
∙రమ్యకృష్ణ, జ్యోతిక, త్రిష
క్రేజీ కపుల్ సూర్య–జ్యోతిక ఆదివారం ఉదయం చెన్నైలోని తమ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, త్రిష, నృత్య దర్శకురాలు బృంద తదితరులు పాల్గొన్నారు.

∙సెల్ఫీ సందడి
‘‘రుచికరమైన ఆహారం... ఆప్త మిత్రులతో హ్యాపీగా సమయాన్ని గడిపాం. మేం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు మరింత బలంగా మారిపోతాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు త్రిష. అలాగే తారలతో సూర్య తీసిన సెల్ఫీ వైరల్గా మారింది. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై