Marco Movie
-
‘మార్కో’ డైరెక్టర్తో దిల్ రాజు పాన్ ఇండియా ప్రాజెక్ట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘మార్కో’ మూవీ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేనితో ఓ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించనున్న ఈ కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘‘మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్ అదేని పేరు బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్తో హై బడ్జెట్తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిల్మ్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీతో హనీఫ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురు ఫిల్మ్స్ సునీత తాటి ఈ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.ఈ బిగ్ ప్రాజెక్ట్లో హీరోలుగా ఎవరు నటిస్తారు..? ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది డిసెంబరులో విడుదలలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్కో’.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హనీష్ అదేని డైరెక్షన్కు ఉన్ని ముకుందన్ నటన తోడు కావడంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. -
'నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేకపోయాం': కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తన భార్య రహస్య గోరఖ్తో కలిసి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్!
'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం' అని తెలుగులో ఓ సామెత ఉంది. కేరళ సెన్సార్ బోర్డ్ ఆలోచనా విధానం చూస్తుంటే ఇప్పుడు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే 'మార్కో' చిత్రం విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సహాయం కావాలని కోరడమే కారణం.(ఇదీ చదవండి: దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్)అసలేం జరిగింది?గతేడాది డిసెంబరులో మలయాళంలో 'మార్కో' అనే సినిమా రిలీజైంది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం మరీ వైల్డ్ గా తీశారు. చిన్న పిల్లాడ్ని, గర్భిణిని, కళ్లు లేని యువకుడిని వర్ణించలేని విధంగా ఎలా చంపారో ఈ సినిమాలో చూపించారు.తొలుత మలయాళంలో రిలీజ్ చేస్తే హిట్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇక్కడ కొందరికి నచ్చేసింది. ఫిబ్రవరి 14న సోనీ లివ్ ఓటీటీలో మలయాళ వెర్షన్, తర్వాత కొన్నిరోజులకు ఆహాలో తెలుగు వెర్షన్, అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్ రిలీజయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)ఆల్రెడీ ఈ సినిమాలో సీన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. నరుక్కోవడం, చంపడమే అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకు అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారా అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. తీరిగ్గా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత సెన్సార్ బోర్డ్ మేల్కొన్నట్లుంది.టీవీలో స్క్రీనింగ్ జరగకుండా 'మార్కో' మూవీపై నిషేధం విధించింది. ఇప్పుడు ఓటీటీలో నుంచి కూడా ఈ మూవీని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఇప్పటికే 'మార్కో'ని చాలామంది చూసేశారు. సెన్సార్ బోర్డ్ తీరిగ్గా కేంద్రానికి ఇప్పుడు లెటర్ రాస్తే ఏం ప్రయోజనమో వాళ్లకే తెలియాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో శివరాత్రి వచ్చివెళ్లింది. ఆ రోజు థియేటర్లలో రిలీజైన 'మజాకా' చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరోవైపు ఈ శుక్రవారం శబ్దం, అగథ్య అనే రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)మరోవైపు ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో సుడాల్, డబ్బా కార్టెల్ సిరీస్ లతో పాటు లవ్ అండర్ కన్షట్రక్షన్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఈ రోజు ఏమేం చిత్రాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు (ఫిబ్రవరి 28)అమెజాన్ ప్రైమ్సుడల్ సీజన్ 2 - తెలుగు సిరీస్మార్కో - హిందీ వర్షన్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)నెట్ ఫ్లిక్స్అయితానా - స్పానిష్ సిరీస్డబ్బా కార్టెల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్డెస్పికబుల్ మీ 4 - తెలుగు డబ్బింగ్ మూవీరూస్టర్స్ - డచ్ సిరీస్సోనిక్ ద హెడ్గేహగ్ 2- ఇంగ్లీష్ సినిమాస్క్వాడ్ 36 - ఫ్రెంచ్ చిత్రంటస్కమ్స్ - ఆఫ్రికన్ సిరీస్హాట్ స్టార్లవ్ అండర్ కన్షట్రక్షన్ - తెలుగు డబ్బింగ్ మూవీబీటల్ జ్యూస్ - ఇంగ్లీష్ సినిమాబజ్ - హిందీ మూవీదిల్ దోస్తీ ఔర్ డాగ్స్ - హిందీ చిత్రంద వాస్ప్ - ఇంగ్లీష్ సినిమాఆహాఎమోజీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆపరేషన్ రావణ్ - తమిళ మూవీపరారీ - తమిళ సినిమాజీ 5సంక్రాంతికి వస్తున్నాం - తెలుగు సినిమా (మార్చి 1)బుక్ మై షోడెలివర్ అజ్ - తెలుగు డబ్బింగ్ సినిమాసైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీద గోల్డ్ స్మిత్ - తెలుగు డబ్బింగ్ సినిమావోల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ చిత్రం(ఇదీ చదవండి: OTT: 13 వారాలుగా ట్రెండింగ్లో తెలుగు సినిమా) -
ముద్దు, రొమాంటిక్ సీన్ల కోసం నాపై ఒత్తిడి తెచ్చారు: హీరో
ముద్దు సన్నివేశాలు అనేవి ఇప్పటి సినిమాల్లో కామన్ అయిపోయాయి. స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఇలాంటి ఇంటిమేట్ సీన్లకు సై అంటున్నారు. కథ డిమాండ్ చేస్తే..‘ఎలాంటి’ సీన్ అయినా చేయడానికి రెడీ అంటూ హీరోయిన్లు సైతం ముందుకొస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో ఇంటిమేట్ విప్లవం నడుస్తోన్న ఇలాంటి రోజుల్లో ఓ హీరో మాత్రం తను ముద్దు, రొమాన్స్ సన్నివేశల్లో నటించబోనని తెగేసి చెబుతున్నాడు. దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి తెచ్చినా.. తాను మాత్రం అలాంటి సీన్లు అంగీకరించబోనని అంటున్నాడు. ఆ యంగ్ హీరో పేరే ఉన్ని ముకుందన్(Unni Mukundan). మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల కూడా ఉన్ని ముకుందన్ పరిచయమే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడి’, ‘యశోద’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. ఇటీవల ఆయన నటించిన మార్కో చిత్రం మలయాళంతో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా 'గెట్ సెట్ బేబీ' అనే మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఇంటిమేట్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ముద్దు, రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చొని నా సినిమా చూడాలనుకుంటాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ముద్దు, ఇంటిమేట్ సీన్లలో నటించమని చాలా మంది దర్శకనిర్మాతలు నాపై ఒత్తిడి తెచ్చారు. ఇతర హీరోల సినిమాలను ఉదాహరణగా చూసిస్తూ..మీరు కూడా చెయ్యొచ్చు కదా అని అడిగారు.కానీ సున్నితంగా తిరస్కరించాను. ఒక జంట మధ్య రొమాన్స్ చూపించాలనుకుంటే.. ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. నేను అలాంటి వాటిల్లో నటించను. ఇది నాకు నేనుగా పెట్టుకున్నా పాలసీ’ అని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చాడు. -
మరో ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంంటంటే?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025 -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
ఓటీటీలోకి రూ.100 కోట్ల సంచలనం ‘మార్కో’.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మార్కో(Marco Movie).. గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రమిది. ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా..మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ఈ మూవీ రైట్స్ కొనేందుకు పోటీ పడ్డాయట. చివరకు సోనీలివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.స్ట్రీమింగ్ అప్పుడేనా?మోస్ట్ వయలెంట్ చిత్రంగా చరిత్రకెక్కిన ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్ని సోనీలివ్ కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని రేటు ఈ చిత్రానికి పెట్టారట. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో..ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంపై భారీ పోటీ ఏర్పడింది. (చదవండి: ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్)అయితే ఇప్పుడప్పుడే కాకుండా కాస్త ఆలస్యంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సోనీలివ్ భావిస్తోందట. పిభ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మాలీవుడ్ టాక్.త్వరలోనే ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.మార్కో కథేంటి?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.Both #Marco & #Rekhachithram OTT deals are closed with Sony Liv. Figures somewhat the same range only with #Marco slightly ahead. pic.twitter.com/FZl8oQvEIj— Friday Matinee (@VRFridayMatinee) January 25, 2025 -
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాను : ‘మార్కో’ హీరో
‘‘మా ‘మార్కో’ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘బాహుబలి, ఈగ’... ఇలా రాజమౌళిగారు తీసిన హై టైమ్ ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ‘మార్కో’ తరహా సినిమా తీయడానికి ఇది కూడా ఓ స్ఫూర్తి. మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని ఉన్ని ముకుందన్ అన్నారు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఉన్ని ముకుందన్ హీరోగా టైటిల్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఈ చిత్రం మలయాళంలో డిసెంబరు 20న విడుదలైంది. ‘మార్కో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ నెల 1న ‘మార్కో’(Marco Movie) సినిమా అదే టైటిల్తో తెలుగులో విడు దలైంది. ఎన్వీఆర్ సినిమా ‘మార్కో’ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ‘మార్కో’ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందని, తెలుగులో తొలి రోజు హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా ‘మార్కో’ నిలిచిందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ– ‘‘మార్కో’ సినిమాకు హిట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజానికి ‘మార్కో’ విజయాన్ని నేను ఊహించాను. ఎందుకంటే కాలం మారుతోంది. ప్రేక్షకుల అభిరుచులు మారి΄ోయాయి. నిజానికి ఈ సినిమా కోసం మేము ఎంతగానో కష్టపడ్డాం. ఫైట్ సీక్వెన్స్లు ఎప్పుడూ రిస్క్తో కూడుకున్నవే. అయినా నేను ఎలాంటి డూప్స్ లేకుండా ఫైట్ సీక్వెన్స్లు చేశాను. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేప్పుడు నాకు ఏమైనా గాయాలవుతాయా? అని టీమ్ అందరూ కంగారు పడ్డారు. ఎందుకంటే అలా జరిగితే షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది. కానీ అదృష్టవశాత్తు అంతా మంచిగానే జరిగింది. ఇక ఈ మూవీలోని మార్కో క్యారెక్టర్ కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. క్యారెక్టర్కు తగ్గట్లుగా ఫిజికల్గా రెడీ కావడం సవాల్గా అనిపించింది. మా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. కానీ ఆ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాతోనే మేం రూ. వందకోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించగలిగాం. యావత్ దేశం మా సినిమాను ఆదరిస్తుందనే నమ్మకం మాకు ఉంది. మలయాళం నుంచి తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘మార్కో’ నిలిచింది. దర్శకుడు హనీఫ్తో గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, కెమెరామేన్ చంద్రు, ఆర్ట్ డైరెక్టర్ సునీల్, ఫైట్మాస్టర్, కొరియోగ్రాఫర్స్... ఇలా టెక్నికల్ టీమ్ అంతా కూడా కష్టపడ్డారు. వీరందరకీ ధన్యవాదాలు. చాలా హ్యాపీ. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. -
‘మార్కో’ మూవీ రివ్యూ: వయొలెన్స్.. వయొలెన్స్.. వైల్డ్ వయొలెన్స్!
టైటిల్: 'మార్కో'నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: షరీఫ్ ముహమ్మద్రచన-దర్శకత్వం: హనీఫ్ అదేనిసంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్ఎడిటర్: షమీర్ మహమ్మద్విడుదల తేది: జనవరి 1, 2025‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..?ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్. సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు. తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం 'మార్కో'. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ. 85 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.'వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం జనవరి 1న తెలుగులో విడుదల కానుంది. మార్కో సినిమా తెలుగు హక్కులు ఏకంగా రూ.3 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. టైటిల్ రోల్లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. అతను మలయాళ నటుడే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడే కావడం విశేషం. టాలీవుడ్లో జనతా గ్యారేజ్, భాగమతి, యశోదా వంటి చిత్రాల్లో నటించారు. భాగమతిలో అనుష్కకు జోడీగా ఆయన నటించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ మార్కోపై పలు కథనాలు కూడా వచ్చాయి. యానిమల్, కిల్ వంటి చిత్రాలను మించిన వైలెంట్ ఇందులో ఉందంటూ పలువురు నెటిజన్లు కూడా పేర్కొన్నారు. అందువల్ల మార్కో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులుగా మెప్పించారు. -
మార్కో యాక్షన్
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులు. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న రిలీజ్ చేస్తోంది. ‘‘వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘మార్కో’. టైటిల్ రోల్లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: జుమానా షరీఫ్, కెమెరా: చంద్రు సెల్వరాజ్. -
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్
‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్