దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్ | Hamas Ready To Release Hostages If Israel Stops Attack | Sakshi
Sakshi News home page

దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్

Published Wed, Oct 18 2023 10:58 AM | Last Updated on Wed, Oct 18 2023 12:24 PM

Hamas Ready To Release Hostages If Israel Stops Attack - Sakshi

జెరూసలేం: గాజా ఆస్పత్రిపై దాడిలో వందల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో గాజా నగరం అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్‌ దాడులతో ఉత్తర గాజా సగభాగాన్ని ప్రజలు ఇప్పటికే ఖాలీ చేశారు. దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ కూడా హతమయ్యారు. ఈ క్రమంలో హమాస్‌ నుంచి కీలక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దాడులను తక్షణమే నిలిపివేస్తే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తామని ప్రకటన వెలువడినట్లు సమాచారం. హమాస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్‌ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.

'మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్ దాడులు జరిపింది. అందులో విఫలమైన ఓ రాకెట్ ఆస్పత్రిపై పడింది. మా బలగాలు ఆ ఆస్పత్రిపై రాకెట్‌ను ప్రయోగించలేదు.' అని ఐడిఎఫ్‌(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది.

ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా పేర్కొన్నారు. గాజాలో ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందలాది మంది మరణించడంతో మూడు రోజుల సంతాప దినాలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. 'మారణహోమం జరుగుతోంది. ఈ మారణకాండను ఆపడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలి. మౌనం ఇకపై ఆమోదయోగ్యంకాదు'అని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటన వెలువరించింది. 

అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష‍్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్‌లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు.

ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement