Rishab Shetty Request To People Do Not Imitate The Sound From Kantara - Sakshi
Sakshi News home page

Kantara: దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్‌ శెట్టి విజ్ఞప్తి

Published Sat, Oct 22 2022 5:00 PM | Last Updated on Sat, Oct 22 2022 5:53 PM

Rishab Shetty Request To People Do Not Imitate The Sound From Kantara - Sakshi

చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

(చదవండి: జపాన్‌ వీధుల్లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ సందడి..వీడియో వైరల్‌)

భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు రిషబ్‌ శెట్టి. కోలం ఆడే వ్యక్తి ‘ఓ..’అంటూ అరుస్తూ డ్యాన్స్‌ చేస్తాడని ఈ సినిమాలో చూపించారు.  ఆ శబ్దం వచ్చిన ప్రతిసారి థియేటర్స్‌ దద్దరిల్లిపోతాయి.  ప్రేక్షకులు కూడా ఆ అరుపులను అంత ఈజీగా మర్చిపోవడం లేదు. సినిమా చూసి బయటకు వచ్చాక ‘ఓ..’ అంటూ గట్టిగా శబ్దం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా ఈ విషయంపై రిషబ్‌ శెట్టి స్పందించారు. ‘ఓ..’అని శబ్దం చేయడం తమ సెంటిమెంట్‌ అని, ఇదొక నమ్మకమని అన్నారు. ‘కాంతార’ వీక్షించిన ప్రేక్షకులు ఈ శబ్దాలను అనుకరించొద్దని విజ్ఞప్తి చేశాడు. అది చాలా సున్నితమైన అంశమని, బయట ఇలా శబ్ధం చేయడం వల్ల తమ ఆచారం దెబ్బ తినొచ్చని అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement