ్రమలో పనిచేశారు. తాను ప్రతిరోజూ సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తానని పేర్కొన్నారు.This wonderful story showed up in my inbox today. I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy. Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young! And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA— anand mahindra (@anandmahindra) July 18, 2024 -
ఇక్కడ ఏదీ వృథా కాదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నిరూపయోగంగా ఉన్న వెహికల్ టైర్స్, డ్రమ్ములు వంటి వాటితో అద్భుతమైన ఇంటీరియర్ వస్తువులను రూపొందించి ఉండటం చూడవచ్చు. చైర్లు, టేబుల్స్, వాష్ బేషన్స్, వాల్ క్లాక్స్ ఇలా పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాకండాలను తయారు చేస్తుండటం చూడవచ్చు.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది సర్క్యులర్ఎకానమీ, ఇక్కడ ఏమీ వేస్ట్ (వృథా) కాదు. ఇందులో కొత్తేమీ లేదు, భారతదేశంలో ఇదొక జీవన విధానమని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The circular economy.Where nothing is wasted.Nothing new. Just a way of life in India… pic.twitter.com/j0UhQxjAmM— anand mahindra (@anandmahindra) July 11, 2024 -
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా తన అద్భుతమైన తన గాప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది. దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఇది వైరల్గా మారింది. టీనా ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్మీదకు వచ్చి ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి ఇలా కాసేపు ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్ ద్వారా ప్రనిస్కా అమ్మమ్మ లైన్లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.What on earth is going on??For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing. With skills acquired in indigenous American genres of music. Rock & Gospel. Pranysqa… pic.twitter.com/2plEj8EXVs— anand mahindra (@anandmahindra) July 8, 2024 భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన చిన్నఅమ్మాయి తన టేలంట్తో షేక్ చేసింది అంటూ ఆనంద్ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు. -
నొప్పిని తగ్గించే మార్గం.. సరికొత్త ఆవిష్కరణ: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. సిరలను గుర్తించడానికి పరారుణ కాంతిని ఉపయోగించడం చూడవచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సిరలను గుర్తించడం కొంత కష్టమైన పని. ఈ టెక్నాలజీ ద్వారా సిరలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇది వైద్య విధానంలో అతి చిన్న ఆకర్షణీయమైన ఆవిష్కరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేలమంది వీక్షించిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.Using infrared light to locate veins. Saving the pain from repeated attempts to find a vein when drawing blood. It’s often the smallest, least glamorous inventions which significantly improve our medical experience and hence, the quality of our lives… pic.twitter.com/XgZI8Bcf2m— anand mahindra (@anandmahindra) July 6, 2024 -
పెట్టుబడులు పెంచండి.. ఆనంద్ మహీంద్రా కీలక సూచనలు
ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఈయన.. కోవిడ్ అనంతర కాలంలో భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక సంబంధాల పరస్పర చర్య భారతదేశం స్థితిని బలపరిచిందని పేర్కొన్నారు.భారతదేశం వృద్ధి మరింత వేగవంతం కావాలంటే పరిశ్రమలు కూడా వృద్ధి చెందాలి. ఈ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికీ మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమ చేయాల్సిన ముఖ్యమైన పని ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం అని ఆనంద్ మహీంద్రా అన్నారు.1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేట్ పెట్టుబడులు జీడీపీలో 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. అయితే 2011-12 నుంచి జీడీపీ శాతంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆందోళనకరమైన స్థాయికి పడిపోతున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దాలని, సమస్య వనరులకు సంబంధించినది కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినదని మహీంద్రా వెల్లడించారు. -
చాట్జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో.. క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.Hello Chat GPT 4.OPlease make me a graphic image showing the Indian Cricket team as Superheroes. Because they were SuperCool till the end.The greatest gift of this final to India was that it didn’t come easy. It almost slipped out of their grasp. But they never lost the… pic.twitter.com/pg8PsXjjqw— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
టీమ్ వర్క్ అండ్ టైమింగ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు, దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నలుగురు వ్యక్తులు నిలబడి ఉండటం చూడవచ్చు. మొదటి వ్యక్తి కొంత పైకి ఎగిరి రింగ్లో దూరాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి రింగును వెనక్కు వేగంగా పంపించారు. అదే సమయంలో వెనుక వున్న వ్యక్తులు కూడా కొంత ఎగిరి ఆ రింగు గుండా బయటకు వచ్చేస్తారు. ఈ సన్నివేశం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీమ్ వర్క్ అండ్ టైమింగ్.. ఈ రాత్రికి లెక్కించబడుతుంది. గో ఇండియా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.Teamwork… and TimingIt’s what’s going to count tonight..Go #TeamIndia !#INDvsSA #T20WorldCupFinal 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/6aovoJZpX6— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ ఇలాంటి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. వర్షంలో ఒక కారునే మంచి నివాస ప్రాంతంగా మార్చడం చూడవచ్చు. ఇందులో ఓ మహిళ వర్షం పడుతున్న సమయంలో తన కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత కారులోని సీట్లను కిందికి వంచి మంచి బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని దానిపై ఓ దుప్పటి కూడా పరుస్తుంది. ఇది అప్పుడు ఓ అద్భుతమైన బెడ్ మాదిరిగా తయారవుతుంది.ఇక కారుకి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంటులో చిన్న టేబుల్స్ వంటివి ఏర్పాటు చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా రూపొందించుకుంటుంది. ఆ తరువాత స్నానం చేయడానికి మరో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూడవచ్చు. ఇలా మొత్తం మీద ఓ అద్భుతమైన గదిగా ఏర్పాటు చేసుకుంది.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది క్యాంపింగ్. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని, ఆనందన్ని పొందవచ్చని అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.This is camping??I want to move in there permanently and claim tenancy rights to this ‘apartment.’ On the other hand, all the pleasures of being outdoors and as close to nature as possible without ‘devices’ are lost!pic.twitter.com/CAC7iOO7v7— anand mahindra (@anandmahindra) June 26, 2024 -
మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండబలం మీకు ఉండవచ్చు'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరాల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బలంగా కండలు కలిగిన వ్యక్తి ఆస్ట్రేలియా అని, అతై ముందు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అని చూడవచ్చు. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆస్ట్రేలియా వ్యక్తి గెలుస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫ్గనిస్తాన్ వ్యక్తి గెలుస్తారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని పేర్కొన్నారు.Never underestimate yourself. You may have more muscles than you imagine…#MondayMotivationpic.twitter.com/vKiC23jJCU— anand mahindra (@anandmahindra) June 24, 2024 -
'ఇదో మంచి ఆలోచన': ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశారు.దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి, అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకున్నారు. దాన్ని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. ఇలా చేయడం వల్ల గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని అన్నారు.Finally, we’re seeing some consistent rain in Mumbai this monsoon. Not heavy enough for our liking, but it’s probably time to plan our ‘wardrobe for wetness.’ May be a good idea to think about a ‘wearable’ umbrellaClever…pic.twitter.com/7pjyFAMJ6O— anand mahindra (@anandmahindra) June 22, 2024 -
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024 -
ఈ వార్తను నేనెలా మిస్ అయ్యాను!.. ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇలాంటి ఉత్తేజకరమైన వార్తను నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో మార్చిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. సుప్రీంకోర్టులో వంటమనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఙను.. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ తల్లితండ్రులను జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు.ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారతదేశం ఎందుకు పుంజుకుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఈ వీడియోను షేర్ చేస్తాను. ఇది నిబద్దత, కృషి, తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం. యునైటెడ్ స్టేట్స్లోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ అధ్యయనం చేయడానికి స్కాలర్షిప్ సాధించినందుకు, ఒక కుక్ కుమార్తె అభినందించారు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.I don’t know how I missed seeing this uplifting news in March this year. If anyone asks me why I think India will rise, I will share this video. It’s about aspirations, commitment, hard work & parental support. And most important, about us all recognizing & cheering each… pic.twitter.com/4bVPEtm8tB— anand mahindra (@anandmahindra) June 20, 2024 -
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024 -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. కల్కిలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు.అయితే హైదరాబాద్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో ఈ సినిమాలోని బుజ్జిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. విభిన్నమైన డిజైన్తో రూపొందించిన కారు(బుజ్జి) లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జి అన్ని ప్రధాన నగరాల్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ బుజ్జిని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్లో పోస్ట్ చేసింది. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. కల్కి సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. #Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/4VQCe3hSSv— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 12, 2024 -
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
'నరేంద్ర మోదీ' భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికలు జరగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయం. తమ ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు భారతీయ ఓటర్లకు అభినందనలు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ జీకి అభినందనలు. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. దేశ ప్రధానికి శుభాకంక్షాలు చెబుతున్నారు.दुनिया के सबसे बड़े लोकतंत्र में इतिहास के सबसे बड़े चुनाव होना और बिना किसी बाधा के नए सरकार का गठन होना गर्व की बात है। भारतीय मतदाताओं को अपने महत्वपूर्ण लोकतांत्रिक अधिकार का प्रयोग करने के लिए बधाई।नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने पर शुभकामनाएं। आशा है कि… pic.twitter.com/t6ylld6FNM— anand mahindra (@anandmahindra) June 9, 2024 -
క్యాప్షన్ కాంపిటీషన్లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా?
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కాంపిటీషన్ నిరవహించారు. గెలిచినవారికి గిఫ్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోను గమనిస్తే.. ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. దీనికి ఓ సరదా కామెంట్ చేయాలనీ, దాని కోసం జులై 3 వరకు గడువు ఇచ్చారు. గెలిచినవారికి ఓ బొమ్మ మహీంద్రా ఫ్యూరియో ప్రకటించారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందులో ఒకరు ఫోటో మీద కామెంట్ చేస్తూ.. అది ఇన్కాగ్నిటో మోడ్ మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమాధానం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. దీంతో వారి అడ్రస్ మెయిల్ చేస్తే గిఫ్ట్ పంపిస్తా అంటూ పేర్కొన్నారు.And the winner is... @raptorsworld : “Indognito mode” (incognito) Bravo! Would you please DM your mailing address details to @mahindracares to receive your Diecast, scale model Mahindra Furio Truck? https://t.co/fYGJybTOWS— anand mahindra (@anandmahindra) June 6, 2024 -
ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్.. ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటిలాగే ఈ రోజు కూడా మండే మోటివేషన్ పేరుతో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' కథనాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు.ఏషియన్ సీనియర్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కొంతకాలం క్రితం మోకాలికి గాయమైనప్పటికీ.. ఆటపైన ఉన్న మమకారమే ఆమెను ముందుకు నడిపించి విజయం సాధించేలా చేసాయి. ఆమె అలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నా.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటపై ఉన్న మమకారం, దీపా కర్మాకర్ గెలుపు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.And more #MondayMotivationJust back in March, @DipaKarmakar was talking about her injury & the hurdles she had to cross. It was the love for the sport, she said, which keeps her going.And yesterday she became the 1⃣st 🇮🇳 gymnast to win🥇at the prestigious Asian championship,… https://t.co/jMXzjp7G9P pic.twitter.com/l4OPrOMbaT— anand mahindra (@anandmahindra) May 27, 2024 -
మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇందులో మురుగు నీటి కాలువను చూడవచ్చు. దానికి ఒద్దు మీద ఓ చెట్టు పువ్వులతో వికసిస్తూ.. కనిపించింది.ఆనంద్ మహీంద్రా ఈ ఫోటో షేర్ చేస్తూ.. ''మేము దహిసర్ నదిని అన్ని రకాల కాలుష్య కారకాలతో ముదురు నల్లగా చేసాము. కానీ నది ఒడ్డున ఉన్న గుల్మోహర్ మాత్రం పూర్తిగా వికసిస్తానని తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. దహిసర్ నదిలో దాని ప్రతిబింబాన్ని మళ్లీ చూడటానికి వేచి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ప్రారంభించడంతో దాని కోరిక నెరవేరుతుంది'' అని అని ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టుకు పలువులు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.When a top city bureaucrat has the soul of a poet….Got this wonderful message from Chandrashekhar Chore (Jt Commissioner BMC) Mumbai“The Gulmohar & the Dahisar River. We have made this river DARK BLACK with all kinds of pollutants but the Gulmohar on the bank… pic.twitter.com/PE2McxDi48— anand mahindra (@anandmahindra) May 26, 2024 -
మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జ్.. ఇది చేయగలమా?: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జి కనిపిస్తుంది. దీనిపైన వెహికల్స్ వెళ్లడం చూడవచ్చు. నిజానికి అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా వెల్లడి కాలేదు.ఎక్కడైనా రోడ్ నిర్మాణం జరిగితే.. అక్కడ వాహనాల రాకపోకలకు రూట్ మారుస్తారు. కానీ వీడియోలో గమనిస్తే.. కింద రోడ్డు పనులు జరుగుతున్నాయి. పైన యధావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పనులు కొనసాగించేందుకు వీలుగా ఒక మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.ఈ వీడియో షేర్ చేస్తూ.. మనం కూడా ఇలాంటి ఆపరేటింగ్ విధానాన్ని చేయగలమా? అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.A mobile overpass bridge.Allows work to continue without traffic being disrupted. Like everything innovative, it looks so obvious after it’s introduced. Can we make this ‘standard operating procedure’ please?pic.twitter.com/RYvPuxDtVO— anand mahindra (@anandmahindra) May 25, 2024 -
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ ప్రత్యేకమైన వాహనానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కనిపించే వాహనం పేరు 'బుజ్జి'. ఇది ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కనిపిస్తుంది. ఇది చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉన్న మా బృందం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఏఐ టెక్నాలజీని పొందుతుందని వివరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.కల్కి 2898 ఏడీపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.Fun stuff does, indeed, happen on X …We’re so proud of @nagashwin7 and his tribe of filmmakers who aren’t afraid to think big…and I mean REALLY big..Our team in Mahindra Research Valley in Chennai helped the Kalki team realise its vision for a futuristic vehicle by… pic.twitter.com/yAb47nx7ut— anand mahindra (@anandmahindra) May 23, 2024 -
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
భారతదేశంలో ఐదో దశ ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా ఉన్నారు.ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అవకాశం. ఇది ఒక బ్లెస్సింగ్ అంటూ.. ట్వీట్ చేశారు.మరో ఫోటో షేర్ చేస్తూ.. 2024 ఎన్నికలలో ఇది ఉత్తమ చిత్రం, గ్రేట్ నికోబార్లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు, మొదటిసారి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ.. ఆ తెగకు చెందిన వ్యక్తి ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.This, for me, is the best picture of the 2024 elections.One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h— anand mahindra (@anandmahindra) May 20, 2024 -
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో అతి పెద్ద 'ఐకాన్ ఆఫ్ ది సీస్' షిప్ సముద్రం మీద ఉండటం చూడవచ్చు.వీడియోను షేర్ చేస్తూ.. సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం. ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. సొంత క్రూయిజ్ షిప్లను ఎక్కువగా డిమాండ్ చేస్తాము.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఐకాన్ ఆఫ్ ది సీస్ఐకాన్ ఆఫ్ ది సీస్ విషయానికి వస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్లు తెలుస్తోంది. దీని బరువు సుమారు 248663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో ఐదు రెట్లు పెద్దగా ఉందని చెబుతారు. కాబట్టి దీన్ని 'సిటీ ఆఫ్ సీ' అని పిలుస్తారు.For Sunday leisure viewing. It’s booked till ‘26. But Indians will be one of the two largest tourist populations in the world…And we will most likely demand—and get—our own cruise ships… pic.twitter.com/IgxW4YhyWZ— anand mahindra (@anandmahindra) May 19, 2024 -
హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. అలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు.ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో స్థానికంగా పెట్రోల్పంపు వద్ద 100 అడుగుల ఎత్తైన బిల్బోర్డ్ ఒక్కసారిగా కుప్పుకూలి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ముంబయి ఆధునిక మహానగరంగా మారుతుంది. సీఎం అన్ని హోర్డింగ్లపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు పాటించాలి’ అని ట్వీట్ చేశారు.గాయపడిన వారిలో 31 మందిని రాజావాడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. హోర్డింగ్ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.14 dead.Om Shanti 🙏🏽60 injuredFrom a billboard collapse.Unacceptable. And we’re a city trying to transform itself into a modern metropolis. CM @mieknathshinde has ordered a probe into all hoardings.Stringent rules must follow.pic.twitter.com/DxvsaoBm0l— anand mahindra (@anandmahindra) May 14, 2024 -
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మాతృ దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్ 1977 నాటి చిత్రం. ఇందులో ఆనంద్ మహీంద్రా తన తల్లితో ఉండటం చూడవచ్చు. నేను కాలేజీకి వెళ్ళడానికి ముందు అంటూ.. అమ్మ ఎప్పుడూ కెమెరా వైపు కాకుండా దూరంగా చూస్తూ ఉంది. ఇందులో తన బిడ్డ భవిష్యత్తును ఆశించింది. చదువులో విజయం సాధించి తన బిడ్డ సంతోషన్ని పొందాలని ఆమె ఆశించిందని ట్వీట్ చేసారు. అంతే కాకుండా హ్యాప్పీ మదర్స్ డే అమ్మా అంటూ మీ కలలను నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టును.. లెక్కకు మించిన నెటిజన్లు లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.Back in 1977. Just before I left for college.My mother wasn’t looking into the camera;As usual she was gazing into the distance…trying to envision her childrens’ future, hoping that a good education would be their passport to success—and happiness.Happy #MothersDay Ma.… pic.twitter.com/nxPZEWzKSD— anand mahindra (@anandmahindra) May 12, 2024 -
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
గత కొన్ని సంవత్సరాలు ఎగిరే కార్లు వస్తాయని వింటూనే ఉన్నాము. ఇటీవల ఆనంద్ మహీంద్రా దేశంలో అడుగు పెట్టనున్న మొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్లాన్ (Eplane) అనే స్టార్టప్ కంపెనీ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి గత సంవత్సరమే ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారు చేసే కంపెనీగా అవతరిస్తుంది.ఈ కంపెనీకి చెందిన ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ.. వచ్చే ఏడాది లోపల మద్రాస్ ఐఐటీ ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The eplane company. A company being incubated at IIT Madras to build a flying electric taxi by sometime next year…IIT Madras has become one of the WORLD’s most exciting and active incubators. Thanks to them and the rapidly growing number of ambitious incubators throughout… pic.twitter.com/Ijb9Rd2MAH— anand mahindra (@anandmahindra) May 10, 2024 -
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
నాన్న (బ్రెయిన్ టీబీ) అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లి ఇక్కడ ఉండలేనంటూ సొంత ఊరికి (పంజాబ్) వెళ్లిపోయింది. దీంతో ఒంటరి అయిపోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. నాన్న చనిపోయి నెలరోజులైనా కాకుండానే బాధ్యతను భుజానకెత్తు కున్నాడు. నాన్న నేర్పిన విద్యనే ఎంచుకున్నాడు. కేవలం పదేళ్లకే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ని నడుపుతూ దైర్యంగా జీవిస్తున్నాడు. తన 14 ఏళ్ల అక్కకు కూడా కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆ దైర్యం పేరే జస్ప్రీత్. చదువుకుంటూనే, ఈ సెంటర్ నడుపుతూ ఉండటం విశేషం. ‘‘జబ్తక్ హిమ్మత్ హై.. తబ్ తక్ లడూంగా’’ అంటున్న ఆ కుర్రవాడి కళ్లలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం నెటిజనులకు ఆకట్టుకుంటోంది. After Kids Video Went Viral On Different SM Platforms, Help And Support For Kid Is Pouring Out Huge...Y'day @JarnailSinghAAP Reached The Kid And Assured Eveey Possible Help And Support For Him.Thank You Everyone For Sharing Such Videos, You Friends Are A Huge Support.🙏❤️ https://t.co/8DKP3G7QlF pic.twitter.com/Rs3sCnM5al— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) May 3, 2024 పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఈ సెంటర్ నడుపుతున్న జస్ప్రీత్ వీడియోను ఫుడ్ వ్లాగర్ సరబ్జీత్ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చికెన్ ఎగ్ రోల్, కబాబ్ రోల్, పన్నీర్ రోల్...ఇలా రుచికరమైన పదార్థాలను అలవోకగా చేసి కస్టమర్లకు అందిస్తాడు. జస్ప్రీత్కు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరలవుతోంది.ఈ వీడియో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర వరకూ చేరింది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ఆ బాలుడి ధైర్యానికి దృఢ సంకల్పానికి ఫిదా అయిపోయారు. అతని కాంటాక్ట్ నంబరు తెలిస్తే జస్ప్రీత్కు సాయం చేస్తానంటూ ప్రకటించారు. అతని చదువు దెబ్బ తినకూడదు. మహీంద్రా ఫౌండేషన్ బృందం, అతని విద్యకు ఎలా మద్దతు ఇవ్వగలదో ఆలోచిస్తుంది. దయచేసి జస్ప్రీత్ వివరాలను అందింగచలరు అంటూ ఎక్స్ లో పోస్ట్(ట్వీట్) చేశారు.Courage, thy name is Jaspreet. But his education shouldn’t suffer. I believe, he’s in Tilak Nagar, Delhi. If anyone has access to his contact number please do share it. The Mahindra foundation team will explore how we can support his education.pic.twitter.com/MkYpJmvlPG— anand mahindra (@anandmahindra) May 6, 2024మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జస్ప్రీత్ భారీ మద్దతు లభిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా స్పందించారు. తగిన సాయం అందిస్తానని ప్రకటించారు. -
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పెద్ద ఫర్నిచర్ను.. ఒక చిన్న స్కూటర్ మీద తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది ఫుడ్ కాదు, కిరాణా సామాగ్రి కాదు.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా అని నేను ఊహిస్తున్నాను అంటూ ఓ ఎమోజీ యాడ్ చేశారు.నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందింది. రెండు వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో చూపరులను తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావిస్తున్నాము.So I guess this is what a 10 minute furniture (not food or groceries) service would look like… 🙂 pic.twitter.com/0GqY39ty2F— anand mahindra (@anandmahindra) May 3, 2024 -
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఒక నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు.ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO కారును ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు షేర్ చేశారు. ఈ వీడియోపైన ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. మీ సందేహానికి ధన్యవాదాలు, ఇలాంటివి మాలో ఇంకా కసిని పెంచుతాయని అన్నారు.1991లో నేను కంపెనీకి చేరినప్పుడు సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగంలో తప్పుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడగలిగాము. వచ్చే వందేళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం ప్రతిరోజు పోరాడుతూ ఉంటామని.. ఆనంద్ మహీంద్రా సున్నితంగా సమాధానం ఇచ్చారు.నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన యూజర్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని నమ్ముతున్నట్టు మరో నెటిజన్ ట్వీట్ చేశారు.Thank you for your skepticism. It only fuels the fire in our bellies. I was told exactly the same thing when I joined the company in 1991. Global consultants advised us to exit the industry. We were told the same thing when Toyota and other global giants in the UV space… https://t.co/oYMBO6HcWk— anand mahindra (@anandmahindra) April 29, 2024 -
పేరులో 'మహీ' ఉన్నందుకు గర్వపడుతున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇన్నింగ్స్ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో MS ధోనీ వరుస సిక్స్లతో చెలరేగిపోయారు. ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? నా పేరులో ''మహీ'' ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ.. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇప్పటికే 51వేలకంటే ఎక్కువ లైక్స్ పొందింది. లక్షల మంది వీక్షించిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Show me one sportsperson who thrives more than this man—on unrealistic expectations & pressure… It only seems to add fuel to his fire Today, I’m simply grateful that my name is Mahi-ndra…. 🙂 https://t.co/u9Hk6H6xiy — anand mahindra (@anandmahindra) April 14, 2024 -
13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే..
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల 'నిఖిత' కోతుల దాడి నుంచి తనతోపాటు ఉన్న చిన్నపిల్లను కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కూడా ఫిదా అయ్యారు. ఏకంగా జాబ్ ఆఫర్ కూడా చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిఖిత అమెజాన్ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి చొరబడ్డ కోతులను భయపెట్టి తరిమేసింది. కోతులు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అలోచించి దైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు. టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? లేదా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతామా? అనేది ప్రశ్న. 13 ఏళ్ల అమ్మాయి వేగంగా ఆలోచించి అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కోతుల భారీ నుంచి బయటపడింది. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తి చాలా గొప్ప విషయం. నిఖిత చదువు పూర్తయిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే.. ఆమెను మాతో చేరటానికి ఒప్పించగలమని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి! అసలేం జరిగిందంటే? కొంత మంది అతిథులు నిఖిత ఇంటికి వచ్చారని, ఆ సమయంలో గేట్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల కోతులు వంటగదిలో ప్రవేశించాయని నిఖిత చెప్పింది. కోతులు వంటగదిలో ప్రవేశించిన తరువాత అక్కడున్న వస్తువులను విసిరివేయడం స్టార్ట్ చేశాయి. ఆ సమయంలో అక్కడనే ఉన్న చిన్నపిల్ల భయపడింది. కానీ నేను మాత్రమే అలెక్సాను కుక్కలాగా శబ్దం చేయమని ఆదేశించాను.. అలెక్స్ చెప్పినట్లు చేసింది. దీంతో కోతులు భయపడి అక్కడ నుంచి పారిపోయాయని చెప్పింది. The dominant question of our era is whether we will become slaves or masters of technology. The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity. Her quick thinking was extraordinary. What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK — anand mahindra (@anandmahindra) April 6, 2024 -
ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!
కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను కూడా ఆకట్టుకుంది. రాజస్తాన్లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్విల్లా మొక్కలతో షెల్టర్ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది. Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers. One individual, passionately built a thing of beauty. Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY — anand mahindra (@anandmahindra) March 28, 2024 -
యూనివర్సిటీకి రూ.500 కోట్లు.. ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల జల్లు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. అనేక స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ, అప్పుడప్పుడు కొందరికి రిప్లై ఇస్తుంటారు. ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచిన ఈయన ఇటీవల హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్శిటీ కోసం రూ. 500 కోట్లు కేటాయించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆనంద్ మహీంద్రా ప్రకటించిన నిధులతో మహీంద్రా యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇంటర్ డిసిప్లినరీ అకడమిక్ ఎక్సలెన్స్ కోసం పాటుపడే మహీంద్రా యూనివర్సిటీ మిషన్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఆనంద్ మహీంద్రా తల్లి 'ఇందిరా మహీంద్రా' పేరుతో నిర్మించిన ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కూడా వ్యక్తిగతంగా రూ.50 కోట్లను అందించనున్నట్లు హామీ ఇచ్చారు. దీనిని విద్యా రంగంలో.. పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల్లో అగ్రగామగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇది మహీంద్రా యూనివర్శిటీలో భాగంగా ఉంటుంది. టెక్ మహీంద్రా మాజీ వైస్-ఛైర్మన్ వినీత్ నాయర్ ఆలోచన ద్వారా పుట్టిన మహీంద్రా యూనివర్సిటీ 2020లో ప్రారంభమైంది. నేడు ఇందులో సుమారు 35 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ వంటి కోర్సులు ఉన్నాయి. మహీంద్రా యూనివర్సిటీలో సుమారు 4100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ కూడా ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. -
ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించిన రామ్ చరణ్
-
నన్నెందుకు పిలవలేదు? ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించిన చరణ్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మధ్య సరదా సంభాషణ జరిగింది. సుజీత్ పెళ్లికి తనను ఎందుకు పిలవలేని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు చరణ్.. దీంతో ఆనంద్ మహీంద్రా అయ్యయ్యో.. మర్చిపోయానంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ముఖచిత్రాన్ని మహీంద్రా ఎలా మార్చాడో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఫ్యాక్టరీతో పాటు.. 'జహీరాబాద్లో మహీంద్రా ఒక ఫ్యాక్టరీని నిర్మించడంతో పాటు లక్షలాది చెట్లను నాటాడు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయించడంతో అండర్గ్రౌండ్ వాటర్ లెవల్ 400 అడుగులకు పెరిగింది. అప్పటివరకు నీటి ఎద్దడి వల్ల గ్రామస్తుడు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అతడే కాదు ఆ ఊర్లో ఉన్న ఎవరికీ పిల్లనిచ్చేందుకు చుట్టుపక్కల ఊరివాళ్లు ముందుకు రాలేదు. ఇప్పుడా నీటిసమస్య తీరిపోవడంతో ఊళ్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. సుజిత్ పెళ్లి జరిగింది' అని చెప్పుకొచ్చారు. ఎంజాయ్ చేసేవాడిని దీనిపై చరణ్ ప్రశంసలు కురిపిస్తూ.. 'ఆనంద్ మహీంద్రా, సుజీత్ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు. నేను అక్కడికి దగ్గర్లోనే ఉంటాను. జహీరాబాద్లో నా ఫ్రెండ్స్ను కలిసి ఎంజాయ్ చేసేవాడిని. ఏదేమైనా మీరు చేసింది చాలా గొప్ప పని' అని మెచ్చుకున్నారు. ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. 'నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు నేను గందరగోళంలో ఉన్నాను.. అందువల్లే పెళ్లికి ఆహ్వానించలేకపోయాను. ఈసారి మిస్ అవ్వను.. అందుకే! ఇప్పుడేమో మీ శిక్షణ ఆధారంగా నా డ్యాన్స్ మెరుగుపర్చుకునే పనిలో ఉన్నాను. మా ప్రకటన పట్ల స్పందించినందుకు థ్యాంక్స్.. ఇది ఎంతో సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నాను. ఈసారి నేను మిస్ అవ్వాలనుకోవడం లేదు. అందుకే అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. దీనికి చరణ్.. థాంక్యూ, త్వరలోనే కలుద్దామంటూ రిప్లై ఇచ్చాడు. I confess. I messed up. And missed sending you the invitation @AlwaysRamCharan ! I believe I was preoccupied with perfecting my dance moves based on your last lesson. 😅 But, many thanks for the shout-out! Makes a huge positive impact. Let me not mess up & miss out… https://t.co/MBl55Eg47Q — anand mahindra (@anandmahindra) March 23, 2024 చదవండి: Pawan Kalyan: నటుడా? నాయకుడా? -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్
నిత్యం టెక్నాలజీలో మార్పులు వస్తోన్నాయి. అందులో చాలా వరకు మనుషులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తుంటే.. మరికొన్ని మనుషులను సోమరులుగా చేసేవి వస్తున్నాయి. మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలను తెలియజేసేందుకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ వీడియోలో.. షాపింగ్మాల్లో ఓ యువకుడు ఒక చేతిలో పాప్కార్న్, మరో చేతిలో కూల్డ్రింక్ పట్టుకుని సింగిల్ వీల్ ఏఐ స్కూటర్పై వెళుతుంటాడు. కళ్లకు విజన్ ప్రో అద్దాలు, స్కూటర్ హ్యాండిల్కు రెండు స్మార్ట్ఫోన్లు ఉంటాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. టెక్నాలజీతో పూర్తిగా కనెక్టయి.. వాస్తవ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యాడని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలగానే ఉండనుందని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనతో ఏకీభవిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘టెక్నాలజీ వచ్చాక చాలామంది పిల్లలు తమ బాల్యాన్ని సరిగా ఆస్వాదించడం లేదు’. ‘రాబోయే రోజుల్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పరిస్థితి ఉండదు. ఎక్కువగా మెషీన్లతోనే కనెక్ట్ అవుతారు’అని కామెంట్లు వస్తున్నాయి. Completely plugged in… And yet, Completely disconnected. If this is the future, then it’s a nightmare…. pic.twitter.com/8i8IapgQYu — anand mahindra (@anandmahindra) March 11, 2024