
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘మార్కో’ మూవీ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేనితో ఓ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించనున్న ఈ కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘‘మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్తో హై బడ్జెట్తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిల్మ్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీతో హనీఫ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురు ఫిల్మ్స్ సునీత తాటి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
ఈ బిగ్ ప్రాజెక్ట్లో హీరోలుగా ఎవరు నటిస్తారు..? ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది డిసెంబరులో విడుదలలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హనీష్ అదేని డైరెక్షన్కు ఉన్ని ముకుందన్ నటన తోడు కావడంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment