Suriya
-
పసందైన విందు
క్రేజీ కపుల్ సూర్య–జ్యోతిక ఆదివారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, త్రిష, నృత్య దర్శకురాలు బృంద తదితరులు పాల్గొన్నారు.∙సెల్ఫీ సందడి ‘‘రుచికరమైన ఆహారం... ఆప్త మిత్రులతో హ్యాపీగా సమయాన్ని గడిపాం. మేం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు మరింత బలంగా మారిపోతాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు త్రిష. అలాగే తారలతో సూర్య తీసిన సెల్ఫీ వైరల్గా మారింది. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై -
సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్ వచ్చేసింది
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా ‘రెట్రో’. ఇందులోని హుషారైన గీతాన్ని టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రంలో బుజ్జమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణన్ ఆలపించారు. ఈ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్లో దూసుకెళ్లోంది. సూర్య అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తుండగా.. మే 1న మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
500 మంది డ్యాన్సర్లతో త్రిష మాస్ జాతర సాంగ్
కోలీవుడ్ నటుడు సూర్య, నటి త్రిష మాస్ జాతర సాంగ్తో తెరపై దుమ్ము రేపటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఈ పాటలో 500 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఇది ఏచిత్రం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సూర్య తన 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆయన ప్రతి నాయకుడిగానూ నటిస్తున్నట్లు సమాచారం. కాగా నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి శ్వాసిక , ఇందిరస్, యోగిబాబు, షివాద, సుప్రీత్రెడ్డి, నట్టి నటరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అందులో ఒకటి న్యాయవాది పాత్ర అని సమాచారం. అదేవిధంగా ఇది న్యాయస్థానంలో జరిగే కేసు నేపథ్యంగా సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. తదుపరి చెన్నైలోని ఈ సీ ఆర్రోడ్లో వేసిన భారీ సెట్లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక మాస్ జాతర పాటను చిత్రీకరించడానికి యూనిట్ సన్నద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఫోక్ సంగీత బాణీలు కట్టిన ఈ మాస్ జాతర పాటలో సూర్య, త్రిషలతో పాటు 50 మంది డాన్సర్లు నటించబోతున్నట్లు తెలిసింది. దీనికి శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహించనున్నారని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ ఒక్క పాట కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. నటి పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 1న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
ఓల్డ్ స్టైల్ స్టెప్పులతో సూర్య, పూజా హెగ్డే 'రెట్రో' సాంగ్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా మరో సాంగ్ విడుదలైంది. ఇందులో సూర్య, పూజా హెగ్డే పాత కాలం నాటి స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ సాంగ్లో చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో కనిపించే ఐకానిక్ స్టెప్స్ కూడా ఉండటంతో కోలీవుడ్లో ఈ పాట వైరల్ అవుతుంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెట్రో సినిమాపై హైప్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
తండేల్ 2లో రామ్..?
-
ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా (Kanguva Movie) కలెక్షన్స్ కొల్లగొడుతుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి తీసిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. సినిమా ఏమీ బాగోలేదని, చాలా బోరింగ్గా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక అప్పట్లోనే ఘాటుగా రియాక్ట్ అయింది. కంగువ అద్భుతమైన సినిమా అని.. ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం కావాలంది. తొలి అరగంట బాగోలేదంతేసూర్య (Suriya)ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. తొలి అరగంట సినిమా బాగోలేదు, అలాగే మ్యూజిక్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని పేర్కొంది. తప్పులు జరగడం సహజమేనని, ఇలాంటి చిత్రంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయంది. ఇలాంటి మూవీకి నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానంది. డబుల్ మీనింగ్స్, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్, పాత స్టోరీలతో తీసే సినిమాలకు వీళ్లెవరూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదని బుగ్గలు నొక్కుకుంది.సినిమాను తొక్కేశారుకంగువా పాజిటివ్ అంశాలు కనబడలేదా? అని ప్రశ్నించింది. తొలిరోజే కంగువాపై నెగెటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సినిమాను తొక్కేస్తున్నారని మండిపడింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో మరోసారి కంగువా సినిమా నెగెటివిటీపై స్పందించింది. జ్యోతిక (Jyotika) మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అస్సలు బాగోవు. అయినా సరే కమర్షియల్గా బాగా ఆడతాయి. వాటికి మంచి రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ నా భర్త సినిమా (కంగువా) విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త కఠినంగా ప్రవర్తించారనిపిస్తుంది.ఎన్నో దారుణ సినిమాల కంటే కంగువా నయంసినిమాలో బాగోలేని సన్నివేశాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. అది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే.. దక్షిణాదిలో ఎన్నో అద్వాణ్నమైన సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ దారుణమైన రివ్యూలు ఇచ్చారు. అది చూసి నాకెంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన కంగువా కేవలం రూ.160 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.చదవండి: భారత్లో తొలి ఏఐ సినిమా.. హీరోహీరోయిన్లు కూడా.. -
సూర్య 'రెట్రో' మెలోడీ సాంగ్ విడుదల
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా సాంగ్ విడుదలైంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను కపిలన్ ఆలపించారు. రెట్రో నుంచి రిలీజ్ అయిన ఈ మెలోడీ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. సూర్య జైలులో ఉన్న సీన్లతో ఈ పాట ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్ అంశాలతో తన కొత్త సినిమా రెట్రోను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్తో పాటు ఈ సాంగ్ను చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్కి చాలా కీలకం. -
తొలి సినిమా నా భర్తతో చేయడం మరిచిపోలేను: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ హీరో సతీమణి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. తాజాగా ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జ్యోతిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో నటించడంపై ఆమె మాట్లాడారు.బాలీవుడ్తో నా తొలిచిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని తెలిపింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని వివరించింది. అది చేసే సమయంలో ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేశానట్లు వెల్లడించింది. కోలీవుడ్లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. స్టార్డమ్ గురించి ఆమెను ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లేముందే బయటే తమ స్టార్డమ్ను వదిలేస్తామని తెలిపింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మా పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటాం.. ప్రతి ఉదయం వారి బాక్స్ల గురించే ఆలోచిస్తామని.. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని జ్యోతిక వెల్లడించింది. కాగా.. తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్లో.. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. -
నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?
ఎవరి టాలెంట్ వారిదే! ఈ పదం సినిమా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఎవరి స్క్రిప్ట్ సెలక్షన్ వారిదే.. బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా వారిదే! ఒకరితో మరొకరిని పోల్చలేం. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా మరికొన్నిసార్లు కలెక్షన్ల ఊచకోతతో రికార్డులు సృష్టిస్తుంటారు. ఫెయిల్యూర్ అందుకున్నంతమాత్రాన నటులు వెనకబడిపోయినట్లు కాదు! అయితే కంగువా సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో సూర్య (Suriya)ను పలువురూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జ్యోతిక (Jyotika) షేర్ చేసిన పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు.నీ భర్తను ఆ రేంజ్ కలెక్షన్స్ తెమ్మనుసూర్య కంటే విజయ్ బెటర్ అని ఒకరు, నీ భర్త కంటే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఉత్తమం అని మరొకరు సెటైర్లు వేశారు. సూర్య, కార్తీల కంటే విజయ్ చాలా నయం.. ఇదే నిజం.. ఆ ఇద్దరు హీరోలను డ్రాగన్, లవ్ టుడే కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురమ్మనండి అంటూ ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై జ్యోతిక చాలా కూల్గా స్పందించింది. నీ భర్త కంటే విజయ్ నయం అన్న కామెంట్కు.. అవునా, నిజమా? అన్నట్లుగా స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. స్పందించడం అవసరమా?తర్వాత సదరు కామెంట్లన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిక ఆ ట్రోలర్స్కు రిప్లై ఇవ్వడం అవసరమా? అని పలువురు మండిపడుతున్నారు. పోనీ.. నీ భర్త కంటే వేరొకరు నయం అన్నప్పుడు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇవ్వొచ్చుగా అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఇతర నటులు సక్సెస్ అయితే ఈ కుటుంబమంతా ఈర్ష్యతో రగిలిపోతుంది అని పెదవి విరుస్తున్నారు. ఇకపోతే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: 'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది -
సూర్యతో జోడీ?
హీరో సూర్య(Suriya) సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్గా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్నగర్ సర్కిల్స్లో. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని తెలిసింది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, మే నుంచి రెగ్యులర్ షూటింగ్ను ఆరంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓ మల్టీస్టారర్ అని, సూర్యతో పాటు మరో హీరో కూడా నటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. -
మా రెమ్యునరేషన్తోనే ఈ బిల్డింగ్ నిర్మించాం: సూర్య
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు అందరూ చెన్నైలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబ ఆద్వర్యంలో నడుస్తున్న అగరం ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి నటుడు శివకుమార్, సోదరి బృందా, జ్యోతికతో పాటు వారి పిల్లలు అందరూ పాల్గొన్నారు. సుమారు ఏడాది తర్వాత ఈ కార్యక్రమం కోసం ముంబై నుండి చెన్నైకి జ్యోతిక పిల్లలతో పాటు వచ్చారు. అగరం ఫౌండేషన్ అనేది నటుడు సూర్య నేతృత్వంలోని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. గత 20 సంవత్సరాలుగా, అతని కుటుంబ సభ్యులు అట్టడుగు ఆర్థిక వర్గాల విద్యార్థులకు వారి కలలను సాధించడంలో సహాయం చేస్తున్నారు. చెన్నైలో ఫౌండేషన్ కొత్త కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. తమిళంలో అగరం అంటే 'అ'కారం... అంటే తొలి అక్షరం అని సూర్య తెలిపారు. ఈ ఫౌండేషన్కు తెలుగువారు భారీ స్థాయిలో విరాళాలు అందించినట్లు గతంలో సూర్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి తమ సొంత డబ్బుతో నిర్మించామన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు కష్టానికి ప్రతిఫలం ఈ భవనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పిల్లల విద్య కోసం తమ సంస్థకు వచ్చిన విరాళాల నుంచి ఒక్క రూపాయి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం ఉపయోగించలేదన్నారు. సినిమా నుంచి తమకు వచ్చిన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి నిర్మించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 700-800 మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్లో ఈ సంఖ్యను పెంచేందుకే ఈ భవన నిర్మాణం చేశామని ఆయన తెలిపారు.సూర్య తండ్రి శివకుమార్ అతని కుటుంబ సభ్యులు చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. ఈ ఫోటోలలో ఆయన సతీమణి లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం నెట్టింట వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. • Exclusive - @Karthi_Offl , @Suriya_offl With Family At Inaugration Of New @agaramvision 's Office | #Karthi #VaaVaathiyaar #Sardar2 #Karthi29 #Kaithi2 #Retro pic.twitter.com/w5qvDxukqW— MKB Santhosh (@MKB_SANTHOSH23) February 16, 2025 -
సూర్యతో తండేల్ 2..!
-
అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)
-
వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటనతో మెప్పించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది. పివీఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఈనెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్లో విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం " అని అన్నారు. -
ప్రేమ,రక్తపాతం 'సూర్య' రెట్రో తెలుగు టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా తెలుగు టీజర్ విడుదలైంది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్ అంశాలతో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్కి చాలా కీలకం. -
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
లుక్ మార్చిన బుట్టబొమ్మ
-
కంగువా బీజీఎంపై విమర్శలు.. దేవీశ్రీ ప్రసాద్ రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్గా నిలిచిందిఅయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.ఆస్కార్ బరిలో కంగువా..అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది. -
Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’
క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.‘లాపతా లేడీస్’ నో ఎంట్రీఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్కు షార్ట్ లిస్ట్కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్లో అధికారికంగా చోటు సాధించింది.ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలుఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది. BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025 -
సూర్య 'రెట్రో' సినిమా.. అలరిస్తున్న టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈసారి అదిరిపోయే మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గతనెలలో 'కంగువ' (Kanguva Movie) మూవీతో వచ్చాడు. ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'బాహుబలి'లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేశారు. దానికి 'రెట్రో' (Retro Movie) అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డీ గ్లామర్ లుక్తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్కి చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో మిగతా భాషల టీజర్స్ విడుదల చేస్తారేమో?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) -
గ్రీన్ సిగ్నల్?
సూర్య మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని పూర్తి చేశారు సూర్య. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల సూర్యకు ఓ కథ చెప్పారట.వెంకీ ఇప్పటివరకూ ధనుష్తో ‘సార్’, దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. తొలి, మలి చిత్రాల్లో ఉన్నట్లుగానే సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. -
త్రిషకు 22 ఏళ్లు పూర్తి.. సూర్యతో కేక్ కట్ చేసిన బ్యూటీ
చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వారి లక్షణం.. నటి త్రిష కూడా తన కెరీర్లో ఇదే చేసింది. 2002లో సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత విజయ్ సరసన నటించిన గిల్లీ, విక్రమ్ జంటగా చేసిన స్వామి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆపై తెలుగులో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్రిష బహుభాషా నటిగా మారిపోయారు. ఆ తర్వాత హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. అలా ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకిగా రాణిస్తున్న త్రిష అసలు వయసు 41 ఏళ్లు. కథానాయకి వయసు 22 ఏళ్లు. ఇప్పటికీ పలు భాషల్లో స్టార్ హీరోలతో జతకడుతూ ఆగ్ర కథానాయకిగా రాణించటం విశేషం. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్న నటి త్రిష, నటుడు కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ, సూర్య సరసన ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంతో పాటు మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్, టోవినో థామస్ కు జంటగా ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగు పదులు దాటినా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న త్రిష శుక్రవారంతో కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో ‘‘నేను కథానాయకిగా పరిచయమై 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రేక్షకులైన మీ వల్లే ఇదంతా జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ ఇకపోతే ఈమె శుక్రవారం సూర్య సరసన నటిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ చిత్ర యూనిట్ త్రిష కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. -
కంగువ నష్టాలు.. సూర్య నుంచి నిర్మాతకు బిగ్ ఆఫర్
సినిమా రంగంలో చిత్రాలను నిర్మించి నష్టాల పాలైన నిర్మాతలే ఎక్కువగా ఉంటారనేది నిజమని చెప్పవచ్చు. ఇందులో లాభాలు పొందేది తక్కువ మందే. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తేడా ఉండదు. కానీ, భారీ చిత్రాలతో ఎక్కువ పొగొట్టుకుంటారు. ఈ క్రమంలో నిర్మాతల కష్టాల గురించి ఆలోచించే నటీనటులు చాలా తక్కువ. నటించామా.. పారితోషికం అందిందా అన్నట్లు చాలా మంది తీరు ఉంటుంది. అయితే నటుడు సూర్యలాంటి వారు అందుకు చాలా భిన్నంగా ఉంటారు. సూర్య నిర్మాత కూడా కావడంతో తన నిర్మాతలపై కొంచెం ఎక్కువ అభిమానం చూపిస్తారనే చెప్పాలి. అందుకు చిన్న ఉదాహరణ ఆయన ఇటీవల నటించిన చిత్రం కంగువనే కారణం. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్రాజా భారీ ఎత్తున నిర్మించారు. కోలీవుడ్లో చాలా కాలం తరువాత 3డీ ఫార్మాట్లో రూపొందిన చిత్రం ఇది. నటుడు సూర్య ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదనే విమర్శలను మూట కట్టుకుంది. సుమారు వెయ్యేళ్ల క్రితం జరిగే కథను ఈ కాలానికి ముడిపెట్టి రూపొందించడంతో ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారేమో. ఏదైమైనా ఈ చిత్రం విషయంలో నటుడు సూర్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.కంగువ చిత్రం నష్టాన్ని భర్తీ చేయడానికి నటుడు సూర్య నిర్మాత కేఈ జ్ఞానవేల్రాజాకు మరో చిత్రం చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కంగువ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ కోసమైనా బాగా ఆడాలని నటుడు సూర్య ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పారన్నది గమనార్హం. ఆయన స్టూడియో గ్రీన్ సంస్థలో మరో చిత్రం చేయడానికి మంచి కథ కోసం చూస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రాన్ని చేస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేస్తారని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు చిత్రం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ త్వరలో రానున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ'
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ సినిమాని.. కోలీవుడ్ 'బాహుబలి' అని అన్నారు. తీరా చూస్తే రియాలిటీలో తేడా కొట్టేసింది. థియేటర్లలో అయితే పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు కానీ ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు. ఇప్పుడు ఈ చిత్రం అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: రోహిణితో పాటు విష్ణుప్రియ ఎలిమినేట్!)తెలుగులో 'శౌర్యం', 'దరువు' తదితర చిత్రాలతో దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న శివ.. తమిళంలోనూ అజిత్ హీరోగా పలు సినిమాలు తీశాడు. అయితే ఇతడిని నమ్మి 'కంగువ' సినిమా చేశాడు సూర్య. కానీ కష్టపడ్డప్పటికీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.నవంబర్ 14న థియేటర్లలో రిలీజైతే.. ఇప్పుడు అంటే డిసెంబరు 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'కంగువ' వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెరన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే మరీ మూడు వారాలకే ఇలా డిజిటల్గా అందుబాటులోకి రావడం విశేషం.(ఇదీ చదవండి: రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్తో పాటు డ్యాన్స్లోనూ) -
ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్
ఓటీటీలో కంగువా విడుదల ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆపై నిర్మాతలకు కూడా ఎక్కువ నష్టాలనే మిగిల్చిన చిత్రంగా కోలీవుడ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే, తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.కంగువ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఇప్పటకే చాలా తేదీలు వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ తప్పు అంటూ ఆ తేదీలకంటే ముందే కంగువ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. డిసెంబర్ 8న ఓటీటీలో కంగువ విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు.ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
'కంగువ' ఫ్లాప్.. విపరీతమైన దైవభక్తిలో జ్యోతిక-సూర్య
తమిళంలో ఇండస్ట్రీలో సూర్య-జ్యోతిక క్యూట్ కపుల్ అని చెప్పొచ్చు. ద్దగా వివాదాల జోలికి పోకుండా తమ పనేదో తమది అన్నట్లు ఉంటారు. గత కొన్నాళ్లుగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిక.. దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాల్ని సందర్శిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమెపై పాత వీడియోల తవ్వి తీసి మరీ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.2020లో ఓ అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడుతూ.. దేవాలయాలకు పెయింట్స్ వేయడం, మిగతా ఖర్చులు వృథా. అదే డబ్బుని ఆస్పత్రులు, స్కూల్స్ కోసం ఉపయోగించొచ్చు కదా అని మాట్లాడింది. అయితే డబ్బుని హాస్పిటల్స్, స్కూల్స్ కోసం ఉపయోగించాలని చెప్పడం బాగుంది కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల కోసం అంత ఖర్చు ఎందుకని చెప్పడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్)అప్పట్లో అసలు గుడికి ఎందుకు వెళ్లడం అనే స్టేట్మెంట్ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా భర్త సూర్యతో కలిసి కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంది. చండీకా యాగం కూడా చేయించింది. కొన్నిరోజుల క్రితం ఇదే దేవాలయానికి ఎన్టీఆర్ కూడా వెళ్లాడు. తాజాగా బుధవారం ఉదయం సుప్రభాత సేవ టైంలో జ్యోతిక.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంది.పెద్దగా బయటే కనిపించని జ్యోతిక.. ఇలా వరసగా ప్రముఖ దేవాలయాల్ని సందర్శించడం కాస్త విచిత్రమే. దీంతో గతంలో ఈమె మాట్లాడిన వీడియోలని బయటకు తీసి.. పలువురు నెటిజన్లు జ్యోతికని ట్రోల్ చేస్తున్నారు. కర్మ.. ఎవరినీ వదిలిపెట్టదు అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా సూర్య 'కంగువ' సినిమా.. థియేటర్లలో రిలీజై ఫ్లాప్ అయింది. భారీ నష్టాలు వచ్చాయి. మరి సినిమా ఫ్లాప్ అయిందని జ్యోతిక-సూర్య.. దేవాలయాల్ని సందర్శిస్తున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)Three years ago Jo criticised people for spending in TemplesAfter a massive smack for #Kanguva , #Suriya started visiting temples. Both #Suriya & #Jyothika performing Chandi homam in Kollur Mookambikai kovil.#Karma speaks @Suriya_offl , hope this is a lesson for your family pic.twitter.com/lG6fcTVToS— akindtamizhan (@akindtamizhan) November 26, 2024Jyothika in Tirupati. pic.twitter.com/zq9HRnD0se— Manobala Vijayabalan (@ManobalaV) November 27, 2024 -
ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్ అప్డేట్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్ను అత్యధిక ధరకు అమెజాన్ దక్కించుకుంది. దీంతో ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.కంగువా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ప్రైమ్ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు. -
వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్ సాంగ్ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్
చిత్రపరిశ్రమలో ఐటమ్ సాంగ్స్కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్ హీరో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్ను పూర్తి చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కథా చిత్రంలో ఐటమ్ సాంగ్లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్ సాంగ్తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. -
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్హాసన్తో ‘విక్రమ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్ని విలన్గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్లోనే ది బెస్ట్ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది.మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.12 నిమిషాల తగ్గింపుకంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. -
కంగువ ఎఫెక్ట్.. సూర్య కొత్త సినిమాలపై పడుతుందా..?
-
'కంగువా'పై విమర్శలు.. కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్
సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై డివైడ్ టాక్ రావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కంగువా మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్పిన మాట నిజమేనని జ్యోతిక కూడా తెలిపింది. సినిమా ప్రారంభమే కాస్త బోర్గా ఉండటంతో కంగువాపై భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు.కంగువా చిత్రం రెండో భాగం చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి. ఫైనల్గా మొదటి అరగంటపై ఎక్కువ విమర్శలు రావడంతో అందులో నుంచి 12 నిమిషాల నిడివిని కత్తిరించారు. ఇప్పుడు ఈ చిత్రం రన్టైమ్ 2.22గంటలు మాత్రమే ఉండనుంది. ఈ సినిమా సౌండ్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిని కూడా రెండో రోజుకే టెక్నికల్గా సరిచేశారు. అదేరోజు సినిమా రన్టైమ్ కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు.ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్తో ఈ కాలానికి సంబంధించిన సన్నివేశాల్ని ట్రిమ్ చేశారని తెలుస్తోంది. గోవా ఎపిసోడ్ కాస్త ఎక్కువ బోరింగ్గా ఉండటంతో చాలా సీన్లు లేపేశారని సమాచారం. వెయ్యేళ్ల కిందటి కథకు, వర్తమాన కాలానికి లింక్ పెడుతు కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. దిశా పటానీ చిన్న పాత్రలో మెరిసినప్పటికీ తన గ్లామర్తో ఫిదా చేస్తుంది. బాబీ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్తో దీనిని నిర్మించారు. -
దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.కంగువా సినిమాతో కోలీవుడ్లో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది. సీన్స్ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి. బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.హీరోయిన్ దిశా పటాని గురించి నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. -
బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య, విక్రమ్
-
'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక
కోలీవుడ్ 'బాహుబలి'గా ప్రచారం చేసిన సూర్య 'కంగువ'.. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్తో రిలీజైన ఈ సినిమాకు మొదటి సీన్ తర్వాత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీలో ప్లస్సులు కంటే మైనస్సులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూర్య భార్య జ్యోతిక ఇప్పుడు 'కంగువ'పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది. కావాలనే మా మూవీని తొక్కేస్తున్నారని అంటోంది.(ఇదీ చదవండి: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్)జ్యోతిక ఏమంది?'నటుడు సూర్య భార్యగా కాదు నేను ఈ నోట్ని జ్యోతికగా, ఓ సినీ ప్రేక్షకురాలిగా రాస్తున్నాను. కంగువ- ఓ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు. మ్యూజిక్ కూడా లౌడ్గా అనిపించింది. మన సినిమాల్లో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇలాంటి మూవీస్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు.''మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయా. వీళ్లెవరు కూడా అవే పాత స్టోరీలతో తీసిన సినిమాలకు, అమ్మాయిల వెంటపడే, డబుల్ మీనింగ్స్ ఉండే, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే మూవీస్కి ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదు. మరి 'కంగువ' పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్.. రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు కనిపించలేదా?'(ఇదీ చదవండి: గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్లో 'పుష్ప 2' క్రేజ్)'తొలిరోజే 'కంగువ'పై నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. తొలి షో పూర్తవకముందే ఇలా చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాని కావాలని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్, కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. నెగిటివ్గా మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు' అని జ్యోతిక ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజైన 'కంగువ'సినిమాకు 2 రోజుల్లో రూ.89.32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.2000 కోట్ల వసూళ్లు వస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
మట్కా,కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. భారీ అంచనాలతో ఆయన నటించిన 'మట్కా' చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ కెరియర్లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'మట్కా' రికార్డ్ క్రియేట్ చేసింది.'పలాస' సినిమాతో మెప్పించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సుమారు రూ. 40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. 'మట్కా' టీజర్, ట్రైలర్తో ఆకట్టుకునేలా ఉండటం, వరుణ్ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఆసక్తిరేకెత్తించే సీన్స్ పెద్దగా సినిమాలో కనిపించలేదు. దీంతో 'మట్కా' మొదటిరోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కనీసం రూ. 2 కోట్లు అయినా రావడం కష్టమని చెప్పవచ్చు.కంగువా కలెక్షన్స్సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం 'కంగవ'. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. అయితే, కంగువా మొదటిరోజు రూ. 58.62 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కంగువా నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు తప్పవని చెప్పవచ్చు. -
'కంగువా' రియల్ వ్యూ...
-
కంగువ లో నటించి సర్ ప్రైజ్ ఇచ్చిన కార్తీ..
-
బాక్సాఫీస్ వద్ద కంగువా.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్స్ సూర్య ఫ్యాన్స్ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. దసరాకు రావాల్సిన కంగువా నెల రోజుల ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కంగువా తొలిరోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే కంగువాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిసైడ్ అయిపోయారు. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. కానీ తొలిరోజు వసూళ్లూ చూస్తే.. ఊహించనిదానికి భిన్నంగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ కంగువా అంచనాలను మించి రాణించిందా? లేదా అన్నది కలెక్షన్స్ చూస్తే తెలిసిపోతుంది.తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్గా కంగువా నిలిచింది. గతంలో ఆయన నటించిన సింగం-2 తొలిరోజు రూ.12 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తాజాగా కంగువా ఆ రికార్డ్ను అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తొలిరోజు 40శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్, విజయ్ ది గోట్ చిత్రాలు మొదటిరోజు 50 నుంచి 60శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి.అయితే వసూళ్ల పరంగా చూస్తే కంగువా కోలీవుడ్లో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో ది గోట్, వెట్టయాన్ చిత్రాలను అధిగమించలేకపోయింది. మొదటి రోజే అంచనాలను అందుకోవడంతో కంగువా విఫలమైందని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. సూర్య అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం(రూ.350 కోట్లు) కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. మరి రాబోయే రోజుల్లో కంగువా కాసుల వర్షం కురిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.కోలీవుడ్లో ఓపెనింగ్ డే కలెక్షన్స్-2024ది గోట్- రూ.39.15 కోట్లువేట్టయాన్- రూ.27.75 కోట్లుకంగువా- రూ.22 కోట్లుఅమరన్- రూ.17 కోట్లుఇండియన్2- రూ.16.5 కోట్లుతంగలాన్- రూ.12.4 కోట్లురాయన్- రూ.11.85 కోట్లుకెప్టెన్ మిల్లర్- రూ.8.05 కోట్లుకల్కి 2898 ఏడీ- రూ.4.5 కోట్లుఅరణ్మనై 4- రూ.4.15 కోట్లు -
సూర్య 'కంగువా'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధ్యమేనా?
సూర్య 'కంగువా' సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. అయితే రిలీజ్కి కొన్నాళ్ల ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తోందని, డౌట్ లేదంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లోనే ఈ మాటలు కాస్త ఓవర్గా అనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మరి 'కంగువ' ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 2000 కోట్లు వసూళ్లు అయ్యే పనేనా?కోలీవుడ్ 'బాహుబలి' అని చెప్పి 'కంగువా' సినిమాని ప్రచారం చేశారు. ట్రైలర్ చూస్తే వర్కౌట్ అయ్యే కంటెంట్ అనే చాలామంది అనుకున్నారు. కానీ రియాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. టీమ్ అంతా కష్టపడ్డారు గానీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో తీసికట్టుగా వ్యవహరించారు. ప్రస్తుత జనరేషన్ సూర్యకి సంబంధించిన 20-25 నిమిషాల ఎపిసోడ్ సినిమా మొదటలో ఉంటుంది. ఇదైతే మరీ చిరాకు పుట్టేంచేలా ఉంటుంది.(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)పీరియాడిక సెటప్లో ఉంటే సూర్య గెటప్ బాగానే ఉంది. కానీ ఆ సీన్లు మరీ సాగదీతగా, ఆడియెన్స్కి కనెక్ట్ కాని విధంగా ఉన్నాయి. స్క్రీన్పై యుద్ధాలు జరుగుతుంటాయి. యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులకు పెద్దగా ఫీలవరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. వీకెండ్ వరకు అంటే ఏదోలా మేనేజ్ అయిపోతుంది గానీ ఆ తర్వాత మాత్రం ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే దానిబట్టి ఉంటుంది.సూర్య 'కంగువా' చిత్రానికి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.50 కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలానే తక్కువ నంబర్స్ వస్తే రూ.2000 కోట్లు కాదు కదా.. లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు రావడం కూడా కష్టమే! ఇప్పటికే తెలుగులో ఈ మార్క్ చేరుకున్న సినిమాలు బోలెడున్నాయి. తమిళ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల వసూళ్ల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో?(ఇదీ చదవండి: సూర్య 'కంగువా' ఏ ఓటీటీకి రానుందంటే?) -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్గా ఉన్నాయి. -
కంగువ టార్గెట్ 1000 కోట్లు
-
సూర్య భారీ యాక్షన్ మూవీ.. కంగువా ఏ ఓటీటీకి రానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో నటించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కంగువా. ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచే కంగువాకు పాజిటివ్ టాక్ వస్తోంది.అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్కు సంబంధించి ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. కంగువా ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది. తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం. అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కంగువా రెమ్యునరేషన్..కంగువా కోసం సూర్య ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా బడ్జెట్లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్కు కేటాయించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. -
Kanguva Review: ‘కంగువా’ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ పీయాడిక్ యాక్షన్ ఫిల్మ్లో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.కంగువా కథేంటి? ఎలా ఉంది? సూర్య ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో కంగువా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సూర్య యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. శివ టేకింగ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు, వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ అదరగొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు. #Kanguva Review🌟🌟🌟🌟It's an EPIC BLOCKBUSTER 🔥 💥- #Suriya & #BobbyDeol's best movie till date and #DishaPatani also looks so hot🥵💥🔥👌- Top Tier BGM, faceoff Sequence Execution and VFX & visuals Top notch👍🔥✨🔥#KanguvaFromNov14#KanguvaBookings pic.twitter.com/6xjzx0SmVm— Ahmy (@ahmy30) November 14, 2024కంగువా బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య, బాబీ డియోల్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్. దిశా పటానీ లుక్ హాట్గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం అదరగొట్టేశాడు. వీఎఫ్ఎక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Kanguva Review🏆🏆🏆An engaging screenplay & solid performances from @Suriya_offl 😨💥Face off scenes Adrenaline pump💉🥵Can’t wait for #Kanguva2#BobbyDeol As usual nailed with his performance, He’s A BEAST🔥@ThisIsDSP you’re a musical magician🥵Overall - 4.25/ 5 ⭐️ pic.twitter.com/SI2s22zRTF— Lets OTT x CINEMA (@LetsOTTxCinema) November 13, 2024 స్క్రీన్ప్లే ఎంగేజింగ్గా ఉంది. సూర్య తన నటన అదిరిపోయింది. ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి. కంగువా 2 కోసం ఆగలేకపోతున్నాం. బాబీడియోల్ ఎప్పటిమాదిరే తనదైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది’అంటూ ఓ నెటిజన్ 4.25/5 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva is a below par fantasy action film that had a story with good potential but is executed in a clumsy way. Surya does well in his role and his efforts should be appreciated but it’s hard to save a script like this with just a performance. The film has a few decent…— Venky Reviews (@venkyreviews) November 14, 2024 కంగువా ఓ యావరేజ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్. ఎమోషనల్ మిస్ అయింది. డైరెక్టర్ శివ ఫస్టాఫ్ స్క్రీన్ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva - Honest Review 👍Positive : - Theatre ambience 👌- Safe Parking lot 💥- Unlimited Popcorn 🍿- Proper Sound system ♥️- Perfect AC temperature 🥶- Proper seating with correct level adjustments ✅Negative : -- Full Movie 👎👎— ... (@its_me_001) November 14, 2024Movie vera level🔥🥵🏆Siva has made a strong comeback! It’s a must-watch in theaters for its stunning visuals. As always, Suriya’s acting is outstanding.DSP BGM kangu kangu kanguvaaa🔥Racey Screen Play🔥🔥🔥Blockbuster #Kanguva 🔥🔥🔥🏆 pic.twitter.com/cLJ1qYZwAv— name_illa (@name_illainga) November 14, 2024First HalfFrancis Portion - 😐👎Kamguva Portion - 🙌Above avg 😐#Kanguva— Ciril_Thomas_997 (@Ciril_Thomas_97) November 14, 2024worth watching kanguva best ever tamil cinema . made tamil cinema at its peak 🔥🔥🔥🔥🥵🥵VFX , bgm , casting , dialogue delievery , surya 😱😱😱😱#Kanguva #KanguvaBookings #KanguvaFDFS #Surya #SiruthaiSiva #DSP #GnanavelRaja 🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳— karl marx (@vens1917) November 14, 2024 -
సూర్య భారీ బడ్జెట్ చిత్రం.. ఆ రాష్ట్రంలో ఆలస్యంగా మార్నింగ్ షోలు!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ మరికొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే మొదటి రోజు తమిళనాడు ప్రభుత్వం ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులిచ్చింది. అయితే మొదటి షో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. చివరి ఐదో షోను అర్ధరాత్రి 2 గంటలకు ముగించాలని ఆదేశించింది. ప్రేక్షకులకు అవసరమైన భద్రతా చర్యలను పాటించాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను కోరింది.అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు కంగువా షోలు మొదలు కానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్,కేరళ రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా మార్నింగ్ షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళలో మాత్రం తెల్లవారుజామున 4 నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అవుతాయని మేకర్స్ వెల్లడించారు.కాగా.. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాని దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద కీలక పాత్రల్లో నటించారు. -
ఆమెతో మళ్లీ కలిసి నటించాలని ఉంది.. కానీ, ఒక కండీషన్: సూర్య
నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటించిన కంగువ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. నటి దిశాపటాని నాయకిగా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటించారు. శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది. కాగా నటుడు సూర్య తన 44వ చిత్ర షూటింగ్ను కూడా పూర్తి చేశారు. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇదే క్రమంలో సూర్య తన 45 చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్ పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం కంగవ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య ఓ భేటీలో పేర్కొంటూ తన భార్య జ్యోతికతో కలిసి మళ్లీ నటించాలన్న కోరిక కలగానే మారిందన్నారు. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. అయితే,ఆ సినిమా కథకు జ్యోతిక అయితేనే సెట్ అవుతుంది అనేలా ఉండాలి కానీ, ఏదో సూర్య చెప్పాడని ఇరికించే ప్రయత్నం చేయకూడదన్నారు. తాను మాత్రం ఏ దర్శకుడిని తమ కోసం కథను సిద్ధం చేయమని కోరనన్నారు. సూర్య తన భార్యతో కలిసి మళ్లీ నటించాలన్న కోరికను వ్యక్తం చేయడంతో దర్శక, నిర్మాతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం నటి జ్యోతిక ఉమెన్స్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈమె తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారన్నది గమనార్హం. కాగా సూర్య, జ్యోతిక కెరీర్ ప్రారంభంలో పూవెల్లామ్ కేట్టుప్పార్, ఉయి రిలే కలందదు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, సిల్ల న్ను ఒరు కాదల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. -
'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు మేకర్స్.తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈవెంట్లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!)కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్ఫుల్ యాక్టర్గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.ముంబైలో జ్యోతిక, సూర్యకాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. -
'కంగువ' టీమ్కు గుడ్న్యూస్ చెప్పిన మద్రాసు హైకోర్టు
సౌత్ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా నిర్మాతలకు మద్రాస్ కోర్టు శుభవార్త చెప్పింది. కంగువ విడుదలను నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన కోర్టు ఫైనల్ తీర్పును వెల్లడించింది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని క్లారిటి ఇచ్చింది. దీంతో ముందుగా అనుకున్న సమయానికే కంగువ విడుదల కానుందని ప్రకటించింది.కంగువ నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పలు చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. అయితే, తాజాగా జరిగిన విచారణలో స్టూడియో గ్రీన్ కంపెనీ తరపున ఉన్న న్యాయవాది మాట్లాడుతూ.. రిలయన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం డబ్బు పూర్తిగా చెల్లించామన్నారు. దీంతో లాయర్ చెప్పిన మాటలను రికార్డ్ చేసుకున్న న్యాయస్థానం కంగువ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపింది. జస్టిస్ అబ్దుల్ కుద్దూస్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. నవంబర్ 8న రియలన్స్కు కేఈ.జ్ఞానవేల్ రాజా రూ. 55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల స్క్రీన్స్లో దీన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2,500 స్క్రీన్స్లలో ఈ చిత్రం విడుదలైతే.. ఉత్తరాదిలో 3,500 స్క్రీన్స్లలో విడుదల కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా కంగువ ఉంది. -
టాలీవుడ్ దర్శక-నిర్మాతలపై కన్నేసిన పర భాష హీరోలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ ముందు వరుసలో ఉంది. స్టార్ హీరోల తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. కథాబలం ఉన్న సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలా ఇతర భాషల హీరోల సినిమాలు కూడా టాలీవుడ్లో విడుదలై, మంచి సినిమాలు సూపర్హిట్స్గా నిలుస్తున్నాయి. దీంతో కొందరు హీరోలు తెలుగు నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా క్షేమంగా రండి లాభంగా వెళ్లండి అంటూ ఆదరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...ఆకాశంలో ఒక తార!‘మహానటి, సీతారామం’, ఇటీవల ‘లక్కీభాస్కర్’ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగులో దుల్కర్ చేసిన ఈ మూడు సినిమాలు సూపర్హిట్స్ కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్ . ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారాయన. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమాస్, లైట్ బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ‘కాంత’ అనే పీరియాడికల్ ఫిల్మ్లోనూ దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని మరో లీడ్ రోల్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ అట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాను సంగీతం అందిస్తున్నారు. కాగా దుల్కర్ తెలుగు నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.రాజమౌళి సమర్పణలో...అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో తెలుగు ఆడియన్స్ను మెప్పించారు మలయాళ హీరో ఫాహద్ఫాజిల్. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోనూ ఫాహద్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఫాహద్ హీరోగా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్ ’ అనే రెండు తెలుగు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, కార్తికేయ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఆక్సిజన్ ’ సినిమాతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’ సినిమాల ఫస్ట్లుక్స్ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత ఈ సినిమాల గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.జై హనుమాన్‘కాంతార’ సినిమాతో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతార: ఛాప్టర్ 1’తో బిజీగా ఉన్నారు రిషబ్శెట్టి. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే జై హనుమాన్.ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్కు విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్ ’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్ ’ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో భాగంగా ‘జై హను మాన్ ’ అనే తెలుగు సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు రిషబ్. ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో లీడ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ‘జై హనుమాన్’ సినిమాను నిర్మిస్తున్నారు.యాక్షన్ ‘జాట్’బాలీవుడ్లోని సీనియర్ హీరోల్లో ఒకరైన సన్నీ డియోల్ తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘జాట్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పీటర్ హెయిన్స్, అన్ల అరసు, రామ్–లక్ష్మణ్, వెంకట్.. ఇలా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు అసోసియేట్ కావడం చూస్తే యాక్షన్ సీక్వెన్స్లు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయని ఊహించవచ్చు. రణ్దీప్ హుడా, వినీత్కుమార్, సయామీ ఖేర్, రెజీనా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ‘జాట్’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ‘గదర్ 2’ వంటి బ్లాక్బస్టర్ కొట్టిన వెంటనే సన్నీడియోల్ తెలుగులో ‘జాట్’ చేయడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ‘జాట్’ కాకుండా హిందీలో ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీడియోల్. ‘జాట్’ విజయం సాధిస్తే ఆయన తదుపరి సినిమాలైన ‘బోర్డర్ 2, లాహోర్ 1947’ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు.కంగువాహీరో సూర్య తెలుగులోనూ పాపులర్. ఆయన తమిళ చిత్రాలు ఎప్పటికప్పుడు తెలుగులో అనువాదం అవుతుంటాయి. వీలైనప్పుడు నేరుగా తెలుగు సినిమాల్లోనూ సూర్య నటిస్తారు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ ‘కంగువా’. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్స్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు భిన్నమైన రోల్స్లో సూర్య నటించారు. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, బాబీడియోల్ ఇతర పాత్రలు చేశారు. ఈ నెల 14న ‘కంగువా’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. అలాగే గీతాఆర్ట్స్ సంస్థలో సూర్య ‘గజిని 2’ సినిమా చేస్తారని, అలాగే బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.కుబేరధనుష్కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే ధనుష్ తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ‘సార్’ చిత్రం వందకోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో వెంటనే తెలుగు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ‘కుబేర’. శేఖర్కమ్ముల దర్శ కత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున మరో లీడ్ రోల్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 15న ‘కుబేర’ సినిమా టీజర్ విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరహాలో మరికొంతమంది ఇతర భాషల హీరోలు టాలీవుడ్ దర్శక– నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆసక్తి చూపిస్తూ, కథలు వింటున్నారు. -
మగధీరకి కంగువకి లింక్ ఏంటి...
-
'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్గా రాజమౌళి ఫొటో
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)'కంగువ' టీమ్కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)"In our mobile phones we keep Family photos as wallpaper, but Gnanavel has your photo as wallpaper. You have paved the way for #Kanguva. It will be like an Oscars If you shake hands with Gnanavel"- #Suriyapic.twitter.com/fJ7GKri4mT— AmuthaBharathi (@CinemaWithAB) November 7, 2024 -
హైదరాబాద్లో ఘనంగా ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
కంగువని థియేటర్స్లోనే చూడాలి: ఎస్ఎస్ రాజమౌళి
‘‘కంగువ’ టీమ్ పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను.కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్ వెట్రి పళనిస్వామి, రైటర్ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు. -
కంగువలో కలరింగ్ తగ్గిందా..!
-
సూర్య ‘కంగువ’ మూవీ HD ఫోటోలు
-
సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం కంగువా. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోన్న కంగువా చిత్రంపై నిర్మాత ధనంజయన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కంగువా మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న నిర్మాత ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటనతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ధనంజయన్ మాట్లాడుతూ..' కంగువా విడుదల కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తమిళనాడులో ఇప్పటికే 700లకు పైగా స్క్రీన్లు సిద్ధం చేశాం. ఒక్క సౌత్లోనే 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లు ప్లాన్ చేశాం. ఉత్తర భారతదేశంలో దాదాపు 3,000 నుంచి 3,500 వరకు థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ విషయం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న పదివేల కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కానుంది' అని అన్నారు.కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య.. బాలకృష్ణ 'అన్స్టాపబుల్' షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. దాదాపు నాలుగున్న నిమిషాల ఈ వీడియోలో సూర్యతో పాటు 'కంగువ' దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. కంగువ సినిమా.. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)సూర్యని ఫుల్గా ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ.. ఎవరికీ తెలియని విషయాల్ని కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే.. వద్దు సర్ ఇప్పుడు పెళ్లయిపోయింది అని సూర్య అన్నాడు. కానీ తమ్ముడు కార్తితో ఫోన్ మాట్లాడిన టైంలో మాత్రం ఓ హీరోయిన్పై అన్నయ్యకు క్రష్ ఉందని చెప్పిన కార్తీ.. బాలయ్యకే షాకిచ్చాడు.'అగరం' ఫౌండేషన్ స్థాపించి ఎందరో విద్యార్థులకు సూర్య అండగా నిలుస్తున్నాడు. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు 'అన్స్టాపబుల్' షోలోనూ ఆ వీడియో ప్లే చేయగా.. సూర్య మళ్లీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం (నవంబర్ 8న) రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?) -
డిల్లీతో రోలెక్స్
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. -
'ఖైదీ' సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరియర్లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్గా మెరిశారు. అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!
రీసెంట్ టైంలో తెలుగులో పెద్ద సినిమాలు కొన్నింటికి వేకువజామున షోలు పడుతున్నాయి. 'గుంటూరు కారం', 'సలార్', 'దేవర' చిత్రాలు సూర్యుడు రాకముందే ప్రేక్షకుల్ని పలకరించేశాయి. ఇవంటే తెలుగు సినిమాలు కాబట్టి ప్లాన్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రం 'కంగువ' కూడా అదే ఫాలో అయిపోతోంది.తమిళ హీరో సూర్య చేసిన పాన్ ఇండియా మూవీ 'కంగువ'. నిర్మాత అయితే ఏకంగా రూ.2000 కోట్లు వచ్చేస్తాయనే ధీమాతో ఉన్నారు. బహుశా కంటెంట్పై నమ్మకంతో ఇలా అనుండొచ్చు. అయితే ఇప్పుడు అదే నమ్మకంతో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో వేకువజామున 4 గంటల నుంచే షోలు పడనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థే ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)కాకపోతే తమిళనాడు ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతి రావాల్సి ఉంది. గతంలో తమిళనాడులోనూ ఎర్లీ మార్నింగ్ షోలు వేసేవారు. కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఒకరిద్దరు అభిమానులు చనిపోయారు. అప్పటినుంచి తమిళనాడులో వేకువజామున షోలు వేయట్లేదు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 'కంగువ' కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్సే 'కంగువ'ని మొదట చూసేస్తారు!నవంబర్ 14న 'కంగువ' థియేటర్లలోకి రానుంది. అయితే కోర్టులో రిలయన్స్ సంస్థ కేసు పెట్టింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని, అది తిరిగిచ్చేవరకు 'కంగువ' విడుదల నిలుపుదల చేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఇది విచారణ సాగుతోంది. ఈ సమస్య పరిష్కారమైతే ఓకే. లేదంటే మాత్రం వాయిదా తప్పదేమో?(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: నయని పావని ఎలిమినేట్.. ఆ కారణం వల్లే!)#Kanguva the most expected magnum opus, shows will open in Kerala, Karnataka, Andhra Pradesh & Telangana from 4 am onwards on 14th November. We have applied with TN Government for early morning shows for 14th & will update once we get the approval for the same.… pic.twitter.com/pMNsDCOG1Z— Studio Green (@StudioGreen2) November 2, 2024 -
ముంబైకి షిఫ్ట్ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య
కోలీవుడ్లో బెస్ట్ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సూర్య చెప్పారు.తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్లో శ్రీకాంత్, కాదల్- ది కోర్, సైతాన్ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది. మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు. -
'అమ్మ, నాన్న పెట్టిన పేరు అదే'.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్లో ఫుల్ బిజీగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. శివ దర్శకత్వంలో వస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కంగువా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఇవాళ వైజాగ్లో కంగువా చిత్రయూనిట్ సభ్యులు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ శివ, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైజాగ్ సిటీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని అన్నారు. మా అమ్మ, నాన్నలకు ఎంతో ఇష్టమైన నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ..'వైజాగ్ సిటీ నాకు చాలా ప్రత్యేకం. అంతేకాదు ఈ రోజు నాకు స్పెషల్ డే. 2015లో సింగం-3 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అమ్మ, నాన్న వైజాగ్కు వచ్చారు. కానీ ఆ తర్వాత నా సినిమా షూటింగ్స్ అప్పుడు కూడా ఇద్దరు వచ్చేవారు. ఇక్కడ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాతో అన్నారు. నాకు మా అమ్మ, నాన్న పెట్టిన పేరు శరవణన్. సినిమాల్లోకి వచ్చాకే నా పేరు సూర్యగా మారింది. నా పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగువా సినిమా చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. కంగువా చిత్రం వచ్చేనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రయాంగిల్ లవ్స్టోరీని బయటపెట్టిన పృథ్వీ.. సూర్యకు సర్ప్రైజ్
గంగవ్వ అర్ధరాత్రి దెయ్యం పట్టినట్లు ప్రవర్తించిన వీడియో ప్లే చేసిన నాగ్ అది కేవలం ప్రాంక్ అని బయటపెట్టాడు. ప్రైజ్మనీలో అరలక్ష పోయినా నామినేషనే ముఖ్యమనుకున్న నబీల్పై పోయిన డబ్బును తీసుకొచ్చే బాధ్యతను వేశాడు. హీరో సూర్య నేటి (అక్టోబర్ 26) ఎపిసోడ్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా మారాడు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..ఇవే తగ్గించుకుంటే మంచిదిఘోస్ట్ ప్రాంక్లో గంగవ్వ యాక్టింగ్కు ఇంప్రెస్ అయిన నాగ్ ఆమెను కన్ఫెషన్ రూమ్కు పిలిచి మరీ సీక్రెట్గా మెచ్చుకున్నాడు. పృథ్వీ ప్రాణం పెట్టి సింహంలా ఆడాడని పొగిడాడు. అయితే నామినేషన్స్లో రోహిణిని కింది నుంచి పైకి చూస్తే అది బాడీ షేమింగ్లానే కనిపిస్తుందని.. దాన్ని మార్చుకోమని సూచించాడు. పృథ్వీ- నిఖిల్.. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోల్లా కలిసి ఆడారని క్లాప్స్ కొట్టాడు. నీ వల్ల అరలక్ష గోవిందా..ప్రైజ్మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని తెలిసినా హరితేజను నామినేట్ చేశావు. ఆ అర లక్ష మళ్లీ ప్రైజ్మనీలో జమ చేయాల్సిన బాధ్యత నీదేనని నబీల్కు నొక్కి చెప్పాడు. గౌతమ్ గురించి మాట్లాడుతూ.. మహిళలపై గౌరవం ఉందని చెప్పే నువ్వు యష్మిపై ఎందుకు అరిచావ్? నీ షార్ట్ టెంపర్ తగ్గించుకో అని సలహా ఇచ్చాడు.ట్రయాంగిల్ లవ్ స్టోరీతర్వాత నిఖిల్- యష్మి - గౌతమ్ల ట్రయాంగిల్ లవ్స్టోరీని నాగ్ బయటపెట్టాడు. హౌస్లో జరిగిన టీ షర్ట్ వ్యవహారం గురించి పృథ్వీ చెప్తే ప్రైజ్మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తానని నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టి పృథ్వీ లేచి నిల్చున్నాడు. గౌతమ్ టీషర్ట్ కావాలని యష్మి అడిగింది. నిఖిల్ టీషర్ట్ లేదు కాబట్టి గౌతమ్ది వేసుకుంది. అప్పుడు నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని యష్మి నాతో చెప్పింది. అక్కడినుంచి ఏమైనా ఉందా? అని అడిగింది అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు.యష్మికి గడ్డి పెట్టిన నాగ్రాయల్ టీమ్లో విభేదాలున్నాయని.. అవన్నీ పక్కనపెట్టి ఓజీ టీమ్లా ఐకమత్యంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక నిఖిల్ చుట్టూ తిరిగిన యష్మిని.. ఎవరి చుట్టూనో తిరగడం మానేయ్, మళ్లీ గేమ్కు వచ్చేయమని సూచించాడు. అలాగే సంచాలకురాలిగా నా స్ట్రాటజీ నాకుంటుంది, నా గ్రూపును నేను గెలిపించుకోవాలనడం తప్పు అని కుండబద్ధలు కొట్టాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన యష్మి నాకు ఏ స్ట్రాటజీ లేదంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.అప్పుడు కెమెరామన్, ఇప్పుడు డైరెక్టర్ఇక గంగవ్వ దెయ్యంగా మారి భయపెట్టింది ప్రాంక్ అని.. ఈ ఐడియా అవినాష్, తేజదని వీడియోతో సహా క్లారిటీ ఇచ్చాడు నాగ్. తర్వాత కంగువా ప్రమోషన్స్ జరిగాయి. అందులో భాగంగా హీరో సూర్య, దర్శకనిర్మాత స్టేజీపైకి వచ్చాడు. డైరెక్టర్ అవ్వకముందు నాగార్జున నటించిన నేనున్నాను, బాస్: ఐ లవ్యూ సినిమాలకు శివ కెమెరామెన్గా నటించాడు. ఆ సమయంలో ఒకరోజు నాగ్ పిలిచి.. నువ్వు కచ్చితంగా డైరెక్టర్ అవుతావన్నాడు అని చెప్పుకొచ్చాడు.సూర్య కోసం వచ్చేందుకు రెడీసూర్య వస్తున్నాడని తెలిసి నయని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట! ఇక హౌస్మేట్స్ అందరూ సూర్య పాటలకు డ్యాన్స్ వేసి అతడిని సర్ప్రైజ్ చేశాడు. సూర్యను కలవడానికి హౌస్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తావా? అని నాగ్ అడగ్గా తప్పకుండా వస్తాను సర్ అంటూ నయని మెలికలు తిరిగిపోయింది. పృథ్వీ కోరిక మేరకు సూర్య.. రోలెక్స్ డైలాగ్ చెప్పాడు. తర్వాత బై చెప్పివెళ్లిపోయాడు.డ్యాన్స్ రిహార్సల్స్లో గొడవఅయితే డ్యాన్స్ రిహార్సల్స్లో యష్మి హర్టయిందట! ప్రాక్టీస్ మీద ఆసక్తి చూపించడం లేదు, నీకసలు డ్యాన్స్ పార్ట్నర్ ఎవరు కావాలి? అని విష్ణు పృథ్వీని అడిగగింది. అందుకతడు ఎవరైనా ఓకే అన్నాడు. దీంతో హర్టయిన విష్ణు.. నేను, పృథ్వీ కంఫర్ట్గా లేము బిగ్బాస్. పార్ట్నర్స్ మార్చుకునే వీలుందా? అని అడిగింది. దీంతో బిగ్బాస్ నిఖిల్ -యష్మిని విడదీశాడు. నిఖిల్తో విష్ణు, యష్మితో పృథ్వీ కలిసి డ్యాన్స్ చేయాలన్నాడు.బిత్తరపోయిన విష్ణుఇది యష్మికి అస్సలు నచ్చలేదు. తన కోసం నా ఆనందాన్ని చెడగొడుతోందని ఏడ్చేసింది. నువ్విలా చేస్తావని ఊహించలేదంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది. దీంతో బిత్తరపోయిన విష్ణు.. పృథ్వీతో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీకి నాగ్ క్లాస్.. సూర్య కోసం బయటకు వచ్చేస్తానన్న కంటెస్టెంట్
చేసేదంతా చేస్తారు.. అంతా అయిపోయాక మాత్రం తన ఉద్దేశం అది కాదని యూటర్న్ తీసుకుంటారు. సోనియా, యష్మి, తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంఠ.. ఇలా బిగ్బాస్ కంటెస్టెంట్లలో చాలామంది ఇదే కోవలోకి వస్తారు. ఈవారం పృథ్వీ.. రోహిణిని కింది నుంచి పైకి చూస్తూ చులకనగా మాట్లాడాడు.. దీని గురించి నాగ్ ప్రస్తావించగా బాడీ షేమింగ్ చేయాలన్న ఉద్దేశం తనది కాదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నాగ్ క్లాస్ పీకాడు. ఇక యష్మి ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ ఆమె ఫోటో ఉన్న కుండ పగలగొట్టాడు.స్పెషల్ గెస్ట్గా సూర్యఇకపోతే ఈరోజు ఎపిసోడ్లో హీరో సూర్య అతిథిగా విచ్చేయనున్నాడు. కంగువా సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్టేజీపైకి వచ్చాడు. అతడిని చూసి సూర్య అభిమానురాలు నయని పావని తెగ సంతోషపడిపోయింది. అతడి కోసం 5 నిమిషాలు హౌస్లో నుంచి బయటకు వస్తావా? అంటే వచ్చేస్తానని తలూపింది. మళ్లీ హౌస్లోకి పంపించను అని నాగ్ తిరకాసు పెట్టినప్పటికీ సూర్య కోసం బయటకు వచ్చేందుకు రెడీ అని చెప్పింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాలీవుడ్ లో కంగువ క్రేజ్ పీక్స్.. తెలుగు రాష్ట్రాల్లో జాక్ పాట్ కొట్టిన సూర్య..
-
హీరో సూర్య ‘కంగువ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కంగువ అరుదైన సినిమా: సూర్య
‘‘నా సినిమా థియేటర్లో రిలీజై రెండేళ్లు దాటింది. అయినా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం రీ రిలీజ్కి ఫ్యాన్స్ చూపించిన స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ‘కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీ చేశాం’’ అని హీరో సూర్య అన్నారు. శివ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ నవంబరు 14న విడుదల కానుంది.ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో సూర్య మాట్లాడుతూ–‘‘కంగువ’లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళిగారు స్ఫూర్తినిచ్చారు. నటుడిగా కమల్హాసన్గారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. ‘కంగువ’ స్ట్రయిట్ తెలుగు సినిమా... ఇండియన్ సినిమా. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం ΄పోరాడే వీరుడి చిత్రమిది. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా ‘కాక్క కాక్క’ సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ‘జై భీమ్’ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి’’ అని తెలిపారు.శివ మాట్లాడుతూ– ‘‘కంగువ’ సినిమాను ఎంతోఫ్యాషన్తో సూర్యగారి లాంటి ఎక్స్ట్రార్డినరీ హీరోతో కలిసి రూపొందించాను. మన దక్షిణాది సినిమాని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలో రాజమౌళిగారు చూపించారు. నాకు ఆయన ఎంతో స్ఫూర్తినిస్తారు. ఆయన ‘విక్రమార్కుడు’ సినిమాని తమిళంలో ‘సిరుతై’గా రీమేక్ చేశాను. ఆ సినిమాతో నా ఇంటి పేరు ముందు ‘సిరుతై’ చేరింది’’ అని పేర్కొన్నారు. ‘‘కంగువ’ కోసం టీమ్ అంతా ఎంతోఫ్యాషనేట్గా హార్డ్వర్క్ చేశాం. మా సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అని చె΄్పారు కేఈ జ్ఞానవేల్ రాజా. రచయిత, నటుడు రాకేందు మౌళి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
హైదరాబాద్లో సూర్య.. ఫోటోలు వైరల్
-
గజిని సీక్వెల్ లో అమీర్ ఖాన్, సూర్య
-
'దిశా పటాని' డ్రెస్పై సెన్సార్ అభ్యంతరం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, తాజాగా విడుదలైన ఒక పాటలో నటి 'దిశా పటాని' ధరించిన డ్రెస్పై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సెన్సాబోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. నవంబరు 14న రిలీజ్ కానున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.తాజాగా సూర్య- దిశా పటానీ మధ్య 'యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్ ట్రెండ్లో ఉంది. ఇందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం అభ్యంతరం చెప్పింది. ఈ పాటలో మూడు సెకన్ల పాటు తొలగించాలని బోర్టు తెలిపింది. దిశా పటానీ ధరించిన 'డీప్ క్లీవేజ్' డ్రెస్తో ఉన్న సన్నివేశాలను తొలగించాలని బోర్డు సూచించింది. దీంతో చిత్ర యూనిట్ తగిన నిర్ణయం తీసుకోనుంది.ఈ సాంగ్లో దిశా పటాని గ్లామర్కు కుర్రకారు ఫిదా అవుతుంది. సూర్యతో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. -
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
కంగువా చూశాక ఆ సినిమాలే గుర్తుకొస్తాయి: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరాకే రావాల్సిన ఈ చిత్రం వేట్టయాన్ రావడంతో బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. ఈ భారీ యాక్షన్ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని కంగువా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో కంగువా టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్ సూర్యతో పాటు హీరోయిన్ దిశాపటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తుందని అన్నారు. ఈ సినిమా బ్రేవ్హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపారు. సూర్య మాట్లాడుతూ..'మనం బ్రేవ్హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి చిత్రాలను ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతాం కూడా. ఆ సినిమాలు చాలాసార్లు చూశాం. మేము కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే చేయబోతున్నాం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది. అప్పటి ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడిపారు? వారికి ఎదురైన కష్టాలేంటి? అనే విషయాలను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ విధంగానే కంగువాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్, కథ విషయంలో శివ చాలా ప్రతిభావంతుడు. అతను థియేటర్లో కంగువా చూశాక మీకే తెలుస్తుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో విలన్గా బాబీ డియోల్ నటించారు. -
'కంగువ' రెండో సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్
సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.సూర్య- దిశా పటానీ మధ్య సాగిన ఈ సాంగ్ చాలా కలర్ఫుల్గా ఉంది. మొదట తమిళం, మలయాళం వెర్షన్ పాటను విడుదల చేయగా తెలుగు వెర్షన్ను తాజాగా రిలీజ్ చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్, సాగర్, శ్రద్ధాదాస్ ఆలపించారు. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవివ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
కంగువ ఆడియో వేడుక రెడీ.. సూర్య కొత్త సినిమాలో మరాఠీ బ్యూటీ
సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.కంగువ ఆడియో ఆవిష్కరణ వేడుకను త్వరలో చైన్నెలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు సూర్య తన 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. 2డీ ఎంటర్టెయిన్మెంట్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.దీంతో నటుడు సూర్య తన 45వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీన్ని నటుడు ఆర్జే. బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే జాక్పాట్ను వర్ధమాన నటి కాశ్మీరా పరదేశీ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే ఆమెకిది నిజంగా లక్కీఛాన్సే అవుతుంది. ఇంతకు ముందు కోలీవుడ్లో శివప్పు మంజల్ పచ్చై, పీటీసార్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. అయితే అంతకు ముందే ఈ మరాఠీ బ్యూటీ తెలుగులో నర్తనశాల,వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలోనూ మెరిసింది. హిందీలో మిషన్ మంగళ్ చిత్రంలోనూ నటించింది. కాగా సూర్యతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రానికి హింట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?
సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కంగువ'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్యతో పాటు ప్రభాస్, రజనీకాంత్ వేదక పంచుకోనున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం రజనీకాంత్ వెట్టయాన్ కోసం వాయిదా పడింది. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవంబరు 14న సినిమా విడుదల కానుంది.కంగువ కోసం ప్రభాస్, రజనీకాంత్రజనీకాంత్ వేట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కావడంలో సూర్య పాత్ర ఎక్కువ ఉంది. తలైవా మీద ఉన్న గౌరవంతో అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువ చిత్రాన్ని సూర్య వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ కూడా కంగువ విజయం కోసం తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు ప్రీరిలీజ్ కార్యక్రమానికి వస్తున్నారట. ఇకపోతే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం యూవీ క్రియేషన్స్ అని చెప్పవచ్చు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి కంగువ సినిమాను వారు నిర్మించారు. యూవీ బ్యానర్ అధినేతలు వంశీ, ప్రమోద్లు ఇద్దరూ ప్రభాస్కు మంచి స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మరింత ప్రమోషన్ కల్పించేందుకు పెంచేలా ప్రభాస్ కూడా భాగం కానున్నారని సమాచారం.రూ. 2000 కోట్లపై టార్గెట్కంగువ సినిమాను 3,500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్, స్పానిష్లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రూ. 1000 కోట్ల టార్గెట్తో దిగుతున్న ఈ సినిమా రూ. 2000 కోట్లు రాబడుతుందని నిర్మాత అంచనా వేశారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 14న సినిమా విడుదల కానుంది. -
సూర్య కొత్త సినిమా.. అదంతా AIతోనే
ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(AI).. టెక్నాలజీ పరంగా ఇదో విప్లవం. ఎందుకంటే దీని వల్ల చాలా పనులు చేయడం సులభం అవుతోంది. దీనివల్ల భవిష్యత్లో చాలా ఉద్యోగాలు ఊడిపోవచ్చని కూడా అంటున్నారు. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా కోసం ఏఐ సాంకేతికతోనే డబ్బింగ్ చెప్పాలని ఫిక్స్ అయ్యారు.సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో దీన్ని తీస్తున్నారు. లెక్క ప్రకారం అక్టోబర్ 10నే రిలీజ్ కావాలి. కానీ రజినీకాంత్ మూవీ కోసం వాయిదా వేశారు. నవంబరు 14న దాదాపు 10 భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఫ్రెంచ్, ఇంగ్లీష్, స్పానిష్ భాషలు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)తాజాగా ఎక్స్(ట్విటర్)లో నెటిజన్లతో ముచ్చటించిన 'కంగువ' నిర్మాత కేఈ జ్ఞానవేల్.. సినిమా కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. తమిళం వరకు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో మాత్రం ఏఐతో డబ్బింగ్ పూర్తి చేస్తామని అన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇలా ఈ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్ల పని గండంలో పడ్డట్లే!'కంగువ' విషయానికొస్తే.. కంగ అనే ఓ యోధుడి జీవితమే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా సూర్య దాదాపు ఆరు గెటప్స్లో కనిపిస్తాడని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరయిన్. బాబీ డియోల్ విలన్. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
హీరోగా రణ్బీర్.. విలన్గా సూర్య?
బాలీవుడ్ సక్సెస్ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ధూమ్’ నుంచి ‘ధూమ్ 4’ రాబోతున్నట్లుగా కొన్ని రోజుల్నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘ధూమ్ 4’లో హీరోలుగా నటిస్తారనే వారిలో ఇప్పటికే షారుక్ ఖాన్ , ప్రభాస్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రణ్బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ధూమ్’ ఫ్రాంచైజీలోని ప్రతి భాగానికి కథ అందించి, నిర్మించిన ఆదిత్యా చో్ప్రా తాజాగా ‘ధూమ్ 4’ కథను కూడా రెడీ చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగానే నటీనటుల గురించిన వివరాలను ప్రకటిస్తారని బాలీవుడ్ సమాచారం. (చదవండి: హీరోయిన్తో పెళ్లికి రెడీ అవుతున్న శింబు)అయితే ‘ధూమ్ 4’ సినిమాలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తే బాగుంటుందని ఆదిత్యా చోప్రా అనుకుంటున్నారట. రణ్బీర్ కపూర్ను కలిసి ఆదిత్య మాట్లాడారని, ఈ హీరో కూడా ‘ధూమ్ 4’ పట్ల ఆసక్తిగా ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాలో సూర్య విలన్గా నటిస్తారట. రణ్బీర్ కపూర్ కెరీర్లో 25వ చిత్రంగా రానున్న ‘ధూమ్ 4’కు దర్శకత్వం వహించే వారిలో అయాన్ ముఖర్జీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక శనివారం (సెప్టెంబరు 28) రణ్బీర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ధూమ్ 4’ వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ‘రామాయణ్’ చిత్రంతో బిజీగా ఉన్న రణ్బీర్ త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ తర్వాత ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ సెట్లోకి అడుగుపెడతారు. దీన్నిబట్టి ‘ధూమ్ 4’ గురించిన క్లారిటీ రావాలంటే మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. -
డైరెక్టర్ శంకర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. తాజాగా విడుదలైన ఇండియన్– 2 చిత్రం వరకూ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. అయితే ఇటీవల విడుదలై ఇండియన్– 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో రామ్చరణ్ కథానాయకుడిగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ సూపర్హిట్ బాట పట్టడానికి దర్శకుడు శంకర్ శ్రమిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఇండియన్– 3 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మరో భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్ ఉన్నారు. ఏల్పారి నవల హక్కులను పొందిన శంకర్ దీన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీన్నీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందించనున్నట్లు తెలిసింది. ఆ స్టార్ హీరోలెవరో కాదు చియాన్ విక్రమ్, సూర్య అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితం నటించిన పితామగన్ అనే సంచలన విజయం సాధించింది. కాగా ఇప్పుడు నటుడు విక్రమ్, సూర్య కలిసి నటిస్తే వేల్పారి నవల మరో సంచలన చిత్రం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్ సినిమా 'సర్ఫిరా'
అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్గా సర్ఫిరా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇందులో రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్ అవుతుందని అక్షయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw— Akshay Kumar (@akshaykumar) September 26, 2024 -
'సత్యం సుందరం' ట్రైలర్.. మరో హిట్ ఖాయం
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మెయిళగన్'. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. సూర్య-జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్కుమార్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. -
సుతిమెత్తగా అభిమానులకు క్లాస్ పీకిన సూర్య
ఒకప్పుడు సినిమా 50, 100 రోజుల పాటు థియేటర్లలో ఆడేది. దానిబట్టి హిట్టా ఫ్లాప్ అనేది నిర్ణయించేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా సంబంధం లేదు. కోట్లకు కోట్లు వచ్చాయా.. మా మూవీ హిట్ అయిపోయిందో అని నిర్మాతలు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడంతా వసూళ్ల బట్టే ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడేది కూడా ఈ వసూళ్ల గురించే.మా హీరో సినిమాకు తొలిరోజు ఇన్ని కోట్లు వచ్చాయని ఒకడంటే.. మా హీరో చిత్రానికి తొలిరోజు మీ వాడికంటే ఎక్కువనే వచ్చాయని మరో ఫ్యాన్ అంటాడు. ఇలాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి అభిమానులపై తమిళ హీరో సూర్య కౌంటర్లు వేశాడు. మూవీకి వచ్చే కలెక్షన్స్ గురించి మీకెందుకు అని అడిగాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మెయిళగన్'. సూర్య-జ్యోతిక నిర్మించారు. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళనాడులో జరిగింది. ఇందులో మాట్లాడిన సూర్య.. 'సినిమాలోని స్టోరీ, కంటెంట్, పాత్రల గురించి మాట్లాడుకోండి. వాటి గురించి సెలబ్రేట్ చేసుకోండి. వసూళ్ల గురించి మీకు(ఫ్యాన్స్) ఎందుకు? వాటి గురించి ఆలోచించడం ఆపండి' అని చెప్పాడు.వసూళ్ల గురించి ఫ్యాన్స్ గొడవ పడుతుంటారని దాదాపు అందరు హీరోలకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరు. సూర్య మాత్రం మరీ కొట్టినట్లు చెప్పనప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని అయితే చెప్పాడు. మరి దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)This is to all the fans who fight day in and day out about the Box Office numbers. pic.twitter.com/YPqdDAi6wb— Aakashavaani (@TheAakashavaani) September 23, 2024 -
రజినీకాంత్ దెబ్బకు వెనక్కి తగ్గిన సూర్య..
-
సూపర్ స్టార్ కోసం సూర్య సైడ్... 'కంగువ' మళ్లీ వాయిదా
-
సూర్య కంగువ వచ్చేది అప్పుడే.. కొత్త విడుదల తేదీ ఇదే..
-
నెల ఆలస్యంగా కంగువ
‘కంగువ’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. సూర్య హీరోగా నటించిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రాన్ని నవంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు గురువారం మేకర్స్ ప్రకటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు. ‘‘పీరియాడిక్ యాక్షన్ జానర్లో ఇప్పటివరకూ రాని ఒక సరికొత్త కాన్సెప్ట్తో ‘కంగువ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కంగువ’ సినిమాను తొలుత ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్గా ఓ నెల ఆలస్యంగా నవంబరు 14కి వాయిదా వేశారు. -
రజనీకాంత్ కోసం సూర్య భారీ త్యాగం!
కంగువా చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తనే నిజమైంది. సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ని వాయిదా వేశారు మేకర్స్. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.వేట్టయాన్ కోసమే వాయిదా?రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. అదే తేదిన కంగువా రిలీజ్ కావాల్సింది. మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే బరిలోని రజనీకాంత్ సినిమా రావడంతో సూర్య వెనక్కి తగ్గారు. తనకంటే సీనియర్ హీరో సినిమాతో పోటీ వద్దని సూర్య చెప్పారట. దీంతో అక్టోబర్ 10న కాకుండా నవంబర్ 14న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. (చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)మూడు విభిన్న పాత్రల్లో సూర్యకంగువా చిత్రం కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రాని కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారట. రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా ‘కంగువా’ కోసం శ్రమించారని ఓ ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే అయిందట. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విజువల్స్ పరంగా ఈ చిత్రం సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva's mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI— Studio Green (@StudioGreen2) September 19, 2024 -
‘ధూమ్ 4’లో విలన్గా సూర్య.!
-
ఎంగేజ్మెంట్ వేడుకలో స్టార్ హీరో దంపతులు.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. అయితే దసరాకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన కంగువా.. ఊహించని విధంగా వాయిదా పడింది. రజినీకాంత్ వేట్టైయాన్ బరిలోకి రావడంతో కంగువా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా తన బంధువుల ఎంగేజ్మెంట్ వేడుకకు సూర్య హాజరయ్యారు. తన భార్య జ్యోతికతో కలిసి జంటగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో కాబోయే నూతన వధూవరులకు ఎంగేజ్మెంట్ రింగ్ అందజేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూర్య అభిమానుల సంఘం పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వేడుక తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందని ఇన్స్టాలో ఓ అభిమాని షేర్ చేశారు. సూర్య కుటుంబానికి చెందిన బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!)ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే కంగువా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్తో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. అంతేకాకుండా తన సోదరుడు కార్తీ, అరవింద్ స్వామిలతో కలిసి మీయజగన్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.Exclusive Video @Suriya_offl & Jyotika at Relative's Engagement Yesterday ♥️#Kanguva pic.twitter.com/ykOA50c3YJ— All India Suriya Fans Club (@Suriya_AISFC) September 17, 2024 -
స్టార్ హీరోతో సినిమా ఛాన్స్... తిరిగొస్తున్న శ్రియ శరణ్
ఇప్పుడు సీనియర్ హీరోయిన్లకు మంచి టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. ఇంతకు ముందు అగ్ర హీరోయిన్లుగా రాణించిన సిమ్రాన్, జ్యోతిక,త్రిష, మంజూ వారియర్ వంటి నటీమణులకు ఇప్పుడు సౌత్ చిత్రపరిశ్రమలో మంచి డిమాండ్ పెరుగుతోందనే చెప్పాలి. ఇలాంటి వారికి సీనియర్ నటులకు జంటగా నటించే అవకాశాలు వరిస్తున్నాయి. అదే విధంగా చిరంజీవి, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నటి శ్రియ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ ఎలా ఉందంటే.. ?ఈమె ఇంతకు ముందు తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో టాప్ కథానాయకిగా రాణించిన విషయం తెలిసిందే. రజనీకాంత్కు జంటగా శివాజీ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గపోయా యి. కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లోనూ నటించారు. అయితే వివాహానంతరం కాస్త గ్యాప్ వచ్చినా ఆమె నటనకు మాత్రం దూరం కాలేదు. ఈ క్రమంలో చిన్న సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ, అవి అంతగా ఆకట్టుకోలేదు. అలాంటిది తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న తన 44వ చిత్రంలో నటి శ్రియ నటిస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ మసాలా చిత్రంలో నాయకిగా నటి పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో నటి శ్రియ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రీసెంట్గా నటి శ్రియ ఒక సినిమా ఒప్పుకున్నారు. మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న సండైక్కారి అనే చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇందులో నటుడు విమల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
దసరా రేసు నుంచి తప్పుకున్న భారీ బడ్జెట్ చిత్రం.. ప్రకటించిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ దసరాకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఊహించని విధంగా రేసులోకి వచ్చేశాడు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం వేట్టైయాన్ కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోల మధ్య క్లాష్ ఏర్పడింది. ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలే రావడంతో కంగువా నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. దీంతో ఈ మూవీ వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి.అందరూ అనుకున్నట్లుగానే కంగువాను వాయిదా వేస్తున్నట్లు హీరో సూర్య ప్రకటించారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్లో తన సోదరుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' మూవీ ఆడియో లాంచ్లో క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అభిమానులు తనకు అండగా నిలవాలని సూర్య అభ్యర్థించారు. రజనీకాంత్ తన కంటే సీనియర్ అని.. అందుకే వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. 'తమిళ చిత్రసీమలో ఓ ప్రత్యేక చిత్రాన్ని అందించడం కోసమే రెండున్నరేళ్లకు పైగా కష్టపడ్డాం. దాదాపు 1000 మందికి పైగా కంగువా కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. రెండున్నరేళ్ల పాటు నటీనటులు, సిబ్బంది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. ఈ సినిమా కోసం మేము పడిన కష్టం వృథా కాదనేది నా గట్టి నమ్మకం. అక్టోబర్ 10న రజినీకాంత్ వెట్టైయాన్ కూడా వస్తోంది. ఆయన సినిమాకు మనం దారి ఇవ్వాలి. రజినీకాంత్ నాకంటే సీనియర్. 50 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు. ముందుగా సూపర్స్టార్ సినిమా వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయంలో మీరంతా నాతో ఉంటారని నమ్ముతున్నా. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
దసరాకి బిగ్ వార్
-
దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగానే జరుగుతుందన్న తరుణంలో కంగువా వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అయితే అదే రోజు రజినీకాంత్ మూవీ వెట్టైయాన్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కంగువా మూవీ వాయిదా పడుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది కాస్తా సూర్య, తలైవా ఫ్యాన్స్ మధ్య వార్గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.కంగువా వాయిదా.. ట్విటర్లో ట్రెండింగ్?సూర్య నటిస్తోన్న కంగువా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 10 రజినీకాంత్తో పోటీపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31కి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కంగువా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించినప్పటికీ పోటీలో రజినీకాంత్ రావడంతో వాయిదా పడినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'షేమ్ ఆన్ యూ స్టూడియోగ్రీన్' అనే హ్యాష్ట్యాగ్ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కంగువా మేకర్స్ క్లారిటీ ఇస్తేనే ఫ్యాన్స్ మధ్య వార్కు చెక్ పడుతుంది. -
కంగువ వాయిదా?
‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?
హీరో సూర్య పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ మన స్టార్ హీరోల రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ)సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న సూర్య.. ఆస్తులు కూడా బాగానే కూడబెతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా సూర్య.. దాదాపు రూ.120 కోట్లు ఖరీదు చేసే దస్సాన్ ఫాల్కన్ 2000 మోడల్ ప్రైవేట్ జెట్ కొన్నాడని న్యూస్ వైరల్ అవుతోంది.సూర్య అనుకుంటే దీన్ని కొనేస్తాడేమో గానీ ఈ వార్తల్లో నిజం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. సరే ఇదలా వదిలేస్తే 'కంగువ' సినిమా.. అక్టోబరు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?) -
సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాని అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. అంటే థియేటర్లలో రావడానికి దాదాపు రెండు నెలల టైమ్ ఉంది. కానీ ఇప్పుడు ట్రైలర్ని రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)హీరో సూర్య- డైరెక్టర్ శివ కాంబోలో తీసిన మూవీ 'కంగువ'. పోస్ట్ ప్రొడక్షన్ చివరి పనుల్లో ఉంది. త్వరలో ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. ఈ క్రమంలోనే రెండు నెలల ముందే బజ్ పెంచే ప్లాన్లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అన్నట్లు ఉన్నాయి. ఇక సూర్యతో పాటు హీరోయిన్గా దిశా పటానీ, విలన్గా బాబీ డియోల్ తమ యాక్టింగ్తో అంచనాలు పెంచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!) -
కోలీవుడ్ స్టార్ హీరో భారీ యాక్షన్ చిత్రం.. ట్రైలర్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ సినిమాను శివ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సూర్య విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కంగువా ట్రైలర్ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విటిర్లో పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే వెల్లడించారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. The anticipation ends now! The time for glory is arriving ✨Get ready for a celebration like no other ❤️🔥The grand #KanguvaTrailer is all set to be yours from 12th August#KanguvaFromOct10 🦅 #Kanguva@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP #StudioGreen… pic.twitter.com/OJ8eRvIv6X— Studio Green (@StudioGreen2) August 10, 2024 -
హీరో సూర్యకు గాయం
హీరో సూర్య స్వల్పంగా గాయపడ్డారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ గ్యాంగ్స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్య, జ్యోతిక, కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోందని కోలీవుడ్ టాక్. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించే సమయంలో సూర్య తలకు గాయం అయిందనే వార్తలు వచ్చాయి.దీంతో సూర్యకు ఏమైందోనని ఆయన అభిమానులు కంగారుపడ్డారు. అయితే అది చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సూర్య అన్న బాగానే ఉన్నారని ఈ చిత్రం సహ–నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ పాడియన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో సూర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్లో వార్తలు రావడంతో ఫ్యాన్స్కు షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024 -
తమిళ 'బిగ్బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్గా సక్సెస్ఫుల్గా నడిపారు. కమల్ ఇమేజ్తో ఈ షో పట్ల కోలీవుడ్లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
కేరళకు అండగా తమిళ హీరోలు.. భారీ మొత్తంలో సాయం
కేరళలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి అండగా కోలీవుడ్ హీరోలు నిలిచారు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి పలు గ్రామాలపై పడటంతో సుమారు 200 మంది మరణించారు. అయితే, 250 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అక్కడి ప్రభుత్వం తెలుపుతుంది. ముఖ్యంగా వయనాడ్, తిరువనంతపురం ప్రజలు తీరని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసిన నేలకూలిన భవనాలు, బురదతో నిండిన వీధులు మాత్రమే కనిపిస్తున్నాయి. కేరళలో ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే, తాజాగా కోలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరూ కేరళకు తమ వంతు అండగా నిలిచారు.తమిళ స్టార్ చియాన్ విక్రమ్, కేరళలో సంభవించిన విపత్తుపై ఉదారంగా స్పందించినందుకు అభిమానుల నుంచి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో జరిగిన విషాద సంఘటనలను చూసి చలించిన విక్రమ్ సహాయక చర్యల కోసం తన వంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు అందించారు. కేరళ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఆయన చాటుకున్నాడు.దేశంలో ఎక్కడ విపత్తు వచ్చిన సాయం చేయడంలో ముందు ఉండే దంపతులు సూర్య- జ్యోతిక. తాజాగా వీరిద్దరూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. సూర్య చేసిన సాయానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. కేరళలో ప్రస్థుత పరిస్థితిని చూస్తుంటే తనను ఎంతో కలచి వేసిందని సూర్య తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాధానికి గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు. -
దేవి ట్యూన్స్ కు అదిరిపోయిన కంగువా స్టెప్స్..
-
గ్యాంగ్ స్టర్ గా మారిన సూర్య..బర్త్ డే కు పవర్ ఫుల్ టీజర్ రిలీజ్..
-
కంగువలో కనిపించనున్న కార్తీ..
-
అసలు సూర్య ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు..
-
మేమే... మేమే...
‘ఆది జ్వాల... అనంత జ్వాల... వైర జ్వాల... వీర జ్వాల.. దైవ జ్వాల... దావాగ్ని జ్వాల...’ అంటూ మొదలవుతుంది ‘కంగువా’ సినిమాలోని ఫైర్ సాంగ్. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు.కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. మంగళవారం సూర్య బర్త్ డే సందర్భంగా ‘కంగువా’ సినిమాలోని ‘ఫైర్ సాంగ్’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘ఈ మట్టి ముట్టే ముందే ఇక్కడ పుట్టింది మేమే మేమే... అంకెలు పుట్టక ముందే లెక్కలు కనిపెట్టింది మేమే మేమే...’ అనే లిరిక్స్తో సాగే ఈపాట తెలుగు వెర్షన్కు శ్రీమణి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, దీప్తీ సురేష్ ఆలపించారు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ది వన్... హీరో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ వీడియోలో ‘ది వన్’ అని ఉంది. దాంతో ఈ సినిమా టైటిల్ ‘ది వన్’ అనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రాన్ని జ్యోతిక, సూర్య, కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. -
Kanguva : అదిరిపోయిన 'ఫైర్ సాంగ్'
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు(జులై 23) సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ 'ఫైర్ సాంగ్' కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. 'ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ' అంటూ ఈ పాట సాగుతుంది. 'పైర్ సాంగ్' "కంగువ"కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. -
తెలుగోళ్లు మెచ్చిన తమిళ స్టార్ హీరో.. సూర్య బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
రోలెక్స్ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)Happy Birthday @Suriya_offl Sir From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024 -
దేవరతో పోటీ.. బరిలోకి దిగుతున్న హిట్ కాంబినేషన్ సినిమా
కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రాల్లో మెయళగన్ ఒకటి. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. నటుడు అరవింద్సామి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి శ్రీదివ్య, స్వాతి కొండే, రాజ్కిరణ్, దేవదర్శిని, జయప్రకాశ్, శ్రీరంజనీ, ఇళవరసు, కరుణాకరన్, రైచల్ రిబాకా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గోవింద్ వసంత సంగీతాన్ని, మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు ఇప్పటికే తెలిపారు. అయితే చిత్రంలో జల్లికట్టు సన్నివేశాలు వంటి పలు యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. కాగా షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న మెయళగన్ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి నటుడు కార్తీ జల్లికట్టు ఎద్దుగా సవారీ చేస్తున్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఇదే తేదీన జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న దేవర చిత్రం తెరపైకి రానుంది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానున్నాయి. దీంతో వీటి మధ్య పోటీ నెలకొంటుందన్న టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య
కోలీవుడ్లో హీరో సూర్యకు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వస్తుదంటే చాలు వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్రెడిట్ను సూర్యకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఏమైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా కట్టకట్టుకుని నిలబడతారు. కోలీవుడ్లో సూర్యకు ఎంత గుర్తింపు ఉందో ఆయన అభిమానులకు కూడా సామన్యప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జులై 23న సూర్య పుట్టినరోజు రానుంది. ఈ క్రమంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.సూర్య పుట్టినరోజు సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని అభిమానులకు సూర్య మాటిచ్చారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా సూర్య కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం మరో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతామని ఆయన ఫ్యాన్స్ తెలిపారు.సుమారు ఏడేళ్ల క్రితం హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ...చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన పిల్లలకు బంగారపు ఉంగరాలను అందించారు. అప్పట్లోనే అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అలా ఆయన అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా ఫ్యాన్స్ నిలిచారు. పరిస్థితులు చక్కపడ్డాక వారందరినీ భోజనానికి సూర్య ఆహ్వానించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగ గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. -
కల్కి దారిలో కంగువా.. సీక్వెల్ కన్ఫర్మ్..
-
తెలుగు రాష్ట్రాల్లో కంగువ రైట్స్.. దిమ్మరిగిపోద్ది
-
దసరా రేస్లో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Dear all It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024 -
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.సూర్య ప్రధాన పాత్రలో 'వాడివాసల్' చిత్రాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాడివాసల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం. -
51 మంది మృతి.. ప్రభుత్వంపై భగ్గుమన్న సూర్య, విజయ్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించారు. అయితే, ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. క్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు.ఈ సంఘటనపై కోలీవుడ్ టాప్ హీరోలు భగ్గుమంటున్నారు. ఈ సంఘటన గురించి దళపతి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేయడమే కాకుండా.. బాధితులను పరామర్శించాడు. 'గతేడాది కూడా ఇలాంటి ఘటనతో 22మందికి పైగా చనిపోయారు. అయినా, ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ విధానాలు మార్చుకోలేదు. ఇప్పటికైనా మద్యం విషయంలో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. ఈ మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. వారి మరణ వార్త వినగానే నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మద్యం విషయంలో ప్రభుత్వ తీరును తప్పకుండా మార్పుచేయాలి. ఇలాంటి ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైన తమిళనాడు ప్రభుత్వం కఠన నిర్ణయం తీసుకోవాలి.' అని విజయ్ కోరారు.ఈ ఘటనను ఖండిస్తూ హీరో సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్పకాలిక పరిష్కారాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కల్తీ మద్యం, అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. తమిళనాడు పరిపాలన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా ప్రభుత్వం చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మద్యం విషయంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి.' అని సూర్య కోరారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలని సూర్య ప్రార్థించారు. -
సూర్య హిట్ సినిమా అక్షయ్ కుమార్ రీమేక్.. ట్రైలర్ విడుదల
సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు 'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది. -
లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?
రాఘవ లారెన్స్.. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి నృత్య దర్శకుడిగా, ఆ తరువాత కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన జిగర్తండ డబులెక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను రాసి, సొంతంగా నిర్మిస్తున్న 'బెంజ్' చిత్రంలో లారెన్స్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట!ప్రస్తుతం ఈయన కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేతిలో వాడివాసల్ తదితర చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చివరి ఘట్టంలో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో మెరిసి పెద్ద ఇంపాక్ట్నే కలిగించారు. ఇదే పాత్రతో సూర్య హీరోగా పూర్తి చిత్రాన్ని చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఈయన రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో రోలెక్స్ తరహా పాత్రలో అతిథిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్ -
ఫ్యాన్స్కు సూర్య డబుల్ ధమాకా ఇస్తారా..?
కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య హీరోగా, దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. సూర్య కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో తెరకెక్కించారు. ఈ క్రమంలో పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పార్ట్ 1 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విజయం ఆధారంగా సీక్వెల్స్ తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, కంగువ విడుదల తేదీని ఇప్పటికి కూడా మేకర్స్ ప్రకటించలేదు. దీంతో సూర్య ఫ్యాన్స్ నుంచి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు అయిన స్టూడియో గ్రీన్, యు.వి.క్రియేషన్స్పై ఒత్తిడి పెరుగుతుంది.గంగూవా చిత్రం సూర్య, డైరెక్టర్ శివకు ముఖ్యమైన చిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే శివ గత సినిమా రజనీకాంత్తో తీసిన అన్నాతై (తెలుగులో పెద్దన్న) భారీ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి శివ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జ్ఞానవేల్ రాజా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది కావడం గమనార్హం. భారీ అంచనాలతో వస్తున్న కంగువ విడుదల తేదీని జులై 23న సూర్య పుట్టినరోజు కానుకగా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే రోజున సూర్య 44 అప్ డేట్స్ విడుదలయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సూర్య పుట్టినరోజున ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ని ఆశించవచ్చు. -
కోలీవుడ్ స్టార్ హీరోతో మూవీ ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్డే
నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్తో రూపొందుతున్నవే. అందులో కంగువ చిత్రం ఒకటి. పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా జనరంజకమైన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇది ఆయన నటిస్తున్న 44 చిత్రం అవుతుంది. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించనున్నారు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ అండమాన్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఇందులో సూర్యతో నటించే నటి ఎవరన్న సస్పెన్స్ ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. అయితే పూజా హెగ్డే ఇందులో కథానాయకిగా నటిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డేకు ఈ చిత్రం చాలా కీలకం కానుంది. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా చాలా కాలం తర్వాత ఈ మధ్య విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంపై పూజాహెగ్డే చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. అదేసమయంలో తెలుగులో కూడా పూజాహెగ్డే నటించిన చిత్రాలు బాగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి ఆమె చేతుల్లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి కష్టకాలంలో సూర్య సరసన నటించే అవకాశం రావడం నిజంగా ఆమెకు లక్కే. -
ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.సూర్య కెరియర్లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. -
‘అరి’కి ముందే మరో చిత్రం
కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్ ఒకరు. పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి తదితరులు పాల్గొన్నారు. అరి మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్య పురిమెట్ల రెండో మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన cinematography minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , సుందర్ పాలుట్ల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు , పేపర్ బాయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతుంది... pic.twitter.com/OiR51KtiGB— ARI (MY NAME IS NOBODY) (@ArvyCinemas) May 21, 2024 -
Kanguva: దీపావళికి కంగువ?
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహించగా, దిశా పటానీ హీరోయిన్గా, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రధారులుగా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. (చదవండి: కంగువా మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా పదివేల మందితో వార్ సీన్..!)కాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. డిఫరెంట్ టైమ్స్ లైన్స్లో సాగే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని, తొలి భాగం ఈ ఏడాదిలో, మలి భాగం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుందని టాక్. -
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
-
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
హిట్ లిస్ట్ టీజర్ బాగుంది: సూర్య
‘‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజయ్ కనిష్కతో పాటు టీమ్కి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సూర్య కతిర్ కాకల్లార్, కె. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ని సూర్య లాంచ్ చేశారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్లో రూపొందిన చిత్రం ‘హిట్ లిస్ట్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది’’ అన్నారు మేకర్స్. -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య
దర్శక నటుడు కేఎస్.రవికుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం హిట్లిస్ట్. ఈ సంస్థలో ఇంతకు ముందు కమలహాసన్ 'తెనాలి', ఈ మధ్య 'గూగుల్ కుట్టప్పా' అనే సినిమాల్ని నిర్మించారు. తాజాగా 'హిట్లిస్ట్' పేరుతో మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కినిష్కాను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూర్య కథీర్, కే. కార్తీకేయన్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ కుమార్, కేఎస్ రవికుమార్, గౌతమ్మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుందని, తాజాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు సూర్య ఆవిష్కరించి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రెడీ చేశామని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని నిర్మాత కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) #I_Am_The_Danger first single from #HitList out now! 💥Song link - https://t.co/XxQoHVyKtpA @CSathyaOfficial Musical!@realsarathkumar @kanvikraman #RKCelluloids @ksravikumardir @menongautham @thondankani @smruthi_venkat @Aishwaryadutta6 @Abinakshatra @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/8BTeyaGEzs— K.S.Ravikumar (@ksravikumardir) May 10, 2024 -
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్లో 97, గణితంలో 94, ఫిజిక్స్లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్లో 98, సోషల్లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్. ఇది తెలుగువాడి బయోపిక్. అంధుడైన శ్రీకాంత్ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ టీచర్ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ తుషార్ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.రిజెక్ట్ చేసిన జ్యోతికఅవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్ బయోపిక్లో ఆఫర్ను తను రిజెక్ట్ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్ చేసి సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్ అంతా చదివాడు.మిస్ చేసుకోవద్దుఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి.. -
సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ‘కంగువా’.. అన్ని కోట్లా?
కంగువా చిత్రం సౌండ్ సినీ వర్గాల్లో బాగా పెరిగిపో తోంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీక్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కంగువా. చారిత్రిక, సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్లో తమిళం, తెలుగు, మలమాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.కాగా ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న కంగువ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్, సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే కంగువ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తాజా సమాచారం. నటుడు సూర్య కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
'కంగువ' స్పెషల్ పోస్టర్.. ఆ సినిమా గుర్తొచ్చిందిగా!
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్కు పరిచయమవుతోంది. శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. పీరియాడికల్, ప్రస్తుత అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూర్య గెటప్, టీజర్ ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మాట్లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) అందులో పీరియడ్ కాలానికి చెందిన సూర్య ఫొటోను, మరో పక్క ప్రస్తుత ఫొటోను పొందుపరచారు. మధ్యలో 2024లో విడుదల అని పేర్కొన్నారు. దీంతో కంగువా చిత్రంలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియడ్ పాత్రధారి చేతిలో కత్తి పట్టుకోగా, ప్రస్తుతం పాత్రధారి చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్కు ఎట్రాక్షన్గా మారింది. అదేవిధంగా ఇది గత జన్మకు, పునర్జన్మకు సంబంధించిన కథా చిత్రం అని కూడా అనిపిస్తోంది. దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఈ మధ్య 'బింబిసార' అనే మూవీతో తెలుగులో వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు అదే చిత్రం గుర్తొస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்! ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ! ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! & Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3 — Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024 -
హీరో సూర్య భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా?
సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులో మన బడా హీరోల రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఇతడు.. దీని తర్వాత పలు చిత్రాలు చేయబోతున్నాడు. అయితే సూర్య చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. పాపకు వెరైటీ పేరు) తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ ది సెపరేట్ బ్రాండ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అద్భుతమైన చిత్రాలు తీస్తుంటారు. ఇతడు సూర్యతో 'వడివాసల్' అనే మూవీ చేస్తానని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ అని దర్శక, నిర్మాతలు ప్రకటించారు కూడా. సినిమాలో పాత్ర కోసం సూర్య ఓ ఎద్దును కూడా పెంచాడు. కానీ షూటింగ్ అనుకున్నట్లు ప్రారంభమే కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే సూర్య, వెట్రిమారన్ ఎవరికి వాళ్లు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన వెట్రిమారన్.. తాను తీసే 'విడుదలై 2' ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని, దీని తర్వాతే వాడివాసల్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. దీనిబట్టి చూస్తే 'వడివాసల్' ఉంది కానీ ఇప్పట్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) -
'గుడ్ లక్ స్టూడియోస్'ని ప్రారంభించిన నటుడు సూర్య (ఫొటోలు)
-
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ముకుటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సూర్య
కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు సూర్య. అంతేకాదు ఈ రెండింటిలోనూ విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన కంగువ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్రాజా యూవీ.క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. కాగా సూర్య తన 44వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే సూరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలోనూ మరో చిత్రం చేయనున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ చిత్రం కూడా లైన్లో ఉంది. ఈ క్రమంలో సూర్య బుధవారం నాడు ఈరోడ్ జిల్లా, కొడుముడియల ప్రాంతంలో గల మకుటేశ్వర ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. కాగా సూర్య ఆ ఆలయానికి వస్తున్న విషయం తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల భద్రత మధ్య సూర్య చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. చదవండి: నేషనల్ క్రష్ ఏం చేసినా ట్రోలింగ్.. చేతలతో జవాబు! -
Jyothika-Suriya Workout: జిమ్లో సూర్య- జ్యోతిక కసరత్తులు.. ఫోటోలు వైరల్!
-
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్లో ప్రతి వర్కౌట్ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న బృందా శివకుమార్కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.