
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ సినిమాలో నటీనటులు వీరే అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సినిమా ప్రకటన ఇంకా రాలేదు.. కానీ అప్పుడే నటీనటుల పాత్రలు,పేర్లు వినిపించడమేంటని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఇచ్చాడు బోయపాటి.
చదవండి: తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్చల్.. హీరోయిన్ అరెస్ట్
దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా.. రామ్కు ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బోయపాటి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నాడట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో రామ్కు అక్కగా సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!
Super kicked to announce my 20th film! #RAPO20 is #BoyapatiRapo !!
— RAm POthineni (@ramsayz) February 18, 2022
Excited to see myself through the eyes of the Daddy of Mass emotions Boyapati garu.🤘
Love..#RAPO pic.twitter.com/J5cFVxU7nv
Comments
Please login to add a commentAdd a comment