జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌ యార్డులు నామమాత్రంగా మారాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో చెత్త సేకరిస్తున్న అధికారులు యథావిధిగా తీసుకెళ్లి డంపింగ్‌ యార్డులో పారబోస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్వహణ చ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌ యార్డులు నామమాత్రంగా మారాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో చెత్త సేకరిస్తున్న అధికారులు యథావిధిగా తీసుకెళ్లి డంపింగ్‌ యార్డులో పారబోస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్వహణ చ

Published Tue, Mar 18 2025 12:34 AM | Last Updated on Tue, Mar 18 2025 12:34 AM

జిల్ల

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ని

కల్వకుర్తి టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని సీబీఎం కళాశాల వెనక భాగంలో రూ.3 కోట్లకు పైగా నిధులతో డీఆర్‌సీసీ ఏర్పాటు చేసి చెత్తను వేర్వేరుగా రీసైక్లింగ్‌ చేస్తున్నారు. చెత్త రీసైక్లింగ్‌ పక్రియను పట్టణంలోని ఎస్‌హెచ్‌జీ సభ్యులు చేపడుతున్నారు. మున్సిపాలిటీలోని 11 ఆటోలు, 3 ట్రాక్టర్లు సేకరించిన చెత్తనంతా డీఆర్‌సీసీకి చేరవేస్తారు. అక్కడ వారంతా చెత్తను రీసైక్లింగ్‌ చేసి, డబ్బులు సంపాదిస్తూ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పట్టణంలోని 22 వార్డుల నుంచి ప్రతిరోజు 15 మె.ట., చెత్త సేకరిస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ మహమూద్‌ షేక్‌ తెలిపారు.

చెత్తను రీసైక్లింగ్‌ చేయడం వల్ల ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒక ఆదాయ మార్గంగా మారింది. చెత్తను ఎక్కడా నిర్లక్ష్యంగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో రీసైక్లింగ్‌ సైతం సులభంగా ఉంటుంది. భవిష్యత్‌లో చెత్త ఎక్కువగా వస్తుందన్న ముందు జాగ్రత్తతో అందుకు తగినట్లుగా డీఆర్‌సీసీ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

– లక్ష్మి, డీఆర్‌సీసీ సభ్యురాలు, కల్వకుర్తి

ఆదాయ మార్గంగా మారింది

మహిళా సంఘాల

ఆధ్వర్యంలో..

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ని1
1/1

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement