గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి

Published Thu, Mar 6 2025 1:50 AM | Last Updated on Thu, Mar 6 2025 1:45 AM

గోదావ

గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్‌ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి..

తాండూర్‌: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. అచ్చులాపూర్‌ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్‌బంక్‌ వద్దకు బైక్‌పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..

సోన్‌: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పట్టే క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ హైమద్‌ మోహినుద్దీన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి1
1/1

గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement