
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్తో ఉన్న ఈ మోషన్ పోస్టర్ మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గొప్పతనం తెలియజేస్తూ తాజాగా గుణశేఖర్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో శకుంతలా నాటకం ఎంత గొప్పదో తెలుపుతూ.. తను ఈ సినిమా రూపొందించడానికి కారణం ఏమిటో తెలిపే ప్రయత్నం చేశారు.
''కావ్యేషు నాటకమ్ రమ్యమ్
నాటకేషు శకుంతలా!
తత్రాపి చ చతుర్థోంకః
తత్ర శ్లోకచతుష్టయం!!
కావ్య ప్రక్రియలన్నిటిలో నాటక ప్రక్రియ రమ్యమైనది.
నాటకాలన్నింటిలో శకుంతలా నాటకము రమ్యమైనది.
ఆ శకుంతలా నాటకములో నాలుగవ అంకము,
అందులోనూ నాలుగు శ్లోకాలు అత్యంత రమ్యమైనవి.. అని గుణశేఖర్ తన ట్వీట్ చేశాడు.
ఇక శాంకుంతలం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. గుణశేఖర్ రుద్రమదేవిలో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఈ తర్వాత పూజా హెగ్దే పేరు కూడా వినిపించింది. అయితే తాము పూజాను అనుకోలేదని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నారని తెలిసింది.
#శాకుంతలం #Shaakuntalam #EpicLoveStory #Manisharma @neelima_guna @GunaaTeamworks pic.twitter.com/llLJwVjA17
— Gunasekhar (@Gunasekhar1) October 12, 2020
Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’..
— Gunasekhar (@Gunasekhar1) October 9, 2020
Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze
Comments
Please login to add a commentAdd a comment