ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి | 2 Persons Killed In Elephant Attack Incidents In Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌: ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి

Published Sun, Jul 28 2024 4:00 PM | Last Updated on Sun, Jul 28 2024 4:04 PM

2 Persons Killed In Elephant Attack Incidents In Jharkhand

రాంచీ: జార్ఖండ్‌లో రెండు వేరువేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈస్ట్‌సింగ్‌భుమ్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఏనుగు ఒక వ్యక్తిని తొక్కి చంపేసింది. ఇదే జిల్లాలోని డిఘీ గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. 

ఈ దాడిలో ఇంటి గోడ కూలి లోపల నిద్రిస్తున్న వృద్ధురాలు మరణించింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళకు దిగారు. ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement