కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత

Published Sun, Feb 16 2025 2:05 AM | Last Updated on Sun, Feb 16 2025 2:05 AM

కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత

కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత

నందవరం: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు వెటర్నరీ డాక్టర్‌ వరలక్ష్మి, ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగలదిన్నె గ్రామంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో శనివారం వాహనా ల తనిఖీ చేపట్టారు. ఎమ్మిగనూరు నుంచి ఎలాంటి అనుమతులు లేని 30 వేల గుడ్లతో వచ్చి బొలెరో వాహనాన్ని తనిఖీ చేసి వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి పత్రాలు చూపించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని గుడ్లు, కోళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్‌ వెల్లడించారు. తనిఖీలో వెటర్నరీ అసిస్టెంట్‌ సుధాకర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement