Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Leaders Release Vennupotu Dinam Program Poster1
జూన్‌ 4న వెన్నుపోటు దినం.. పోస్టర్‌ ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, తాడేపల్లి: మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రజలను వంచించారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అరాచక, మోసపూరిత పాలన సాగుతోందని.. ప్రజలను భ్రమల్లో పెట్టి పాలన చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన.. ‘వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్‌’ను విడుదల చేశారు. పార్టీ నేతలు సాకే శైలజానాథ్‌, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, ఆది మూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్‌, మల్లాది విష్ణు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో తమ అరాచకంతో రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించారు. వైఎస్ జగన్ తొలి ఏడాదే 90 శాతం హామీలు అమలు చేశారు. చంద్రబాబు ఒక్కటీ చేయలేదు. జగన్ తెచ్చిన సంస్కరణలను, వ్యవస్థలను సర్వనాశనం చేశారు. చంద్రబాబు ఏ హామీనీ అమలు చేయరని జగన్ ఆనాడే చెప్పారు. ఇటీవల చంద్రబాబు మాటలు చూస్తుంటే ఇక ఏ పథకాన్నీ అమలు చేయరని తేలిపోయింది’’ అని సజ్జల చెప్పారు.‘‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో చెప్పాలని అడుగుతున్నారు. చంద్రబాబు వచ్చిన తొలి ఏడాదిలోనే 1.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదే. అమలు చేయలేనని కూడా బరితెగించి మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. అందుకే జిల్లాల్లో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జూన్‌ 4న చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తాం. ఆ రోజు కలెక్టర్లు, అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Cricketer Vaibhav Suryavanshi Meets PM Modi At Patna Airport2
వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

పాట్నా: యువ క్రికెట్ కెరటం, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈరోజు(శుక్రవారం, మే 30వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో కలిసిన వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడారు. తొలుత వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించిన మోదీ..క్రికెట్ కు సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పాట్నా ఎయిర్ పోర్ట్ లో మోదీని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవ్ సూర్యవంశీ కలిశారు. ఈ విషయాన్ని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు మోదీ.‘వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. నా ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ లో అరంగేట్రం ద్వారా సంచలన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా వైభవ్ సూర్యవంశీ తెరపైకి వచ్చాడు. At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6— Narendra Modi (@narendramodi) May 30, 2025

Gaddar Awards Winners Full List 2014 To 20233
గద్దర్‌ అవార్డ్స్‌.. 2014 నుంచి 2023వరకు ఉత్తమ చిత్రాలు ఇవే

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు ప్రకటించారు. జూన్‌ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు2014- ఉత్తమ చిత్రాలుఉత్తమ చిత్రం- రన్‌ రాజా రన్‌ఉత్తమ రెండో చిత్రం - పాఠశాలఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను2015- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవిరెండవ ఉత్తమ చిత్రం - కంచెమూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు2016- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతిరెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులుమూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్2017- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్‌క్లూజన్రెండవ ఉత్తమ చిత్రం - ఫిదామూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ2018- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలంమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం2019- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం2020- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములోరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటోమూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్2021- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - RRRరెండవ ఉత్తమ చిత్రం - అఖండమూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన2022- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - సీతా రామంరెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2మూడవ ఉత్తమ చిత్రం - మేజర్2023- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బలగంరెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి2024- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం : కల్కీ 2898రెండవ ఉత్తమ చిత్రం ‌: పోటేల్‌మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణపైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నంబి ఎన్ రెడ్డి అవార్డు - దర్శకుడు సుకుమార్నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావుకాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండరఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్

mlc kavitha comments on brs merge with bjp4
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత

సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా త‌పన అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా తప‌న‌. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్ద‌నేది నా వాద‌న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుప‌డ‌లేదు. నేను జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని బీజేపీలో క‌లుపుతాన‌ని అన్నారు. పార్టీని బీజేపీలో క‌లుపుతానంటే నేను ఒప్పుకోను. లెట‌ర్ రాయ‌డంలో నా త‌ప్పేమీ లేదు. లెట‌ర్ బ‌య‌ట‌పెట్టిన వారిని ప‌ట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.

Miss England Milla Magee Row: Telangana Govt Probe Done5
మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ(Milla Magee) సంచలన ఆరోపణల వ్యవహారంపై విచారణ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ సాక్షితో శుక్రవారం మాట్లాడారు.‘‘మిస్‌ ఇంగ్లండ్‌ మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. అయితే ఆమె విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు లండన్‌లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్‌ చర్యలు తీసుకుంటుంది’’ అని జయేష్‌ రంజన్‌(Jayesh Ranjan) స్పష్టం చేశారు.వ్యక్తిగత, నైతిక కారణాలను చూపుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ 2025 (Miss World 2025)పోటీల నుంచి నిష్క్రమిస్తూ మిల్లా మ్యాగీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆపై ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తెలంగాణపై గౌరవం పెరిగింది. అక్కడి అతిథ్యం బాగుంది. కానీ, మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలు?’’ అని ఆమె అన్నట్లు సదరు టాబ్లాయిడ్‌ కథనం ఇచ్చింది.అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆమె పోటీ నుండి వైదొలగాలని అభ్యర్థించారని తెలిపారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు.. గౌరవం, బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ విలువలకు కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.అయితే ఈ వ్యవహారంపై తెలంగాణాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Bhairavam Movie Review And Rating In Telugu6
భైరవం మూవీ రివ్యూ

టైటిల్‌: భైరవంనటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అతిధి శంకర్‌, ఆనంది , దివ్య తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్నిర్మాత: కేకే రాధామోహన్‌దర్శకత్వం: విజయ్‌ కనకమేడలసంగీతం: శ్రీచరణ్‌ పాకాలసినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతంఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌విడుదల తేది: మే 30, 2025బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'గరుడన్‌’ తెలుగు రీమేకే ఈ భైరవం. టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్‌ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించారా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.(Bhairavam Review)భైరవం కథేంటంటే..?తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్‌), వరద(నారా రోహిత్‌),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. (Bhairavam Review)మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత రీమేక్‌ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఓ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే ఓటీటీల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి సమయంలో తమిళ బ్లాక్‌ బస్టర్‌ గరుడన్‌ని తెలుగులో రీమేక్‌ చేశాడు దర్శకుడు విజయ్‌ కనకమేడల. ఇది ఓ రకంగా పెద్ద సాహసమే. కానీ దానికి తగిన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. ఒరిజినల్‌ సినిమాలోని ఎమోషన్‌ని ఇందులో క్యారీ చేయలేకపోయాడు. కథలో ఆయన చేసిన చిన్న చిన్న మార్పులే దీనికి కారణం. ముగ్గురు హీరోలను మేనేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు కానీ సెంటిమెంట్స్‌ని పండించే విషయంలో తడబడ్డాడు.ఒరిజినల్‌లో బెల్లంకొండ పాత్రను సూరి పోషించాడు. ఆయనకున్న ఇమేజ్‌కి ఆ పాత్ర కొత్తగా అనిపించింది. కానీ బెల్లంకొండకు ఇక్కడ ఉన్న ఇమేజ్‌ వేరు. దీంతో ఆ పాత్రలో ఆయన ఒదిగినట్లుగా కాకుండా నటించినట్లుగానే అనిపిస్తుంది. అలాగే మనోజ్‌ పాత్ర కూడా. ముగ్గురు హీరోలకు ఎలివేషన్స్‌ ఇవ్వడంపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. అమ్మవారి ట్రాక్‌ని కూడా సరిగా వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. గుడి నేపథ్యంతో పాటు ముగ్గురు హీరోల పరిచయం తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. శీను-వెన్నెల(అతిధి శంకర్‌) లవ్‌ ట్రాక్‌ అంతగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీసినట్లుగా ఉంటుంది. గరుడన్‌ చూసిన వారికి ట్విస్టులు కూడా తెలుస్తాయి కనుక.. అవి కూడా ఆకట్టుకోలేవు. ఇక గరుడన్‌ చూడని ప్రేక్షకులకు మాత్రం కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్‌ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌, రోహిత్‌..ముగ్గురూ టాలెంటెడ్‌ నటులే. మంచి పాత్రలు పడాలేకానీ రెచ్చిపోయి నటిస్తారు. భైరవంలోనూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ సినిమా ప్లస్‌ అవుతుందని చెప్పాలి. శీను పాత్రలో ఆయన జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పూనకాల సీన్‌లో అదరగొట్టేశాడు. .నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న గజపతి వర్మగా మనోజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్లలో బాగా నటించాడు. ఇక నారా రోహిత్‌ తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోయిన్లు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. వెన్నెల కిశోర్‌ , జయసుద తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్‌ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చేప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

One habit I have had now for many years External Affairs Minister Lifestyle7
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై జైశంకర్‌ మాట

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్. జైశంకర్‌కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు. అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన జై శంకర్‌ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అంద‍ర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్‌ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్‌, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్‌ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్‌బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్‌. ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్‌ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్‌ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్‌ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్‌ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్‌కు కుటుంబంతో గడపడం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. కాబట్టి తన లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్‌ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. అలాగే తన వర్క్‌ లైఫ్‌ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్‌లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అ‍న్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్‌కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్‌ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్‌. బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. చెప్పాలంటే వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ అంటే అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్‌స్టైలే కదూ..! సో.. మనం కూడా పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం. (చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్‌..)

Pakistan Army Chief Asim Munir Comments On Indus Water Treaty8
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపై పాకిస్తాన్‌ ఆర్మీ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ స్పందించారు. సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్‌ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్‌ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.పాకిస్తాన్‌లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్‌ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్‌ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్‌ మాట్లాడుతూ.. రెడ్‌లైన్‌ అనేది పాకిస్తాన్‌ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.గత నెల ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్‌ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ ఆటకట్టించేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్‌ 7న పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్‌ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది. అదే సమయంలో భారత్‌- పాక్‌ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్‌లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్‌ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది. తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Jio continues to dominate the telecom market in AP and Telangana9
ఏపీ, తెలంగాణలో జియో హవా

రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఏప్రిల్ 2025కిగాను ట్రాయ్‌ విడుదల చేసిన నివేదికలో జియో వైర్‌లెస్‌ మొబిలిటీ, వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్, 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్‌ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగాల్లో సబ్‌స్క్రైబర్ల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.అత్యంత పోటీ ఉన్న వైర్‌లెస్‌(మొబైల్) విభాగంలో అత్యధిక నెట్ సబ్‌స్క్రైబర్లను జోడించి టాప్‌లో నిలిచింది. మొత్తంగా ఏప్రిల్‌లో జియో 95,310 కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించి, మార్చిలో 3,17,76,074 ఉన్న వినియోగదారులను 3,18,71,384కు పెంచుకుంది. ఎయిర్‌టెల్‌ 42,600 సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 1,715 సబ్‌స్క్రైబర్ల సాధారణ వృద్ధిని చూపింది. కాగా వోడాఫోన్ ఐడియా 9,058 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంజియో ఫైబర్రిలయన్స్ జియో వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌, జియో ఫైబర్, ఏపీ టెలికాం సర్కిల్‌లో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఏప్రిల్‌లో జియో ఫైబర్ 54,000కి పైగా కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించింది. దాంతో మొత్తం వైర్‌లైన్‌ సబ్‌స్క్రైబర్ బేస్‌ను సుమారు 1.66 మిలియన్లకు విస్తరించింది. ఈ వృద్ధి రేటు ఎయిర్‌టెల్‌ (సుమారు 18,000 సబ్‌స్క్రైబర్లు), బీఎస్‌ఎన్‌ఎల్‌ కంటే ఎక్కువ. జియో ఎయిర్‌ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 2025 నాటికి జియో ఎయిర్‌ఫైబర్ దేశవ్యాప్తంగా 6.14 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఏపీ సర్కిల్‌లో జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రైబర్ బేస్ జనవరి 2025లో 4,27,439 నుంచి ఏప్రిల్‌లో 5,23,000కి పెరిగింది. ఈ విభాగంలో 80%కి పైగా మార్కెట్ షేర్‌ను దక్కించుకుంది.

Jeff Bezos To Secure His Fortune With Prenup Before Marrrying Lauren10
Jeff Bezos మెకంజీ షాక్‌, ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే జాగ్రత్తపడుతున్న బెజోస్‌

అమెజాన్ వ్యవస్థాపకుడు , భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి ముఖ్యాంశాల్లోకి వచ్చాడు. అయితే ఇది బిజినెస్‌ వ్యవహారమో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించో కాదు. ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే బిలియన్ డాలర్ల తన సంపదను కాపాడుకునేందుకు న్యాయపరంగా ఒక కీలకమైన చర్య తీసుకోబోతున్నాడు. అమెరికన్ టీవీ, రిపోర్టర్ లారెన్ సాంచెజ్‌ (Lauren Sánchez)తో 2023లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. వచ్చే నెలలో గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తున్నాయి. మొదటి భార్యతో విడాకులు, భారీ భరణం నేపథ్యంలో బెజోస్‌ తాజా ఏర్పాట్టు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ వివాహం ఇప్పటికే చాలా అలస్యమైన కారణంగా వీలైనంత త్వరగా తమ వివాహాన్ని చేసుకోవాలని 61 ఏళ్ల జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే జెఫ్ 220 బిలియన్ డాలర్ల సంపదను ( సుమారు 18.84 లక్షల కోట్ల రూపాయలు) భద్రపరచడానికి ఐరన్‌ క్లాడ్ ప్రెనప్‌కు సన్నాహాలు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. వివాహానికిముందే చేసుకోబోయే ఈ పటిష్ఠ ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నందున పెళ్లికి సమయం తీసుకుంటున్నాడట. అటు గ్లోబల్‌ న్యాయనిపుణులు దీనిపై భారీ కసరత్తే చేస్తున్నారు.అసలేంటీ ప్రెనప్‌వివాహానికి ముందు ఒక జంట వ్రాతపూర్వకంగా చేసుకునే ఒప్పందం. విడాకులు లేదా మరణానికి సంబంధించిన సంభావ్య ఆర్థిక సంక్లిష్టతలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం, విడాకుల సందర్భంలో ఆస్తులు , అప్పులు ఎలా విభజించబడతాయో ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఆయా జంటలు రాష్ట్రం లేదా దేశంలోని నియమ నిబంధనలపై ఆధారపడకుండా వారి స్వంత నిబంధనలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫైడ్ ఫ్యామిలీ లా అటార్నీ ఆల్ఫోన్స్ ప్రొవిన్జియానోను సంప్రదించిన జెఫ్‌ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నాడు. ప్రస్తుత ఆస్తులు, ఆస్తులు, హోల్డింగ్ పెట్టుబడులు మొదలైన వాటి జాబితా ఉండవచ్చని , వాటిని ప్రత్యేక సంస్థలుగా లేబుల్ చేయవచ్చని వివరించారు. కాబట్టి, భవిష్యత్తులో లారెన్ సాంచెజ్ జెఫ్ వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటానికి ముందుకు వచ్చినప్పటికీ, ఒక వేళ విడిపోతే, ఆ సందర్భంలో వాటి యాజమాన్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త. అయితే, వ్యాపారవేత్త తన ఆర్థిక , ఆస్తులన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లీగల్‌ అగ్రిమంట్‌ డ్రాఫ్టింగ్‌ కష్టతరంగా మారిందట. ముఖ్యంగా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల బృందంతో సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని అంచనా. అంతేకాదు ఇది సాధారణంగా రెండు వైపులా న్యాయవాదుల బృందాలను కలిగి ఉండే సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చెల్లింపులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. ఇరు పార్టీల అంగీకారంతో జరిగే ఈ ముందస్తు ఒప్పందానికి చర్చోపచర్చలు, అంగీకారాలు అవసరమంటున్నారు నిపుణులు. కేన్స్ సమీపంలో 500 మిలియన్ డాలర్ల సూపర్‌యాచ్‌లో లారెన్‌కు జెఫ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట అనేక ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చుతో అత్యంత ఘనంగా జెఫ్‌ రెండోపెళ్లి జరగనుందని సమాచారం.ఇదీ చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బ‌హిష్క‌ర‌ణ‌అమెజాన్‌ బాస్‌ జెఫ్ బెజోస్ 1993లో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకున్నాడు.. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే 25 ఏళ్ల దాంపత్యం జీవితం తరువాత 2019లో విడాకుల ప్రకటన చేయడం యావత్‌ ప్రపంచాన్ని విస్మయపర్చింది. అయితే మెంకజీతో విడాకులకు ముందు (2018) నుంచే జెబోస్, 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. కొన్నాళ్లకు విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) డైమండ్‌ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అటు లారెన్ శాంచెజ్‌కు ఇప్పటికే రెండుసార్లు వివాహమైంది. పాట్రిక్ వైట్ సెల్‌ తో, పెళ్లి ఇద్దరు పిల్లలు తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్‌ను పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా! మెకెంజీతో జెఫ్ బెజోస్ ఖరీదైన విడాకులుచరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు అంటే జెఫ్‌, మెకంజీదే. అమెజాన్ కేవలం ఆన్‌లైన్ పుస్తక రిటైలర్‌గా ఉన్నప్పుడు వివాహం, అమెజాన్ విజయంలో అండగా నిలిచిన అతని మాజీ భార్యకు కంపెనీలో నాలుగు శాతం వాటా లభించింది. దీంతో ఆమె అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో చేరింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement