లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థిని దుర్మరణం

Feb 19 2024 11:56 PM | Updated on Feb 20 2024 11:38 AM

- - Sakshi

కరీంనగర్‌రూరల్‌: లారీ ఢీకొని ఓ విద్యార్థిని దుర్మర ణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుజ రాత్‌కు చెందిన వాసాని జగదీశ్‌ కొన్నేళ్ల క్రితం భా ర్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కరీంనగర్‌ మండలంలోని గోపాల్‌పూర్‌ వచ్చి, ఇక్కడే ఉంటున్నా డు. స్థానికంగా కట్టెకోత మెషిన్‌ పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కూతురు దియాపటేల్‌(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది.

సోమవారం ఉదయం 8 గంటలకు ఎలక్ట్రికల్‌ స్కూటీపై కాలేజీకి వెళ్తోంది. బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ సర్కిల్‌లో గోదావరిఖని నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన 14 టైర్ల లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో దియాపటేల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు లారీడ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement