
దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా బాగుందని టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘రాజావారు రాణివారు’ఫేం రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా పనులు సైలెంట్గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ని మేకర్స్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారట. కానీ ఈ లోపే దిల్ రాజు సినిమా టైటిల్ని ప్రకటించి మేకర్స్కి షాకిచ్చాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్డేట్స్ గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్ధన్' అనే టైటిల్ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు.
అయితే ఈ టైటిల్ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్ రాజుతో పాటు మిగతావాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. ఈ చిత్రంతో పాటు ‘బలగం’ వేణు దర్శకత్వంలో కూడా దిల్రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ని ఖరారు చేవారు.
Comments
Please login to add a commentAdd a comment