ప్రైవేటు వాహనాల బంద్‌... కిక్కిరిసిన మెట్రో రైళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వాహనాల బంద్‌... కిక్కిరిసిన మెట్రో రైళ్లు

Sep 12 2023 12:24 AM | Updated on Sep 12 2023 8:14 AM

కేఆర్‌.పురంలో మెట్రో రైలులో కిటకిట  - Sakshi

కేఆర్‌.పురంలో మెట్రో రైలులో కిటకిట

ప్రైవేటు వాహనాల బంద్‌ వల్ల మెట్రో రైళ్లు నిలబడానికి కూడా స్థలం లేకుండా కిటకిటలాడాయి. మెట్రో స్టేషన్లకు భారీఎత్తున ప్రయాణికులు తరలివచ్చారు.

బనశంకరి: ప్రైవేటు వాహనాల బంద్‌ వల్ల మెట్రో రైళ్లు నిలబడానికి కూడా స్థలం లేకుండా కిటకిటలాడాయి. మెట్రో స్టేషన్లకు భారీఎత్తున ప్రయాణికులు తరలివచ్చారు. దీంతో మెట్రో సంస్థ రెండు మెట్రో రైళ్ల మధ్య సంచార అవధిని ఐదు నిమిషాలకు తగ్గించింది.

సాధారణంగా వేకువజామున ప్రతి 10 నిమిషాలకు ఒకరైలు సంచరిస్తుంది. ఉదయం 8 గంటలనుంచి 11.30 వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడిపినట్లు సంస్థ అధికారులు తెలిపారు. స్టేషన్లలో టోకెన్‌ తీసుకోవడం దగ్గరనుంచి అన్నిచోట్లా జనసమ్మర్ధం కనిపించింది. సిటీ బస్సుల్లో మాదిరిగా పెద్దసంఖ్యలో నిలబడి ప్రయాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement