జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి నెట్బాల్ జూనియర్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, పీడీ బి.తిరుపతి తెలిపారు. ఎంపికై న వారిని మంగళవారం అభినందించారు. ఆర్.పల్లవి, కె.రోషిణి, ఎం.దీపిక, ఎం. రోహన్, ఎన్.రోహిత్ ఈ నెల 26, 27, 28 తేదీల్లో హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇదే పోటీలకు ఎంపికై న జిల్లాకు చెందిన డి.వినత్రయను నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment