రజతోత్సవ సభను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

Published Tue, Apr 8 2025 7:37 AM | Last Updated on Tue, Apr 8 2025 7:37 AM

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

కామారెడ్డి క్రైం: వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి లోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుండి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ సూచించిన దాని కంటే ఎక్కువ మంది కార్యకర్తలను సభకు తరలించాలని ఆయా మండలాల నాయకులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జెడ్పీ మాజీ సభ్యులు మినుకూరి రాంరెడ్డి, గండ్ర మధుసూదన్‌, మాజీ ఎంపీపీలు బాలమణి, పిప్పిరి ఆంజనేయులు, పార్టీ అధికార ప్రతినిధులు బల్వంత్‌ రావు, గైని శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు గోపీ గౌడ్‌, నల్లవెల్లి అశోక్‌, మోహన్‌ రెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, ప్రభాకర్‌ రెడ్డి, భాను, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

భారీగా తరలిరావాలి

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement