గోపాల్నగర్ శివారులో పులి
తాండూర్ (బెల్లంపల్లి): బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలోనే పక్షం రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. బెల్లంపల్లి మండలం కన్నాల అటవీ ప్రాంతం, కాసిపేట, తాండూర్ మండలం అంకుశం, మాదారం, రెబ్బెన మండలం పులి మడుగు గ్రామాల శివారులో ఉన్న అటవీ ప్రాంతాల మీదుగా తాండూర్ మండలానికి చేరుకుంది. మండలంలోని గోపాల్నగర్ గ్రామ పరిసరాల్లో ఉన్న ఓ మంచినీటి బావివద్ద శనివారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇ వ్వగా, ఫారెస్ట్ బీట్ అధికారి గోపీకృష్ణ పరిశీ లించి ధ్రువీకరించారు. ఆకస్మింగా పులి గోపాల్నగర్ వైపు వెళ్లడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment