ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీ తిరుపతితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన నిశ్విత్, కార్తికేయ, మనితేజ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని, ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.