బిజినేపల్లి: ఇంటి ఆవరణలో కూరగాయల సాగుపై ప్రజలు దృష్టి పెట్టాలని పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం పాలెం కేవీకేలో పెరటి తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పెరట్లో చేపట్టే కూరగాయల సాగులో కృత్రిమ ఎరువులు, మందుల వాడకం ఉండదన్నారు. సేంద్రియ పద్ధతిలో మొక్క పెరుగుతుందన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. పెరట్లో టమాటా, వంకాయ, చిక్కుడు, మిరప, బెండ, కాకర, క్యారేట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీన, పాలకూర వంటి వాటిని పెంచుకోవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment