ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి

Apr 7 2025 1:11 AM | Updated on Apr 7 2025 1:11 AM

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలి

ములుగు రూరల్‌: దండకారణ్యంలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు బొమ్మెడ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన షెడ్యూల్‌లోని చట్టాలను ప్రధాని మోదీ, అమిత్‌షాలు కాలరాస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకే అమాయకపు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న హత్యాకాండను నిలిపివేయాలని కోరారు. రేపు(8వ తేదీ)హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు చౌక్‌ వద్ద చేపడుతున్న ప్రజాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్‌, రాజేందర్‌, బాలరాజు, నర్సింహరావు, కుమార్‌, బుచ్చన్న, రమేష్‌, చిరంజీవి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

న్యూడెమోక్రసీ నాయకుడు సాంబయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement