పెరటి తోటలపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పెరటి తోటలపై దృష్టి పెట్టాలి

Published Wed, Feb 26 2025 8:26 AM | Last Updated on Wed, Feb 26 2025 8:26 AM

-

బిజినేపల్లి: ఇంటి ఆవరణలో కూరగాయల సాగుపై ప్రజలు దృష్టి పెట్టాలని పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పాలెం కేవీకేలో పెరటి తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పెరట్లో చేపట్టే కూరగాయల సాగులో కృత్రిమ ఎరువులు, మందుల వాడకం ఉండదన్నారు. సేంద్రియ పద్ధతిలో మొక్క పెరుగుతుందన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. పెరట్లో టమాటా, వంకాయ, చిక్కుడు, మిరప, బెండ, కాకర, క్యారేట్‌, కొత్తిమీర, కరివేపాకు, పుదీన, పాలకూర వంటి వాటిని పెంచుకోవచ్చని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement