Actor Suriya Video Call To Died Fan Families Who Died In Electrocution Incident - Sakshi
Sakshi News home page

Suriya Video Call To Died Fans Families: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు సూర్య వీడియోకాల్‌.. అండగా ఉంటానని హామీ

Published Mon, Jul 24 2023 4:31 PM | Last Updated on Mon, Jul 24 2023 4:51 PM

Suriya Video Call to Died Fan Family - Sakshi

కోలీవుడ్‌ హీరో సూర్య బర్త్‌డే రోజు పల్నాడు జిల్లాలో ఆయన అభిమానులిద్దరూ కరెంట్‌ షాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే! జూలై 23న అభిమాన హీరో బర్త్‌డే సందర్భంగా నక్కా వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు.. ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన ఇద్దరు కుర్రాళ్లు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సూర్య.. మృతుల కుటుంబాలకు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. సూర్యను చూడగానే కొడుకును కోల్పోయిన ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. నాకు ఒక్కడే కొడుకయ్యా అంటూ ఏడ్చింది. వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన సూర్య.. బాధిత కుటుంబాలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చాడు. ఏ అవసరం ఉన్నా కూడా అండగా నిలబడతానని కుటుంబానికి ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యది ఎంత మంచి మనసోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

చదవండి: వికటించిన సర్జరీ, అందవిహీనంగా మారిన బిగ్‌బాస్‌ బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement