Nagarkurnool District News
-
కొనసాగుతున్న అన్వేషణ
బురద, ఊట నీరే ప్రధాన సమస్య ● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట ● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు ● పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు ● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
సహాయక చర్యలు వేగవంతం
సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. -
రోజుల తరబడి నీటి ఉధృతి
ముక్కిడిగుండం గ్రామానికి రెండు దిక్కులా మొలచింతలపల్లి వైపు ఉడుముల వాగు, నార్లాపూర్ వైపు పెద్దవాగు ప్రవహిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ రెండు వాగులు రోజుల తరబడి పొంగిపొర్లుతాయి. ఆ సమయంలో ముక్కిడిగుండంతోపాటు అనుబంధ గ్రామమైన గేమ్యానాయక్తండాకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పీఆర్ శాఖ ఎస్డీఎఫ్ నిధులు రూ.9 కోట్లు మంజూరు చేయగా.. లాంఛనంగా పనులను శంకుస్థాపన చేశారు. కానీ, పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఏప్రిల్ నెల నుంచి పనులు చేపట్టగా ప్రస్తుతం తుది దశకు చేరుకొని అందుబాటులోకి రానుంది. అయితే నార్లాపూర్ నుంచి ముక్కిడిగుండం వెళ్లే దారిలో పెద్దవాగు కంటే ముందు దాని పక్కనే మాల ఓడిక (చిన్న వాగు) పారుతుంది. రెండు వాగుల మధ్య వంద మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కనే ఉన్న ఈ వాగు కూడా ఉన్నా.. దీనిని అనుసరించి బిడ్జి నిర్మించాలనే ఆలోచన అధికారులకు తట్టలేదు. వర్షాకాలంలో ఈ వాగు సైతం ఉధృతంగానే పారుతుంది. దీంతో పెద్దవాగుపై బ్రిడ్జి ప్రారంభమైనా వర్షాకాలంలో మాల ఓడిక దాటి వెళ్లడం కష్టమేనని గ్రామస్తులు చెబుతున్నారు. -
‘చెవి స్పీకర్లతో వినికిడి కోల్పోతాం’
బిజినేపల్లి: ప్రస్తుత కాలంలో హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్ ప్రతిఒక్కరు ఎక్కువగా వినియోగిస్తున్నారని, తద్వారా వారు వినికిడి లోపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోగ్రాం అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ చెవిలో అనవసరంగా దూది పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని ఉపయోగించి చెవి గుమిలిని తీయడం వలన కర్ణభేరికి గాయమై వినికిడి శక్తి కోల్పోతామని, చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయని చెప్పారు. చెవిలోకి నీరు పోకుండా చూసుకోవాలని, చెవిలో చీము కారడం, చెవి నొప్పి తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విజయ్కుమార్, రాజేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. -
బ్రిడ్జి పనులు తుదిదశకు చేరాయి
నార్లాపూర్– ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. బ్రిడ్జికి రెండు వైపులా 20 మీటర్ల మేరకు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి, ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. అయితే వర్షాకాలంలో పెద్దవాగు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న మరో వాగు అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని గుర్తించాం. దీనిపై కూడా వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు పంపాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. – సాయిరాం, పీఆర్ఏఈ ● -
నల్లమల వన్యప్రాణులకు స్వర్గధామం
మన్ననూర్: రాష్ట్ర అటవీ శాఖ అమ్రాబాద్ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడం వల్ల నల్లమల ప్రాంతం వన్యప్రాణులకు స్వర్గధామంగా మారిందని డీఎఫ్ఓ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మన్ననూర్లోని ఈసీ సెంటర్ వద్ద వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ, వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుగా ఉన్న ఆయా గ్రామాలు, పెంటలు, గూడేలలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి కొత్తగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నల్లమల, కృష్ణానది పరివాహక ప్రాంతాలతోపాటు శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్ను నిషేధించడం శుభపరిణామం అన్నారు. అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధికి గాను రిసార్టులు, కాగితం పరిశ్రమ, జనపనార ఉత్పత్తులు వంటివి ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు తెలిపేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం పురోగతి సాధించేదిగా కూడా ఉందన్నారు. ఈ సమాచారాన్ని తెలియజేసే అంశాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పగుళ్లు.. ‘మామూలే’నట!
కల్వకుర్తి టౌన్: సాధారణంగా మానవునికి వడదెబ్బ సోకుతుంది. కానీ, విచిత్రంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో చల్లని శీతాకాలంలో వేసిన రోడ్లకు వడదెబ్బ తగిలిందా అన్న అనుమానం కలుగుతుంది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. కానీ, ఇదే అర్థం వచ్చేలా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగంతోపాటు.. క్వాలిటీ సెల్ చూసే జిల్లా స్థాయి అధికారి ఇలా చెప్పడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ.కోట్లు వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులకు ఉన్న శ్రద్ధ.. నాణ్యత విషయంలో ఎందుకు లేకుండా పోతోందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత విషయంలో అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం ముగుస్తుండటంతో.. కల్వకుర్తి మున్సిపాలిటీలో గతేడాది కిందట సుమారు రూ.15 కోట్లతో 22 వార్డుల్లో టీయూఎఫ్ఐడీసీ, మిషన్ భగీరథ కింద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా రోడ్లకు సంబంధించి కనీసం పదేళ్లు లైఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ విషయం అటుంచితే.. కనీసం ఏడాదిపాటు వ్యాలిడిటీ లేకుండా పగుళ్లతోపాటు, పలుచోట్ల ఏకంగా గుంతలు కూడా ఏర్పడ్డాయి. ఇటీవల మున్సిపల్ పాలకవర్గం ముగుస్తుందన్న తొందరలో ఆయా వార్డుల్లో పలుచోట్ల టీయూఎఫ్ఐడీసీ కింద రూ.10 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. అధికారే.. కాంట్రాక్టర్? మున్సిపాలిటీలోని రోడ్లకు సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని భావించి.. ఆదరాబాదరాగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్గా తన పేరు ఉంటే ఇబ్బంది అవుతుందని, బంధువు పేరిట కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ చేసి టెండర్లు వేయించారు. బంధువుకు కల్వకుర్తిలో ఏకంగా ఒక ఇల్లు అద్దెకు ఇప్పించి, ఎలాంటి అనుమానం రాకుండా తనే సొంతంగా పనులు చేపట్టాడు. ఇలా సీసీ రోడ్లు మాత్రమే కాకుండా, మున్సిపాలిటీలో చాలా పనులను దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సదరు అధికారి బదిలీ కావడంతో సీసీ రోడ్ల నాణ్యతా లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాజకీయ నాయకుల ముసుగులో మరికొందరు కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకొని, వారి బినామీ పేర్లపైన కాంట్రాక్టులు చేపట్టిన వారికి కూడా ఆ అధికారి అండదండలు బలంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకే వత్తాసు.. మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణంలో వరుసగా నాణ్యతా లోపాలు బయటపడుతున్నా.. మున్సిపల్ అధికారులు వాటిని తేలికగా తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ క్యూసీ (క్వాలిటీ కంట్రోల్) కేవలం జనరల్ ఫండ్, ఇతరత్రా వాటికే పనిచేస్తుండటంతో.. టీయూఎఫ్ఐడీసీ కింద నిర్మాణం చేపట్టే రోడ్లకు మాత్రం పబ్లిక్ హెల్త్ క్వాలిటీ సెల్ అధికారులు నాణ్యత పరిశీలిస్తారు. అయితే ఈ అధికారులు పగుళ్లు ఏర్పడటం కామన్ అని తీరిగ్గా చెప్పుకొస్తున్నారు. అధికారులే కాంట్రాక్టర్లకు వత్తాసు పలకటం, నాణ్యతపై రాజీ కుదిరేలా వారి వ్యవహార శైలి ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. క్వాలిటీ సెల్ కాకుండా సీసీ రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ విచారణ చేస్తే మరిన్ని నాణ్యతా లోపాలు బయటకు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో నెలకిందట వేసిన సీసీరోడ్లకు నెర్రెలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నాణ్యతా లోపాలు సాధారణమేనని చెబుతున్న ప్రభుత్వ క్వాలిటీ సెల్ అధికారుల తీరుతో ప్రజాధనం దుర్వినియోగం కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కాలనీలో గత నెలలో సుమారు 400 మీటర్ల మేర నిర్మించిన సీసీ రోడ్డు ఇది. అయితే రోడ్డు వేసిన 15 రోజులకే పూర్తిగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక ఈ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ అధికారులు శాంపిళ్లు సేకరించారే తప్ప, పగుళ్ల గురించి పట్టించుకోలేదు. పైగా పగుళ్లు సాధారణమే అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. రూ.15 లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్డుకు అప్పుడే పగుళ్లు రావడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. క్యూసీని తీస్తున్నాం.. మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాక క్యూసీని తీస్తున్నాం. రోడ్ల పగుళ్లకు ఎండల తీవ్రత ఒక కారణం కావొచ్చు. గతేడాది కిందట వేసిన రోడ్లు పగుళ్లతోపాటు, రోడ్లు దెబ్బతిన్న విషయమై మరోమారు క్యూసీ నిర్వహిస్తాం. నాణ్యతలో లోపాలు ఉన్నట్లుగా గుర్తిస్తే వాటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం. – భరత్కుమార్, పబ్లిక్ హెల్త్ క్యూసీ అధికారి -
బ్రిడ్జి పనులు తుదిదశకు చేరాయి
నార్లాపూర్– ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. బ్రిడ్జికి రెండు వైపులా 20 మీటర్ల మేరకు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి, ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. అయితే వర్షాకాలంలో పెద్దవాగు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న మరో వాగు అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని గుర్తించాం. దీనిపై కూడా వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు పంపాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. – సాయిరాం, పీఆర్ఏఈ ● -
చిన్నవాగు దాటాలి
పెద్దవాగు చేరాలంటే.. రూ.9 కోట్లతో నార్లాపూర్– ముక్కిడిగుండం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం కొల్లాపూర్: ఆ గ్రామాలు అసలే నల్లమల ప్రాంతంలో మూరుమూల విసిరేసినట్టుగా ఉంటాయి. ఆయా గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు ఇప్పుడే తీర్చడం ఇష్టం లేదో.. లేక మరోసారి వంతెన నిర్మాణం చేపట్టి ఎంతో కొంత వెనకేసుకుందాం అనుకున్నారో.. కానీ, ముక్కిడిగుండం– గేమ్యానాయక్తండాల ప్రజల వంతెన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే ముక్కిడిగుండం– గేమ్యానాయక్తండాలకు రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. రెండు ప్రధాన వాగులకు మధ్యలో ఈ గ్రామాలు ఉండటంతో.. తమ కష్టాలు తీర్చాలని దశాబ్దాల కాలంగా వారు ప్రభుత్వాలను కోరారు. గత ప్రభుత్వ హయాంలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా.. మరోవైపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. అయితే అధికారుల అవగాహన లోపం, నిధుల మంజూరులో వ్యత్యాసాల కారణంగా పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అందుబాటులోకి రాబోతున్నా.. ప్రజల రాకపోకల కష్టాలు మాత్రం తీరే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న బ్రిడ్జిపై నిర్మిస్తేనే.. పెద్దవాగు బ్రిడ్జికి అనుసంధానంగా మరో వంతెన లేదా కల్వర్టు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మాల ఓడికైపె వంతెన నిర్మాణం కోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి.. ఉన్నతాధికారులకు పంపారు. మాల ఓడికైపె బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొల్లాపూర్ మండలంలోని మారుమూల ప్రాంతమైన ముక్కిడిగుండం– నార్లాపూర్ మధ్యలో పారుతున్న పెద్ద వాగు ఇది.. ఈ వాగుకు అటువైపు ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండాలు ఉండగా.. ఆయా గ్రామాల ప్రజలు, రైతుల రాకపోకల కోసం దశాబ్దాలపాటు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం రూ.9 కోట్లు వెచ్చించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించింది. ఏళ్లతరబడిగా ఆగుతూ.. సాగిన ఈ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకోగా.. అధికారులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. తుది దశకు పనులు.. త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు సమీపంలోనే అడ్డంకిగా మరో చిన్నవాగు దానిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు ఇప్పట్లో ఎడతెగని వంతెన కష్టాలు ఇక్కడ కనిపిస్తున్న చిన్న వాగు సైతం అదే గ్రామాల మధ్యలో.. పెద్ద వాగుకు సమీపంలోనే పారుతుంది. ఆ పెద్ద వాగు.. చేరాలంటే ఈ చిన్నవాగు దాటాలి.. ప్రస్తుతం ఎండాకాలంలోనే ఈ వాగు పైనున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి వచ్చే ఊట నీటితో ఇలా పారుతోంది. అదే వర్షాకాలంలో అయితే ఇంకెతలా పారుతుందో ఊహించుకోవచ్చు. ఏదైతేనేం ఈ వాగుపై కూడా వంతెన నిర్మాణానికి సంబంధిత అధికారులు మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. -
‘చెవి స్పీకర్లతో వినికిడి కోల్పోతాం’
బిజినేపల్లి: ప్రస్తుత కాలంలో హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్ ప్రతిఒక్కరు ఎక్కువగా వినియోగిస్తున్నారని, తద్వారా వారు వినికిడి లోపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోగ్రాం అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ చెవిలో అనవసరంగా దూది పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని ఉపయోగించి చెవి గుమిలిని తీయడం వలన కర్ణభేరికి గాయమై వినికిడి శక్తి కోల్పోతామని, చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయని చెప్పారు. చెవిలోకి నీరు పోకుండా చూసుకోవాలని, చెవిలో చీము కారడం, చెవి నొప్పి తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విజయ్కుమార్, రాజేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటాల్ రూ. 7,529
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు ఆదివారం 234 మంది రైతులు 165 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 7,529 కనిష్టంగా రూ.4,001, సరాసరి రూ. 6,610 ధరలు వచ్చాయి. మరో ముగ్గురు రైతులు 18 క్వింటాళ్ల కందులను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 6,420, కనిష్టంగా రూ. 6,209 ధర పలికింది. ఇక నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్యార్డులో రెండు రోజులపాటు మాత్రమే క్రయవిక్రయాలు ఉంటాయని కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ఆది, గురువారాల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. -
మిర్చికి రూ.25వేల ధర చెల్లించాలి
కల్వకుర్తి రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి క్వింటాల్ రూ. 25వేల ధర చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తున్నారని చెప్పారు. రెండేళ్లుగా మిర్చికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని.. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కౌలు రైతులు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు కౌలు చెల్లించడంతో పాటు రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగుచేస్తున్నారని వివరించారు. ఒకరిద్దరు రైతులకు మాత్రమే గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా.. చాలా మందికి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. పండించిన పంటకు మంచి ధర వస్తుందనుకుంటే.. మార్కెట్లో రూ. 12వేల నుంచి రూ. 13వేలకు మించి ధర లభించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తేవడంతో పాటు మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా మిర్చిని రూ. 25వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు ఆంజనేయులు, నాయకులు ఆర్.శ్రీనివాస్, బాలస్వామి, ఏపీ మల్లయ్య, బాల్రెడ్డి, రామయ్య, ఆంజనేయులు, ఈశ్వర్, శివవర్మ, దశరథం, కిషోర్, నిర్మల తదితరులు ఉన్నారు. -
నీటి ఊటతో పెరుగుతున్న బురద..
టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. -
రమణీయం.. ఆది దంపతుల కల్యాణం
నాగర్కర్నూల్రూరల్: మండలంలోని కుమ్మెర గట్టుపై స్వయంభూ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుమ్మెర గట్టు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పండితుడు పట్నం సురేశ్ శర్మ ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. భక్తజనంతో కుమ్మెర గట్టు కిక్కిరిసిపోయింది. స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్రెడ్డి పాల్గొన్నారు. -
పాలమూరు వాసులు అమాయకులేం కాదు..
దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. -
కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం
● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచి స్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
బిజినేపల్లి: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆదివారం మండలంలోని మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి విద్యుత్ సబ్స్టేషన్లు సందర్శించి.. స్థానిక రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోఓల్టేజీ కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చోట డీటీఆర్లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే రైతులు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురావచ్చని తెలిపారు. డైరెక్టర్ వెంట విద్యుత్శాఖ అధికారులు శ్రీధర్, రాకేష్రెడ్డి తదితరులు ఉన్నారు. -
తీర్చుకుంటా
పాలమూరు రుణం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభిృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. పదేళ్లు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి -
పరిస్థితి సంక్లిష్టం..
నాగర్కర్నూల్ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. సీఎం పర్యటన సైడ్లైట్స్ కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు -
నేడు వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం -
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
నాగర్కర్నూల్/ అచ్చంపేట రూరల్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ నెల 31లోగా క్రమబద్ధీకరించి ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందుకోసం నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్లో తెలియజేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 79955 15737, 94941 41708లను సంప్రదించాలని సూచించారు. ● అచ్చంపేటలోనూ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
చివరి అంకానికి..
నాగర్కర్నూల్ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025బురద, నీటి ఊటలు.. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ● టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ ● నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా ● సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటనా స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. అదనపు మోటార్ల ఏర్పాటు.. సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కుకున్న వారి అవశేషాలు వెలికితీసేందుకు వీలవుతుంది. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. -
మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నం
నాగర్కర్నూల్: ఇంటి పన్ను అడిగేందుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడంతో సదరు వ్యక్తిపై మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో శనివారం ఉదయం వార్డు ఆఫీసర్ కుమార్ కొంతమంది సిబ్బందితో కలిసి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. అయితే కొట్ర లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఇంటి పన్ను అడగడంతో పన్నులేదు.. ఏమీ లేదంటూ.. మహిళా సిబ్బంది, ఇతర సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సిబ్బంది వెనక్కి వచ్చి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్కు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ దాడికి ప్రయత్నించిన లక్ష్మణ్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీస్స్టేషన్లో కమిషనర్ ఫిర్యాదు -
పటిష్ట బందోబస్తు..
సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. శనివారం ఉదయం సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్రన్ నిర్వహించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించారు. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంకార్డులు విధుల్లో పాల్గొననున్నారు. -
మహిళల రక్షణ కోసం షీటీం కృషి
నాగర్కర్నూల్ క్రైం: మహిళల రక్షణ కోసం షీటీం నిరంతరం పనిచేస్తుందని ఏఎస్పీ రామేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన పోకిరీలను గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. గత నెలలో మొత్తం 16 ఫిర్యాదులు రాగా.. అందులో 6 కేసులు నమోదు చేయడంతోపాటు 10 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 20 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎవరైనా వేధింపులకు గురైతే డయల్ 100, సెల్ నం.87126 57676ను సంప్రదించాలని సూచించారు. -
ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులపై రైతుల ఫిర్యాదు
బల్మూర్: కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం భూ నిర్వాసిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఐ రమాదేవి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వస్తుందని తిరస్కరించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతు కమిటీ నాయకులు సీతారాంరెడ్డి, తిరుపతయ్య, ఇంద్రారెడ్డి తదితరులు స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తే నాలుగు గ్రామాల రైతుల భూములు కోల్పోతామని కోర్టును ఆశ్రయించగా నిర్వాసితులకు పరిహారంతోపాటు పిసా చట్టం ప్రకారం ఏజెన్సీ గ్రామమైన బల్మూర్లో ఎస్సీ, ఎస్టీ రైతులకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కానీ, భూ సేకరణ చేయకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు నిలిపి వేయకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడమని తేల్చిచెప్పారు. కోర్టు పరిధిలో తేల్చుకోవాలని తిరస్కరించిన పోలీసులు -
అడ్డంకులు దాటుతూ..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు వివరాలు 8లో uఅచ్చంపేట/అచ్చంపేట రూరల్: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. కటింగ్ చేసిన విడి భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్ ద్వారా సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలలో సొరంగం బయటికి బురద, గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. జేసీబీలు, బృందాలు లోపల బురదను పక్కకు తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు. సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. ● టన్నెల్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అదనపు బృందాల రాక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద మట్టి పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు. ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు -
ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద యుద్ధ ప్రాదిపదికన సహాయక చర్యలు చేపడుతున్నా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల నుంచే ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా శవ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల సంఘటనలు జరిగినా.. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరూ కూడా పరామర్శించలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు పరామర్శించడానికి వెళ్తే అడ్డుకుని అరెస్టులు చేయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని మాట్లాడటం సరైంది కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడేళ్లలో 25 కి.మీ., సొరంగం పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 5 కి.మీ., మాత్రమే సొరంగం పనులు చేపట్టారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. -
మాస్ కాపీయింగ్కు తావివ్వొద్దు
కందనూలు: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్ పరీక్షల కన్వీనర్ వెంకటరమణ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం జిల్లాకేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాళ్లకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇంటర్ బోర్డు ప్రతినిధిగా డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పించాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూడాలని, సెల్ఫోన్ అనుమతించకూడదని సూచించారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు. విహాన స్కానింగ్ సెంటర్, శ్రీ సత్యసాయి నర్సింగ్ హోంలోని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన గర్భిణుల స్కానింగ్ వివరాలు, ఫారం–ఎఫ్ల రికార్డులు, స్కానింగ్ మిషన్ వివరాలను సేకరించారు. లింగ నిర్ధారణ చట్టం గురించి తెలిపే బోర్డులను పరిశీలించి, స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు లింగ నిర్ధారణ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారు, చేయించుకున్న వారు, ప్రోత్సహించిన వారు గర్భ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, గర్భ నిర్ధారణ నిరోధక చట్టం అమలుకు వైద్యులు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట డీపీఓ రేణయ్య, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అచ్చంపేట: జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఉన్నత స్థాయి అధికారులు శుక్రవారం కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు సమీక్షిస్తున్న కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్ఎల్బీసీ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. వీరికోసం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,477 మంది విద్యార్థులు ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది ఉన్నారన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్తో పటిష్ట నిఘా పెడతామని వివరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి కస్టోడియన్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పూర్తిగా మూసివేయించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచించామన్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు ఇతర మందులతో మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, ఆశాలు అందుబాటులో ఉంటారన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా, పరీక్ష కేంద్రాల వద్ద మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి
కందనూలు: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనకు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఏఎంవో షర్పుద్ధీన్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది అక్టోబర్లో డీఎస్సీ ద్వారా నియామకమైన 129 నూతన ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై శిక్షణలో భాగంగా మొదటిరోజు ప్రారంభమైంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిపెట్టి సామర్థ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగర్కర్నూల్ ఎంఈఓ భాస్కర్రెడ్డి, పాఠశాల హెచ్ఎం సిద్ధిక్ అహ్మద్, రీసోర్స్పర్సన్స్ లక్ష్మీనర్సింహరావు, నెహ్రూప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చేరేందుకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాఘవేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నామని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు బిజినేపల్లి: పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని వసంతాపూర్ గ్రామం పల్లె దవాఖానాను సందర్శించి, వర్చువల్ పద్ధతిలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల అసెస్మెంట్లో పాల్గొన్నారు. పల్లె దవాఖానాల్లో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటివి పరిశీలించారు. క్షయ నిర్మూలన, దోమకాటులో వ్యాధుల నియంత్రణ, అసంక్రమిత వ్యాధుల నివారణ వంటి కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాలెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రియాంక, డీపీఓ రేణయ్య, క్యూసీ మేనేజర్ సంతోష్కుమార్, ఆశాలు పాల్గొన్నారు. వేలం పాట వాయిదా చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయంలో శనివారం ని ర్వహించే వేలం పాట అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాట తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. -
కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం.. ●15 ఏళ్లుపై బడిన వెహికిల్స్తో తీవ్రమైన కాలుష్యం ఆదేశాలు ఇచ్చాం.. ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన అన్ని రకాల వాహనాల వివరాలు జిల్లా వాహనాలు మహబూబ్నగర్ 13,965 నాగర్కర్నూల్ 5,295 వనపర్తి 4,059 జోగుళాంబ గద్వాల 3,672 నారాయణపేట 5,190 -
రెండోరోజూ కొనసాగిన గాలింపు
● 100 ఫీట్ల మేర నీటి తోడివేత ● రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం ● లభ్యం కాని విద్యార్థి ఆచూకీ – వెల్దండ వివరాలు 8లోపక్కా భవనాలు లేక.. ● కోడేరులో పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. -
రెండేళ్లలో ఉమామహేశ్వరం ప్రాజెక్టు పూర్తి
బల్మూర్: ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ప్రాజెక్టు పనులను గురువారం ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2.5 టీఎంసీలకు తగ్గించామని తెలిపారు. ఫేజ్–1లో రూ.1,534 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
జనరల్ ఆస్పత్రి @ 900
పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రి 650 పడకల నుంచి 900 పడకలకు అప్గ్రేడ్ అయ్యింది. కొత్తగా మరో 250 పడకలు అదనంగా పెంచుకోవ డానికి ఎన్ఎంసీ అంగీకరించినట్లు రెండ్రోజుల కిందట డీఎంఈకి ఉత్తర్వులు అందాయి. మరో రెండు నెలల్లో 900 పడకలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేపడుతోంది. పెరిగిన పడకల నేపథ్యంలో సరిప డా వైద్యుల దగ్గరి నుంచి నాలుగో తరగతి, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. పడకల పెంపుపై ప్రభుత్వ వర్గాల నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం 13 విభాగాల్లో 28 పీజీ సీట్లు ఉండగా ఇటీవల అర్థోకు 4, ఈఎన్టీ విభాగానికి 3 పీజీ సీట్లు దర ఖాస్తు చేయగా వాటికి సైతం మార్చి మొదటి వా రంలో అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పడకల పెంపుతో జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు మె రుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పని ఒత్తిడి తట్టుకోలేక.. జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్ఆర్లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. పరిపాలన, టెక్నికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఇలా.. పీజీలో కూడా సీట్లు మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 250 పడకలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి రావడంతో పకడలు 900 చేరాయి. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా పడకలు ఆస్పత్రిలో అవసరం ఉన్నాయి. పీజీలో కూడా సీట్లు మరిన్ని పెరుగుతాయి. మార్చిలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – రమేష్, మెడికల్ కళాశాల డైరెక్టర్, పాలమూరు అనేక కొత్త సమస్యలు జనరల్ ఆస్పత్రి తాజా పరిస్థితిని పరిశీలిస్తే మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. పడకల పెంపుతో అనేక కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అరకొర సిబ్బందితో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్నవారు పని చేయలేమంటూ వాపోతున్నారు. ఇక కాంట్రాక్టు వైద్యులు తమ వల్ల కూడా కాదంటూ ఇప్పటికే కొందరు తప్పుకున్నారు. ఇక ఆస్పత్రిని ఒంటిచేతిపై నడిపిన ఎస్ఆర్లు సైతం లేకపోవడంతో ఇబ్బందులు పెరిగి.. జనరల్ ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటిని భర్తీ చేస్తే తప్ప రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి దవాఖానాల్లో వసతులు, ఆధునిక పరికరాలు సమకూర్చుతున్నా.. ఖాళీలపై దృష్టి పెట్టకపోవడంతో రోగులకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి. అదనంగా 250 బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎన్ఎంసీ ఆదేశాలు ఇప్పటికే డీఎంఈకి అందిన ఉత్తర్వులు రెండు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయడానికి కసరత్తు వసతులు సమకూరినా.. ఖాళీల భర్తీపై దృష్టిపెట్టని ప్రభుత్వం అరకొర వైద్యులతో రోగులకు మెరుగుపడని వైద్యసేవలు ఆదేశాలు వచ్చాయి.. జనరల్ ఆస్పత్రి పడకల స్థాయి 650 నుంచి 900కు పెంచడానికి అన్ని రకాలుగా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఎన్ఎంసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం, డీఎంఈతో నుంచి అధికారికంగా రావాల్సి ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. పడకలు పెరగడం వల్ల రోగులకు మరింత వైద్య సేవలు పెరుగుతాయి. – సంపత్కుమార్సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్నగర్ -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
నాగర్కర్నూల్: వచ్చేనెల 5 నుంచి 22 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో సరిపడా ఫర్నిచర్, తాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవ్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరంలో 6,977 మంది పరీక్షకు హాజరు కానున్నారని, వీరికోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 14 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 11 మంది అదనపు సూపరింటెండెంట్లు, ఇద్దరు ఫ్లయింగ్, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఆరుగురు కస్టోడియన్లు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలపై ఆసక్తితోనే ఉన్నత స్థాయికి..
బిజినేపల్లి: సైన్స్ను ఇష్టపడి శాస్త్రవేత్త కాలేకపోయినా.. జీవితకాలం సైన్స్ ఫ్యాకల్టీగా సైన్స్ పరిశోధనలపై ఆసక్తితోనే ప్రతాప్ కౌటిల్య ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్ అన్నారు. ప్రతాప్ కౌటిల్య 2025 సంవత్సరానికి గాను అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకోవడంతో గురువారం ఆయనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్ ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న ప్రతాప్ కౌటిల్య పరిశోధన పట్ల అభిరుచితో సైన్స్ డాట్ కామ్, సైన్స్ నేచర్ వంటి మూడు పుస్తకాలు రచించారన్నారు. ఇందుకు గాను ఆయనకు 2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ప్రతిభా అవార్డు, 2024లో జాతీయ పురస్కారం అందుకున్నారన్నారు. అనంతరం ప్రతాప్ కౌటిల్యకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీలోప్రవేశాలు కందనూలు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025– 26 సంవత్సరానికి మోడల్ స్పోర్ట్స్ పాఠశాల, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్లాగ్ ఖాళీలు పూర్తి చేస్తూ.. ప్రస్తుతం 4, 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన బాల, బాలికలు అర్హులన్నారు. జిల్లా స్థాయి ఎంపికలను వచ్చే నెల 12 నుంచి 16 వరకు అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామని చెప్పారు. జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో గురువారం తగ్గింది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 2,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. గురువారం ఉదయానికి 365 క్యూసెక్కులకు తగ్గిపోయాయి. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా.. ఇక్కడికి కేవలం 2,418 క్యూసెక్కులు 24 గంటల పాటు చేరాయి. అనంతరం పూర్తిగా ఇన్ఫ్లో తగ్గింది. తాగు, సాగు నీటికి ఈ సారి తిప్పలు తప్పేలా లేనట్లుగా కనిపిస్తోంది. ఆవిరి రూపంలో 75 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 625, భీమా లిఫ్టు–1కు 550, కోయిల్సాగర్కు 220, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 375, ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.721 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. -
శిథిలాల తొలగింపు షురూ
లోకో ట్రైన్ మూడు కోచ్ల ద్వారా మట్టి వెలుపలికి.. అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలే దు. టన్నెల్ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్ గురువారం మొదలైంది. సహాయక చర్య ల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్ మూడు కోచ్ ద్వారా మట్టి శిథిలాలను తీసుకొ చ్చారు. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ., వద్ద టీబీఎం మిషన్ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్ చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందు కు లోకో ట్రైన్ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా ప్రతిష్టమైన పునఃనిర్మాణం చేస్తున్నారు.అయితే దెబ్బతిన్న కన్వేయర్ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. ● టన్నెల్లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. కఠిన ఆంక్షలు.. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం.. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెన్షన్.. టెన్షన్ మాజీమంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను టన్నెల్ లోపలికి అనుమతించకపోవడంతో జేపీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. టన్నెల్ సందర్శనకు వచ్చిన బృందాన్ని పోలీసులు ముందుగా దోమలపెంట ఫారెస్టు చెక్పోస్టు, జేపీ కార్యాలయానికి వెళ్లే గేటు వద్ద, సొరంగం మార్గం రహదారిలో మూడు చోట్ల అడ్డుకుని తనిఖీలు చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన వాహనాలను లోపలికి పంపించకుండా ఫారెస్టు చెక్పోస్టు వద్దే అడ్డుకున్నారు. పోలీసులు చివరికి హరీశ్రావుతోపాటు ముఖ్య నాయకులు 10 మంది మాత్రమే లోపలికి పంపించారు. సొరంగం వద్దకు వెళ్లేందుకు ముందు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించడంతో హరీశ్రావుతోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టన్నెల్ లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ బృందం సొరంగం వద్దకు చేరుకుని రెస్క్యూ టీం సభ్యులు, ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం జేపీ కార్యాలయం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, జేపీ కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్తో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని పోలీసుల ద్వారా సమాచారం పంపించారు. కానీ, వారెవరనూ రాకపోవడంతో జేపీ కార్యాలయం గేటు వద్ద ఉత్తమ్కుమార్రెడ్డి బయటికి రావాలని, అధికారులు వచ్చి తమతో మాట్లాడాలని నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్తో పాటు మరో మూడు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీకి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులలో నీళ్లను కూడా కాపాడలేకపోతున్నారని, శ్రీశైలం అడుగంటిందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం మీద పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల ప్రాజెక్టుల ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాల్సి ఉండగా.. ఇప్పటికే శ్రీశైలం ఖాళీ అవుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడుకు నీరు తరలించుకుపోతుంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 20 మంది చొప్పున మూడు షిఫ్ట్లోపనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్ బెల్ట్ -
మరికొన్ని వివరాలు..
● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. ● 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు.అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. -
దారులన్నీ నల్లమల వైపే..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజులుగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివెళ్తుండటంతో నల్లమల కొండలు జనసంద్రంగా మారాయి. ఉమామహేశ్వరం, భౌరాపూర్, శ్రీశైలం క్షేత్రాలకు వెళ్లే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 120 మంది పోలీసులను నియమించారు. అదే విధంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంటలలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. పాతాళాగంగ వద్ద 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉన్నారు. అత్యవసర పరిస్థితిల్లో రోగులను తరలించేందుకు రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. -
అంతుచిక్కడం లేదు..
సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవా ల్గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచి క్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటి కి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. వాస్తవానికి టన్నెల్ బో రింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది. -
శివం శంకరం
అచ్చంపేట/కొల్లాపూర్: ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ శంభో శంకర.. సర్వేశ్వర సదా స్వరామి అంటూ నల్లమలలోని శైవ క్షేత్రాలు మార్మోగాయి. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటిని భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. లింగోద్భవ కాలంలో ఆదిదేవుడి దర్శనానికి బారులు దీరారు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, అంతరగంగా, భౌరాపూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొల్లాపూర్ మండలం సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని తన్మయం చెందారు. అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, కొల్లాపూర్ శివాలయం, మన్ననూర్ లింగమయ్య, దోమలపెంట ఉమామహేశ్వరాలయం, లొద్దిమల్లయ్య క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసదీక్ష చేపట్టారు. రాత్రి జాగరణ చేశారు. ఆలయాల వద్ద దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు నల్లమలలో జనసంద్రమైన శైవక్షేత్రాలు -
అంతా వారి కనుసన్నల్లోనే..!
కల్వకర్తి బల్దియాలో కిందిస్థాయి సిబ్బందిదే పెత్తనం ● అర్హతకు మించి విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉద్యోగులు ● రెగ్యులర్ ఉద్యోగులకు నామమాత్రంగా విధులు ●చర్యలు తీసుకుంటాం.. నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్లను వారివారి స్థానాల్లో కేటాయిస్తాం. అర్హత గల వారినే కార్యాలయ విభాగాల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఎవరి పనుల్లో వారే ఉండేలా ప్రక్షాళన చేసి.. ఔట్సోర్సింగ్ వారిని విభాగాల్లో కాకుండా సాధారణ పనుల్లో విధులు కేటాయిస్తాం. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన విభాగాలైన ఇంజినీరింగ్, అకౌంట్స్ విభాగాల్లో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వేదం. ఆయా విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నా.. కార్యాలయంలో ఆఖరి పోస్టు (ఆఫీస్ సబార్డినేట్)లో పనిచేసే వారే శాసిస్తారు. వారిని ప్రసన్నం చేసుకుంటేనే ఏ ఫైల్ అయినా ముందుకు కదులుతుంది. కాంట్రాక్టుల విషయంలోనూ వారు చెప్పిందే కొటేషన్లో ఉంటుంది. మున్సిపాలిటీలో వీరంతా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తూ బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా రెగ్యులర్ ఉద్యోగాలకు ఎంపికై .. ఇప్పుడు కార్యాలయాన్నే శాసించే స్థాయికి ఎదిగారు. ఆయా శాఖల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పోవడం తప్ప.. వీరిని కాదని పనిచేస్తే ఉన్నతాధికారుల నుంచి వాయింపు తప్పడం లేదని వాపోతుండటం గమనార్హం. ● అధికారులకు నచ్చితే చాలు.. అర్హత లేకున్నా ఎలాంటి విధులైనా నిర్వర్తించవచ్చు కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించినా వారిని మాత్రం ఇక్కడ పక్కన పెడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందికి పాలకులు, కాంట్రాక్టర్ల అండదండలు ఉండటంతో పూర్తిస్థాయిలో కార్యాలయాన్ని శాసిస్తున్నారు. బదిలీపై అధికారులు వచ్చినా.. వారికి నామమాత్రమైన విధులను కేటాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందితోనే అన్ని కార్యకలాపాలను సాఫీగా చేయించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో మున్సిపాలిటీలో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతోంది. అయితే అధికారులకు అమ్యామ్యాలు అందుతుండటంతోనే వారిని ఆయా స్థానాల నుంచి కదిలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నా.. కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2012లో నగర పంచాయతీగా, 2014లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. అప్పట్లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న సిబ్బందితోనే కార్యాలయ విభాగాలను నెట్టుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్–4 ద్వారా రెగ్యులర్ ఉద్యోగులను భర్తీ చేసింది. తద్వారా కల్వకుర్తి మున్సిపాలిటీకి సుమారు 11 మంది జూనియర్ అసిస్టెంట్లతో పాటు వార్డు ఆపీసర్లను సైతం కేటాయించారు. వీరిలో వార్డు ఆపీసర్లు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుండగా.. జూనియర్ అసిస్టెంట్లకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పూర్తిస్థాయి శాఖను కేటాయించ లేదు. దీంతో రోజు వారు కార్యాలయంలో ఖాళీగా ఉంటున్నారు. వారికి కనీసం మున్సిపాలిటీ విధులపై అవగాహన కల్పించకపోవడం గమనార్హం. కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం స్థాన చలనం కలిగేనా..? మున్సిపాలిటీలో కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది కమిషనర్లు మారారు. సిబ్బంది వ్యవహార తీరును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారుల పట్టింపు లేకపోవడంతో వారంతా చివరకు ఆయా శాఖల్లోని ఉన్నతాధికారులను శాసిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే ఆయా విభాగాల్లో పనులను చక్కబెడుతున్నారు. అయితే కొందరు సిబ్బందికి గత పాలకవర్గం అండగా నిలుస్తూ వచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం పాలకవర్గం లేనందున ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అర్హత గల ఉద్యోగులను వారివారి స్థానాలకు కేటాయిస్తారో లేదో వేచి చూడాలి. -
హెలీప్యాడ్లు లేక..
సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చిపోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్గౌర్ మరో హెలిక్యాప్టర్లో వచ్చారు. ఒక హెలీప్యాడ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. -
కనిపించని పురోగతి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్లోని డెహ్రాడూన్లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం నీటిని, బురద తొలగించడం పెద్ద సవాలే.. రెండు రోజుల్లో తీసుకు వస్తామన్న మంత్రులు -
పండగ పూట విషాదం
● గుండాల కోనేరులో స్నానం చేస్తూ విద్యార్థి గల్లంతు ● ఆచూకీ కోసం శ్రమిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ● మోటార్ల సహాయంతో బయటకు నీటి తోడివేత శివదీక్ష విరమణకు శ్రీశైలానికి వచ్చి.. ● పాతాళగంగలో మునిగి తండ్రీకొడుకు మృతి ● మృతులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసులు వివరాలు 8లో.. -
మంత్రుల పర్యవేక్షణ..
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్మార్రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
అచ్చంపేట రూరల్: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన బీటీఎఫ్ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని చైతన్యం చేయడానికి, మూఢ నమ్మకాలు, అన్ని వివక్షతలకు వ్యతిరేకంగా, జ్ఞాన సమాజం కోసం పని చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగం సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల మండలాల కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో రవీందర్, కరుణాకర్ తదితరులు ఉన్నారు. -
2న వనపర్తికి ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ఇలా.. జిల్లా జనరల్ ఆస్పత్రిని 500 పడకలకు పెంచడం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటర్మీడియట్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి పనుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పర్యటనలో తన చిన్ననాటి స్నేహితులతో కొంత సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జాగ్రత్తలు పాటించాలి నాగర్కర్నూల్ క్రైం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర చేసే భక్తులు అటవీశాఖ నిబంధనలు పాటిస్తూ.. వారు సూచించిన మార్గంలోనే వెళ్లాలన్నారు. వాహనదారులు వేగంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని.. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వికలాంగుల సంక్షేమంపై చిన్నచూపు తగదు నాగర్కర్నూల్రూరల్: వికలాంగుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం వికలాంగుల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమయ్యతో కలిసి పర్వతాలు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వికలాంగుల సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం తగదన్నారు. వికలాంగులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందించాలని కోరారు. వికలాంగుల హక్కుల సాధనకు సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గగనమోని అంజయ్య, బాలీశ్వర్, కోట్ల గౌతమ్, సైదులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు చెల్లించండి అచ్చంపేట రూరల్: పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల శుభ్రతకు నిరంతరం పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. కార్మికులకు ఇచ్చి హామీలను నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులు కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, మల్లేష్, చిట్టెమ్మ, బాలస్వామి, తిమ్మయ్య, సుల్తాన్, నిరంజన్, ఇసాక్ పాల్గొన్నారు. -
సన్నగిల్లుతున్న ఆశలు
నాలుగు రోజులైనా దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫ లించడం లేదు. ఈ నెల 22న ఘటన జరగగా ఇప్ప టి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 11 రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా కనీసం ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. మంగళవారం నాలుగో రోజు కూడా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధిత కుటుంబాల్లో నిరాశ, నిస్పృహ అలుముకోగా.. ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలకు ఆటంకం సొరంగంలో సెగ్మెంట్ బిగిస్తుండగా ఏర్పడిన రంద్రం వల్ల నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. బురద, నీటి ప్రవాహంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర 11 బృందాలకు చెందిన 750 మంది నిపుణులు కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం మరిన్ని బృందాలు రంగంలోకి రానున్నాయి. చెల్లాచెదురైన మిషన్ 40 మీటర్ల వద్దకు చేరుకునేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిషానికి 3,600 నుంచి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో రెండు 100 హెచ్పీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నా ఊట అదుపులోకి రాలేకపోతోంది. రేపటి వరకు నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆశాభావం మంత్రుల బృందం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎల్అండ్టీ సంస్థ రెండు క్రేన్లను కూడా తెప్పించింది. వాటిని లోపలికి తీసుకెళ్లి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచారు. మరోవైపు పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. మంగళవారం పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వారితో చర్చలు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల షిఫ్టులో వెళ్లాల్సిన బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు లోపలికి వెళ్లింది. నిత్యం సమీక్షలు సొరంగ ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వివిధ దేశాలకు చెందిన నిపుణులను రప్పించి సహాయక చర్యలు సాగిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల రాకతో వారి భద్రతా ఏర్పాట్లు, అధికారుల హడావుడితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది. నీరు, మట్టిని తొలగిస్తేనే.. టన్నెల్లో కాంక్రీట్ సెగ్మెంట్లతోపాటు నిర్మాణ సామగ్రి, సెగ్మెంట్ మిషన్, ఇతర సామగ్రి, కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్ ట్రాక్ వంటివి నీటిలో మునిగి, మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సెగ్మెంట్ల కింద కానీ, బురదలో కాని బాధితులు చిక్కుకుని ఉంటారని, తొలగింపు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు వచ్చిన బృందాలు తాళ్లు, పలుగు, పారలతో లోపలికి వెళ్లారు. నీరు, మట్టిని తొలిగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు తొలగిస్తుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఘటనా స్థలానికి కొద్దిదూరంలోనేఆగిపోతున్న రెస్క్యూ బృందాలు భారీగా వస్తున్న నీటి ఊటతో తీవ్ర ఆటంకం టన్నెల్ లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ దేవుడిపైనే భారమంటున్న కుటుంబ సభ్యులు -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 5నుంచి 25వ తేదీ వరకు జరిగే పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని.. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఇది వరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఇక నుంచి ఆ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఓటీపీ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు ఈ ఏడాది నుంచి అమలులోకి తీసుకువచ్చింది. హాల్ టికెట్పై ఉండే బార్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం సమాచారం తెలుస్తుంది. వసతులపై ఫోకస్.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించడంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ద్వారా ప్రథమ చికిత్స కోసం సిబ్బందిని నియమించండంతో పాటు తరగతి గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రశ్న పత్రాలను తెరవడం, సీల్ వేయడం వంటి వాటిని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. వీటిని కంట్రోల్ కమాండ్ రూమ్కు అనుసంధానం చేయనున్నారు. ఓటీపీ ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్.. ప్రైవేటు కళాశాలల్లో చరువుతున్న విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓటీపీ ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి హాల్టికెట్పై బార్కోడ్ ఏర్పాటు చేశారు. బార్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అధికారుల నియామకం.. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 11మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 33మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఆరుగురు కస్టోడియన్లు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు హైపవర్ కమిటీని నియమించారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. 33 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 15 ప్రభుత్వ, 11 ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పాటు మూడు బీసీ వెల్ఫేర్, ఒకటి ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనార్టీ, ఒక మోడల్ కళాశాల, ఒక సాంఘిక సంక్షేమ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కొనసాగనున్నాయి. మొత్తం 13,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ 4,899, ఒకేషనల్ 1,578 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జనరల్ 5,576 మంది, ఒకేషనల్ 1,401 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. హాజరుకానున్న 13,454 మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఓటీపీతో హాల్ టికెట్ డౌన్లోడ్కు అవకాశం -
పెరటి తోటలపై దృష్టి పెట్టాలి
బిజినేపల్లి: ఇంటి ఆవరణలో కూరగాయల సాగుపై ప్రజలు దృష్టి పెట్టాలని పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం పాలెం కేవీకేలో పెరటి తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పెరట్లో చేపట్టే కూరగాయల సాగులో కృత్రిమ ఎరువులు, మందుల వాడకం ఉండదన్నారు. సేంద్రియ పద్ధతిలో మొక్క పెరుగుతుందన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. పెరట్లో టమాటా, వంకాయ, చిక్కుడు, మిరప, బెండ, కాకర, క్యారేట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీన, పాలకూర వంటి వాటిని పెంచుకోవచ్చని వివరించారు. -
సర్వం.. శివమయం
నేటి మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శైవక్షేత్రాలు ● నల్లమలలో మొదలైన భక్తుల సందడి ● మార్మోగుతున్న శివనామస్మరణ నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, అచ్చంపేటలోని శివాలయం, అంబ దేవాలయం, ఉట్లకోనేరు, చింతలబస్తీ శివాలయం, భక్తమార్కండేయ, పల్కపల్లి భవానీ రామలింగేశ్వరస్వామి, ఉప్పునుంతల కేదరేశ్వరుడు, బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాల్లో ఉత్సవాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ● ఉమామహేశ్వర క్షేత్రంలో బుధవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 7నుంచి రాత్రి 9గంటల వరకు నిత్యాభిషేకం, అర్చనలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి 11గంటలకు లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి 1గంటకు పాపనాశం వరకు పల్లకీసేవ, ఉమామహేశ్వర కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గురువారం తెల్లవారుజామున నందివాహన సేవ, నీరాజన మంత్రం పుష్పాలు, సుప్రభాతం, ఉదయం 7గంటలకు నిత్యాభిషేకం, మహానివేదన ఉంటుంది. ● కొల్లాపూర్ మండలం సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గురువారం శివపార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉంటుంది. సప్తనదుల సంగమ ప్రాంతమైన సంగమేశ్వరాలయం వద్ద కూడా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట/కొల్లాపూర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. విద్యుద్దీపాలతో ముస్తాబై కాంతులీనుతున్నాయి. నల్లమలలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ పరమశివుడిని కీర్తిస్తూ తరలివస్తున్నారు. సదాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పరమశివుడు కోటి సూర్యకాంతులతో మహాశివరాత్రి రోజున మహాలింగంగా ఉద్భవించాడని శివపురాణం చెబుతోంది. బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువుల తగవు తీర్చేందుకు వారిరువురి నడుమ పరమశివుడు మహా తేజోమయంగా లింగరూపంలో ఉద్భవించాడని ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తేజో లింగరూపంలో దర్శనం.. మహాశివరాత్రి రోజున పరమశివుడు కమలనాభ, కమలగర్భులిరువురికి తేజో లింగరూపంలో దర్శనమిచ్చాడని లింగ, కూర్మ, శివపురాణాల్లో ఉంది. మహాశివరాత్రి గురించి మరో అంశం కూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పడు వచ్చిన గరళాన్ని పరమశివుడు మింగి సకల లోకాలకు శుభాన్ని కలిగించిన మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజున మహాశివరాత్రిగా ఆచరిస్తున్నట్లు చెబుతారు. శివుడికి ప్రీతిపదమైన మహాశివరాత్రి రోజున రుత్వికులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లింగోద్భవకాల అభిషేకాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో అర్చకులు, వేదపండితులు మినహా మరెవరినీ గర్భాలయంలోకి అనుమతించరు. సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. -
లక్ష్యం.. చేరేనా?
జిల్లాలోని పంచాయతీల్లో 45.76 శాతమే పన్నుల వసూలు ●మరో 35 రోజుల్లో.. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో ఏరియర్స్, ప్రస్తుత బకాయిలు కలిపి రూ.7,22,46,200 పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.3,30,63,349 పన్నులు (45.76 శాతం) వసూలు చేశారు. ఇంకా రూ.3,91,82,851 వసూలు చేయాల్సి ఉంది. ఇందుకోసం మార్చి 31 చివరి గడువు కావడంతో మరో 35 రోజుల్లో రూ.3.91 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలోని చాలా గ్రామాలు నిధుల లేమితో కనీసం కార్మికుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి. ఆదేశాలు జారీ చేశాం.. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు గడువులోగా వందశాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గడువులోగా అనుకున్న లక్ష్యం చేరుకుంటాం. – రామ్మోహన్, డీపీఓ నాగర్కర్నూల్: పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధులు సక్రమంగా రాకపోవడంతో గ్రామాలు కుంటుపడుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పలు చిన్న గ్రామాలను పంచాయతీలుగా గుర్తించి నిధుల విడుదల పెంచింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సర్పంచ్ల పదవీకాలం కూడా ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వం పాలనా బాధ్యతలు ప్రత్యేకాధికారులకు అప్పగించారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాకపోవడంతో పంచాయతీల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. చిన్న గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. కనీసం ట్రాక్టర్ కిస్తులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పల్లెలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసం జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 461 పంచాయతీలు.. జిల్లాలో మొత్తం 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో మురుగు కాల్వల శుభ్రం, తాగునీటి వసతి, మొక్కల పెంపకం, ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటితోపాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేయించి చెత్త సేకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో ఆయా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి. ఈ క్రమంలోనే గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా పన్నుల రూపంలో నిధులు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం గడువు మరో 35 రోజులే.. నిధులు లేక నీరసిస్తున్న పంచాయతీలు గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి పనులు -
కమనీయంగా.. శ్రీనివాసుడి కల్యాణం
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని సుభాష్నగర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పండితులతోపాటు స్థానిక వేద పండితుల సమక్షంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామివార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ చైర్మన్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో వేదికపైకి తీసుకువచ్చారు. హరీశ్వర దాండియా బృందం నృత్యాలు అలరించాయి. వేడుకలలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్బాబు, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్, సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రమాకాంత్రెడ్డి, కొండల్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
చెంచులకు నేచర్ గైడ్ ప్రతిభ పరీక్ష
మన్ననూర్: ప్రకృతి మార్గదర్శి (నేచర్ గైడ్)పై ఆసక్తి కలిగి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ చెంచు యువతీ, యువకులకు సోమవారం మన్ననూర్లోని ఐటీడీఏ ప్రాంగణంలో అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని కొల్లాపూర్, లింగాల, బల్మూర్, అచ్చంపేట, పదర, అమ్రాబాద్ మండలాలకు చెందిన 61 మంది ఆదివాసీ చెంచులు హాజరయ్యారని అటవీశాఖ ఎడ్యుకేషనల్ అధికారి శ్వేత తెలిపారు. పరీక్షలో ప్రతిభ కనబరిచి అర్హత సాధించగా ఎంపిక చేసిన 30 మంది అభ్యర్థులకు అన్ని ఖర్చులు అటవీశాఖ భరించి బెంగుళూరులో నెలరోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించి అర్హతను ధృవీకరించే అధికారిక పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నేచర్ గైడ్స్ కావాలనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో వీరికి మొదటి ప్రాధాన్యతగా ఉపాధి అవకాశం కల్పించేందుకు చొరవ చూపిస్తామన్నారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణతోపాటు బాధ్యతాయుత పర్యాటక విధానాలను మెరుగుపరచడం దీని ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ ఎఫ్బీఓ మధు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి 45 ఫిర్యాదులు
నాగర్కర్నూల్: కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 45 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించి.. ఆయా శాఖలకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 11.. నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు 11 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో తగు న్యాయం గురించి 3, భూమి పంచాయతీ 7, భార్యాభర్తల గొడవ ఫిర్యాదు 1 వచ్చినట్లు చెప్పారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు బిజినేపల్లి: ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవడం వలన వారు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారని, అంతేకాక ఆ పథకాలను సద్వినియోగం చేసుకుని సరైన ఆచరణలో పెట్టాలని పాలెం కేవీకే సమన్వయకర్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పాలెం ఆర్ఏఆర్ఎస్ ఆడిటోరియంలో కిసాన్ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోడీ కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మాట్లాడిన అనంతరం కేవీకే సమన్వయకర్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలైన పప్పు ధాన్యాల పంటలలో ఆత్మనిర్భరత, అధిక సాంధ్రత పత్తి సాగు, భూసార పరీక్షా పత్రాల పథకం, ఎరువుల సబ్సిడీ వంటివి సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అనంతరం మద్రాస్ ఫర్టిలైజర్స్ మేనేజర్ ఉమాశంకర్ సమతుల్య ఏరువుల యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్, పాలెం కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు అమరచింత: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పట్టణ పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పట్టువస్త్రాలను సోమవారం మహంకాళి శ్రీనివాసులు, సవితారాణి దంపతులు ఆలయ ఈఓకు అందజేశారు. పద్మశాలి భవన్లో పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం తలపై పెట్టుకొని మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసి ఆలయ ఈఓకు సమర్పించారు. వీటిని శివరాత్రి రోజున స్వామి, అమ్మవారికి అలంకరిస్తారు. కార్యక్రమంలో పద్మశాలి సత్రం కమిటీ సభ్యుడు కర్నాటి శ్రీధర్, మహంకాళి సత్యనారాయణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ‘త్రివేణి సంగమ జలాలు పవిత్రం’ వనపర్తిటౌన్: త్రివేణి సంగమంలోని జలాలు పరమ పవిత్రమని ప్రముఖ గురువు ఆదిత్యా పరాశ్రీ స్వామిజీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పెంటగాన్ సమీపంలో కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాల సంప్రోక్షణ కార్యక్రమం పోచ రవీందర్రెడ్డి నేతృత్వంలో నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుంభమేళాకు వెళ్లలేని వారికి ఈ పవిత్ర జలాలు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపపట్టినట్లు వివరించారు. సజ్జన సాంగత్యంతోనే ధర్మమార్గానికి బాటలు పడతాయని.. సజ్జనులు కుంభమేళా జలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జీజే శ్రీనివాసులు, వామన్గౌడ్, కేవీ రమణ, సదానందగౌడ్, శ్రీనివాస్రెడ్డి, సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు. -
నోటిఫికేషన్ జారీ చేశాం..
జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు స్కానింగ్ సేవలు అందించేందుకు గాను రేడియాలజిస్టు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశాం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో జనరల్ ఆస్పత్రిలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక అందజేశాం. జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – డా.రఘు, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
అవస్థలు పడుతున్నాం..
చిన్నచిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుండటంతో దూర, వ్యయభారం అవుతోంది. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తుండటంతో అవస్థలు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో టీ–ఫైబర్ సేవలు అందించాలి. – కొమిరె చెన్నకేశవులు, కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ– ఫైబర్కు సంబంధించిన పరికరాలను బిగించారు. విద్యుత్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. వాటి నుంచి గ్రామ పంచాయతీలకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరం అవుతాయి. – రామ్మోహన్రావు, డీపీఓ -
అందుబాటులోకి రాని టీ–ఫైబర్ సేవలు
అచ్చంపేట రూరల్: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతి పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతు వేదికలు, ఇతర ప్రజా సేవల సంస్థలకు అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైపులైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలను సైతం అమర్చారు. అయితే ఇప్పటి వరకు టీ–ఫైబర్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు.జాడలేని ఈ–పాలన..పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారితనంతో పాటు డిజిటల్ సేవలు అందించాలని గతంలో క్లస్టర్ల వారీగా ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. జిల్లావ్యాప్తంగా 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 60 మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశం. అయితే పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ–పాలన జాడ లేకుండా పోయింది. చాలా వరకు ఈ–పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల్లో ఏమైనా అవాంతరాలుంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి కార్యదర్శులు చేతి రాత రశీదులను జారీ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా టీ–ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే.. గ్రామాల్లోనే డిజిటల్ సేవలు అందుతాయని ప్రజలు కోరుతున్నారు.పరికరాల బిగింపుతోనే సరి..జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అవసరమైన టీ–ఫైబర్ కేబుల్, పరికరాలను సైతం బిగించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ఫలకలు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి.ఎన్నికలలోగా జరిగేనా..ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, విజేతల వివరాలు ఇలా ప్రక్రియంతా ఇంటర్నెట్ ద్వారానే జరగాల్సి ఉంటోంది. గ్రామాల్లో సేవలు అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించకముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో పంచాయతీల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత మాత్రం తప్పడం లేదు. -
స్కానింగ్ సేవలు నిల్.. రోగుల పరిస్థితి డల్
నాగర్కర్నూల్ క్రైం: ప్రస్తుతం ఏ వ్యక్తికి అయినా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు రక్త పరీక్షలతో పాటు స్కానింగ్పైనే ఆధారపడి రోగాన్ని గుర్తించే రోజులు ఇవి. ఆర్థిక భారం మోయగలిగే వారు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి జబ్బును నయం చేసుకుంటారు. డబ్బులేని పేదలు మాత్రం ఆధారపడేది ప్రభుత్వ ఆస్పత్రులపైనే. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు సెంటర్లలో స్కానింగ్ చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నాలుగు నెలలుగా మూత..జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నప్పటికీ.. జనరల్ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా రేడియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో గర్భిణులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు, ఇతర రోగులు స్కానింగ్ చేయించుకోవాలంటే ప్రైవేటు సెంటర్లే దిక్కయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచితంగా చేసే స్కానింగ్కు ప్రైవేటు సెంటర్లలో రూ.800 వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఆరు నెలలకోసారి గర్భిణులకు చేయాల్సిన టిఫా స్కానింగ్ కోసం రూ. 1,800 వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో చెల్లిస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ అవసరమయ్యే ప్రతి రోగిపై ఆర్థిక భారం పడుతుందని.. జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్టును నియమించాలని కోరుతున్నారు.ఆసక్తి చూపని రేడియాలజిస్టులుప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వారికి చెల్లించే జీతం కూడా రూ.లక్షల్లో ఉండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు తర్వాత సీనియర్ రెసిడెంట్గా పనిచేసేందుకు రేడియాలజిస్టు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రేడియాలజిస్టు కాలపరిమితి ముగిసిన తర్వాత వెళ్లిపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న రేడియాలజిస్టు పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసినా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రోజు జనరల్ ఆస్పత్రికి దాదాపు వెయ్యి మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారిలో చాలా మందికి స్కా నింగ్ సేవలు అవసరం పడుతుండటంతో ఇబ్బందికరంగా మారింది. జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
క్షణక్షణం ఉత్కంఠ
రెండు రోజులుగా టన్నెల్లోనే ఎనిమిది మంది కార్మికులు సేవాలాల్ మహరాజ్ జీవితం ఆదర్శనీయం ‘స్కానింగ్’ భారం! టీ–ఫైబర్ సేవలెప్పుడో? సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వివరాలు 8లో uక్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల తర్వాత సొరంగంలో బురద మట్టి, నీటితో పేరుకుపోవడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యపడటంలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణిలోని నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతలుగా సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగో బృందం లోపలికి వెళ్లగా.. అర్ధరాత్రి తర్వాత ఐదో బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్లోకి వెళ్లేందుకు జంకుతున్న కార్మికులు.. పాలకుల నిర్లక్ష్యంతోనే నత్తనడకన పనులు ● ఎస్ఎల్బీసీ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి ● సీపీఐఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: గత పాలకు లు ఎస్ఎల్బీసీకి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే టన్నెల్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోయారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే (సీపీఐఎం) జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇద్దరు ఇంజినీర్లతోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇరుక్కపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి.. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన టన్నెల్ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా.. 20 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పదేళ్లపాటు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఫలితంగా వ్యయం పెరిగి.. అంచనా బడ్జెట్ రూ.4,600 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. టన్నెల్లో ఇరుక్కపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష లింగాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. వివిధ తరగతుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 990 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 920 మంది హాజరయ్యారు. 70 మంది గైర్హాజరైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. కాగా, 10 మంది విద్యార్థులకు వివిధ కారణాలతో ఓఎంఆర్ షీట్ రాకపోవడంతో పరీక్ష రాయలేకపోయారు. టన్నెల్లో ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారితో పాటు లోపలికి వెళ్లి మట్టి, శిథిలాలను తొలగించేందుకు కార్మికులు జంకుతున్నారు. కళ్ల ముందే ప్రమాదం చోటుచేసుకోవడంతో వారు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ క్రమంలో లోపల శిథిలాల తొలగింపు, మట్టి తొలగింపునకు కార్మికులు వెనకాడుతుండటంతో సహాయక చర్యల్లో మందగమనం నెలకొంది. దీంతో లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించే కార్మికులకు దినసరి వేతనం రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఓ ఉన్నతాధికారి సంబంధిత కంపెనీ ప్రతినిధికి సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) ఇన్లెట్ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్పై రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోలేకపోవడంతో ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. వారిని సమీపించేందుకే సహాయక బృందాలకు సాధ్యపడటంలేదు. 9.8 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగం నిండా మట్టి, బురద నిండిపోవడంతో కార్మికుల వద్దకు చేరడం కష్టంగా మారింది. టన్నుల కొద్దీ పేరుకున్న మట్టిని తొలగించడం సైతం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకాలే.. సొరంగంలో కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ (24), ఎఫ్డీఆర్ఎఫ్(120), ఎస్డీఆర్ఎఫ్(24), సింగరేణి(24), హైడ్రా(24) రెస్క్యూ సిబ్బందితో కూడిన బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆయా శాఖల సమన్వయంతో విడతల వారీగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 6–8 గంటలకు ఒక బృందం చొప్పున షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 13వ కి.మీ. వద్దకు లోకో ట్రైన్ వెళ్లడానికి గంట, రావడానికి గంట సమయం పడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన శిథిలాలు పేరుకుని ఉండటంతో రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కడు వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షిస్తున్నారు. పంథా మార్చితేనే సాధ్యం.. కార్మికులను కాపాడేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త పంథా(టెక్నిక్)లో వెళ్లితే తప్ప వారిని బయటికి తీసుకురావడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. సొరంగంలో ఒకే మార్గం గుండా రాకపోకలు చేయాల్సి రావడం, ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకపోవడంతో రెస్క్యూ వీలు కావడం లేదు. రాకపోకలకు, మట్టిని తరలించేందుకు ఒకే ఒక కన్వేయర్ బెల్టు ఉండగా, ఆ మట్టి తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. సొరంగంలో నుంచి మట్టిని, రాళ్లను తొలగించడం అంతా సాధ్యమైన పని కాదని అంటున్నారు. దీంతో కొత్త పంథాలో సహాయక చర్యలు చేపడితేనే ప్రయోజనం ఉండనుంది. ఉత్తరాఖండ్ తరహాలో రెస్క్యూకు సన్నద్ధం.. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించిన తరహాలోనే ఇక్కడ కూడా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా పై నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసు కొచ్చేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సైతం పరిశీలించనున్నారు. సోమవారం ఉదయానికి ఈ తరహా రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉంది. – సాక్షి, నాగర్కర్నూల్ /అచ్చంపేట మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ తగ్గింది. వ్యవసాయ పనులు ఉండటంతో ఆదివారం తక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 6వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో జాతరలో పలు దుకాణాలు వెలవెలబోయాయి. వేరుశనగ @ 7,369 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 7,369, కనిష్టంగా రూ. 4,001, సరాసరి రూ. 7,009 ధరలు వచ్చాయి. మొత్తం 230 మంది రైతులు 1,947 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. కల్వకుర్తి: గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి హరిహరా టౌన్షిప్ వరకు గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే ఆడి పాడారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని తండాలు, గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ బీటీరోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గిరిజన భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేశామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేంగా చేపడుతున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, హనుమాన్ నాయక్, దేవీలాల్ చౌహన్, నిరంజన్ నాయక్, శివరాం, రాజు నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా జనరల్ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా నిలిచిన సేవలు ● రేడియాలజిస్టు లేకపోవడంతో రోగుల అవస్థలు ● స్కానింగ్కు ప్రైవేటు సెంటర్లే దిక్కు ●న్యూస్రీల్భద్రతా ప్రమాణాలపై అనుమానాలు.. ఎస్ఎల్బీసీ సొరంగం తొలుస్తున్న టీబీఎం కొన్ని రోజులుగా మరమ్మతుకు గురై పెద్ద శబ్ధంతో పనిచేస్తోందని కొందరు కార్మికులు చెబుతున్నారు. అలాగే అసంపూర్తిగా కాంక్రీట్ సెగ్మెంట్ ఉండటం, భద్రతా ప్రమాణాలు పాటించకనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారులు స్పందించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందస్తుగా పనుల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రంతా కొనసాగుతున్న సహాయక చర్యలు అర్ధరాత్రి తర్వాత టన్నెల్లోకి ప్రవేశించిన ఐదో బృందం రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్, సింగరేణి, హైడ్రా బృందాలు టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి -
సత్వర న్యాయం అందేలా చూడాలి
నాగర్కర్నూల్ క్రైం: కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయమూర్తులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి శరత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో మెడికల్ డిస్పెన్సరీ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం న్యాయ సేవలు, చట్టాల అమలు, వివిధ శాఖల విధులపై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయస్థానాల ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్ డిస్పెన్సరీ యూనిట్తో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో 400 మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రాజేశ్బాబు, సీనియర్ సివిల్జడ్జి సబిత, న్యాయమూర్తులు శ్రీదేవి, కావ్య, శ్రీనిధి, ఏఎస్పీ రామేశ్వర్, డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బార్ కౌన్సిల్ సభ్యుడు హన్మంత్రెడ్డి పాల్గొన్నారు. -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సు లు నడుపనున్నారు. రీజియన్లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్నగర్ 85, నాగర్కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సు లు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్సుల వివరాలు, తేదీల వారీగా.. మహా శివరాత్రి నేపథ్యంలో రీజియన్ నుంచి 357 సర్వీసులు -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నాగర్కర్నూల్ క్రైం/చారకొండ/వెల్దండ/: విద్యుత్ బకాయిలు పెండింగ్ లేకుండా ప్రతినెలా వసూలు చేయాలని విద్యుత్శాఖ రెవెన్యూ విభాగం జనరల్ మేనేజర్ తులసీ నాగరాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల వసూలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు చారకొండ, సిర్సనగండ్ల గ్రామాల్లో ఆమె పర్యటించి విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ప్రతినెలా బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అర్హులందరూ గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి, గుండాల అంబా రామలింగేశ్వరస్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ పాల్రాజ్, డీఈ శ్రీధర్శెట్టి, టెక్నికల్ డీఈ రవికుమార్, పార్ధసారథి, శ్రీనివాస్, ఏఈ జానకీరాం నాయక్, శంకర్, వెంకటయ్య రాఘవేందర్గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి/కొత్తకోట రూరల్: దేశంలో ఉన్న మంచినూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రైతులు అత్యధికంగా ఆయిల్పాం సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరా రు. దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లిలో ప్రీ యూనిక్ సంస్థ నిర్మించనున్న ఆయిల్పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్పాం రైతులతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంట ఆయిల్పాం మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఆయిల్పాం గెలలు టన్నుకు రూ.20,487 ధర పలుకుతుందని త్వరలో రూ.25 వేలకు చేరుతుందని వివరించారు. ఆగస్టు 15 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని.. అదేవిధంగా బీచుపల్లి వద్ద ఉన్న కంపెనీ మరమ్మతు పూర్తిచేసి ఇదే సంవత్సరంలో వినియోగంలోకి తీసుకువస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆయిల్పాం కంపెనీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని.. త్వరగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరా రు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడుగు, బలహీనవర్గాలు, రైతుల సమ స్యలు తనవిగా భావించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, తూడి మేఘారెడ్డి మాట్లాడారు. అంతకుముందు పెద్దమందడి మండలం వెల్టూరులో ఆరోగ్య ఉప కేంద్ర భవనం, మోజర్లలో గోదాముల సముదాయానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. పెబ్బేరులో మరో వ్యవసాయ గోదాం, వ్యవసాయ కార్యాలయ భవన నిర్మాణానికి, కాలిన మార్కెట్యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ ఎండీ షేక్ యాస్మిన్బాషా, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
గడువులోగా సీఎంఆర్ అప్పగించకపోతే చర్యలు
కల్వకుర్తి రూరల్: మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిపడిన సీఎంఆర్ను నిర్ణీత గడువులోగా అప్పగించకపోతే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్లోని రైస్మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్ల వారీగా బకాయి సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఎస్ఓ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సీఎంఆర్ను మార్చి 17వ తేదీలోగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. త్వరలోనే మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అప్పటిలోగా పెండింగ్ సీఎంఆర్ను ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు. ఇప్పటికే ఎంతో సమయం ఇచ్చామని.. ఇదే చివరి అవకాశమని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనునాయక్, తహసీల్దార్ ఇబ్రహీం, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు పోలా ఏకనాథం, రాంరెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
రైస్మిల్లులో తనిఖీలు
కల్వకుర్తి: పట్టణంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర రైస్మిల్లులో శనివారం అడిషనల్ కలెక్టర్ అమ రేందర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం, ఇప్పటి వరకు అప్పగించిన సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి బకాయిపడిన బియ్యా న్ని వెంటనే అందించాలని యజమానిని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ రాఘవేందర్రెడ్డి ఉన్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం నాగర్కర్నూల్రూరల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తిగా పరీక్షించకుండా పనులు చేపట్టడంతోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత పనులను తిరిగి ప్రారంభించిన అధికారులు.. టన్నెల్ సురక్షితంగా ఉందా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికు ల ప్రాణాలను కాపాడాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్, గోపాల్, శివకృష్ణ ఉన్నారు. సమగ్ర విచారణ జరపాలి.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారీ వర్షాల కారణంగా సొరంగం పనులు నిలిచిపోవడంతో పాటు మిషన్లు కూడా నీటిలో మునిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పనులను పునఃప్రారంభించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు, శంకర్నాయక్, శివవర్మ తదితరులు ఉన్నారు. -
తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం
●● స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ 50శాతం దాటొద్దని ఆదేశాలు ● బేస్ సంఖ్య స్థానాల్లో ప్రభావం ● పలు మండలాల్లో ఒక్కొక్క స్థానం కోల్పోనున్న మహిళలు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. కోడేరు మండలంలో ఆరు జీపీలు తగ్గాయి. పెద్దకొత్తపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో మొత్తం 460 జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. – రామోహ్మన్రావు, డీపీఓ అచ్చంపేట: స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు విధానంలో పలు మార్పులు చేశారు. వీటి ఫలితంగా పలుచోట్ల మహిళల స్థానాలు స్వల్పంగా తగ్గనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను మండల యూనిట్గా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జిల్లా యూనిట్గా తీసుకుని రిజర్వు స్థానాలను కేటాయించనున్నారు. గతంలో మహిళలకు 50 శాతం స్థానాలు తగ్గకుండా రిజర్వు చేయాలనే ఆదేశాలతో సగం కంటే ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. తద్వారా బేస్ సంఖ్యలో స్థానాలు ఉన్న మండలాల్లో సమస్య రానుంది. ఇదిలా ఉంటే.. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా.. అందుకు పూర్థిస్తాయిలో సన్నద్ధమై ఉండాలని పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఆరు జీపీలు ఔట్.. ఐదు ఇన్ గత ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 461 గ్రామపంచాయతీలు ఉండగా.. కోడేరు మండలంలోని ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, సింగాయిపల్లి, గుండావాయిని తండా, మాచుపల్లి, రేకులపల్లి జీపీలను వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆరు జీపీలు తగ్గాయి. అదే సమయంలో పెద్దకొత్తపల్లి మండలంలో కొత్తగా ఏర్పాటైన బాచారం, సంజీవపూర్, కొత్తపేట జీపీలతో పాటు కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన బోయలపల్లి (నర్సింగరావుపల్లి), తాళ్ల నర్సింగాపురం రెండు జీపీలు ఏర్పాటయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీల్లో 4,140 వార్డులు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించారు. లక్కీ డ్రా విధానంలోనే.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిశాకే లక్కీ డ్రా విధానంలో మహిళలకు రిజర్వు స్థానాలు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా లక్కీ డ్రా చేపడతారు. సర్పంచ్, ఎంపీటీసీలకు ఆర్డీఓ స్థాయిలో, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్ స్థాయిలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. పూర్తిస్థాయిలో బీసీ కులగణన పూర్తయ్యాక.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. గతంలో ఉప్పునుంతల మండలంలో 27 గ్రామపంచాయతీలకు సగం లెక్కిస్తే.. 13.5 అవుతుంది. అక్కడ 14 జీపీలను మహిళలకు కేటాయించారు. ఈసారి అక్కడ మహిళలకు 13 జీపీలు మాత్రమే రిజర్వు చేయనున్నారు. బల్మూర్ మండలంలో 23, లింగాలలో 23 జీపీలు ఉండగా.. 11 స్థానాల చొప్పున మహిళలకు కేటాయించనున్నారు. గతంలో అచ్చంపేట మండలంలో 33 జీపీలు ఉండగా.. 17 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. ఈసారి ఇక్కడ కొత్తగా ఐదు జీపీలు ఏర్పాటు కావడంతో మొత్తం 38 ఉన్నాయి. మహిళలకు సగం అంటే 19 స్థానాలు వస్తాయి. బేస్ సంఖ్య వచ్చే ప్రతిచోట మహిళా రిజర్వు స్థానాలు తగ్గనున్నాయి. జిల్లాలోని చాలా మండలాల్లో బేస్ సంఖ్య కారణంగా మహిళల ప్రాతినిధ్యం తగ్గనుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని కేటగిరిల్లోనూ సగం కేటాయించాల్సి ఉండటంతో.. ఇక్కడా బేస్ సంఖ్య వస్తే ఆ వర్గంలోనూ మహిళా స్థానాలు తగ్గుతాయి. మొత్తంగా మహిళల ప్రాతినిధ్యం కొంతమేర తగ్గనుందని చెప్పవచ్చు. ● జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండటంతో మహిళలకు సగం స్థానాలు వస్తాయి. సరి సంఖ్య రావడంతో రిజర్వేషన్ కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బంది ఉత్పన్నం కాదు. ఇందులో సగం అంటే 10 స్థానాలు కేటాయించాల్సిందే. బేస్ సంఖ్య వచ్చే మండలాల్లో మాత్రమే రిజర్వేషన్లలో స్పల్ప మార్పులు జరగనున్నాయి. బేస్ సంఖ్య స్థానాల్లోనే సమస్య.. అమ్రాబాద్ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 4.5 అవుతుంది. అలాగే పదర మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 2.5గా పరిగణించాలి. గతంలో ఆయా మండలాల్లో 5, 3 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. ఎందుకంటే మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త విధానంతో అక్కడ మహిళలకు 4, 2 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే కేటాయించనున్నారు. బల్మూర్ మండలంలో 11, కల్వకుర్తిలో 11, వెల్దండలో 11, బిజినేపల్లి మండలంలో 21 స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానం మహిళలకు తగ్గనుంది. -
భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్ పాల్గొన్నారు. -
ఎనిమిది మంది
సొరంగంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు శ్రీౖశెలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను తవ్వుకుంటూ సుమారు 40 కి.మీ., మేర టన్నెల్ను తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ., టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14 కి.మీ., వద్ద సొరంగం తవ్వకాలను గత నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో గత నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి ఎక్కువై అప్పటికే బలహీనంగా మారిన పైకప్పు, రాక్ బోల్టింగ్, కాంక్రీట్ సెగ్మెంట్తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఇన్లెట్ టన్నెల్లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి, మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకునిపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకే మార్గం గుండా.. టన్నెల్ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహం, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్ ప్రెజర్ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏమీ ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు ఈ ప్రాజెక్ట్లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది. సీపేజీనే ప్రమాదానికి కారణం.. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి, కలెక్టర్, ఎస్పీ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు భారీ ఎత్తున నీటి ఊట, బురద, శిథిలాలతో సహాయక చర్యలకు ఆటంకం -
హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ మంజూరు చేశామని సీఎం అన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్ర భుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్ర జలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం పేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్రెడ్డి ధ్వజం రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి
కల్వకుర్తి టౌన్: ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటర్, పదో తరగతి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. వార్షిక పరీక్షలంటే భయం వీడి.. ఉత్సాహంగా ముందుకెళ్లాలని విద్యార్థినులకు డీఈఓ సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలన్నారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యేలా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కేజీబీవీలో ఉన్న రికార్డులను పరిశీలించి, పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. డీఈఓ వెంట ఎస్ఓ రమాదేవి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన
కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని పస్పుల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించే స్థలం వెడల్పు 18 ఫీట్లు, పొడవు 22 ఫీట్లు ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కురుమూర్తి, రాజవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ లక్ష్యాలను సాధించాలి కందనూలు: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఉపాధి హామీ కూలీలకు కల్పించాల్సిన పనిదినాలు, పని ప్రదేశాల్లో వసతులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ మాట్లాడుతూ.. 2024–25లో గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్కల పరిరక్షణ కోసం క్రమం తప్పకుండా నీటిని అందించాలని ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ఉపాధి హామీ మెటీరియల్ బిల్లుల వివరాలు అందించడంతో పాటు మంజూరు చేసిన పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెంపకం లబ్ధిదారులను గుర్తించాలని.. ఈత ప్లాంటేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీ శ్రీను, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో కొత్తగా స్వయం సహాయక మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు పాత సంఘాలకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన సభ్యులందరికీ సీ్త్రనిధి రుణాలు అందించాలని తెలిపారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ శివ, రిసోర్స్ పర్సన్లు తదితరులు ఉన్నారు. -
నేడు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి సబిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ క్యాంపులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు చేస్తారని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్ కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నాలుగు దశల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,454 మంది ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరైనట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని డీఐఈఓ తెలిపారు. చరిత్రను ఎప్పటికీ మరిచిపోవద్దు నాగర్కర్నూల్ క్రైం: చరిత్రను ఎప్పటికీ మర్చిపోరాదని.. గతంలో జరిగిన అనేక సంఘటనలను జీవన విధానంలో పాటించాల్సిన అవసరం ఉందని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పురాతన నాణేల ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్దులకు పురాతన నాణేల గొప్పతనాన్ని, ప్రత్యేకను అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. చరిత్రను అధ్యయనం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గత అనుభవాలను తెలుసుకుని వాటి ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పురాతన నాణేలు ఏ సంవత్సరానికి చెందినవనే విషయాన్ని చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ధర్మ, డా.హజీరా ఫర్విన్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య పాల్గొన్నారు. బైపాస్ బాధితులకు న్యాయం చేయాలి నాగర్కర్నూల్రూరల్: చారగొండలో ఎన్హెచ్–167కే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చారగొండలో నేషనల్ హైవే బైపాస్ బాధితులకు అరకొర పరిహారం చెల్లించి.. బలవంతంగా ఇళ్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 24న కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య, సభ్యులు అశోక్, సురేష్, చంద్రశేఖర్, నాగరాజు, తిరుపతయ్య ఉన్నారు. -
తిలా పాపం.. తలా పిడికెడు!
అక్రమ నిర్మాణాల్లో అధికారులే సూత్రధారులు? ●నాగర్కర్నూల్: తెలకపల్లి మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అధికారులు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల ఆజ్ఞ మేరకు అక్రమ నిర్మాణాల నుంచి విద్యుత్ మీటర్ల మంజూరు వరకు సహకారం అందించినట్లు తేటతెల్లమవుతోంది. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకుండా.. దగ్గరుండి అక్రమ నిర్మాణాలను పూర్తి చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులకు దన్ను.. తెలకపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్లు మూసుకున్న అధికారులు.. సదరు భూమికి తామే వారసులమంటూ బాధితులు ఆ భూమిలో తడకలు వేసుకుంటే మాత్రం రాత్రికి రాత్రే స్పందించారు. పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సంయుక్తంగా వెళ్లి తడకలను తొలగించారు. మరోసారి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే దీన్ని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో అధికారుల వ్యవహార శైలి ఇలా ఉందనే విమర్శలు ఉన్నాయి. దుకాణాలను నిర్మించుకున్న వ్యక్తులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్లు లేకుండానే.. తెలకపల్లిలోని వివాదాస్పద భూమిలో అక్రమంగా నిర్మించిన దుకాణాల్లో ప్రస్తుతం వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏదైన వ్యాపారం కొనసాగాలంటే కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు దుకాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఉండాలి. కానీ అక్కడ నిర్మించిన ఏ ఒక్క దుకాణానికి అనుమతులు లేవు. దీంతో ట్రేడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం రూ. 1.50లక్షల వరకు గ్రాపంచాయతీ ఆదాయాన్ని కోల్పోతోంది. దీంతో పాటు అప్పటి విద్యుత్ అధికారులు అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ మీటర్లను ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్లు లేవు.. తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో నిర్మించిన దుకాణాలకు అనుమతులు లేకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్లు కూడా లేవు. ట్రేడ్ లైసెన్స్లు ఉంటే సంవత్సరానికి రూ. 1.20లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్లు లేకుండానే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నేను ఈఓగా బాధ్యతలు చేపట్టక ముందే ఈ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. – భాస్కర్, ఈఓ, తెలకపల్లి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాకే కదలిక.. అక్రమ నిర్మాణాల విషయంలో బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గతేడాది ఆగస్టు 12న ఫిర్యాదు చేఽశారు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి.. రిపోర్టు అందజేయాలని కమిషనర్ ఆదేశిస్తే గాని జిల్లా అధికార యంత్రాంగం కదలలేదు. విచారణ పూర్తి చేశామని.. సదరు నిర్మాణాలకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు.. ఇప్పటికై నా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన ఆక్రమణదారులు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాతే అధికారుల్లో చలనం -
జాతీయస్థాయికి ముష్టిపల్లి విద్యార్థుల ప్రాజెక్టు
పెద్దకొత్తపల్లి: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసి వారు ఆన్లైన్లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్లో పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. విపత్తుల నిర్వహణ అంశంపై విద్యార్థులు గాధరి ప్రవీణ్, సాయిచరణ్ రూపొందించిన నోకాస్ట్ లైఫ్ సేవింగ్ బోటు అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ందని హెచ్ఎం సురేఖ తెలిపారు. వరద బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం గురుకాసి యూనివర్సిటీ వారు అవసరమైన నిధులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయస్థాయికి ఎంపికై న విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ రమేష్ కుమార్ అభినందనలు తెలిపారు.