
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో మల్లవోలు లిఖిత 500 మార్కులకు 494, ఓకే గీతిక 494, మామిడిపాక హరిణి 494 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదే విధంగా 490కిపైగా సాధించిన విద్యార్థులు 88 మంది, 480కి పైగా సాధించిన వారు 498 మంది, 475కి పైగా సాధించిన వారు 649 మంది ఉన్నట్లు వివరించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని సముద్రాల సాత్విక 982 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా 970కి పైగా 71 మంది, 960కి పైగా 141 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ ప్రభంజనం