Ram Pothineni
-
హీరో రామ్ ప్రేమలో పడ్డాడా?
-
రాజమండ్రిలో హీరో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం (ఫొటోలు)
-
RAPO22: 'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి'.. భాగ్యశ్రీ లుక్ అదిరింది!
ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.'హైదరాబాద్లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. మన సాగర్ గాడి లవ్వు ❤️Meet @bhagyasriiborse as Mahalakshmi.Let this new year bring a lot of love and joy to all your lives ✨Team #RAPO22 wishes you all a very Happy New Year ❤🔥@filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/vAHpfWRvXT— RAm POthineni (@ramsayz) January 1, 2025 -
ఈ సారి అయిన హిట్ పడేనా ?
-
మీలో ఒకడు
‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ తాజా చిత్రం లుక్ విడుదలైంది. రామ్ పోతినేని హీరోగా మహేశ్బాబు .పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా రామ్ చేస్తున్న సాగర్ పాత్రను పరిచయం చేసి, లుక్ని విడుదల చేశారు. పాత రోజుల హెయిర్ స్టయిల్, క్లీన్ షేవ్తో రామ్ వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ హీరోకి ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్–మెర్విన్, సీఈవో: చెర్రీ. -
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఫుల్ కామెడీ
రామ్ పోతినేని హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేశ్బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు ‘‘పూర్తి స్థాయి వినోదం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.ఇటీవల వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యునిక్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆయన కెరీర్లోని ల్యాండ్మార్క్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. మహేశ్బాబు ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్ని తెరకెక్కించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. -
హరీష్ కి హ్యాండ్ ఇచ్చిన రామ్.
-
అదిత్ అరుణ్ రామ్ పోతినేని లాగా ఉన్నాడా..?
-
హీరో లను మించిపోయిన హీరోయిన్స్
-
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూవీని 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు.మొదటి నుంచే బజ్ ఉన్న మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తి కాలేదు.కాగా.. ఈ చిత్రంలో రామ్కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. -
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని 2021లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్కు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ ఎక్సలెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లాక్బస్టర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచే థియేటర్ల పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్కు హిట్ టాక్ రావడంతో రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. #DoubleISMART Super hit...My fav director puri sir is back...Positives Puri sir dialogues, Amma sentiment,mani Sharma music vere level, big plus Ram energy #DoubleismartonAug15th #DoubleISMARTCelebrations pic.twitter.com/xGwnAKPCAX— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 14, 2024 Nandyal EMS mass crowd House full's everywhere 🔥🥵Ustaad @ramsayz ❤️🔥🥳#RAmPOthineni #DoubleISMART#DoubleismartRAmPAgepic.twitter.com/4CkXFS3zhF— DoubleISMART🔱 CITYZEN⚽️ (@Ismart_Cityzen) August 15, 2024 Just now completed ☑️ Congratulations #PuriJagannadh sir🎉Good Movie 👍2nd half >> 1st half Climax 💥💥💥#ManiSharma bgm and songs💥💥#DoubleISMART #RAmPOthineni pic.twitter.com/QJwUGJQbtt— JA$HU’NTR’ (@Jashu_Chowdary9) August 14, 2024 BLOCK BUSTER 💥💥🤟#DoubleISMART #BlockbusterDoubleISMART pic.twitter.com/s2GkDuAAId— RAm POthineni Trends (@RAPOFanTrends) August 15, 2024 -
నా అనుకున్న వాళ్లకే ఇస్తా.. అందుకే చెప్తున్నా: హీరో రామ్
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను బ్లాక్బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది. హనుమకొండలోని జరిగిన ఈవెంట్కు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తకర కామెంట్స్ చేశారు. పక్కోడి గురించి.. పకోడీల గురించి పట్టింటచుకుంటే పనులు జరగవంటూ ఫ్యాన్స్కు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. రామ్ మాట్లాడుతూ..'ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ.. బయటకానీ ఓ ట్రెండ్ చూస్తున్నా. అరే... నీకిది నచ్చిందా? అని అంటే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమోనని పక్కనోళ్ల మీద తోసేస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం హోటల్కు వెళ్లి ఓ బిర్యానీ తిన్నామనుకోండి. బిర్యానీ బాగుందిరా అనుకోని.. చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగలేదు అని అంటే మనమీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది బిర్యానీ అయినా, సినిమా అయినా.. రేపు మీ కెరీర్ అయినా..నీకు నచ్చింది నువ్వు చెయ్.. పక్కనోడి ఓపినియన్తో నీ అభిప్రాయం మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కొడీ గురించి.. పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అన్నాయ్. మామూలుగా నేను సలహాలు ఇవ్వను. నా అనుకున్న వాళ్లకే ఇస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది. అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఆగస్టు 15న కలుద్దాం. లవ్ యూ ఆల్' అంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు.ఈ చిత్రంలో హీరోయిన్ ముంబయి ముద్దగుమ్మ కావ్య థాపర్ కనిపించనుంది. ఇందులో సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రంలో కమెడియన్ అలీ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.పక్కనోడి గురించి.. పకోడీ గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్..🔥#RamPothineni #DoubleISMART #TeluguFilmNagar pic.twitter.com/bMveIckc1Q— Telugu FilmNagar (@telugufilmnagar) August 11, 2024 -
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాలా ఎవరూ చేయకండి.. చాలా ప్రమాదం: హీరో రామ్
సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. రిలీజ్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఈ విషయాల్ని బయటపెడుతుంటారు. యంగ్ హీరో రామ్ కూడా తన ఒక్క నెలలలో 18 కిలోలు ఎలా తగ్గానో చెప్పుకొచ్చాడు. అయితే తనలా ఎవరూ ప్రయత్నించొద్దని మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ రామ్ ఏం చెప్పాడంటే?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)''డబుల్ ఇస్మార్ట్' కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లానే ఇందులోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నాం. ఆ పార్ట్ అంతా నవంబరులోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయముంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెలరోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు' అని రామ్ చెప్పుకొచ్చాడు.రామ్ కాబట్టి హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెలలో 18 కిలోలు అంటే.. 86 నుంచి 68 కిలోలకు వచ్చాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంది. రామ్-పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. పెద్దగా బజ్ అయితే లేదు. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) -
ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. హైలెట్స్ ఇవే
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది.పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.ఇద్దరికి కంబ్యాక్ ఫిల్మ్!డబుల్ ఇస్మార్ట్ హిట్ డైరెక్టర్ పూరి, హీరో రామ్కి చాలా అవసరం. ఇద్దరి ఖాతాలో హిట్ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు.తాజాగా సెన్సార్ సభ్యులు కూడా ఆ విషయాన్నే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా చూసి.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల లవ్ట్రాక్ కూడా అదిరిపోయిందట. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని అంటున్నారు. అలీ కామెడీ, మణి శర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పారట. సెన్సార్ సభ్యుల టాక్ బట్టి చూస్తే.. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ కంబ్యాక్ ఫిల్మ్గా అవ్వబోతుందని తెలుస్తోంది. -
ఫైట్స్ చేయడం సవాల్గా అనిపించింది: కావ్యా థాపర్
‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేశాను. మొదటిసారి ఫైట్స్ చేయడం, పాటల్లో ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసే అవకాశం రావడం సవాల్గా అనిపించింది’’ అని హీరోయిన్ కావ్యా థాపర్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్ పంచుకున్న విశేషాలు. పూరి జగన్నాథ్గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’కి నా ఆడిషన్స్ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్గారితో సాంగ్ షూట్లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. అయినా సెట్కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను... నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. మణిశర్మగారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’ నేరుగా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. నాకు యాక్షన్ రోల్స్, అడ్వంచరస్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఆటో ఎక్కిన హీరో, హీరోయిన్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్ సరసన ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా గెటప్ శ్రీనుతో రామ్ పోతినేని, కావ్య థాపర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆటోలో వచ్చిన గెటప్ శ్రీను.. హీరోయిన్, హీరోతో కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ట్విటర్లో పంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్- డబుల్ డోస్ రైడ్ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న రామ్ పోతినేని.. మూవీ HD స్టిల్స్
-
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది!
రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈనెల 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. Mamaaaaaa! #DoubleiSmartTrailer aaagayyaaaa! https://t.co/6PHbKXHj1Z -Ustaad #DoubleiSmart Shankar pic.twitter.com/7BtSgW5AeC— RAm POthineni (@ramsayz) August 4, 2024 -
పదింటికే చలీ జ్వరం...
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
'డబుల్ ఇస్మార్ట్' నుంచి మరో సాంగ్ విడుదల
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత రామ్,పూరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.2019లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజున రవితేజ- హరీష్ శంకర్ల సినిమా మిస్టర్ బచ్చన్ విడుదల కానున్నడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. -
డబుల్ ఇస్మార్ట్ కు కిక్ ఇచ్చే న్యూస్..
-
రిలీజ్కు ముందే భారీ డీల్.. డబుల్ ఇస్మార్ట్కు ఎన్ని కోట్లంటే!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కించారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ఫ్యాన్స్ను ఊపేస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ కాకముందే క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.33 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా చేశారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
మార్ ముంత చోర్ చింత సాంగ్ థియేటర్ లో అదరగొడతాది
-
ఇస్మార్ట్ శంకర్కు ఐదేళ్లు.. రామ్ పోతినేని స్పెషల్ పోస్ట్!
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని-పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.అయితే 2019 జూలై 18 ఇస్మార్ట్ శంకర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. 'ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెంటల్ మాస్ మ్యాడ్నెస్.. ఇస్మార్ట్ శంకర్' అంటూ పోస్ట్ చేశారు. ఆగస్టు 15న డబుల్ మ్యాడ్నెస్ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 5 Years for this Mental Mass Madness! #iSmartShankar Let’s Celebrate this Double Madness on 15th of August! -USTAAD #DoubleiSmart SHANKAR pic.twitter.com/0pSbqTkX6N— RAm POthineni (@ramsayz) July 18, 2024 -
పూరి జగన్నాథ్పై భగ్గుమంటున్న కేసీఆర్ అభిమానులు
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేశారు. 'మార్ ముంత... చోడ్ చింత' అనే పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ను ఉపయోగించడంతో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగనన్నాథ్పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోని 'మార్ ముంత చోడ్ చింత..' అనే 'కల్లు కంపౌండ్' పాటలో హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం 'ఏం జేద్దామంటవ్ మరీ..' పదాల్ని యథాతథంగా ఆయన వాయిస్నే ఉపయోగించారు. అది కూడా పాటలో రెండుసార్లు వినిపిస్తుంది. దీంతో కేసీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. కేసీఆర్ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్ ఉపయోగించారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా సాంగ్ ఉందంటూ కేసీఆర్ అభిమానులు తెలుపుతున్నారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ వారు మండిపడుతున్నారు.ఓ దర్శకుడిగా తన అభిరుచితో పాటను తెరకెక్కించడంలో అభ్యంతరం లేదు. కానీ, కల్లు పంపౌండ్ పాటలో ఒక రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి టోన్ను ఉపయోగించడమంటే ఆయన్ను అవమానించడమేనని కేసీఆర్ అభిమానులు అంటున్నారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరీపై మండిపడుతున్నారు.ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్తో పాటు రాహుల్ సిప్లిగంజ్ల పైనా సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారై ఉండి అలాంటి కేసీఆర్ హుక్లైన్ను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని ఇలా కించపరచడం ఏంటి అంటూ.. పలువురు తెలంగాణ వాదులు కూడా తమ అభిప్రాయాన్ని నెట్టింట తెలుపుతున్నారు. -
'మార్ ముంత.. చోడ్ చింత'.. కేసీఆర్ డైలాగ్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవేటైడ్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే స్టెప్ మార్ అనే పాటను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో సాంగ్ను విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు. అయితే ఈ సాంగ్ మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ డైలాగ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. పూరి- రామ్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ భారీగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్తో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. Yo boys! #MaarMunthaChodChinta …Enjoy! https://t.co/9IMWg4rcUb-USTAAD #DoubleIsmart Shankar pic.twitter.com/IjB7f6gWtV— RAm POthineni (@ramsayz) July 16, 2024 -
గుమ్మడికాయ కొట్టారు
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు హీరో రామ్. 2019లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రధారులు.ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. సో.. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ యూనిట్ గుమ్మడికాయ కొట్టింది. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ ఫిదా
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' (2019) కి సీక్వెల్గా 'డబుల్ ఇస్మార్ట్' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘స్టెప్ మార్’ అంటూ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. రి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుంటే.. సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం ఈ మూవీకి ప్రధాన బలం కానుంది. పార్ట్-1 కోసం ఆయన అందించిన మ్యూజిక్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్లో కూడా ఆయన దుమ్మురేపాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది. -
కౌంట్డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్డౌన్ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇస్మార్ట్ నిర్ణయం
ఇస్మార్ట్ (తెలివి)గా ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్. ఈ చిత్రం విడుదల తేదీని తెలివిగా నిర్ణయించింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఆగస్ట్ 15 గురువారం సెలవు. అలాగే సోమవారం రక్షాబంధన్. మధ్యలో శని, ఆదివారాల వీకెండ్ కలిసొస్తుంది.ఇలా మా ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలకు ఆగస్ట్ 15 పర్ఫెక్ట్ డేట్’’ అని చిత్రబృందం పేర్కొని, రామ్ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. రామ్–పూరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. పూరి జగన్నా«థ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ గొడవపై క్లారిటీ
-
రామ్తో రూపాయి బిజినెస్ కూడా ఉండేది కాదు: టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో రామ్పై నిర్మాత వైవీఎస్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామ్కు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదని అన్నారు. అతనితో కలిసి నిర్మించిన దేవదాసు చిత్రానికి నాలుగు వారాల పాటు ప్రేక్షకులే రాలేదని వెల్లడించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదని.. రామ్పై ఒక్క రూపాయి కూడా స్కేలబిలీటీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ చౌదరి మాట్లాడారు.వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..'దేవదాసు సినిమా రిలీజ్ రోజునే రూ.10 కోట్లు పోయాయి అన్నారు. నా ఆస్తులన్నీ స్టేక్లో ఉన్నాయి. నాలుగు వారాల వరకు జనాలు లేరు. కానీ నేను బ్రహ్మండగా జనాలు ఉన్నారని మైకుల్లో మాట్లాడా. ఇదే నిజం. నేను శాటిలైట్స్ తక్కువ రేట్కే అమ్మాను. నా విజయాలు అంత ఈజీగా రాలేదు. జనవరి 11న దేవదాసు రిలీజైంది. ఆ తర్వాత 12వ తేదీనే స్టైల్ సినిమా రిలీజైంది. చిరంజీవి, లారెన్స్ ఆ దెబ్బకు నా సినిమా కుదేలైంది.' అన్నారుసంక్రాంతి సీజన్లో లవ్ స్టోరీలు సినిమాలు చూడరు. ఆ వైపు అస్సలు వెళ్లరు. 13న చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి సినిమాలు రిలీజ్. నా సినిమాకు థియేటర్ల వద్ద జనాలే లేరు. ఇక 14వ తేదీకల్లా జీ టీవీకి ముందు అనుకున్న దానికంటే తక్కువ ధరకే శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నా. డబ్బులు పెట్టుకుని తిరిగితే నాలుగు వారాల తర్వాత నా సినిమాకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత 17 సెంటర్లలో 175 డేస్ ఆడింది. ఇక్కడ రామ్ను నేను తక్కువ చేయడం లేదు.' అని అన్నారు. ప్రస్తుతం వైవీఎస్ చౌదరి నందమూరి జానకి రామ్ కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నారు.కాగా.. రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్ తెరకెక్కించనున్నారు. 2006లో రామ్, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన దేవదాసు చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా నటించారు. -
Double Ismart: రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
-
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్ని ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా) -
Ram Pothineni: ఇస్మార్ట్ రామ్ పోతినేని బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో పూరి దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. రామ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. ఈనెల 15న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:03 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన వీడియోలో ఇస్మార్ట్ శంకర్ సీన్స్ను జోడించారు. ఈ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలు మాస్ ఇమేజ్ను గుర్తుచేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ టీజర్తో రామ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ— Puri Connects (@PuriConnects) May 14, 2024 -
డబుల్ యాక్షన్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’(2019) మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రూపొందుతోంది. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రామ్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. ఫేస్ మాస్క్, పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఇంటెన్స్ లుక్తో కనిపించారు రామ్. ‘‘డబుల్ ఇస్మార్ట్’ లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ హై–బడ్జెట్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణిశర్మ, కెమెరా: సామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుం ఆ సినిమాకు సీక్వెల్ పనులు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీని తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో అనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో రామ్ ఒక వెబ్సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన డీల్ కుదుర్చకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది. త్వరలో ప్రకటన కూడా రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రామ్ పుట్టినరోజు ఈనెల 15న ఉంది. ఆరోజునే ఈ ప్రకటన విడుదల కావచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.మరోవైపు రామ్ రెండు ప్రాజక్ట్లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ కథను ఆయన ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్రివిక్రమ్ కూడా రామ్కు ఒక కథ చెప్పారట. మంచి లవ్ స్టోరీ కావడంతో రామ్ ఆసక్త చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. -
రామ్ తో త్రివిక్రమ్ సినిమా
-
టార్గెట్ 2024.. ఈ సారైనా హిట్ కొడతారా?
గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..? యంగ్ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. (చదవండి: క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?) అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదికి వస్తాడేమో చూడాలి. (చదవండి: దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!) నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది. -
స్కంద క్లైమాక్స్ సీన్పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన రామ్
ఓపక్క ట్రోలింగ్.. మరోపక్క ట్రెండింగ్.. బోయపాటి సినిమాకే సాధ్యమైంది. సోషల్ మీడియాలో స్కంద సినిమా తప్పొప్పులను ఎత్తిచూపుతూ డైరెక్టర్ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న స్కందను ఎగబడి మరీ చూస్తున్నారు జనాలు. కాగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నవంబర్ 2న ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో ప్రతి సన్నివేశాన్ని జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ప్రేక్షకులు. ఫైట్ సీన్లో బోయపాటి.. ఈ క్రమంలో ఓ ఇంటర్వెల్ ఫైట్లో రామ్ ఓ పోలీస్ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాతి ఫ్రేమ్లో ఆ సీన్ను చూసి షాకవుతున్న వారిలో ఆ చనిపోయిన వ్యక్తి కనిపిస్తాడు. దీంతో ఈ సీన్పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్లో రామ్ దీపస్తంభాలు పట్టుకుని విలన్లను చంపుతాడు. ఈ సీన్లో తేడాను గమనించారు ఓటీటీ ఆడియన్స్. ఈ సన్నివేశంలో మొదట రామ్ పోతినేని కనిపించగా తర్వాతి షాట్లో రామ్కు బదులుగా బోయపాటి దర్శనమిచ్చాడు. దీంతో ఈ సీన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై హీరో రామ్ స్పందించాడు. కాలి నుంచి రక్తం,, నడవలేని స్థితిలో.. '22 ఏప్రిల్, 2023 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 25 రోజుల షెడ్యూల్లో అది మూడవ రోజు.. అప్పుడు నా కాలి పరిస్థితి ఎలా ఉందో ఫోటోలో చూడొచ్చు. కనీసం నడవలేకపోయాను. కాలి పగుళ్ల నుంచి రక్తం కారింది. దర్శకుడు ఆ సన్నివేశం షూట్ అయిపోవాలన్నాడు. నా పరిస్థితి బాలేకపోవడంతో ఆ ఒకే ఒక్క సీన్లో తను నటించాడు. అందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెమట చిందించేందుకు ఎప్పుడూ సిద్ధం సినిమాలోని కంటెంట్ నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. మీకు వినోదాన్ని అందించడం కోసం నేను రక్తం, చెమట చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని ట్వీట్ చేశాడు. దీనికి గాయపడిన కాలి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'మీ కష్టానికి విజయం దక్కకపోయినా పర్వాలేదు కానీ కనీసం అభినందనలైనా దక్కితే బాగుండేది' అని కామెంట్లు చేస్తున్నారు. 22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn — RAm POthineni (@ramsayz) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
స్కంద సినిమాపై ట్రోల్ చేస్తున్న ఆడియన్స్
-
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
పాన్ ఇండియా రికార్డ్స్ తో సిద్ధం అవుతున్న రామ్ పోతినేని
-
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్ఫ్లెక్స్లో చూడొచ్చు. స్కంద- హాట్స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. (ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!) అయితే ఈ సినిమా మొదట అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్పై సస్పెన్ష్ నెలకొంది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్స్టార్ ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్కు అన్ని రోజులు పట్టిందా?) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
Skanda OTT Release: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్న స్కంద!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పేలవంగా వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమేరకు ప్రకటన సైతం వెలువడింది. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఈరోజు ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్త డేట్ను ప్రకటించనున్నట్లు హాట్స్టార్ వెల్లడించింది. Bringing MASS like never experienced before🕺🏽 Announcement coming at 5pm today 🕔 @disneyplushstel #RapoRampageonHotstar @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/O5wcuBSE8R — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023 చదవండి: హీరోయిన్తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ.. -
ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్
బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. -
ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'స్కంద'. గత నెల చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. కేవలం మాస్ని మాత్రమే ఆకట్టుకుంది. తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి గానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డల్ అయిపోయింది. గత వారం కొత్త సినిమాలు రాకతో పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) 'స్కంద' సంగతేంటి? బోయపాటి సినిమా అంటే లాజిక్స్ అసలు వెతకాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమాల్లో యాక్షన్, స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ డైరెక్టర్.. 'స్కంద' విషయంలో దాన్ని పక్కనబెట్టేశాడు. అయితే ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి నచ్చింది గానీ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా నిలిచింది. లాభాల కంటే నష్టాలే వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీలోకి అప్పుడేనా? థియేటర్లలో రిలీజ్కి ముందే 'స్కంద' డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా 'స్కంద'కి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూస్తుంటే.. రెండో భాగం తీస్తారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
యంగ్ హీరోల కొంపముంచిన బోయపాటి!
ఊరమాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్లో ఓ పవర్ ఉంటుంది. అది మాస్ ఆడియన్స్కు ఎక్కడలేని కిక్ అందిస్తుంది. అయితే ఇది కేవలం సీనియర్ హీరోల విషయంలోనే జరుగుతుంది. యంగ్ హీరోలకు మాత్ర బోయపాటి భారీ ఫ్లాపులను అందిస్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏ యంగ్ హీరోలకి బోయపాటి హిట్ అందించలేదు. 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘దమ్ము’ తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జయ జానకి నాయక(2017) తీస్తే..అది హిట్ కాలేదు. మెగా పవర్స్టార్ రామ్ చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక తాజాగా రామ్ పోతినేనితో ‘స్కంద’ చేయగా..అది కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్! బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. స్కంద రిలీజ్కు ముందు ఆయన తర్వాత సినిమా బన్నీతో ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు సూర్య కూడా బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వచ్చింది. చిరంజీవీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే స్కంద రిలీజ్ తర్వాత మాత్రం ఈ పుకార్లు వినిపించడం లేదు. పైగా బోయపాటితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో బోయపాటి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. -
హీరో రామ్తో అనుపమ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జనాలకు భలే ఇంట్రస్ట్.. వారు ఏయే సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్గా కనిపిస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలా అన్నింటినీ ఆరా తీస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి జీవితంలోకి తొంగి చూడాలనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు గాసిప్రాయుళ్లు సెలబ్రిటీల గురించి లెక్కలేనన్ని పుకార్లు సృష్టిస్తుంటారు. అందులో లేటెస్ట్ రూమర్ ఒకటి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోతో ప్రేమలో బ్యూటీ? బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారట! త్వరలోనే వీరు ఏడడుగులు వేయనున్నారట! ఈ మేరకు ఓ వార్త నెట్టింట కోడై కూస్తోంది. సాధారణంగా ఇలాంటి గాసిప్స్ను అనుపమ లైట్ తీసుకుంటుంది. అయితే ఈ రూమర్లు విని విసుగు పుట్టిన అనుపమ తల్లి సునీత సదరు పుకార్లపై స్పందించినట్లు తెలుస్తోంది. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో పిసరంత నిజం కూడా లేదని కొట్టిపారేసిందట! ఇది చూసిన ఫ్యాన్స్.. హమ్మయ్య, మా అనుపమ ఇంకా సింగిలే అంటూ ఎగిరి గంతేస్తున్నారు. సినిమాల సంగతి.. కాగా అనుపమ, రామ్.. రెండు సినిమాల్లో జంటగా నటించారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో వీరు కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ విషయానికి వస్తే.. తెలుగులో రవితేజ ‘ఈగిల్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ డైరెక్షన్లోనూ ఓ మూవీ చేస్తోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్.. బ్యూటీ రియాక్షన్ చూశారా? -
ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్..అది ఏంటో నీకు తెలుసా ..?
-
స్కంద మూవీలో రామ్కు చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను- ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం స్కంద. ఈ మూవీలో రామ్ నటనకు, లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. తన యాక్షన్కు థియేటర్స్లో విజిల్స్ వేస్తున్నారు. మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో రామ్ పోతినేనికి చెల్లిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈమె ఎవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ్కు చెల్లిగా నటించిన ఆమె పేరు అమృత చౌదరి. ఈమె పక్కా తెలుగమ్మాయి. తనది భీమవరం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమృత చౌదరి కాలేజీ డేస్లోనే యాక్టింగ్లో తన టాలెంట్ చూపించింది. పలు షార్ట్ ఫిలింస్లో నటించిన ఈ బ్యూటీ కవర్ సాంగ్స్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటిగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో స్కంద మూవీలో హీరోకి చెల్లెలిగా నటించింది. ఈ ఛాన్స్తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియోతో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటోంది. హీరోయిన్కు తానేం తక్కువ కాదన్నట్లుగా అందాలు ఆరబోస్తోంది. View this post on Instagram A post shared by AMRUTHA CHOWDARY✨ (@__amrutha__chowdary__) చదవండి: తేజపై విరుచుకుపడ్డ నాగ్.. జైలు శిక్ష తక్కువే.. నేరుగా ఇంటికి పంపించేయడమే.. -
'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) స్కంద సంగతేంటి? బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి. సగానికి సగం అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈనెల 28న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. పక్కా మాస్ మూవీగా రూపొందించిన ఈ మూవీ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.8.62 వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం మాస్ ఆడియన్స్ మెప్పించేలా ఉన్న ఈ చిత్రం నైజాంలో అత్యధికంగా రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్గా చూస్తే రామ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా స్కంద నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించబోతున్నట్లు రామ్, బోయపాటి శ్రీను ప్రకటించారు. -
స్కంద సినిమా హిట్టా..ఫట్టా..
-
'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్ ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్నర్తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'స్కంద' కథేంటి? ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) ఎలా ఉంది? బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే. ఓటీటీ డీటైల్స్ ఇకపోతే రిలీజ్కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ
టైటిల్: స్కంద నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: బోయపాటి శ్రీను సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటాకే ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 ‘స్కంద’ కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్) తన కూతరు పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. గవర్నర్తో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముందు ఏపీ సీఎం కూతురిని తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు లేపుకెళ్తాడు. దీంతో ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంపై పగ పెంచుకుంటాడు. తన పరువు దక్కాలంటే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు. దాని కోసం ఓ కుర్రాడిని (రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలంగాణ సీఎం కొడుకు నిశ్చితార్థం జరిగే కొద్ది క్షణాల ముందు.. రామ్ వచ్చి ఏపీ సీఎం కూతురితో పాటు తెలంగాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్)కు, ఇద్దరు సీఎంలతో ఉన్న వైర్యం ఏంటి? రామకృష్ణ రాజుకు, రామ్కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో 'స్కంద' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన 9 సినిమాలు మాస్ ఆడియన్స్ని మెప్పించేలా ఉంటాయి. స్కంద కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. అయితే బోయపాటి సినిమాల్లో లాజిక్కులు ఉండవు. హీరో ఏ స్థాయి వ్యక్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితో తన్నితే కార్లు సైతం బద్దలవ్వాల్సిందే. ఇదంతా గత సినిమాల్లో చూశాం. ఇక స్కందలో అయితే రెండు అడుగులు ముందుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎంతలా అంటే.. ఒక సీఎం ఇంటికి ఓ సామాన్యుడు ట్రాక్టర్ వేసుకొని వెళ్లేంతలా. ఇద్దరు ముఖ్యమంత్రులు అతని చేతిలో తన్నులు తినేంతలా. ఒక ముఖ్యమంత్రి వీధి రౌడీ కంటే నీచంగా బూతులు మాట్లాడేంతలా. పోలీసు బెటాలియన్ మొత్తం దిగి గన్ పైరింగ్ చేస్తుంటే మన హీరోకి ఒక్కటంటే.. ఒక్క బుల్లెట్ కూడా తగలదు అంటే అది బోయపాటితోనే సాధ్యమని స్కందలో చూపించాడు. ఇవన్నీ మాస్ ఆడియన్స్ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రగంటి రామకృష్ణరాజు(శ్రీకాంత్) జైలు సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కాస్త చప్పగా సాగుతుంది. కాలేజీ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. హీరో ఎంట్రీ, అతనికిచ్చిన ఎలివేషన్స్ బట్టి ఏదో జరుగబోతుందనే ఆసక్తి ఆడియన్స్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ట్విస్ట్ కూడా సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కంద సెకండాఫ్ కూడా ఫ్లాష్బ్యాక్తో ప్రారంభమవుతుంది. రుద్రగంటి రామకృష్ణరాజు ఎందుకు జైలు పాలయ్యాడు? హీరో నేపథ్యం ఏంటి? తదితర సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్ 15 నిమిషాల ముందు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అదే సమయంలో విపరీతమైన హింస, అనవసరపు సంభాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బందిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్ పండినంతగా ఎమోషనల్ సన్నీవేశాలు పండలేదు. క్లైమాక్స్ ట్వీస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఓవరాల్గా మాస్ ఆడియన్స్కి అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. మాస్ పాత్రలు రామ్కి కొత్తేమి కాదు. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో ఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కందలో మాత్రం ఊరమాస్ యాక్టింగ్తో అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్. హీరోయిన్లు శ్రీలీల, సయీ మంజ్రేకర్ పాత్రల పరిధి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించారు. శ్రీలీల తనదైన డ్యాన్స్తో మరోసారి ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటించారు. వ్యాపారవేత్తగా శ్రీకాంత్ చక్కగా నటించాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఎక్కడ రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Good First Half Sound effects could have been less in fights Boya Senseless Mass Logics pekkana petti chudandi #Skanda https://t.co/6XUAzzuu2i — ʜᴜɴɢʀʏ ᴄʜᴇᴇᴛᴀʜ (@SiddarthRoi) September 28, 2023 సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్ మాత్రం ఓవర్సీస్లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొన్ని చోట్ల షో పడిపోయింది. ట్విటర్లో పలువురు షేర్ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్ ఆడియన్స్కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయిందని సమాచారం. ఫస్టాఫ్ కొంతమేరకు యావరేజ్గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. #Skanda 🎬 First Half Report 📝 :#RAmPOthineni introduction & Mass Swag🔥💥#Sreeleela Scenes 💥 Action Scenes ⚡️⚡️#Thaman Songs & Bgm Music 💥🥁💥 Interval 💥 Overall a Good First Half...!!👍 Stay tuned to @Mee_Cinema for Second Half Report & Full Review ✍️ pic.twitter.com/y1sOAXYh0j — Mee Cinema (@Mee_Cinema) September 28, 2023 Just finished watching #Skanda movie #BoyapatiSreenu Thandavaam started the main asset to movie is direction The main piller to entire movie @ramsayz acting and swag never before seen This time @MusicThaman ur music and bgm will speaks in peeks 🔥@sreeleela14 dance ultimate pic.twitter.com/sa8nDUIJRO — Jaikarthiksv (@jaikarthiksv1) September 28, 2023 First half #Blockbuster #Skanda #RAPO #RAPOMass https://t.co/o3fjjWCV8u — BABA #DEVARA 🥵 (@lovelybaba9999) September 28, 2023 Pakka Mass Hittt Bomma 🤙🤙💥 Mass Euphoria In Theatres 🔥🔥🔥 Ustaad Ram in never before looks Boyapati mark massss💥💥💥💥 Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda #RAmPOthineni #BoyapatiSreenu — S.Harsha (@SHarsha19085417) September 28, 2023 #Skanda Average 1st Half! Starts off interesting and has a rocking introduction for Ram but dips after that and loses track apart from a few good action sequences. — Venky Reviews (@venkyreviews) September 28, 2023 Take care sir! Don't sit near the speakers and wear helmet, if possible! Feeling sorry for you that you are going through this torture.....@ramsayz #skandareview — SATYA (@ssatyatweets) September 28, 2023 #Skanda 1st half: Best Introduction ever for @ramsayz 🔥, Narration👍, some mass scenes Worked well, Interval Massive🔥🔥 Very Good 1st half works In most parts 2nd half: Dialogues and some scenes Are Excellent, Climax is Different and Okay Good 2nd half Overall: HIT💥 — tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) September 28, 2023 All set for Boya-Thaman Sambavam 👂👂 #Skanda pic.twitter.com/jRm5uvyQpJ — Ragadi (@RagadiYT) September 28, 2023 It's official It's two parts Skanda 2 was confirmed in post credits scene#Skanda #SkandaOnSep28 — 𝙍𝙤𝙨𝙝𝙖𝙣™ (@NTR_Roshan_) September 28, 2023 Just mental mass no logic ..just mass First half #Skanda @Prabhas83932022 pic.twitter.com/Z0xPYZvm6X — Raghu (@436game) September 28, 2023 -
యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది
‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ‘స్కంద’. ఇందులో నా పాత్రలో సరదా, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్ డ్రామా కూడా ఉంది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ని అద్భుతంగా చూపించడంలో బోయపాటిగారి మార్క్ కనిపిస్తుంది. ‘స్కంద’ చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది’’ అని శ్రీ లీల అన్నారు. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీ లీల చెప్పిన విశేషాలు. ► ‘స్కంద’లో నా పాత్రలో మాస్, క్లాస్ రెండూ మిక్స్ అయ్యుంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ సీన్స్. ► ధమాకా’లో నా డ్యాన్స్లకు అంత పేరు వస్తుందనుకోలేదు. ‘స్కంద’ పాటల్లో మాస్, వెస్ట్రన్ డ్యాన్సులు అలరిస్తాయి. రామ్గారి డ్యాన్స్ని మ్యాచ్ చేయడం కష్టం. శ్రీనివాసా చిట్టూరిగారు ఈ సినిమాని గ్రాండ్గా నిర్మించారు. ‘స్కంద’ బోయపాటిగారి మార్క్లో గ్రాండ్గా ఉంటుంది. ఇంత మాస్ యాక్షన్ సినిమా చేయడం నాకిదే తొలిసారి. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కూడా మొదటిసారే. ► ‘పెళ్లి సందడి’ తర్వాత ‘స్కంద’తో పాటు మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. ఆ ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన. -
బోయపాటిని వెంటాడుతున్న సెంటిమెంట్.. ‘స్కంద’తో నిరూపిస్తాడా?
టాలీవుడ్లో ఊరమాస్ డైరెక్టర్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. నేల టికెట్ ఆడియన్స్కి నచ్చేలా.. వాళ్లను మెప్పించేలా భారీ మాస్ మూవీస్ని తెరకెక్కిస్తున్న ఏకైక తెలుగు దర్శకుడు. బోయపాటి కెరీర్లో ఇప్పటికి వరకు 9 సినిమాలు తెరకెక్కిస్తే.. అందులో 6 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఇది ఆషామాషీ విషయం కాదు. కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ విక్టరీ సాధించిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి ఒకరు. అయితే బోయపాటిని మాత్రం ఒక సెంటిమెంట్ బాగా పట్టి పీడిస్తోంది. ఆరు విక్టరీలు కానీ.. బోయపాటి కెరీర్లో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కిస్తే.. వాటిలో ఆరు సీనియర్ హీరోలు నటించినవే. అవి మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. బోయపాటి తొలి చిత్రం భద్ర. రవితేజ హీరోగా నటించాడు. 2005 రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వెంకటేశ్తో తులసి(2007) చిత్రం తెరకెక్కించాడు. అది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2010లో బాలయ్యతో సింహా తెరకెక్కించగా.. అది రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బోయపాటి.. తన నాలుగో చిత్రం ‘దమ్ము’ని ఎన్టీఆర్తో చేశాడు. 2012లో వచ్చిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్యతో ‘లెజెండ్’ తీస్తే.. అది సూపర్ హిట్గా నిలిచింది. అదే జోష్లో అల్లు అర్జున్తో ‘సరైనోడు’ తెరకెక్కించాడు. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం అల్లు అర్జున్ని రూ. 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక 2017లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జయ జానకి నాయక చిత్రాన్ని తెరకెక్కించగా.. అది బాక్సాపీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ బాలయ్యతో మూవీ చేశాడు. 2021లో రిలీజైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. స్కంద పరీక్షలో పాస్ అవుతాడా ? బోయపాటి కెరీర్లో హిట్ అయిన చిత్రాలన్నీ సీనియర్ హీరోలవే. బాలయ్యకు మూడు(సింహా, లెజెండ్, అఖండ), రవితేజ, వెంకటేశ్లకు ఒక్కొక్క(భద్ర, తులసి) హిట్ అందించాడు. అలాగే సరైనోడుతో అల్లు అర్జున్కి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. బన్నీ మినహా యంగ్ హీరోలతో చేసిన సినిమాలేవి విజయం సాధించలేదు. రామ్ చరణ్తో వినయ విధేయ రామ తెరకెక్కిస్తే..అది డిజాస్టర్ అయింది. అలాగే మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్తో ‘జయ జానకి నాయక’ తీస్తే..అది కూడా దారుణంగా బోల్తా పడింది. చాలా కాలం తర్వాత మరో యంగ్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి సినిమా తీశాడు. మరి ఈ సారి అయినా బోయపాటి ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడా? స్కంద పరీక్షలో పాస్ అయి..తనపై పడిన ముద్రను తొలగింటాడో..లేదో ఈ నెల 28న తెలుస్తుంది. -
‘స్కంద’ మాస్ మూవీనే కాదు..ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి: రామ్
‘బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని హీరో రామ్ పోతినేని అన్నారు. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ కరీంనగర్లో స్కంద కల్ట్ జాతర పేరుతో ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి ఔట్పుట్ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ ఉండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద చాలా మంచి సినిమా. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం కచ్చితంగా అందరూ మనస్పూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు బోయపాటి అన్నారు. రామ్- బోయపాటి సినిమా అభిమానులందరికీ ఒక పండగలా ఉంటుందని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ సాయి మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్, శ్రవణ్, రచ్చరవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె.. కరీంనగర్లో నిర్వహించిన కల్ట్ జాతర ఈవెంట్లో స్కంద మూవీ రెండో ట్రైలర్ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్తో ట్రైలర్ అదిరిపోయింది.'నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను’,'రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె...చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం.'' అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది -
విరాట్ కోహ్లి బయోపిక్లో రామ్ పోతినేని?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఇద్దరి హైట్తో పాటు ఫేస్ కట్ కూడా దాదాపు ఒకేలా అనిస్తుంది. 'ఇస్మార్ట్ శంకర్'షూటింగ్ సమయంలో రామ్ లుక్ చూసి అంతా విరాట్ కొహ్లిలా ఉన్నారని అన్నారు. అప్పట్లో రామ్ ఫోటోలు నెట్టింట తెగవైరల్ అయ్యాయి. విరాట్కి డూప్లా ఉన్నాడంటూ ట్విటర్లో కామెంట్స్ వచ్చాయి. ఇదే విషయంపై తాజాగా రామ్ స్పందించాడు. రామ్ పోతినేని నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్.. ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే(అల్లు అర్జున్, రామ్ వంటి తెలుగు స్టార్ హీరోలకు సంకేత్ హిందీలో డబ్బింగ్ చెబుతాడు) కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సంకేత్.. ‘విరాట్ కోహ్లిలా ఉన్నావని చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన బయోపిక్లో నటించే అవకాశం వస్తే చేస్తారా?’ అని ప్రశ్నించారు. దానికి రామ్ సమాధానం ఇస్తూ.. ‘విరాట్లా ఉన్నారని చాలా మంది అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్' కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోంది. ఇండియన్ స్టార్ క్రికెటర్తో పోల్చడం చాల హ్యాపీ. తని బయోపిక్లో నటించే అవకాశం వస్తే.. తప్పకుండా చేస్తా. విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది’అన్నారు. స్కంద విషయానికొస్తే.. అఖండ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్కి జోడీగా శ్రీలీల నటించింది. తమన్ సంగీతం అందించాడు. -
పసిపిల్లాడికి ఆ సినిమా పేరు పెట్టారు.. కారణమదే
అభిమానులు.. ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వినిపిస్తూనే ఉంటుంది. పాలిటిక్స్ లేదా సినిమాలు కావొచ్చు. యువత పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. ఇలా చెప్పుకుంటే టాలీవుడ్లో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ అభిమాని చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) యువ హీరో రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాస్, మాస్ సినిమాలు చేస్తూ తనదైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా 'స్కంద'. ఈ పాటికే అంటే సెప్టెంబరు 15న రిలీజ్ అయిపోవాల్సింది కానీ 'సలార్' వాయిదాతో డేట్ మార్చుకుంది. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీ పేరుని ఓ పిల్లాడికి పెట్టేశారు. ఫ్యాన్స్ అసిసోయేషన్కి చెందిన సందీప్.. రామ్ కి అభిమాని అయిన హరిహర కొడుకు నామకరణ మహోత్సవానికి వెళ్లాడు. అయితే అతడి కొడుక్కి 'స్కంద' అని పేరు పెట్టారని ట్వీట్ చేశాడు. 'స్కంద' అనేది రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా టైటిల్. ఇప్పుడు ట్వీట్ రామ్ వరకు చేరింది. దీంతో అతడు స్పందించాడు. 'ఈ విషయం నా మనసుకు హత్తుకుంది. ఆ పిల్లాడికి స్కంద దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ అభిమానికి, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను' అని రామ్.. రీట్వీట్ చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ) I’m so touched..I’m sure the blessings of lord Skanda will always be with him.. God bless you & your family.. ❤️ https://t.co/66uYUZtwVc — RAm POthineni (@ramsayz) September 16, 2023 -
ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?
పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత రవితేజ సరసన ధమాకాతో అదరగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా రామ్ సరసన స్కంద చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించారు. శనివారం ఈ చిత్రానికి స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే ఈవెంట్కు యాంకర్గా వ్యవహరించిన సుమ హీరోయిన్ శ్రీలీలకు ఆసక్తికర ప్రశ్న వేసింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి) స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్లో శ్రీలీలను యాంకర్ సుమ ప్రశ్నించింది. మీకు ఇప్పటిదాకా మీకేమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా అని నవ్వుతూ అడిగింది. ఆ ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానమిచ్చింది పెళ్లిసందడి భామ. ఇప్పటి వరకైతే రాలేదు కానీ.. సెప్టెంబర్ 15న రావొచ్చేమో.. ఫన్నీగా ఆన్సరిచ్చింది. ఎందుకంటే ఆ రోజునే రామ్- శ్రీలీల స్కంద మూవీ రిలీజ్ కానుంది. బాలయ్య గురించి మాట్లాడుతూ..'అంతేకాకుండా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది. కానీ వచ్చేనెలలో జరిగే మరో ఈవెంట్లో వెల్లడిస్తాననని చెప్పుకొచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను.. రామ్తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. హీరో శ్రీకాంత్కు మా ఇంట్లో వాళ్లందరు ఫ్యాన్స్. ఆయన సినిమా టైటిల్తోనే నేను కెరీర్ గురించి ప్రారభించా. థ్యాంక్ యూ శ్రీకాంత్.' అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్) -
రామ్ 'స్కంద' మూవీ స్టిల్స్
-
రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్
రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్లో రామ్ చెప్పే పంచ్ డైలాగ్లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' వంటివి బాగా పేలాయని చెప్పవచ్చు. రామ్పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్లు మెప్పిస్తాయి. రామ్ను పక్కా మాస్ లుక్లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్కి తిరిగి వచ్చి షూటింగ్ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్లాండ్లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్)