పుట్టినరోజే చివరిరోజు | - | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే చివరిరోజు

Jul 10 2024 12:24 AM | Updated on Jul 10 2024 10:40 AM

-

కారు ప్రమాదంలో యువతి మృతి

చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా హొన్నేనహళ్లికి చెందిన రక్షిత (21) అనే యువతి పుట్టినరోజు నాడే దుర్మరణం పాలైంది. వివరాలు... ఆమె బెంగళూరులో ప్రైవేటు కాలేజీలో బీకాం చివరి ఏడాది చదువుతోంది. సోమవారం ఆమె బర్త్‌ డే కావడంతో కాలేజీలో స్నేహితుల మధ్య కేక్‌ కట్‌చేసింది. ఇంటి వద్ద కూడా వేడుకలు చేసుకోవాలనుకుంది. దీంతో సాయంత్రం స్నేహితునితో కలిసి కారులో సొంతూరికి వస్తోంది. 

చిక్కబళ్లాపురం సమీపంలో నాగార్జున ఇంజినీరింగ్‌ కాలేజు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. కారు ముందు భాగం ధ్వంసమైంది, రక్షిత తీవ్ర గాయాలతో కారులోనే మరణించింది. స్నేహితునికి తీవ్ర గాయాలు కాగా, చిక్కబళ్లాపురం ఆసుపత్రికి తరలించారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement