చైనాలో అడుగుపెట్టిన మోదీ | Pm Modi Arrives In China Tianjin Ahead Of Sco Summit | Sakshi
Sakshi News home page

చైనాలో అడుగుపెట్టిన మోదీ

Aug 30 2025 5:20 PM | Updated on Aug 31 2025 4:54 AM

Pm Modi Arrives In China Tianjin Ahead Of Sco Summit

తియాంజిన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్‌లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది.    
 

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్‌పింగ్‌ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్‌పింగ్‌ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. 

టియాంజిన్ లో  ల్యాండ్ అయిన ప్రధాని మోదీ

గణనాథుడి చిత్రాన్ని షేర్‌ చేసిన చైనా   ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్‌.. వినాయకుడి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్‌ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్‌ స్పష్టంచేశారు.   

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement