Kantara Movie
-
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్పూర్లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
'కాంతార' యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
'కాంతార' సినిమా యూనిట్ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్ను మేకర్స్ ఆపేశారు. కన్నడ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నవంబర్ 24న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్ల్లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్ను ఆపేశారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్గా రిషభ్ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్
-
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కాంతార 1' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఇంత ఆలస్యంగానా?
కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!చదవండి: సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్ -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
కాంతార ప్రీక్వెల్లో మోహన్లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్లో రిషబ్ శెట్టిని మోహన్లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్వుడ్లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్కుమార్కు ఈ స్క్రిప్ట్ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్కుమార్కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
హిందీ సినిమాలు భారత్ను నెగెటివ్గా చూపిస్తున్నాయి: కాంతార హీరో
రెండేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్ను గడగడలాడించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టికి ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఇతడి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి బాలీవుడ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ మూడే నాకు గర్వకారణంఓ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్.. మన దేశాన్ని నెగెటివ్గా చూపిస్తున్నాయి. అలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయం. నా వరకైతే దేశం, నా రాష్ట్రం, నా భాష.. ఈ మూడింటినీ చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. వీటిని ప్రపంచానికి పాజిటివ్గా చూపించాలని నమ్ముతాను. అందుకోసం నావంతు ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.అది తప్పు కాదా?ఇది చూసిన జనాలు.. హీరో వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అదెప్పటినుంచో అలాంటి సినిమాలే ఎక్కువగా తీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్లే మాట్లాడుతున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతదాకా ఎందుకు? కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ సీన్స్ ఆపేయండి..ఈయన ఒక్క సినిమా హిట్ కొట్టి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్లా ఫీలవుతున్నాడు. కాంతారకు అనవసరంగా హైప్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూశాక మళ్లీ చూడాలన్న ఆసక్తే రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము గిల్లే సన్నివేశాలు ఆపేయండి.. చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అవి ఆపేశాక నీతులు చెప్పండి అని మరో వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ సినిమా చేస్తున్నాడు. -
జాతీయ అవార్డ్.. హీరో పునీత్ - వాళ్లకు అంకితం: రిషబ్ శెట్టి
కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జాతీయ సినిమా అవార్డ్తో పాటు ఏమేం ఇస్తారు?
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది. (ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
క్లాప్ బాయ్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్గా.. 'రిషబ్ శెట్టి' ప్రయాణం
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్పై షార్ట్టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)కూలీ పనులకు కూడా వెళ్లేవాడురిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణంచదువుకునే సమయంలోనే రిషబ్కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.‘కాంతార’ ప్రభంజనంచిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది. -
జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో?
70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్లో ఉంది.ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్లో ఉంది.వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్లో ఉంది.ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్స్టార్లో ఉంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్లో ఉంది.ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్స్టార్లో ఉంది.(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ) -
'కాంతార' బ్యూటీ.. షార్ట్లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
కాంతార 2 రిలీజ్ డేట్ లాక్..
-
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్గా ఎన్టీఆర్, రామ్చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
బుజ్జి కారును నడిపిన కాంతార హీరో.. వీడియో వైరల్
ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు.తాజాగా బుజ్జి కారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. బుజ్జి కారును ఇప్పటికే పలువురు సినీతారలు డ్రైవ్ చేశారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024 -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్లాల్ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్లాల్ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) -
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ బ్లాక్బస్టర్ హిట్ మూవీ కాంతారతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్వుడ్లో యువ చిత్రంలో హీరోయిన్గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివరాజ్కుమార్ అన్నయ్య కుమారుడు యువరాజ్కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్కుమార్ రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. మరోవైరు ఈ ఏడాదిలోనే సప్తమి గౌడ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నారు. -
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
రిలీజ్ కు రెడీ అవుతున్న కాంతార-2
-
రామ్రాజ్ కాటన్ ప్రచారకర్తగా కాంతారా హీరో
కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిను రామ్రాజ్ కాటన్ కంపెనీ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించింది. ఇకపై రామ్రాజ్ కంపెనీ తయారుచేస్తున్న ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు రిషబ్ ప్రచారం చేయనున్నట్లు రామ్రాజ్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్ తెలిపారు. రామ్రాజ్ బ్రాండ్కు ప్రచారం చేయడం పట్ల రిషబ్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రచారంతో రామ్రాజ్ బ్రాండ్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని సంస్థ ఎండీ అరుణ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..? 1983లో ప్రారంభమైన ఈ సంస్థ 2023 మార్చి లెక్కల ప్రకారం దాదాపు రూ.119 కోట్లు మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉందని అంచనా. సంస్థలో భాగంగా ఉన్న రామ్రాజ్ సర్జికల్ కాటన్ మిల్స్లో కాటన్యార్న్, ఫాబ్రిక్స్ తయారవుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు రిషబ్ శెట్టి అడుగులు
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతార'తో యావత్తు సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా ఘనవిజయం తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదటి భాగం హిట్ కొట్టడంతో 'కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1' ప్రీక్వెల్ కూడా త్వరలో రానుంది. 54వ 'ఇఫి' వేడుకలో 'కాంతార'కు సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ సినిమా విజయంతో ఆయన ఒక పౌండేషన్ను ఏర్పాడు చేశాడు. ఇందులో భాగంగ తన సొంత గ్రామానికి తనకు చేతనైన సాయం చేయాలని ముందుకు వచ్చాడు. దక్షిణ కర్ణాటకలోని కెరటి గ్రామానికి చెందిన వ్యక్తి రిషబ్ శెట్టి. సినిమా వల్ల ప్రస్తుతం ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దీంతో తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. శెట్టి ఫౌండేషన్ ద్వారా తన సొంత గ్రామంలో ఉండే పాఠశాలకు సహాయాన్ని అందించాడని సమాచారం. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. దీని ద్వారా కనీస అవసరాలే లేని కన్నడ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి వంటి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాడట. ఇందులో మరికొందరిని భాగస్వామ్యం చేసేందుకు ఆయన చూస్తున్నారట. ఇందులో భాగంగా తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలను తాజాగా రిషబ్ సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఆయన ప్రాథమిక చర్చ జరిపారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. త్వరలో ఆయన ఈ విషయంపై క్లారటీ ఇస్తారని తెలుస్తోంది. -
'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
సాధారణంగా ఓ సినిమా తీస్తున్నారంటే చాలామంది యువనటీనటులు.. అందులో ఛాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ఓ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ప్రముఖ హీరోయినే ప్రయత్నిస్తే? అవును మీరు సరిగానే విన్నారు. ప్రస్తుతం 'కాంతార' మూవీకి ప్రీక్వెల్ తీసే పనిలో హీరో రిషభ్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో క్రేజీ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలాడుకుంది. ఏంటి విషయం? కన్నడ హీరో రిషభ్ శెట్టిని.. రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ని చేసి మూవీ 'కాంతార'. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీస్తున్నారు. మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేయగా, తెగ వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) ఛాన్స్ అడుక్కుంది అయితే 'కాంతార-1' సినిమాలో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఎక్స్ (ట్విట్వర్) వేదికగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పోస్ట్ పెట్టింది. 'రిషభ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్.. కాంతార చాప్టర్-1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఈ మధ్య విడుదలైన 'మంగళవారం'లో నా యాక్టింగ్ని అందరూ ప్రశంసించారు. మీరు కాస్త టైం కేటాయించి నా సినిమా చూస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులు థ్యాంక్స్' అని పాయల్ రాసుకొచ్చింది. మరి పాయల్ కోరుకున్నట్లు.. 'కాంతార-1' హీరో గానీ మూవీ యూనిట్ గానీ ఈ ట్వీట్ చూసి, ఛాన్స్ ఇస్తే మాత్రం పాయల్ ని అదృష్టం వరించినట్లే. చూద్దాం మరి ఈ బ్యూటీ అనుకున్నది జరుగుతుందో లేదో? (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) @shetty_rishab @hombalefilms I've learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to… — paayal rajput (@starlingpayal) December 12, 2023 -
నెట్టింట్లో వైరల్ అవుతున్న 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు
-
గుర్తుపట్టలేనంత అందంగా మారిన కాంతార హీరోయిన్ సప్తమి గౌడ (ఫొటోలు)
-
పుష్ప 2 అంచనాలకు మించి కాంతార చాప్టర్ 1
-
ఓటీటీలు అలా చేయడం మంచిది కాదు: రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్
కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్ పీకాక్(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 -
'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో సుమారు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
కాంతార2 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..
-
'కాంతారా' అభిమానులకు శుభవార్త ప్రకటించిన రిషబ్ శెట్టి
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. సినిమా ప్రకటన అయితే ఇచ్చారు కానీ గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సినీ వర్గాలకు ఓ శుభవార్తను అందించారు. 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. నవంబర్ 27న 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేని సినీ పరిశ్రమకు రిషబ్ శెట్టి శుభవార్త అందించాడు. రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ప్రత్యేకించి ఈసారి 5 భాషల్లో కాకుండా 7 భాషల్లో సినిమా విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో 'కాంతారా' విడుదల అయ్యి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ పొందింది. కాబట్టి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సినిమా రిలీజైన ఇన్నాళ్లకు ఆ పాట వీడియో రిలీజ్
తెలుగు సినిమాలో తెలుగులోనే కొన్ని కొన్ని సరిగా ఆడవు. అలాంటిది ఓ కన్నడ సినిమా.. ఏ మాత్రం అంచనాల్లేకుండా కర్ణాటకలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. తెలుగులోనూ అంతకు మించి అనేలా హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో క్లైమాక్స్ సాంగ్ ఎంత హిట్టయిందో, అన్నే వివాదాలు కూడా వచ్చాయి. (ఇదీ చదవండి: దానికి నో చెప్పానని నాతో అలా ప్రవర్తించారు.. హాట్ బ్యూటీ కామెంట్స్!) అయితే 'కాంతార' మూవీకి ఎంతో పేరు తెచ్చిన 'వరహారూపం' పాట లిరికల్ సాంగ్ మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. తాజాగా సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా పూర్తి వీడియోని రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్ లో ఆ పాటని పోస్ట్ చేసింది. ఇంకెందుకు లేటు మీరు దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) -
కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!
రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ సక్సెస్తో రిషబ్ శెట్టి మరో సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతారం-2 తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సైతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కాంతార- 2' బడ్జెట్ పైనే చర్చ జరుగుతోంది. సాధారణంగా సూపర్ హిట్ అయినా సినిమాలకు సీక్వెల్ రూపొందించడం మనం చూసుంటాం. కానీ అందుకు భిన్నంగా రిషబ్ శెట్టి ప్రీక్వెల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) ఈ నేపథ్యంలోనే కాంతార-2 ప్రీక్వెల్ను గ్రాండ్గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దాదాపు రూ.125 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర భాషల నటీనటులను తీసుకోవడంతో పాటు.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ సైతం ఓ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. అందుకే సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా.. కాంతార పార్ట్-1 షూటింగ్ ఎక్కువ భాగం రిషబ్ స్వగ్రామమైన కుందాపూర్లోనే జరిగింది. అయితే రెండో భాగాన్ని మంగళూరులో చిత్రీకరించనున్నారు. సినిమాలో భూత కోల పూజను మరింత లోతుగా చూపించనున్నారు. వచ్చే ఏడాది 2024 చివర్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. (ఇది చదవండి: నిత్యామేనన్ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి? ) రిషబ్ శెట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంతార- 2కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రకృతి నేపథ్యంలో తెరకెక్కిన తొలిభాగం కథ ఎక్కడ, ఎలా మొదలైందనేది ప్రీక్వెల్లో చూపిస్తామని తెలిపారు. పంజర్లీ దేవుడికి సంబంధించిన మరిన్ని సన్నివేశాలు ఉంటాయని అన్నారు. కాగా.. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న సినిమాలు
-
రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!
కాంతార సినిమాతో స్టార్గా గుర్తింపు దక్కించుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను ఒక్కసారిగా షేక్ చేసింది. కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగే భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు. తన ముద్దుల కూతురు రాధ్య, కుమారుడు రాన్వీ రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి. ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.. మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇన్స్టాలో రాసుకొచ్చారు. చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం రక్షాబంధన్ విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఇటీవలే ప్రకటించారు. (ఇది చదవండి: ‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) -
టాప్ హీరోతో ఒకే ప్లేట్లో భోజనం చేసిన ఈ స్నేహితులు ఎవరంటే..
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రాణస్నేహితులు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది.. ప్రముఖ నటులు విష్ణువర్ధన్, రెబల్ స్టార్ డా. అంబరీష్ మాత్రమే అని చెప్తారు. ఈ దిగ్గజాల తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వారి బంధానికి మించి అయితే కాదు అనే టాక్ ఉంది. ఈ క్రమంలో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టితో రక్షిత్ శెట్టి స్నేహ బంధం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది . ఒకరు కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారితే.. రక్షిత్ శెట్టి 'చార్లీ 777' సినిమాతో బాక్సాఫీస్ బద్దలుకొట్టారు. ఇలా వీరద్దరూ కన్నడ పరిశ్రమలో పాపులర్ యాక్టర్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది) జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు, ఈ నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్న వీడియో రివీల్ అయింది. ఈ బ్యాచ్లో ప్రమోద్ శెట్టి కూడా ఉన్నారు. ఈ వీడియోను కన్నడ నటి శీతల్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా అందంగా ఉంది. కానీ ఇదీ పాతదని ఆమె తెలిపింది. ఈ వీడియో వారు సినిమా పరిశ్రమలో కష్టాలు ఎదుర్కొంటున్న నాటిదే అయినా.. వారి మధ్య ఉండే స్నేహం ఎంత బలమైనదో తెలుపుతుంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కంటే ముందే రక్షిత్ శెట్టి సినీ పరిశ్రమలో ఉన్నారు. అప్పటికే ఆర్థికంగా మంచి స్థానంలో రక్షిత్ ఉన్నారు. మొదట 'తుగ్లక్' సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా జర్నీలో వీరు మంచి స్నేహితులుగా మారారు. 'తుగ్లక్' సినిమాతో హీరోగా రక్షిత్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. రిషబ్ కూడా ఒక చిన్న క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా రక్షిత్ శెట్టి చేసిన తొలి సినిమా ఇదే కావడం అది పరాజయం పాలవడం అతన్ని ఎంతగానో కుంగతీసింది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు డిప్రెషన్కు గురైయాడు. (ఇదీ చదవండి: Anna Lezhneva Facts: అన్నా లెజెనెవా ఎవరు? పవన్కు ఎలా పరిచయమయ్యారు?) దీంతో రిషబ్ వద్ద ఉన్న'కిరిక్ పార్టీ' కథను రక్షిత్కు చెప్పడంతో తనకు నచ్చింది. దానికి రిషబ్నే డైరెక్టర్గా తొలిసారి వ్యవహరించాడు. రక్షిత్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పెట్టాడు. విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద హిట్టయింది. దాని వల్ల వారికి భారీగా డబ్బు వచ్చింది. దాంతో ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ సినిమా తీశారు. దానికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డొచ్చింది. అలా వారిద్దరూ తిరిగి వెనకడుగు వేయలేదు. ప్రస్థుతం భారీ సినిమాల్లో నటించే స్థాయికి ఈ స్నేహితులు చేరుకున్నారు. View this post on Instagram A post shared by Sheetal Shetty (@isheetalshetty) -
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) అయితే తాజాగా రిషబ్ ట్విటర్లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ట్విటర్లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్) ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ. ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ. The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy — Rishab Shetty (@shetty_rishab) June 25, 2023 -
రిషబ్ శెట్టి ప్లానింగ్ కాంతారా 2
-
కాంతారకు బిగ్ షాక్ ఇచ్చిన కేరళ హైకోర్ట్
-
కాంతార టీంకు భారీ షాక్.. వరాహ రూపం సాంగ్పై నిషేధం!
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వరాహ రూపం పాటపై వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతేకాకుండా న్యాయపోరాటానికి కూడా దిగింది. పిటిషన్పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కాంతారా చిత్ర బృందానికి షాకిచ్చింది. పాటపై నిషేధం వరాహ రూపం సాంగ్ను థియేటర్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల్లో ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాట విషయంలో చిత్రబృందం ప్రాథమిక కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. తైకుడం బ్రిడ్జ్కు చెందిన నవరసం నుంచి కాపీ కొట్టారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని తాము రూపొందించిన 'నవరసం' నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ కోర్టును ఆశ్రయించింది. పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. -
కాంతార: ప్రపంచం మెచ్చిన భూతకోల.. ఇది ఎలా పుట్టిందో తెలుసా?
లాక్డౌన్ అనంతరం పరిస్థితులు మారాయి. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. కరోనా అనంతరం ప్రేక్షకుల్లో సినిమాను చూసే కోణం మారింది. భారీ బడ్జెట్, ఫైట్స్, పెద్ద హీరోలు ఉంటేనే సినిమా ఆడుతుందనేత పాత ముచ్చట.. ఇప్పుడు కథలో దమ్ముండాలే కాని చిన్న సినిమా అయితే ఏంటీ! కొత్త నటులు అయితే ఏంటీ? అంటున్నారు ఆడియన్స్. దానికి ఇటీవల వచ్చిన బలగం, కాంతార చిత్రాలే ఉదాహరణ. కాంతార స్ఫూర్తితోనే వచ్చింది బలగం మూవీ. అలా ప్రాంతీయ సినిమాలకు పుంతలు వేసిన కాంతార సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఓ రీజనల్ సినిమా ప్రపంచాన్ని మెప్పించిందటే అది సాధారణ విషయం కాదు. ఐక్యరాజ్య సమితీలో సైతం కాంతార చిత్రాన్ని ప్రదర్శించారంటే అది ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈసినిమా క్లైమాక్స్లో రిషబ్ శెట్టి భూతకోల ఆచారంలో భాగంగా పంజుర్లిగా మారి ‘ఓఁ’ అంటూ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ఆయన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో అసలు భూతకోల అంటే ఏంటీ? దీని సంప్రదాయమేంటో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తికని కనబరిచారు. అయితే కర్ణాటకలో ఈ భూతకోల ఆచారం పుట్టడానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం! భూతకోల... కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల ముఖ్యమైన సంస్కృతి, సంప్రదాయం ఇది. ముఖ్యంగా ప్రకృతి-మానవాళి మధ్య మంచి సత్సంబంధాల ఉంటేనే మనుగడ సాధ్యమని కాంతార ద్వారా చాటిచెప్పాడు రిషబ్ శెట్టి. కర్ణాటకలో ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవం ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెబుతుంది. పూర్వం తుళునాడులో అడవి పందులు ఎక్కువడగా ఉండేవట. అవి రాత్రిళ్లు సంచరిస్తూ అలా స్థానికంగా ఉన్న పంటలను నాశనం చేస్తుండేవట. అలా ఓ పంది తన పంటను నాశనం చేసిందనే కోపంతో దాన్ని చంపేశాడట ఓ రైతు. కొంతకాలనికి పందిని చంపినందుకు ఆ రైతు తీవ్ర మనోవేదనకు గరయ్యాడట. దీంతో ఆ పంది ఆత్మను పూజించడం ప్రాంరభించాట. అలా తుళునాడు ఆదివాసిలంతా వరాహాన్ని దైవంగా కొలిచేవారట. దీనిలో భాగంగానే వరహాన్ని కొలిచేందుకు ఈ భూతకోలను ప్రతిఏటా నిర్వహించేవరట. అలా ఈ సంస్కృతి పుట్టిందని కొందరు చెబుతుంటారు. అలాగే మరోకంటి ఏంటంటే.. ఓ మగ, ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్వేశ్వర ఆలయానికి వెళ్లి ప్రార్థంచగా.. వాటి భక్తికి ప్రత్యక్షమైన స్వామి ఓ వరం కోరుకోమన్నాడట. వాటి కోరికను సుబ్రమణ్య స్వామి నెరవేర్చాడని, ఆయన ఇచ్చిన వరం ప్రకారం వాటికి నాలుగు పిల్ల పందులు పుట్టాయట. ఆ పంది పిల్లల్లో ఒకటి ఈశ్వరుడి తోటలో ప్రవేశించి అక్కడ సంచరిస్తుండగా పార్వతి దేవి దానిని చూసింది. చూడగానే ఆ పంది పిల్ల పార్వతి దేవికి నచ్చిందట. దీంతో శివుడు దానికి దేవికి కానుకగా ఇచ్చాడట. ఆ తర్వాత కైలాసం ఆ పంది పిల్ల తోటలన్నింటిని నాశనం చేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ పందిని పిల్లని చంపేశాడట. ఆ ఘటనతో బాధపడ్డ పార్వతి దేవి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరడంతో పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి, దైవిక శక్తిని ప్రసాదించి, పంజుర్లిగా భూమ్మీదకు పంపించాడని అక్కడ ప్రజలు అంటుంటారు. అప్పటి నుంచి మానవులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవరూపాన్ని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందనేది తుళునాడు ప్రజల విశ్వాసం. ప్రాంతాన్ని బట్టి అన్నప్ప పంజుర్లి, కద్రి పంజుర్లి, కాంతవర పంజుర్లి.. ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. ఆ దైవాన్ని పూజించే ప్రత్యేక సంగీత నాట్యకళే భూతకోల. దానికి దైవ కోల, నేమ అనే పేర్లూ ఉన్నాయి. పంజుర్లితోపాటు క్షేత్రపాలకుడిగా గుళిగను కూడా శివుడు పంపించాడని, తప్పు చేసిన వారిని పంజుర్లి వదిలిపెట్టినా గుళిగ వదలదు అని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. -
సీఎం వెంట కాంతార రిషబ్.. బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?
యశవంతపుర: సీఎం బొమ్మై రాష్ట్రంలో దేవస్థానాల సందర్శన చేపట్టారు. గురువారం కొల్లూరు మూకాంబిక దేవస్థానాన్ని సతీసమేతంగా దర్శించారు. ఈ సమయంలో కాంతార నటుడు రిషబ్శెట్టి కూడా సీఎం వెంట ఉండడం విశేషం. తరువాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ రిషబ్శెట్టి అనుకోకుండా కలిశారని చెప్పడం గమనార్హం. సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్ మధ్వరాజ్లున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. కాగా, ఉడుపి జిల్లా శిరూరు వద్ద సీఎం హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అక్కడికి వంద మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ యథావిధిగా టేకాఫ్ అయ్యింది. కాగా ఇటీవల సినీనటుడు కిచ్చా సుదీప్ బహిరంగంగానే సీఎం బసవరాజ్ బొమ్మై, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీని తర్వాత సీఎం బసవరాజ బొమ్మైతో కాంతారావు నటుడు రిషబ్ శెట్టి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. కిచ్చా సుదీప్ లాగా కాంతారావు కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
పాన్ ఇండియా రేంజ్ లో సమంత.. కాంతర తోనే పోటీనా..
-
మరో కాంతారా ?
-
రాజకీయాల్లోకి కాంతార హీరో రిషబ్ శెట్టి? ఆయన ఏమన్నారంటే..
కన్నడ సెన్సేషన్ కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు రిషబ్ శెట్టి. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించి ఓ వార్త కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడంటూ తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో కాసేపటికే అది వైరల్గా మారింది. అయితే తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందించారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రచారంలో నిజం లేదు. నా సినిమాలకు మద్దతివ్వండి చాలు అంటూ అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపై ఉందని చెప్పుకొచ్చారు. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
కాంతారకు అరుదైన గౌరవం, ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్
-
కాంతార మరో సంచలనం.. విదేశాల్లోనూ రిలీజ్!
భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ చిత్రం ఇప్పుడు విదేశీ ఆడియన్స్ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 20కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీని విదేశాల్లో కూడా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. స్పానిష్, ఇటాలియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని, థియేటర్స్లోనే విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. -
అంతర్జాతీయ స్థాయిలో కాంతారకు అరుదైన గౌరవం..
రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా స్వీయదర్శకత్వం వహించిన అద్భుత చిత్రం కాంతారకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో మార్చి 17న ఈ సినిమా ప్రదర్శించనున్నారు. స్క్రీనింగ్ పూర్తైన అనంతరం రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. తన సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనుడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార సినిమా ప్రకృతి ప్రసాదించిన అడవుల రక్షణ గురించి ప్రస్తావించిన కాంతార చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రదర్శితం కానుండటం నిజంగా గొప్ప విషయం అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి పలు ఫోటోలు జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తక్కువ బడ్జెట్తో రూపొందిన కాంతార వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే! దీంతో కాంతార ప్రీక్వెల్ తీసే పనిలో పడింది చిత్రయూనిట్. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)
-
క్రేజీ బజ్.. కాంతార-2లో సూపర్స్టార్ రజనీకాంత్?
కన్నడ సెన్సేషన్ కాంతార మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా కాంతార-2కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో రిషబ్ శెట్టిని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఒకవేళ రజనీకాంత్ను సంప్రదించకపోతే ఇది కేవలం పుకారు అని బదులిచ్చేవారు. దీంతో కాంతార-2పై మరింత ఆసక్తి నెలకొంది. -
ఇది వారికే అంకితమిస్తున్నా: రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఆయన మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్ కిరగందూర్ సర్కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్, భగవాన్ (దివంగత దర్శకుడు)సర్కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది. -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనపై కంగనా అసహనం
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నిర్వహకులపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ అవార్డు కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతం చూపించారని కంగనా మండిపడింది. కాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహేబ్ ఫాల్కే’ అవార్డు ఒకటి. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి నిన్న (సోమవారం) రాత్రి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. 2023కి గానూ పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర) ఉత్తమ నటిగా ఆలియా భట్(గంగూబాయ్ కథియవాడి) చిత్రాలకు గానూ అవార్డును అందుకున్నారు. అలాగే కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా ఈ అవార్డును దక్కింది. చదవండి: నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఎంటంటే! ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’, ఫిలిం ఆఫ్ ది ఇయర్గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు అవార్డును గెలుచుకున్నాయి. అయితే రణ్బీర్ కపూర్, ఆలియాలకు ఈ అవార్డు రావడంపై కంగనా తప్పుబట్టింది. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్కు అవార్డులు దక్కాయని విమర్శించింది. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ తన ట్విటర్లో ఓ జాబితాను పంచుకుంది. అనంతరం బాలీవుడ్ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా పేర్కొన్నా జాబితా ఇలా ఉంది బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతార) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్) ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా) Best director- SS Rajamouli ( RRR) Best supporting actor- Anupam Kher ( Kashmir Files) Best supporting actress- Tabu ( Drishyaman/Bhool Bhulaiya) Bolly awards are a big sham … when I get some time from my schedule I will make a list of all those I feel are deserving … thanks — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్సీరీస్గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
అభిమానితో ప్రేమ.. ఆ తర్వాత.. కాంతార హీరో ప్రేమకథలో ట్విస్టులు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం. అభిమానితో ప్రేమ సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. రిషబ్కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్లో ఫేస్ బుక్ చూస్తే ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ సినీ కెరీర్ రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. -
కాంతార-2 హీరోయిన్గా ఊర్వశీ రౌతేలా? వైరల్ అవుతున్న ఫోటో
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇటీవలె మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంతార-2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా నటించనుంది. ఈ మేరకు స్వయంగా ఆమె తన ఇన్స్టా స్టోరీలో డైరెక్టర్ రిషబ్ శెట్టితో కలిసి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘కాంతారా2’లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఊర్వశీ హీరోయిన్గా నటిస్తుందా లేక కీలక పాత్రలో చేయనుందా అన్న సందేహం నెలకొంది. ప్రస్తుతం ఊర్వశీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
కాంతార వరాహ రూపం సాంగ్.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కన్నక హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో వరాహ రూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరంగదూర్కు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాకుండా కేసు విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అనంతరం కోర్టును ఆశ్రయించి పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత థియేటర్లలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో పాటను ప్లే చేయడాన్నినిలిపివేయాలని స్థానిక న్యాయస్థానం మేకర్స్ను ఆదేశించింది. ఆ తర్వాత కేరళలోని కోజికోడ్ జిల్లా న్యాయస్థానం అధికార పరిధి లేకపోవడంతో 'వరాహ రూపం' పాటపై నిషేధాన్నిఎత్తివేసింది. -
కాంతార 2పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
గతేడాది రిలీజ్ అయిన కన్నడ చిత్రం కాంతార ఎంతటి విజయం సాధించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళు చేసింది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కానీ ఇది కాంతారకు సీక్వెల్ కాదని ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. అయితే కాంతార 2 ప్రకటించిన నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కీలక అప్డేట్ ఇచ్చారు. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆయన కాంతార 2పై స్పందించారు. ‘వచ్చే ఏడాది కాంతార 2ను విడుదల చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. ఇది కాంతారకు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపించబోతున్నాం. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు పార్ట్ 2లో ఎక్కువగా ఉంటాయి’ అంటూ రిషబ్ చెప్పుకొచ్చారు. -
అందుకే కాంతార ఆస్కార్కు నామినేట్ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్కు షాట్లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్కు నామినేట్ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ కొత్త రకం కంటెంట్నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! ఇక కాంతార ఆస్కార్కు నామినేట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
కన్నడ సెన్సేషన్ కాంతార-2 వచ్చేస్తోంది.. కానీ సీక్వెల్ కాదట
కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయ్యింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా రూ. 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచిందీ చిత్రం. అంతేకాకుండా ఆస్కార్కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకుంది కాంతార. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కిస్తున్నట్లు హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ తెలిపారు. అయితే ఇది సీక్వెల్ కాదని, ప్రీక్వెల్గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. -
'కాంతార క్లైమాక్స్.. రియల్ లైఫ్లోనూ ఎదురైన సీన్'
కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా అయినా కేవలం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. రిషబ్శెట్టి, సప్తమి గౌడతోపాటు చిత్రబృందం సభ్యులు. హోంబలే నిర్మాతలు తులునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. పంజర్లీ అతడిని ఆవహించడం లాంటి సన్నివేశాలను చిత్రబృందం దగ్గరుండి చూశారు. పంజర్లీ ఆవహించిన వ్యక్తి రిషబ్శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఆ వీడియోలో భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెరపై చూపించిన భూతకోల సన్నివేశాలను నిజ జీవితంలోనూ రిషబ్ శెట్టి బృందం కనులారా వీక్షించింది. స్పెషల్ వీడియో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. కాంతార టీమ్తో కలిసి తాము నిజ జీవితంలో దైవానుగ్రహం పొందామని పేర్కొంది. హోంబలే ఫిల్మ్స్ తన ట్విటర్ ఖాతాలో రాస్తూ..'ప్రకృతికి మనం లొంగిపోయి మనకు స్వేచ్ఛ, విజయాన్ని ప్రసాదించిన దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రహాన్ని పొందింది.' అని పేర్కొంది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు సినిమా తీయడానికి కంటే ముందే జరిగినట్లు తెలుస్తోంది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು. You surrender to the nature & worship the God, who has bestowed you with such success n freedom in life. #Kantara team witnessed the divine in real form & took the blessings of Daiva!@shetty_rishab #VijayKiragandur @gowda_sapthami @ChaluveG @Karthik1423 pic.twitter.com/vPn8mOoenR — Hombale Films (@hombalefilms) January 20, 2023 -
నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారే.. కాంతార హీరోపై రష్మిక షాకింగ్ కామెంట్స్
రష్మిక మందన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప సినిమా ఒక్కసారిగా నేషనల్ క్రష్గా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. అయితే గతంలో రిషబ్ శెట్టి కాంతార సినిమాపై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో రిషబ్ శెట్టి, రష్మిక ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణమని తెలిపింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వినిపించింది. అలాగే తనపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. ఇకపై అలాంటి వాటిని సహించబోనని చెబుతోంది నేషనల్ క్రష్. సడన్గా రిషబ్, రక్షిత్పై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించిన ఈ ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత్ర ప్రతిష్టాత్మకమై ఈ అవార్డు రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతుండాలో ఓసారి చూద్దాం.. ఈ ఆస్కార్ అవార్డు కోసం సినిమా ఎదురుకాబోయే చాలా పరీక్షల్లో అర్హత సంపాదించడం అత్యంత ముఖ్యమైంది. ఏ సినిమా అయిన ఆస్కార్ బరిలో ఉండాలంటే.. అది అమెరికాలో గుర్తింపు పొందిన ఆరు ప్రధాన నగరాల్లోని ఏదో ఒక సిటీలో కమర్షియల్ థియేటర్లో రిలీజ్ అవ్వాలి. అంతేకాదు.. కనీసం వారం రోజుల పాటు అక్కడ సినిమా ఆడాలి. రోజుకు కనీసంగా మూడు ఆటల చొప్పున సాయంత్రం షో తప్పకుండా ఉండాలి. ఆస్కార్ అప్లికేషన్ ఫామ్లో సినిమా ప్రదర్శించబడినట్లు రిసీట్ కూడా జతచేయాలి. అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరికి ఈ అర్హత అవసరం లేదు. ప్రస్తుత ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా సినిమాలు ఈ అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్, కాంతార, గంగూభాయ్, ది కశ్మీర్ ఫైల్స్, మి వసంత్రావ్, రాకేట్రీ లాంటి పలు సినిమాలు అర్హత సాధించాయి. వీటన్నింటిని రిమైండర్ లిస్టుగా పిలుస్తారు. ఇలా రిమైండర్ లిస్టులో ఉన్న సినిమాలన్ని క్యాటగిరీలకు అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. అయితే ఈ సినిమాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరి కింద గుర్తించబడవు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ఫిల్మ్ క్యాటగిరి... ఈ కేటగిరి కోసం ప్రతీ ఒక్క దేశం తమ తరుపున ఒక్క సినిమాను ఆస్కార్ ఎంట్రీ కోసం నామినేట్ చేస్తుంది. ఈసారి దాదాపు 80 దేశాలు ఈ క్యాటగిరి కింద ఒక్కో సినిమాను నామినేట్ చేశాయి. భారత్ తరుపున ఈసారి ఛెల్లో సినిమాను నామినేట్ చేశారు. ఇప్పటికే దాదాపు 10 కేటగిరీలకు సంబంధించిన షార్ట్లిస్ట్ను డిసెంబర్-21న ప్రకటించింది ఆస్కార్ అకాడమీ. ఇందులో 1. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్-15 సినిమాలు 2. షార్ట్ డాక్యుమెంటరీ-15 సినిమాలు 3. ఇంటర్నేషనల్ ఫీచర్-15 సినిమాలు 4. మేకప్ అండ్ హేయిర్ స్టైల్-10 సినిమాలు 5. మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్- 5 సినిమాలు 6. మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్-15 సినిమాలు 7. షార్ట్ యానేటెడ్ ఫిల్మ్-15 సినిమాలు 8. లైవ్ యాక్షన్-15 సినిమాలు 9. సౌండ్-10 సినిమాలు 10. వీఎఫ్ఎక్స్-10 సినిమాలు ఈ కేటగిరీల్లో ఇండియా నుంచి నాలుగు సినిమాలు ఆస్కార్ అకాడమీ ప్రకటించిన షార్ట్లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో 1. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గాను RRR సినిమా షార్ట్ లిస్టు అయ్యింది. 2. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లో సినిమా షార్ట్ లిస్టు అయింది. 3. షార్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో... ఆల్ దట్ బ్రీత్ సినిమాను షార్ట్ లిస్టు చేశారు. 4. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎలిఫెంట్ విస్ఫర్స్ నామినేట్ అయింది. జనవరి 24న అన్ని కేటగిరీలకు సంబంధించి 5 సినిమాలను అకాడమీ షార్ట్ లిస్టు విడుదల చేయనుంది. ఇక ఒకసారి ఫైనల్ నామినేషన్స్ పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ అకాడమీ మెంబర్స్ ఓటింగ్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అకడామీలో దాదాపు 10 వేల మంది సభ్యులున్నారు. వీరిలో చాలామంది అమెరికాకు చెందినవారే... అయితే ఇందులో ఇండియాకు చెందిన 40మంది ఉన్నారు. అకాడమీకి చెందిన 10వేల మంది సభ్యులు దాదాపు 16 క్రాఫ్ట్లకు చెందిన వారై ఉంటారు. వీరి ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ ఇలా చాలా విభాగాలకు సంబంధించినవారు. వీరు ముందుగా అర్హత సాధించిన 300 సినిమాలను వివిధ కేటగిరీలకు నామినేట్ చేసే ప్రక్రియలో ఓటింగ్ చేస్తారు. చివరికి షార్ట్ లిస్టు అయిన సినిమాలకు వీరు వేసే ఓటే డిసైండింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. వీరిలో చాలామంది అమెరికాకు చెందిన వారు కావడంతో వీరంతా అమెరికాలో బ్లాక్బస్టర్ అయిన సినిమాలకు ఓటు వేస్తారనే చర్చ ఉంది. అందుకే సినిమా ప్రమోషన్ చాలా ముఖ్యమైంది. ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో... RRR సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అమెరికాలో సైతం చాలామంది RRR సినిమాను ప్రశంసించారు. సినిమా దేవుడిగా పిలిచే స్టీఫెన్ స్పీల్బర్గ్ సైతం తనకు నాటు నాటు పాట బాగా నచ్చిందని చెప్పారు. అందుకే ఈసారి RRR సినిమాకు ఆస్కార్ పక్కా అనే చర్చ జరుగుతోంది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతే కాకుండా షార్ట్ లిస్ట్ చేయకుండానే కొన్ని బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ లాంటి కేటగిరీలకు డైరెక్ట్గా నామినేషన్స్ చేస్తారు. ఇలాంటి కేటగిరీల్లోనూ RRR సినిమాకు ఛాన్స్ ఉందని అంటున్నారు. --ఇస్మాయిల్, ఇన్ పుట్ఎడిటర్, సాక్షి టీవీ -
ఆస్కార్ బరిలో RRR కి పోటీ ఇస్తున్న సౌత్ సినిమాలు
-
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
తండ్రితో గర్వంగా.. కాంతార ఫేమ్ సప్తమి గౌడ (ఫొటోలు)
-
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
అందుకే నా ట్విటర్ అకౌంట్ను నిలిపివేశారు: నటుడు
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్ ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోస్టుల కారణంగానే ట్విటర్ అతడి ఖాతాను సస్సెండ్ చేశారని కొందరు అంటుంటే, ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నాయి. ఇలా తన ట్విటర్ ఖాతా సస్పెండ్ కావడంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా కిషోర్ కూమార్ స్పందించాడు. చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్ తన ట్విటర్ అకౌంట్ను నిలిపివేయడానికి కారణమేంటో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘నా అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారు. అందువల్లే నా ట్విటర్ నా అకౌంట్ను తొలగించింది. అంతేకాని నేను పెట్టిన పోస్ట్ల వల్ల కాదు. నా ట్విటర్ సస్పెన్షన్పై ఇప్పటికైన అనవసరమైన వాదనలను ఆపండి. నా పోస్ట్ల వల్ల దానిని నిలిపివేయలేదు. డిసెంబర్20న నా అకౌంట్ హ్యాక్ అయింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ నాకు హామీ ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ట్విటర్ తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్ చేశాడు. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం View this post on Instagram A post shared by Kishore Kumar Huli (@actorkishore) -
5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ కీలక ప్రకటన!
భారీ చిత్రాలకు కేరాఫ్గా మారిన సంస్థ హోమ్ బాలే. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి కేజీఎఫ్ పార్ట్– 1, పార్ట్–2, కాంతారా వంటి చిత్రాలు విడుదలై భారీ వసూళ్లతో సంచలన విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్లో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా హొంబాలే ఫిలింస్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ ఓ ప్రకటన చేశారు. చదవండి: వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ అలాగే రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ. 3000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది తమకు సక్సెస్ఫుల్గా గడిచిందన్నాడు. సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోందన్నారు. సినిమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రిక విషయాలను చూపిస్తూ వస్తున్నామన్నారు. కాగా ఇలాంటి సినిమా రంగం కోసం తన సంస్థ రానున్న అయిదేళ్లలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యానర్లో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ చిత్రంతో పాటు పృథీరాజ్ హీరోగా టైసప్, ఫాహత్ ఫాజిల్ కథానాయకుడుగా ధూమమ్, దక్షిత శెట్టి దర్శకత్వంలో రిచర్డ్ ఆంటోనీ చిత్రాలను తెరకెక్కుతున్నాయి. On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! - @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP — Hombale Films (@hombalefilms) January 2, 2023 -
కాంతార నటుడికి షాకిచ్చిన ట్విటర్!
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్కి ట్విటర్ భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని ఖాతాను సస్పెండ్ చేసింది. అతని ఖాతాని ఓపెన్ చేయగా..‘నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాను ట్వీటర్ సస్పెండ్ చేస్తుంది’అనే మెసేజ్ డిస్ప్లే అవుతోంది. అయితే కిశోర్ ఖాతాను నిలివివేయడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియదు. కిశోర్కి ట్విటర్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. ఇన్స్టాలో 43 వేల మంది, ఫేస్బుక్లో 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల ‘కాంతార’దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి మరణించారనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై కిశోర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘దేవుడు లేదా దెయ్యం అనేది మన నమ్మకం మాత్రమే. మీరు నమ్మితే, ఉంది, మీరు నమ్మకపోతే, లేదు. ఇలా కష్టకాలంలో ధైర్యాన్నిచ్చే నమ్మకాలను అవమానించాల్సిన పనిలేదు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉంది. వారి విశ్వాసం వారిది. విశ్వాసం కలిగి ఉండండి, మూఢనమ్మకం కాదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వ్యతిరేకించాడు. -
ఈ ఏడాది బాక్సాఫీస్ను బద్దలు కొట్టిన చిత్రాలివే..!
ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు సైతం ఈ మార్క్ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలివే.. టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్ఫాదర్ బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్సింగ్ చద్దా, జగ్జగ్ జీయో తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్ రోణ, 777 ఛార్లీ, జేమ్స్ -
సినిమా రంగంలో భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!
కన్నడలో బ్లాక్బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు. -
'కాంతార' హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. మరీ ఇంత తక్కువా?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. కేవలం రూ. 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన కాంతార హీరోకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగానే కాకుండా హీరోగా చేసిన రిషబ్ శెట్టికి పారితోషికం కింద రూ. 4కోట్లు మాత్రమే చెల్లించారట. కనీసం సినిమా సూపర్ హిట్ అయ్యాక అయినా హోంబేల్ ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టికి అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వడం, లేదా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం వంటివి కూడా జరగలేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. -
అది కాంతార మ్యానియా.. గవర్నమెంట్ ఎగ్జామ్లో మూవీపై ప్రశ్న
ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో రిషబ్ ట్రాన్స్ఫార్మేషన్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’