ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, కార్మి కులు సమన్వయంతో కృషి చేయాలని ఆది లాబాద్ రీజినల్ మేనేజర్ సోలోమన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సిబ్బందికి వారం రోజులుగా నిర్వహిస్తున్న పవర్ శిక్షణ కార్యక్రమానికి సోమవారం ప్రత్యేక అ తిథిగా హాజరయ్యారు. ఆర్ఎం మాట్లాడు తూ సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పాటించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూ చించారు. డిపో పరిధిలో ఖర్చులు తగ్గించడంతోపాటు కేఎంపీఎల్ పెంచాలన్నారు. ప్ర మాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణలో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ విశ్వనాథ్, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment