
గంజాయి అమ్మకాలపై నిఘా ఉంచాలి
నెహ్రూనగర్: ప్రభుత్వం తలపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 28 గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా అనధికార మద్యం దుకాణాలు లేకుండా చూడాలన్నారు. ప్రతి మద్యం దుకాణం, బార్ అండ్ రెస్టారెంట్లలో, కల్లు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించి కల్తీ జరగకుండా చూడాలన్నారు. మద్యం దుకాణాల్లో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి మద్యం సీసాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు ఎం సుధాకర్రెడ్డి, ఎం రవికుమార్రెడ్డి, పల్నాడు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు ఇ మారయ్యబాబు, కె రవీంద్ర, జి సూర్యనారాయణ, గుంటూరు, పల్నాడు జిల్లాల ఎకై ్సజ్ సీఐలు పాల్గొన్నారు.
నేడు ఉపాధ్యాయులసర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరుజిల్లా పరిధిలోని మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు హైకోర్టు కామన్ ఉత్తర్వుల ప్రకారం అర్హులైన ఎస్జీటీ, భాషా పండిట్ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు డీఈవో సీవీ రేణుక సోమవారం ఓప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో పొందుపర్చిన 10–10–2017 నాటి కామన్ సీనియారిటీ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీసు రిజిస్టర్తో హాజరు కావాలని సూచించారు.
వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన
నరసరావుపేట: భారత రాజ్యాంగం కాపాడాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, పేద మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ముస్లిం సంఘాలు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ముస్లిం మైనార్టీ నాయకులు మస్తాన్వలి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింల అణచివేతకు పాల్పడుతుందన్నారు. ఒక్క ముస్లింను కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో నియమించలేదని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఎం నాయకులు డి.శివకుమారి, పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు ఉదయగిరి వెంకటస్వామి, మైనారిటీ నాయకులు మాదిన రసూల్ రఫీ, వర్లమాబు, కరీముల్లా, ఖలీల్, మెకానిక్ మస్తాన్ వలి పాల్గొన్నారు.
ముగిసిన గోవర్ధనస్వామి ఆలయ బ్రహోత్సవాలు
నాదెండ్ల: నాదెండ్లలో కొలువై ఉన్న చారిత్రాత్మక ఆలయమైన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధనస్వామి, భూనీలా సమేత శ్రీ చెన్నకేశవస్వామి వార్ల దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు స్వామివారి ధ్వజారోహణ నిర్వహించారు. ఈ నెల 8న ప్రారంభమైన బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు పరాంకుశం సాయిశ్రీనివాసాచార్యులు, విజయరామాచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.

గంజాయి అమ్మకాలపై నిఘా ఉంచాలి

గంజాయి అమ్మకాలపై నిఘా ఉంచాలి