Jharkhand
-
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
రాగాల పల్లకిలో రాష్ట్రపతి చెంతకు..
జార్ఖండ్(Jharkhand )కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన(Republic Day Parade ) ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో జార్ఖండ్లోని సింగ్భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్ర్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది. ‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచి΄ోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో. (చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్లో మెలానియా ట్రంప్) -
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్లను విప్పదీయించి బ్లేజర్తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పీడ్స్టర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron) రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం తెలిపాడు. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసమే జీవించానని.. ఇకపై క్రికెట్కు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.గాయాలు వేధిస్తున్నా‘‘ఫాస్ట్ బౌలింగే ఊపిరిగా బతికాను. ఇరవై ఏళ్లుగా నా ఆశ, శ్వాస అంతా క్రికెటే. ఆట పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న నేను.. ఈరోజు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది, అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ ప్రయాణం కొనసాగింది.గాయాలు వేధిస్తున్నా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు శారీరకంగా, మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించగలిగాను. నా ఫిజియోలు, ట్రైనర్లు, కోచ్లతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ వల్లే ఇదంతా సాధ్యమైంది.ఆటే నాకు అన్నీ ఇచ్చిందినా కెరీర్ను ఇన్నాళ్లు కొనసాగించేలా తోడ్పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించవచ్చని తెలుసు. అయితే, నా జీవితంలోని ప్రతీ చిన్న ఆనందానికి ఆటే కారణం. ఆటే నాకు అన్నీ ఇచ్చింది.నా ఫస్ట్ లవ్ ఫాస్ట్ బౌలింగ్. అందుకే నేనిక మైదానంలో అడుగుపెట్టకపోయినా.. క్రికెట్లో భాగంగానే ఉంటాను. ఎందుకంటే.. నేను అందులో ఓ భాగం కాబట్టి..’’ అంటూ వరుణ్ ఆరోన్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.గంటకు 153 కిలోమీటర్ల వేగంతోకాగా సింగ్భూమ్కు చెందిన వరుణ్ ఆరోన్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)- 2010- 11 సందర్భంగా వరుణ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. గుజరాత్తో జరిగిన ఫైనల్లో ఈ జార్ఖండ్ పేసర్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. తన స్పీడ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో.. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్.. తొమ్మిది టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చివరగా 2015లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్లో పాల్గొన వరుణ్ ఆరోన్.. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఐపీఎల్లోనూ..ఇక గాయాల బెడద కారణంగా గతేడాది ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకొన్న వరుణ్ ఆరోన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ స్పీడ్స్టర్.. 2022లో చివరగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో పుణెలో జరిగిన మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్లో ఆఖరిది. ఇక క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 52 మ్యాచ్లు ఆడిన 35 ఏళ్ల వరుణ్ ఆరోన్.. 44 వికెట్లు పడగొట్టాడు. స్కూల్ ఫ్రెండ్తో పెళ్లివరుణ్ ఆరోన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2016లో రాగిణితో అతడి వివాహం జరిగింది. కోర్టు మ్యారేజీ చేసుకున్న వీళ్లిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. చదవండి: ‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’ -
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్పూర్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్కు చెందిన దీపికా పాండే సింగ్లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్కు నాలుగు బెర్త్లు, సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
ఒక ప్రేయసి.. 50 ముక్కలు!
జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్ 9న ఇద్దరు జార్ఖండ్లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.నవంబర 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు. -
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
జార్ఖండ్లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
-
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
-
ఒకే ఒక్కడు హేమంత్
సాక్షి, నేషనల్ డెస్క్: హేమంత్ సోరెన్. జార్ఖండ్ అత్యంత యువ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన గిరిజన నేత. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతుండగానే ఎన్నో సవాళ్లు. భూవివాదంలో చిక్కుకుని ఈడీ అరెస్ట్తో జైలుపాలైనా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట మసకబారినా, వదిన సీత సోరెన్, అత్యంత ఆప్తుడైన నేత చంపయీ సోరెన్ పార్టీని వీడి తిరుగుబాటు జెండా ఎగరేసినా అన్నింటినీ తట్టుకుని సవాళ్లకు ఎదురొడ్డి జార్ఖండ్ శాసనసభ సమరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)ను విజయతీరాలకు చేర్చి జార్ఖండ్ గిరిజన కోటపై తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. హేమంత్ సోరెన్ ఒక్కడే అంతా తానై, అన్నింటా ముందుండి నడిపించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి ఘన విజయం దక్కేలా చేసి తన రాజకీయపటిమను మరోసారి చాటిచెప్పారు. విపక్ష బీజేపీ కూటమి తరఫున ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ తదితరులు కాళ్లకు బలపం కట్టుకుని విస్తృతస్థాయి ప్రచారం చేసినా హేమంత్ సోరెన్ ప్రభ ముందు అదంతా కొట్టుకుపోయింది. జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ఖర్గే కొన్ని చోట్ల ప్రచారం చేసినా కూటమి తరఫున పూర్తి ప్రచార బాధ్యతల్ని హేమంత్ తన భుజస్కంధాలపై మోపి కూటమిని విజయశిఖరాలపై నిలిపారు. తన అరెస్ట్తో ఆదివాసీ సెంటిమెంట్ను తెరమీదకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జేఎంఎం మాత్రమే పాటుపడగలదని ప్రచారంచేసి మెజారిటీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తండ్రి, జేఎంఎం దిగ్గజం శిబూసోరెన్ నుంచి రాజకీయ వారసత్వం పొందినా తొలినాళ్ల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి సిసలైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. 2009లో రాజ్యసభలో అడుగుపెట్టి.. మూడోసారి ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైన హేమంత్ రాజకీయ ప్రస్థానం శాసనసభకు బదులు రాజ్యసభలో మొదలైంది. 2009లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనివార్యకారణాల వల్ల కొద్దికాలానికే రాజీనామాచేయాల్సి వచి్చంది. నాటి మిత్రపక్షంగా బీజేపీ సారథ్యంలోని అర్జున్ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లకే ప్రభుత్వం కుప్పకూలడం రాష్ట్రపతిపాలన అమలుకావడంతో సోరెన్ జేఎంఎం పగ్గాలు చేపట్టారు. తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతులో 2013లో 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏడాదికే పదవిని కోల్పోవాల్సి వచి్చంది. 2014లో అధికార పీఠాన్ని బీజేపీ హస్తగతంచేసుకోవడంతో సోరెన్ విపక్షనేత బాధ్యతలు నెత్తినేసుకున్నారు. మలుపుతిప్పిన 2016.. 2016లో నాటి బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్లో గిరిజన అటవీ భూములను సులభంగా వ్యవసాయేతర అవసరాలకు బదలాయించేందుకు వీలుగా అత్యంత వివాదాస్పద ‘చోటానాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908(సవరణ)ఆర్డినెన్స్, సంథాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ 1949(సవరణ) ఆర్డినెన్స్లను తీసుకొచి్చంది. గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రంలో వారి భూములను ప్రభుత్వం అన్యాయంగా స్వా«దీనంచేసుకుని సొంత వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తోందని హేమంత్ సోరెన్ 2016లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం లేవదీశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం చేసిన ఈ ఉద్యమం విజయవంతమవడంతో సోరెన్ శక్తివంత గిరిజన నేతగా అవతరించారు. 2019లో కొనసాగిన హవా కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో 2019లో హేమంత్ మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. 81 సీట్లున్న అసెంబ్లీలో జేఎంఎం పార్టీ ఒక్కటే ఏకంగా 30 సీట్లను కైవసం చేసుకోవడంలో హేమంత్ కృషి దాగిఉంది. అయితే 2023లో భూవివాదంలో మనీలాండరింగ్ జరిగిందంటూ హేమంత్ను అరెస్ట్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కటకటాల వెనక్కి నెట్టింది. జనవరి 31న అరెస్ట్కు ముందు సీఎం పదవికి రాజీనామాచేసి పారీ్టలో అత్యంత నమ్మకస్తుడైన చంపయీ సోరెన్కు పగ్గాలు అప్పజెప్పి జైలుకెళ్లారు. జార్ఖండ్ హైకోర్టు జూన్లో బెయిల్ ఇవ్వడంతో మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే తనను అవమానకర రీతిలో సీఎం పదవి నుంచి కిందకు తోశారని చంపయీ సోరెన్, పారీ్టలో విలువ ఇవ్వట్లేరని వదిన సీతా సోరెన్ జేఎంఎంను వీడి హేమంత్కు తలనొప్పిగా మారారు. ప్రజలకు చేరువగా పథకాలు పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రజారంజక నేతగా హేమంత్ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మయ్యాన్ సమ్మాన్ యోజన ఆర్థిక ప్రయోజనం లబ్ధిని పెంచారు. 18–51 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1,000 ఆర్థికసాయం అందేలా చేశారు. దాదాపు 1.75 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి రైతన్నల మన్ననలు అందుకున్నారు. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. సహజవనరులతో తులతూగే జార్ఖండ్ నుంచి సహజసంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచేస్తోందని ప్రచారకార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించి బీజేపీ పట్ల ఓటర్లలో ఆగ్రహం పెంచారు. బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలపై నిలదీసి గిరిజనులకు అండగా తానొక్కడినే ఉన్నానని ఓటర్ల మనసుల్లో ముద్రవేశారు. 2022లో సొంతంగా మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడనే అపవాదుతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే ప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు. జార్ఖండ్ పేదలను మోదీ సర్కార్ తన స్వప్రయోజనాల కోసం నిమ్మకాయ పిండినట్లు పిండుతోందని హేమంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తెగ పాపులర్ అయ్యాయి. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, నమ్మకస్తులైన ఓటర్లు అంతా కలిసి హేమంత్కు మరోసారి ఘన విజయమాల వేశారు. -
కొంత మోదం.. కొంత ఖేదం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టికి కొంత నిరాశం, కొంత ఉపశమనం కలిగించాయి. మహారాష్ట్రలో కూటమి పక్షాలతో కలిసి అధికార బీజేపీ కూటమికి ఓటమి రుచి చూపిద్దామన్న కసితో పనిచేసిన కాంగ్రెస్కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్ఛాయి. సీట్ల పంపకాల్లో తప్పిదాలు, ఓట్ల బదిలీ జరగకపోవడం, పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు పెద్దగా నమ్మకపోవడం ఘోర పరాజయానికి దారితీశాయి. జార్ఖండ్లో మాత్రం తన బలాన్ని నిలుపుకోవడం, కూటమి పార్టితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం కాంగ్రెస్కు ఊపిరినిచ్చింది. మహారాష్ట్రలో ఊహించని దెబ్బ ఆరు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ అద్భుత ప్రదర్శన కనబరించింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 16.12 శాతం ఓట్లను రాబట్టుకొని 13 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ(శరద్ పవార్) 8 స్థానాలు దక్కించుకున్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. తన ఓట్ల శాతాన్ని సైతం కోల్పోయి కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తన పేలవ ప్రదర్శనతో 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం తమకు బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు వదిలేయడమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో అగ్రనేత రాహుల్గాంధీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలను, సీట్లను తగ్గించేలా నియోజకవర్గాల ఎంపిక జరిగిందని ఆరోపించారు. దీనికి తోడు 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీపడ్డాయి. ఆయా స్థానాల్లో 65కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిందువుల ఓట్ల ప్రాబల్యంతోపాటు గరిష్ట సంఖ్యలో మరాఠాలు బీజేపీకి జైకొట్టడంతో కాంగ్రెస్కు పరాజయం ఎదరయ్యింది. జార్ఖండ్తో దక్కిన పరువు జార్ఖండ్లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్పోల్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నెగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీచేసి 16 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం అందడంతో జేఎంఎం గెలుచుకున్న స్థానాలు 30 నుంచి 34కి పెరిగాయి. పొత్తులపై ముందునుంచే అవగాహన ఉండడం, జార్ఖండ్లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించడం ఇండియా కూటమికి కలిసొచ్చింది. ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో 9 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మరో 2 స్థానాలు గెలిచే అవకాశమున్నా ఎస్పీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పశి్చమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 6 స్థానాల్లోనూ మిత్రపక్షమైన తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. పంజాబ్లోనూ నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టితో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒక స్థానంలో నెగ్గింది. మూడు స్థానాల్లో ఆప్ గెలుపొందింది. రాజస్తాన్లో 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆరింటిని గెలుచుకున్నాయి. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరోవైపు వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు..
-
మహారాష్ట్ర ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ VS రియల్ ఫలితాలు
-
ఒకసారి ఇండియా కూటమి.. ఒకసారి NDA కూటమి
-
ఎగ్జిట్పోల్స్ తలకిందులు: జార్ఖండ్లో మళ్లీ ఇండియా కూటమినే!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్లో ఇండియా కూటమి హవా సాగుతోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ బర్హైత్లో4,921 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆయన సతీమణి గాండే అసెంబ్లీ స్థానం నుంచి 4,593 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన మునియా దేవి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.జేఎంఎం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుంచి వెరెకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి గణేష్ మహాలీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో నాలుగుసార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంపైధన్మర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరండీ ఆధిక్యంలో ఉన్నారు.బీజేపీకి చెందిన సీతా సోరెన్ జమ్తారాలో వెనుకంజలో ఉన్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.చదవండి: ‘ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది’: మహా ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుజార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్యూ 10, జేడీయూ రెండు, లోక్జన్శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. -
బీజేపీ జోష్
-
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
Watch Live: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వయనాడ్లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాసేపట్లో ప్రారంభం కానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
-
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. -
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
ప్రశాంతంగా ముగిసిన ఝార్కండ్ తొలి విడత ఎన్నికలు
-
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్చార్జిగా జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు. -
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్లో పేలుడు.. 12 మంది మృతి -
లిక్కర్ స్కామ్: ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్లో ఛత్తీస్గఢ్,జార్ఖండ్లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్పై ఛత్తీస్గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్గఢ్లో లిక్కర్స్కామ్కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
Jharkhand Election: రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్యూ పార్టీ టిక్కెట్పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు -
దీపావళి తర్వాత జార్ఖండ్లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ
రాంచీ: జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. నవంబర్ ఒకటి నుంచి నవంబర్ 10 వరకు ఎన్నికల ర్యాలీల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా స్టార్ క్యాంపెయినర్లు సమయం కేటాయించాలని పార్టీ కోరింది.మీడియాకు అందిన తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్లో దీపావళి తర్వాత బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఎన్నికల ర్యాలీలు జరగనున్నాయి. ప్రధానమంత్రి ఆరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనేలా బీజేపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పార్టీలోని ఆరు సంస్థాగత విభాగాల్లోనూ ప్రధాని ఎన్నికల సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు ర్యాలీలు నిర్వహించారు.గడచిన నవంబర్ 15న జంషెడ్పూర్లో ప్రధాని మోదీ తన మొదటి ర్యాలీ నిర్వహించారు. రెండో ర్యాలీ అక్టోబర్ 2న హజారీబాగ్లో జరిగింది. బీజేపీ పరివర్తన్ యాత్రను ఆయన రాష్ట్రంలో ముగించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సాహిబ్గంజ్, గిరిడిహ్లలో ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి వివిధ సమస్యలు ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రచారాస్త్రాలుగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు పేపర్ లీక్ ఉదంతం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాశం కానుంది.ఇది కూడా చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్టైంలో వస్తే.. అంతా సేఫ్..! -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్వర్లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే.. -
మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.కోడా పిటిషన్ను శుక్రవారం(అక్టోబర్ 25) విచారించిన జస్టిస్ సంజీవ్కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది. అన్సారీ సిట్టింగ్ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.ఇదీ చదవండి: వయనాడ్లో ఖర్గేకు అవమానం నిజమేనా.. -
జార్ఖండ్లో హోరాహోరీ
గిరిజన రాష్ట్రం జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుతోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణం ప్రయతి్నస్తోంది. ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి జార్ఖండ్లో కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో పాటు ఇతర నేతల అవినీతినే ప్రధాన ఎజెండాగా మలచుకుని ప్రజల్లోకి వెళ్తోంది. అయితే పుంఖానుపుంఖాలుగా ప్రకటించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గట్టెక్కిస్తాయని అ«ధికార కూటమి విశ్వసిస్తోంది. రాష్ట్రంలో నవంబర్ 13, 20ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు 23న వెల్లడవుతాయి. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో జార్ఖండ్లో విజయం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జేఎంఎం–కాంగ్రెస్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటముల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే... బీజేపీ దూకుడు మంత్రం దూకుడైన ప్రచారమే మంత్రంగా జార్ఖండ్ ప్రచార పర్వంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఎప్పట్లాగే ప్రధాని మోదీ కరిజ్మాపైనే పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితర నేతలు కూడా రాష్ట్రంలో కాలికి బలపం పట్టుకుని తిరుగుతున్నారు. పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ప్రజలను ఆలోచింపజేయడమే గాక అధికార కూటమిని ఇరుకున పెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. 2014లో బీజేపీ 31.8 శాతం ఓట్లతో 37 అసెంబ్లీ స్థానాలు ఒడిసిపట్టి విజయం సాధించింది. 2019లో ఓట్ల శాతం 33.8కి పెరిగినా 25 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎక్కడా చిన్న అవకాశం కూడా వదలరాదని పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. ⇒ బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి చొరబాట్లపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. వారివల్ల స్థానికుల అవకాశాలన్నింటికీ భారీగా గండి పడుతుందని జోరుగా ప్రచారం చేస్తోంది. ⇒ సీఎం హేమంత్తో పాటు జేఎంఎం, కాంగ్రెస్ నేతల్లో పలువురిపై ఈడీ, సీబీఐ దాడులను ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది. ⇒ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తోంది. ⇒ మోదీ సర్కారు అభివృద్ధి నినాదాన్ని వల్లెవేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేతలు ప్రచారం చేస్తున్నారు. ⇒ గత కొద్ది నెలల్లో జార్ఖండ్లో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పార్టీలో వలసల జోష్: గిరిజనుల్లో గట్టి ఆదరణ ఉన్న మాజీ సీఎం చంపయ్ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరడం కమలనాథులకు మరింత ఊపునిచి్చంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ గీతా కోరా కూడా అదే బాట పట్టారు. అంతేగాక సీతా సోరెన్, అమిత్ కుమార్ యాదవ్, కమలేశ్ సింగ్ రూపంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ జేఎంఎం సంక్షేమ మంత్రంఅధికార జేంఎంఎ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు తెర తీసింది. ⇒ మయ్యా సమ్మాన్ యోజన పేరిట 18–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా నేరుగా రూ.12 వేల నుంచి రూ.30 వేల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది. ⇒ ఆప్కీ యోజనా, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్, అబువా ఆవాస్, సార్వత్రిక పెన్షన్కు తోడు ఆహార భద్రత, క్రీడలు–విద్యా పథకాలను అమలు చేస్తోంది. ⇒ గిరిజన సెంటిమెంట్కు ఇవన్నీ తోడై తమను మరోసారి విజయ తీరాలకు చేరుస్తాయని నమ్ముతోంది. కల్పన ఫ్యాక్టర్ సీఎం హేమంత్ సోరెన్ కల్పన ప్రచార సభలకు లభిస్తున్న భారీ ఆదరణ కమలనాథుల్లో గుబులు రేపుతోంది. భర్తపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ఇటీవల జేఎంఎంలో చేరి ఉప ఎన్నికలో గండే అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో నెగ్గడం అధికార కూటమిలో జోష్ పెంచింది.గిరిజన సీట్లే నిర్ణాయకంజార్ఖండ్లో ఏకంగా 28 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. మొత్తం సీట్లలో ఇవి మూడో వంతు కంటే అధికం! అధికార, విపక్ష కూటముల భాగ్యరేఖలను ఇవే నిర్దేశించనున్నాయి. ⇒ ఈ నేపథ్యంలో గిరిజనుడైన తనను మోదీ ప్రభుత్వం వేధిస్తోందంటూ హేమంత్ చేస్తున్న ప్రచారం ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న భయాందోళనలు బీజేపీలో లేకపోలేదు. ⇒ అధికార కూటమి గిరిజన సెంటిమెంట్ను గట్టిగా నమ్ముకుంది. ⇒ గిరిజనులు పాటించే సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ జేఎంఎం, కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇరు కూటముల్లోనూ లుకలుకలు అధికార, విపక్ష కూటములు రెండూ ఇంటి పోరుతో సతమతమవుతుండటం విశేషం. ముఖ్యంగా బీజేపీని నేతల విభేదాలు బాగా కలవరపెడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య సమన్వయం బాగా కొరవడిందంటూ వార్తలు వస్తున్నాయి. అధికార కూటమిలోనూ లుకలుకలు లేకపోలేదు. పలువురు కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేల సిగపట్ల వివాదం ఎన్నోసార్లు హస్తిన దాకా వెళ్లింది. చాలా అసెంబ్లీ స్థానాల్లో సమన్వయంతో కలిసి పని చేసేందుకు కూడా ఇష్టపడనంతగా ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపాయి. -
Jharkhand Elections: నేడు రాహుల్ జార్ఖండ్ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ
రాంచీ: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో కూడా చర్చలు జరిగాయన్నారు.ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
-
ఆ రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం: జేపీ నడ్డా
సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.आज मुझे शारदीय नवरात्रों में नवमी के दिन मां नैना देवी का आशीर्वाद लेने का सौभाग्य प्राप्त हुआ।हम सब लोग माता के आशीर्वाद से प्रधानमंत्री मोदी जी के विकसित भारत के सपने को पूरा करने में अपनी पूरी ऊर्जा के साथ कार्य करेंगे।- श्री @JPNadda pic.twitter.com/LE0avEBDsm— BJP (@BJP4India) October 11, 2024 -
జార్ఖండ్లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్పూర్లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు.स्वास्थ्य संबंधित परेशानियों की वजह से आज वीर भूमि भोगनाडीह में आयोजित "मांझी परगना महासम्मेलन" में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शामिल रहूंगा।डॉक्टरों के अनुसार चिंता की कोई खास बात नहीं है। मैं शीघ्र पुर्णतः स्वस्थ होकर, आप सभी के बीच वापस आऊंगा। जोहार ! pic.twitter.com/rUrCzCd7lK— Champai Soren (@ChampaiSoren) October 6, 2024‘‘చంపయ్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్ సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్ బెయిల్పై విడుదలైన తర్వాత చంపయ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్ సోరెన్ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్
రాంచీ: జార్ఖండ్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు రైల్వే ట్రాక్పై బాంబు అమర్చారు. ఈ క్రమంలో బాంబు పేలడంతో పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ 40 అడుగుల దూరంలో ఎగిరిపడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లా రంగగుట్టు జిల్లాలో రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ట్రాక్పై పేలుడు పదార్ధాలు అమర్చాడు. దీంతో, పేలుడు సంభవించడంతో ట్రాక్ దాదాపు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ట్రాక్ ఎన్టీపీసీ నుంచి బొగ్గును తరలించే గూడ్స్ రైలుకు సంబంధించిందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు కనుక ప్రయాణం చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. झारखंड में रेलवे ट्रैक को बम से उड़ा दिया..झारखंड के साहिबगंज में बदमाशों ने विस्फोटक लगाकर रेलवे ट्रैक उड़ा दिया है. हादसे के बाद रेल मार्ग पर रेल सेवा बाधित.#IndianRailways #Jharkhand pic.twitter.com/Yenx6C92EB— Pankaj Tiwari । पंकज तिवारी (@pankaj_cktd) October 2, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. మరికొందరు ఏకంగా ట్రాక్లకు ఉన్న జాయింట్స్ను తొలగించారు. ఈ ఘటనలను సీరియస్గా తీసుకున్న రైల్వే అధికారులు పలుచోట్ల ఆకతాయిలను అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రాజస్థాన్లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్హెచ్ -2, ఎన్హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్లో అంతర్గత పోరు -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్పూర్లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్లోని భుజ్ నుంచి అహ్మదాబాద్కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
జార్ఖండ్కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి.. అతిపెద్ద శత్రువులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని చెబుతూనే.. ఆర్జేడీ ఇప్పటికీ రాష్ట్ర ఏర్పాటుపై ప్రతీకారం కోరుకుంటోందని అన్నారు. ప్రధాని మోదీ జార్ఖండ్లోని ఆదివారం నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. ‘‘అధికార జేఎంఎం పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తోంది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆ వర్గాల అటవీ భూమిని ఆక్రమించినవారితో చేతులు కలుపుతోంది. బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుతో అధికార పార్టీ సంబంధాలు ఏర్పరుచుకుంటోంది. అంతే కాకుండా బుజ్జగింపు రాజకీయాలపై చేయటంలో అధికార జేఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని సైతం అధిగమించింది. బుజ్జగింపు రాజకీయం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దళితుల, గిరిజనులు వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసి.. వారికి ద్రోహం చేయటమే కాంగ్రెస్ పార్టీ అజెండా. ప్రస్తుతం అదే విధమైన ద్రోహం జేఎంఎం చర్యలలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.#WATCH | Jamshedpur, Jharkhand: PM Modi says, "...In Santhal Pargana, the Adivasi population is decreasing rapidly. The lands are being grabbed. Infiltrators are taking over positions in Panchayats. The incidents of crime against daughters are increasing... Every Jharkhandi is… pic.twitter.com/ECYnXNID83— ANI (@ANI) September 15, 2024‘‘ జేఎంఎం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో జార్ఖండ్ను దోచుకోవడం, అవినీతిపై మాత్రమే దృష్టి సారించింది. ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. నీరు, అడవులు, భూమి అన్నింటిలో అవినీతికి పాల్పడింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఈ కేసులన్నీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇస్తున్నా. కొన్ని నెలల తర్వాత జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తాం. కొత్త పరిపాలనలో జవాబుదారీతనం, న్యాయాన్ని తీసుకురావాలనే బలమైన ఉద్దేశం మాది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ’ అని మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ జార్ఖండ్లోని రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. టాటానగర్ నుంచి ప్రధాని మోదీ.. ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు.చదవండి: నాకు ప్రధాని ఆయ్యే అవకాశం వచ్చింది : గడ్కరీ -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్
కేంద్రమంత్రికి ఓ ప్రభుత్వ అధికారి సేవలు చేయడం విదాదాస్పదంగా మారింది. సదరు ఉన్నతాధికారి మంత్రి పైజామాను సరిచేయడం, బూట్లను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అధికారి, మంత్రి తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సోమవారం జార్ఖండ్ పర్యటనకు వచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుంబంధ సంస్థ అయిన బీసీసీఎల్ జనరల్ మేనేజర్ అరిందమ్ ముస్తాఫీ.. కేంద్ర మంత్రి బూట్లను తొలగించారు. అలాగే ధన్బాద్లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు.On an official visit to review several coal projects of BCCL, Union Minister of State for Coal Satish Chandra Dubey was seen taking the help of a senior BCCL official to remove his shoes and tighten his pajama. #Watch #Dhanbad #Jharkhand #India #SatishChandraDubey #BCCL pic.twitter.com/v1mvbbUxWo— Mirror Now (@MirrorNow) September 9, 2024ఈ వీడియో వైరలవ్వడంతో కాంగ్రెస్ స్పందిస్తూ.. ఈ ఘటన అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది.‘మంత్రి కాళ్లకు షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్ సీఎండీ (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడి, తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు. -
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
జార్ఖండ్ సీఎం నివాసాన్ని ముట్టడించిన BJYM నేతలు
-
మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీ
రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o— ANI (@ANI) August 21, 2024మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాంఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జరీచేసింది. ఆగస్టు 22 ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలో ఆగస్టు 20 నుండి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. VIDEO | Delhi: Heavy rainfall lashes parts of the national capital. Visuals from Janpath.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/4XCCXwHrBN— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
బీజేపీ లో చేరిక పై స్పందించిన జార్ఖండ్ మాజీ సీఎం
-
భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు. బుచ్చి బాబు టోర్నీలో వరుసగా సెంచరీ (114), మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (41 నాటౌట్) ఆడిన ఇషాన్.. బ్యాట్తో సెలెక్టర్లకు సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే ఖాళీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇషాన్ కొత్తగా రేసులోకి వచ్చి సీనియర్ల స్థానాలను ప్రశ్నార్థకంగా మార్చాడు. భారత సెలెక్టర్లు బంగ్లాదేశ్ పర్యటనకు ఇషాన్ను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.Ishan Kishan - the hero of Jharkhand !!!- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024బుచ్చి బాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్, మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ను జార్ఖండ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ స్టయిల్గా ముగించాడు. తన జట్టు గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ రెండు సిక్సర్లతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇషాన్ విన్నింగ్ షాట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 86 బంతుల్లోనే!
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రంజీల్లో ఆడనందుకు వేటు మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్బాల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. జార్ఖండ్కు కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్తో తమ తొలి మ్యాచ్లో శతకంతో కదం తొక్కాడు.సిక్సర్తో సెంచరీ పూర్తిసిక్సర్తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్లతో మెరిసి వికెట్ కీపర్గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్. కాగా జార్ఖండ్తో మ్యాచ్లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భాగమయ్యాడు.చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024 -
రీ ఎంట్రీ అదుర్స్: అద్భుత క్యాచ్తో మెరిసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్ అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.బ్యాట్ ఎడ్జ్ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా మధ్యప్రదేశ్తో మ్యాచ్లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్ల ఈ రెడ్బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది. Ishan Kishan in good rhythm. 💥- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024 -
Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000
జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ సర్కారు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం నూతన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. -
పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు
జంషెడ్పూర్/రాంచీ/చాయ్బసా/కోల్కతా: జార్ఖండ్లోని సెరాయ్కెరా–ఖర్సావాన్ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్ఈస్ట్రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ చరణ్ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్ సింఘ్భమ్ డెప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్గ్రేషియాను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. -
జార్ఖండ్లో రైలు ప్రమాదం.. ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్లో హౌరా-సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్లోని చక్రధర్పూర్ డివిజన్లో అర్ధరాత్రి 3గం. దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో ప్రయాణికులకు సంబంధించినవి 16 బోగీలు, ఒకటి పవర్ కార్ బోగీ, మరోకటి పాంట్రీ బోగీ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమదానికి గల కచ్చితమై కారణం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am.Two people have lost their lives so far.(Visuals from the spot) pic.twitter.com/zYvhUHI9cV— ANI (@ANI) July 30, 2024Train no.12810 Howrah -CSMT Mail got accident in Jharkhand near Tatanagar. pic.twitter.com/6mQyUBeIWT— Santu1213 (@santu_1213) July 30, 2024 -
ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్లో రెండు వేరువేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈస్ట్సింగ్భుమ్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఏనుగు ఒక వ్యక్తిని తొక్కి చంపేసింది. ఇదే జిల్లాలోని డిఘీ గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇంటి గోడ కూలి లోపల నిద్రిస్తున్న వృద్ధురాలు మరణించింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళకు దిగారు. ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రాహుల్కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
నాడు ఈడీ అరెస్ట్.. నేడు మోదీతో సీఎం సొరేన్ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, హేమంత్ సొరేన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.కాగా, మోదీని సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వంగా కలిసినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్లో ల్యాండ్ స్కామ్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సొరేన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. माननीय प्रधानमंत्री श्री .@narendramodi जी से शिष्टाचार मुलाक़ात हुई। pic.twitter.com/jByrjWHsUw— Hemant Soren (@HemantSorenJMM) July 15, 2024 ఈ క్రమంలో జనవరి 31వ తేదీన సీఎం పదవికి సొరేన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవలే జార్ఖండ్ కోర్టు హేమంత్ సొరేన్కు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, మళ్లీ జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు. -
జార్ఖండ్: బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం
జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది.భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు హేమంత్ సోరెన్ ఆ తరువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు.జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1). బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. -
హేమంత్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్ష.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?
జార్ఖండ్లో కొత్తగా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్లో సీఎం సతీమణి కల్పనా సోరెన్కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఎవరి బలం ఎంత?కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయసంగా సోరెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికవ్వడంతో జేఎంఎం బలం 27కు తగ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఇక ఇటీవల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను (బిషున్పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్ లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్ను కాషాయ పార్టీ బహిష్కరించింది.కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మూడోసారి ముఖ్యమంత్రిపీథాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వసీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. -
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ల్యాండ్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత.. హేమంత్కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్ సోరెన్ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్భవన్కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. జార్ఖండ్లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. -
జార్ఖండ్లో కూలిన గిర్డర్
జార్ఖండ్: జార్ఖండ్లో పెను ప్రమాదం తప్పింది. గిరిధ్ జిల్లాలోని ఆర్గా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన గిర్డర్ ఒకటి కూలిపోయింది. రాష్ట్ర రాజధాని రాంచీకి 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరీ బ్లాక్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.భారీ వర్షం కారణంగా గిర్డర్ కూలిపోయిందని, పిల్లర్ కూడా వంగిపోయిందని ఈఈ వినయ్కుమార్ తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన జార్ఖండ్లోని గిరిధ్, బిహార్లోని జమూయి జిల్లాలను కలుపుతుంది. -
‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
న్యూఢిల్లీ: నీట్–యూజీ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం గుజరాత్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. జార్ఖండ్లో ఓ హిందీ పత్రిక జర్నలిస్టు జమాలుద్దీన్ అన్సారీని అరెస్ట్ చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన హజారీబాగ్లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలామ్కు జమాలుద్దీన్ సహకరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గుజరాత్లోని ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లో నిందితులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ్ జలారామ్ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తమ్, టీచర్ తుషార్, మధ్యవర్తులు వి¿ోర్æ, అరిఫ్లను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గోద్రా కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గోద్రా, ఖేడా జిల్లాల్లో నీట్ పరీక్ష జరిగిన సెంటర్లు జయ్ జలారామ్ సూక్ల్ యాజమాన్యం ఆ«దీనంలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.