ఎండు మిరపకు నిప్పు పెట్టిన దుండగులు | - | Sakshi
Sakshi News home page

ఎండు మిరపకు నిప్పు పెట్టిన దుండగులు

Published Sat, Mar 1 2025 8:02 AM | Last Updated on Sat, Mar 1 2025 7:57 AM

ఎండు మిరపకు  నిప్పు పెట్టిన దుండగులు

ఎండు మిరపకు నిప్పు పెట్టిన దుండగులు

రూ. ఐదు లక్షల నష్టం

అయిజ: రైతులు పండించిన ఎండు మిరుప పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన గురువారం రాత్రి అయిజ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. తూంకుంట గ్రామానికి చెందిన రైతు అలిపీర 2.30ఎకరాల పొలంలో మిరుప సాగుచేశాడు. సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండించిన మిరుపను పొలంలోనే ఎండబెట్టి రాశిగా కుప్ప పేర్చాడు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎండుమిరుప కుప్పకు నిప్పంటించారు. దీంతో సుమారు రూ. ఐదు లక్షల నష్టం వాటిల్లింది. శుక్రవారం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement