రమణీయంగా లక్ష్మీనర్సింహుడి రథోత్సవం
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగి తరించారు. అనంతరం శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్యహోమాలు, బలిహరణం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ఆవరణలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు, ఈఓ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు గణేష్గౌడ్, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్ప్రసాద్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment